Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 10, 2013

శ్రీసాయితో మధుర క్షణాలు - 15 - బాబావారి కఫ్నీ

0 comments Posted by tyagaraju on 7:38 PM


  
          

11.08.2013 ఆదివారము 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజున విజయవాడలో ఉన్నందువల్ల శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, 
తాత్పర్యం అందిచలేకపోతున్నాను...  


శ్రీసాయితో మధుర క్షణాలు - 15

బాబావారి కఫ్నీ

బాబాగారు తన కఫ్నీ చిరిగిపోయి పాడయిపోయినప్పుడెల్లా దానిని యితరులకెవరికైనా యిచ్చివేసే బదులు దానిని ధునిలో కాల్చి బూడిద చేసేవారు.  దానిని ధునిలో కాల్చడానికి అది పాతబడిపోవాల్సిన అవసరమే లేదు.

ఒక్కొక్కసారి ఆయన కఫ్నీలను కొద్ది కాలమే ధరించినప్పటికి వాటిని కాల్చి బూడిద చేసేవారు. ఒకోసారి ఆయన వాటిని కుట్టుకొని బాగుచేసుకొని ధరిస్తూ ఉండేవారు.  సాయిబాబాగారి దుస్తులు చిరుగులు పట్టినపుడు, తాత్యాపాటిల్ వాటిని తన వేళ్ళతో యింకా చింపివేసేవాడు.

సాయిబాబా ఏభక్తుడినయినా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని భావించినపుడు, ఆ అదృష్టవంతునికి బాబావారి దుస్తులు ప్రసాదంగా లభించేవి.  బాబావారి దుస్తులలో అపారమయిన శక్తి నిండి ఉంది.  ఒక సారి సాయిబాబా తన కఫ్నీని మహల్సాపతికి బహుమతిగా యిచ్చారు. దానియొక్క ఫలితం ఏమిటంటే, మహల్సాపతి తాను మరణించే వరకూ సన్యాసిలా జీవించినా, తన కుటుంబ బాధ్యతలను సామాజిక అనుంబంధాలని నెరవేర్చాడు.

మరొక సంఘటనలో సాయిబాబా తన కఫ్నీని ముక్తారాం అనే భక్తునికిచ్చారు. కఫ్నీ బాగా మాసిపోయి ఉండటంవల్ల ముక్తారాం దానిని ఉతికి వాడా (ధర్మశాల) లో ఆరబెట్టాడు.  తరువాత ముక్తారాం బాబా దర్శనానికి వెళ్ళాడు.  కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో కఫ్నీ ఆరబెట్టిన చోట వామనరావు ఉన్నాడు.  కఫ్నీలోనించి ఈ విధంగా మాటలు  వినిపించాయి, "చూడు, ముక్తారాం నన్నిక్కడకు తీసుకొనివచ్చి తలకిందులుగా ఆరబెట్టాడు".    

వామనరావు వెంటనే కఫ్నీని తీసి తాను ధరించాడు.  కఫ్నీని ధరించిన తరువాత వామనరావు ద్వారకామాయికి వెళ్ళాడు.  

కఫ్నీని ధరించిన వామనరావుని చూసి సాయిబాబా కోపోద్రిక్తులయ్యారు.  కాని, వామనరావు సన్యాసం తీసుకోవడానికి నిశ్చయించుకొన్నాడు.  ఈసంఘటన జరిగిన తరువాత సమయం వచ్చినపుడు వామనరావు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నాడు.

15, అక్టోబరు, 1918, మంగళవారమునాడు బాబావారు సమాధి చెందిన తరువాత బాబావారి పాత గుడ్డ సంచిని తెరచి చూశారు.  దానిని ఆయన ఎప్పుడూ ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు.  ఆసంచిలో ఆకుపచ్చ కఫ్నీ, ఆకుపచ్చ టోపీ కనిపించాయి.  వాటిని కాశీరాం అనే దర్జీ బాబాకిచ్చాడు.

బాబా వాటిని ధరించారు.  కాని, తరువాత తెల్లని దుస్తులను ధరించడానికే యిష్టపడ్డారు.  మిగిలిన వస్తువులతోపాటు, ఈ సంచికూడా బాబావారి సమాధిలోపల ఉంచారు.

నేటికీ షిర్దిడీలోని దీక్షిత్ వాడాలో "సాయిబాబా మ్యూజియం లో బాబావారి మరొక కఫ్నీని చూడవచ్చు. 

