Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 8, 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 3వ.భాగం

0 comments Posted by tyagaraju on 6:28 AM
  

08.11.2014 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 3వ.భాగం

ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు 
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                   హైదరాబాద్

ఈ రోజు సాయి  బా ని స గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.  

మొదటగా సాయిప్రేరణనుంచి కొన్ని మాటలు ఈ రోజునుండి చదవండి.

1. ఒక్కసారి నా మార్గంలో అడుగుపెట్టి చూడు నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను.


గృహిణి ఆకలితో ఉన్నవారికి గాని, లేక ఏప్రాణికయినా సరే అన్నం పెట్టాలి ఈవిషయాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 42వ.అధ్యాయంలో బాబా లక్ష్మీబాయితో అన్న మాటల ద్వారా గ్రహించుకోవచ్చు.  బాబా లక్ష్మిబాయితో తనకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పగా ఆమె తెచ్చిన కూర, రొట్టెను ద్వారకామాయిలో ఉన్న కుక్కకు వేశారు.  అదేమని ప్రశ్నించినపుడు ఆమెతో బాబా, ఆకుక్క ఆకలిని తీర్చడమంటే నా ఆకలిని తీర్చడంవంటిదే అని చెప్పారు.  కుక్కకు కూడా ఆత్మ ఉన్నది.  ప్రాణులు వేరయినా ఆకలి అందరికీ ఒక్కటే.  ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే అని అన్నారు బాబా. ఈవిధంగా గృహస్థాశ్రమంలో గృహిణి బాధ్యతను శ్రీసాయి మనకందరికీ తెలియచేశారు.         

తరువాత, వైవాహిక జీవితంలో స్త్రీ బాధ్యత ఎక్కువగా ఉంటుందని శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడింది.  ముఖ్యంగా ఒక తల్లిగా స్గ్త్రీ బాధ్యతలు ఏమిటనే విషయాలు శ్రీసాయి సత్ చరిత్రలో అనేక చోట్ల వివరింపబడింది.  పిల్లలయందు తల్లి బాధ్యతలు అన్నింటికన్నా ఎక్కువగా ఉంటాయి.  

పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారి ఆరోగ్యం కోసం తల్లి దేవీ దేవతలకు మ్రొక్కుకొంటుంది.  అది సహజంగా అందరూ చేసేదే.  ఈసందర్భంగా మీకు శ్రీసాయి సత్ చరిత్రలోని కొన్ని ఉదాహరణలను వివరిస్తాను.  శ్యామా చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడుతున్నపుడు అతని తల్లి వణిలోని సప్తశృంగి దేవతకు తన కుమారునికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మ్రొక్కుకొంది.    

ఒక కమ్మరివాని భార్య తన ఒడిలొనున్న బిడ్డ కొలిమిలోనికి జారిపడినప్పుడు, ఆమె తన పిల్లవాడిని రక్షించమని సాయిని ప్రార్ధించింది.  

హరిశ్చంద్రపితలే భార్య తన కుమారుని మూర్చరోగం పోగొట్టమని ద్వారకామాయిలో సాయిని వేడుకొంది.

బాబూ టెండుల్కర్ వైద్య పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడని జ్యోతిష్కులు చెప్పినపుడు, తల్లి షిరిడీకి వచ్చి సాయిని ప్రార్ధించి తన కుమారుడు వైద్య పరీక్షలో పాసయేలాగ సాయినుండి ఆశీర్వచనాలు పొందింది.   

లక్ష్మీ ఖాపర్డే తన కుమారుడు ప్లేగు వ్యాధితో షిరిడీలో బాధపడుతున్నపుడు, ఆమె శ్రీసాయిని ప్రార్ధించినపుడు, శ్రీసాయి ఆప్లేగు వ్యాధిని తన మీదకు తీసుకొని లక్ష్మి ఖాపర్డే కుమారుని రక్షించారు. 


శ్రీసాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయంలో తల్లి తన పిల్లలను ఎలా చూసుకోవాలన్న విషయం వివరింపబడింది.  అది సాయిబాబాయొక్క మాతృప్రేమ అనే విషయంలో చెప్పబడింది.  బిడ్డకు పాలు ఎప్పుడు కావలెనో అతల్లి గ్రహించి సకాలంలో బిడ్డకు ఆకలి తీరుస్తుంది.  తల్లి బిడ్డకు సరియైన సమయంలో కావలసిన రీతిలో దుస్తులు ధరింప చేస్తుంది.  కాని, బిడ్డకు ఈవిషయాలేమీ తెలియవు.  అదే విధంగా మన సాయిమాత కూడా తన భక్తుల అవసరాలను తీరుస్తూ ఉంటారు.  

శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో గృహిణియొక్క ముఖ్యమయిన బాధ్యతలు గురించి మరొక్కసారి వివరింపబడింది.  మధ్యాహ్న్నం 12గంటల సమయంలో ఎవరయినా భిక్షకు వచ్చినపుడు యింటి యిల్లాలు కాదనకుండా తన శక్త్యానుసారం భిక్ష యివ్వాలి.  ఇదే 33వ.అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణి భార్య, సాయిని పోలిన ఫకీరు తన యింటికి 12గంటలకు భిక్షకు వచ్చినపుడు ఒక రూపాయి దక్షిణ యిచ్చి, తరువాత తన భర్తకు చెప్పగా తిరిగి ఆమె భర్త ఆఫకీరును వెదకి పట్టుకొని పది రూపాయలు దక్షిణ యిచ్చిన సంగతి మనకు తెలుసు.  

ఇంతవరకూ మనము వైవాహిక జీవితంలో స్త్రీయొక్క బాధ్యతలను గురించి తెలుసుకొన్నాము.  


(ఇంకా ఉంది)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 
    

Friday, November 7, 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 2వ.భాగం

0 comments Posted by tyagaraju on 5:30 AM
  
  
07.11.2014 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 2వ.భాగం

 ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
 తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 9440375411
                    హైదరాబాద్ 

ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలు వినండి.       



స్త్రీ తన వివాహం తరువాత పుట్టింటివారిని మరచిపోరాదనె విషయాన్ని శ్రీసాయి సత్ చరిత్ర 12వ.అధ్యాయంలో బాబా మనకందరికీ మంచి సందేశాన్నిచ్చారు.  నిమోన్ కర్ భార్య బేలాపూర్ లో ఉన్న తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళివస్తానన్నపుడు ఆమె భర్త ఒక్కరోజు మాత్రమే ఉండి వచ్చేయమని చెప్పాడు.  అపుడు బాబా  కలగచేసుకొని ఆమెను పుట్టింటిలో నాలుగు రోజులు ఉండి బంధువులందరితోను గడిపిన తరువాత షిరిడీకి రమ్మని చెప్పారు.     


ఆవిధంగా బాబా, స్త్రీ  వివాహమయిన తరువాత తన పుట్టింటివారిని మరువరాదనే మంచి సందేశాన్నివ్వడమే కదా.

భర్త బ్రతికి ఉండగా ప్రారంభించిన మంచి పనులను, అతని మరణానంతరం భార్య కొనసాగించి పూర్తి చేయాలి.  ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 6వ.అధ్యాయంలో కనిపిస్తుంది.  అమీర్ శక్కర్ ద్వారకామాయిలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమినాడు రాత్రి చందనోత్సవం చేస్తూ ఉండేవాడు.  అమీర్ శక్కర్ మరణానంతరం అతని భార్య బాబా ఆశీర్వాదంతో చందనోత్సవం జరిపిస్తూ ఆసాంప్రదాయాన్ని కొనసాగించింది.     

సంసార స్త్రీ లక్షణాల గురించిన విషయాలను మనము శ్రీహేమాడ్ పంత్ వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర మరాఠీ మూల గ్రంధంలోను, ఇందిరా ఖేర్ ఆంగ్లంలో వ్రాసిన పుస్తకంలోను, మణిగారు తెలుగులో తర్జుమా చేసినటువంటి పుస్తకంలోను, అచలానంద సరస్వతి తెలుగులో తర్జుమా చేసిన పుస్తకంలోను మనకు కనిపిస్తాయి.  కాని, ఈ విషయాలు మనకు శ్రీవాసుదేవ గుణాజీ ఆంగ్లంలోనికి అనువదించిన శ్రీసాయి సత్ చరిత్రలోను, తెలుగులోనికి అనువాదం చేసిన శ్రీపత్తి నారాయణరావు గ్రంధాలలోను కనిపించవు.     

శ్రీసాయి సత్ చరిత్ర 13వ.అధ్యాయంలో క్షయవ్యాధితో బాధపడుతున్న భీమాజీపాటిల్ కి బాబా ఒక స్కూలు టీచరుగా కలలో కనిపించి ఒక పద్యం అప్పచెప్పమంటారు.  అతను చెప్పలేకపోయినపుడు ఒక బెత్తంతో దెబ్బలు కొట్టి ఆపద్యాన్ని వల్లె వేయిస్తారు.  ఆపద్యానికి అర్ధం ఏమిటంటే  "యితరుల గృహాలకు వెళ్ళాలంటే  పాము తలపై పాదం మోపినట్లుగా భావించే స్త్రీ, లోభి చేతినుండి డబ్బులాగ అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, యింటిలో ధనము లేకున్నా భర్తను సుఖపెట్టాలనుకునే స్త్రీ, ప్రశాంతమయిన మనసుతో భర్త మనసునెరిగి నడచుకొనే స్త్రీ, నిజమయిన సతి" అని సాయి ఆపద్యం రూపంలో భీమాజీ పాటిల్ చేత వల్లె వేయించారు.  

సంసార స్త్రీ అతిధి మర్యాదలు సరిగా చేయాలి.  ఈవిషయాన్ని గూర్చి మనం శ్రీసాయి సత్ చరిత్ర 35వ.అధ్యాయంలో చూడగలం.  బాలాజీ పాటిల్ నెవాస్కర్ సంవత్సరీకము రోజున అతని భార్య వందమందిని భోజనానికి పిలవగా మూడువందల మంది భోజనానికి వచ్చారు.  అతిధి మర్యాదలు ఏవిధంగా చేయాలని కోడలు బాధపడుతుంటే అత్తగారు సాయిని ప్రార్ధించి ఊదీని ఆవంటకాల మీద జల్లమని సలహా యిచ్చింది. ఆ విధంగా వచ్చిన మూడువందల మందికి సక్రమంగా మర్యాదలు చేసి భోజనం వడ్డించి పంపించారు. ఈ సంఘటన ద్వారా సంసార స్త్రీ అతిధి మర్యాదలు సరిగా చేయాలని, సాయి సహాయంతో చక్కగా చేయగలరనీ మనం గ్రహించగలం.     

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Thursday, November 6, 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 1వ. భాగం

0 comments Posted by tyagaraju on 7:10 AM

   
  
06.11.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కార్తికపౌర్ణమి శుభాకాంక్షలు
నెలరోజుల తరువాత మరలా బ్లాగులో ప్రచురణకు సమయం కుదిరింది.  ఈ రోజు సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు శ్రీసాయి సత్ చరిత్ర మీద చేసిన పరిసోధనా వ్యాసం "గృహస్థులకు సాయి సందేశాలు" ప్రారంభిస్తున్నాను.  ఇది చదివిన తరువాత మరలా మరొక్కసారి శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేయండి.  ఈ వ్యాసంలో సాయిబానిస గారు చెప్పిన విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ పారాయణ చేయండి.  సాయి తత్వం మనకు బోధపడుతుంది.  ఓం సాయిరాం.

ఓం శ్రీసాయినాధాయనమహ

గృహస్థులకు సాయి సందేశాలు -  1వ. భాగం 

ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు        

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 

ఓం శ్రీగణేశాయనమహ, ఓం శ్రీసరస్వత్యైనమహ, ఓంశ్రీసాయినాధాయనమహ 

ఈ రోజు సాయిభక్తులందరికీ, గృహస్థులకు సాయి సందేశాలను గురించి వివరిస్తాను.

వైవాహిక జీవితాన్ననుభవిస్తున్నవారందరూ గృహస్థులే.  శ్రీసాయి సత్ చరిత్ర 10,15 అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని తానందరి హృదయాలలోను నివసిస్తున్నానీ చెప్పారు. నాయజమాని సాయినాధుడు మీకు బానిస అయినప్పుడు నేను కూడా మీకు బానిసనే.  ముందుగా మీకందరికీ నాప్రణామములు సమర్పించుకొంటూ నా ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను.  సమాజంలో అందరూ కూడా నీతి నియమాలతో జీవనం సాగించడానికి మన పూర్వీకులు గృహస్థాశ్రమ ధర్మాలకనుగుణంగా మనకు ఎన్నో మార్గదర్శక సూత్రాలనందించారు.  ముందుగా మను స్మృతిలోని కొన్ని ధర్మాలను మీకు వివరిస్తాను.        
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List