                    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Friday, August 9, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 51వ.అధ్యాయము

0 comments Posted by tyagaraju on 4:28 AM
             
       

09.08.2013 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి 

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఫ్రియమైన సాయిబంధువులారా! నేటితో "పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి" పూర్తి అవుతున్నది..సాయి బా ని స గారు తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలలోని సాయి తత్వాన్ని మీరందరు చక్కగా చదివి అర్ధం చేసుకున్నారని తలుస్తాను...సాయి.బా.ని.స. గారు ఆచరించినట్లుగా మనందరమూ శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేసినట్లయితే సర్వ శుభములు కలుగుతాయని మనకందరకూ బాగా అర్ధమయింది..ఈ అధ్యాయము చదివిన వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 51వ.అధ్యాయము చివరిలో నున్న ఫలశ్రితిని ఒక్కసారి చదవండి..శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ వల్ల కలిగే లాబాలు కానివ్వండి, ఉపయోగాలు కానివ్వండి మీకే అర్ధమవుతుంది..

ఇంతకుముందు శ్రీసాయితో మధుర క్షణాలు ప్రచురించాను...రేపటినుండి మిగిలిన భాగాలను ప్రచురిస్తున్నాను..చదివి ఆనందించండి..శ్రీసాయిని మనసారా మదిలో నిలుపుకొనండి.

ఓం సాయిరాం   

      
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 82వ.శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం : చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః  | 

         చతురాత్మా చతుర్బావశ్చతుర్వేద విదేకపాత్ ||

తాత్పర్యం :  పరమాత్మ నాలుగు మూర్తులుగా లేక దశలుగా సృష్టిని వ్యక్తము చేయువాడు.  ఒకటి పరావాక్కు, రెండు పశ్యంతీవాక్కు, మూడు మధ్యమావాక్కు, నాలుగు వైఖరీవాక్కు, పరమాత్మ నాలుగు వాక్కులు కలవాడు.  



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 51వ.అధ్యాయము (ఆఖరి అధ్యాయం)

                                         విశాఖపట్నం
                                         22.02.1992

ప్రియమైన చక్రపాణి, 

శ్రీసాయిబాబా జీవిత చరిత్రములోని విశేషాలు, నా జీవితముపై శ్రీసాయి సత్ చరిత్ర ప్రభావమును తెలియచేస్తు నీకు వ్రాసిన ఉత్తరాలలో యిది ఆఖరి ఉత్తరము.  ఈఉత్తరము చదివేముందు 51వ.అధ్యాయము చదివి శ్రీసాయిని పూర్తిగా అర్ధము చేసుకో.  

Thursday, August 8, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము

0 comments Posted by tyagaraju on 7:09 AM
       
     
08.08.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము
         
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 81వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  తేజోవృషో ద్యుతిధరస్సర్వ శస్త్ర భృతాంవరః  |

          ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నేకశృంగో గదాగ్రజః || 

తాత్పర్యం : పరమాత్మను తేజోవంతమయిన సత్తువగలవానిగా, కాంతిని ధరించినవానిగా, ఆయుధములు ధరించిన వానిలో గొప్పవానిగా, దీక్ష కలిగి నిగ్రహము గల పాలకునిగా, అనేక శృంగములు గలవానిగా, గదునికి అన్నగా ధ్యానము చేయుము.    

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము

                            విశాఖపట్నము  21.02.92

ప్రియమైన చక్రపాణి,

శ్రీ హేమాద్రిపంతు ఈ అధ్యాయములో ప్రముఖ సాయి భక్తుల చరిత్ర వర్ణించినారు.  శ్రీసాయికి తన భక్తులపై ఉన్న ప్రేమను గుర్తించు.  నీవు కూడా శ్రీసాయి ప్రేమను సంపాదించటానికి కృషి చేయి.  ఈరోజున ఈఉత్తరము నీకు విశాఖపట్నము నుండి వ్రాస్తున్నాను.  కారణము నిన్నటి ఉత్తరములో నీకు వివరించినాను.  నిన్నటిరోజు సాయంత్రము 5 గంటలకు శ్రీగంటి సన్యాసిరావుగారి యింటికి వెళ్ళి అక్కడ మీఅక్క పెండ్లి సంబంధమువారి పెద్ద అబ్బాయి చి.రామకృష్ణతో నిశ్చయము చేసినాను.  

Wednesday, August 7, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం

0 comments Posted by tyagaraju on 8:46 AM
     
        
07.08.2013 బుధవారము
ఓం  సాయి  శ్రీసాయి  జయజయ సాయి 
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 80వ.శ్లోకం, తాత్పర్యం
  
శ్లోకం :  అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్       |     

            సుమేధా మేధజోధన్య స్సత్యమేధా ధరాధరః           | |

తాత్పర్యం : పరమాత్మను ఆత్మ గౌరవములేనివానిగా, తన స్పర్శచే సృష్టికి గౌరవమిచ్చువానిగా, అందరిచే గౌరవింపబడువానిగా, ధ్యానము చేయుము.  ఆయన మూడు లోకములకు అధిపతియై అట్టి మూడు లోకములనూ తానెత్తిపట్టి యున్నాడు.  ఆయన అబివృధ్ధి చెందుచున్న బుధ్ధిగా, దాని ఫలితముగా దానిని పొందువానిగా ధ్యానము చేయుము.  సత్యమే ఆయన ధర్మమై, భౌతికస్థితినుండి సత్యలోకము వరకూ తన బుధ్ధియందు సమస్తము ధరించుచున్నాడు.          

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం

                                      20.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు, సాయి భక్తులుగా మారిపోయిన యిద్దరి చరిత్ర - సాయిభక్తునిగా ఉంటూ మనసులో నిగ్రహము లేక మానసిక బాధపడుతున్న ఒక వ్యక్తి చరిత్ర వర్ణించినారు.  ఈ ఉత్తరము చదవటానికి ముందు ఈముగ్గురి చరిత్ర చదివినపుడు నీకే చాలా ఆస్ఛర్యము వేస్తుంది.  

Tuesday, August 6, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ. అధ్యాయము

0 comments Posted by tyagaraju on 12:34 AM
    
   
06.08.2013 మంగళవారము 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ.అధ్యాయం
        
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 79వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ  |

          వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః    || 

పరమాత్మను బంగారు వర్ణముగా, చక్కని శబ్దములతో, వర్ణములతో కూడిన నామముకలవానిగా, బంగారు చాయగలిగిన తన అవయవములందు గంధపు పూతగలవానిగా, ఆయన అవయవములు పొందిక కలవిగా, అతిక్రమిమించువారిని తన పరాక్రమముతో సం హరించువానిగా, అస్తవ్యస్తములుగా కనిపించు లోకమే తన నివాసముగా, నేతిని స్వీకరించు అగ్నిగా, కదలునట్టి వాయువుగా, కదలని చోటుగా, తనచే నిండిన శూన్యముగా ధ్యానము చేయుము.        

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ. అధ్యాయము

                                     19.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు  శ్రీసాయియొక్క అనంతత్వాన్ని, భక్తులపై వారికి యున్న ప్రేమను వర్ణించినారు.  యిటువంటి సద్గురువు మనకు లభించటము మన పూర్వ జన్మ సుకృతము.  ప్రేమయొక్క ప్రాముఖ్యత గురించి చక్కగా వివరింపబడినది.  ఒక్కొక్కసారి అనిపించుతుంది - నీవు నీతోటివాడిని ప్రేమించకపోతే నీవు శ్రీసాయి భక్తుడివి అని చెప్పుకోగలవా.  

Sunday, August 4, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 47వ.అధ్యాయం

0 comments Posted by tyagaraju on 7:02 AM
   
   
04.08.2013 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  47వ.అధ్యాయం

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 78వ.శ్లోకం, తాత్పర్యం
            

శ్లోకం: ఏకో నైకస్సవఃకః కిం యత్తత్పద మనుత్తమమ్     |  

        లోకబంధుర్లోకనాధో మాధవో భక్తవత్సలః  ||

తాత్పర్యం : పరమాత్మ అనేకులలోనున్న ఒక్కనిగా, మరియూ ఒక్కనిలోనున్న అనేకముగా నున్నాడు.  అతడు ఎవరు? ఏమిటి? ఏది? అది, మొదలగు శబ్దములచే తన సంబంధము నెరుక పరుచువాడు.  ఆయన ఎల్లప్పుడూ లోకమునకు రక్షకుడే, బంధువై యుండును.  ఆయన లక్ష్మీదేవికి భర్త, భక్తులకు భక్తుడు.  


 పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  47వ.అధ్యాయం

                                18.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులకు గత జన్మ బంధాలు గురించి తెలియచేసే విషయాలు చెప్పినారు.  ఈ అధ్యాయము చదివిన తర్వాత నాలో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి.  అన్ని విషయాలు వివరముగా వ్రాయలేకపోయినా సంక్షిప్తముగా వ్రాస్తాను.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List