Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 13, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 30వ.అధ్యాయము

0 comments Posted by tyagaraju on 11:09 PM


                       
                        
14.04.2013  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంచువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్య భూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 30 వ.అధ్యాయము కాస్త పెద్దదిగా ఉండటం వల్ల గత మూడురోజులుగా ఇవ్వలేకపోయాను.  ఉగాదినాడు కూడా కుదరలేదు...అందుచేత కొంత ఆలస్యమయినా సాయిబంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం లాగే ప్రతీ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవితం గడిపేలా వరమివ్వమని, బాబావారి అనుగ్రహం మనందరి మీదా ఎల్లవేళలా ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను. 
        
                  
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 63వ.శ్లోక, తాత్పర్యం

శ్లోకం:  శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః    | 

         గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః       ||

తాత్పర్యం:  ఆయన శుభమయిన శరీరము లేక విగ్రహము కలవాడు.  ఆయన సృష్టించునవి భూగోళమందంతట అయన సాన్నిధ్యముచే శాంతిని ఆనందమును జీవులకు కలిగించును.  అయన గోవులు, వృషభముల హితము కోరుచు, వాటిని గుప్తముగా నుంచి సం రక్షించును.  ఆయన వృషభ నేత్రముతో నుండి వృషభమును యిష్టపడును.     



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
30వ.అధ్యాయము

                                                              02.02.1992

ప్రియమైన చక్రపాణి,

నాజీవితములో నేను గాయత్రి మంత్రమును రోజు జపించలేదు.  వేద శాస్త్రాలు పారాయణ చేయలేదు.  కాని, శ్రీసాయి సత్ చరిత్ర ప్రతిరోజు పారాయణ చేయటము వలన గాయత్రి మంత్ర జపము, వేద శాస్త్రాల పారాయణ ఫలము నిత్యము నేను అనుభవించుచున్నాను. ఈ నానమ్మకాన్ని కొందరు హేళన చేయవచ్చును.  

Wednesday, April 10, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 28 వ.అధ్యాయము

0 comments Posted by tyagaraju on 8:33 AM
   
     
               
                   

10.04.2013 బుధవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులందరకి   శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు
      

        
శ్రీవిష్ణుసహస్రనామం 62వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:     త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్        |

             సన్యాస కృచ్చమశ్శన్ తో నిష్ఠాశ్శాంతిః పరాయణం    ||

తాత్పర్యం:  మూడు స్థాయిలలో గానము చేయబడు సోమము అను యజ్ఞము నారాయణునియొక్క రూపము.  పరమాత్మయే ఆ గానమందలి విషయము.  బృదములచే ఆలపింపబడు గానమునందు లీనమగుటచే నారాయణుని సాన్నిధ్యము కలుగును.  ఆయన నిర్వాణము, చికిత్స మరియు చికిత్సకుడు.  ఆయన జీవులను,  సన్యాస మార్గమున నడిపించుచు ఉద్రేకములను సం యనమువలన ఉపశమింపచేసి, తన ప్రశాంతత అనుభవములో కూడిన సాన్నిధ్యమును అనుగ్రహించుచున్నాడు.  దీక్ష మరియు మార్గమున కంకితమగుట అను తన లక్షణములచే నిరంతరము జీవులను శాంతియుతులుగా చేయుచున్నాడు.   


 పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  
28 వ.అధ్యాయము

                                                             01.02.1992

ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో అనాటి సాయి భక్తుల అనుభవాలను వివరించుతాను.  మద్రాసు భజన సమాజము శిరిడీకి వచ్చి శ్రీసాయి సన్నిధిలో భజన చేసినట్లు, వారి అనుభవాలను హేమాద్రిపంతు వివరించినారు.  


Tuesday, April 9, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 28వ. అధ్యాయము

0 comments Posted by tyagaraju on 7:09 AM

                   

                    

09.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్ర నామం 61వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోక       సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణ ప్రదః                    |

             దువస్సృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః        ||

తాత్పర్యం:  గొప్ప విలుకాడు, విరిగిన గొడ్డలిని ధరించి భయంకరముగా నున్ననూ, సంపద లిచ్చువాడుగా నున్నాడు. ఆయన రూపము ఆకాశమంతయూ వ్యాపించి సమస్తము చూచుచున్నది.  వేదవ్యాసుడు వాక్కునకు, భాషకు అధిపతియై భగవంతుని అవతారమగుటచే స్త్రీ గర్భమందు పుట్టనివాడై యున్నాడు.   


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

28వ. అధ్యాయము

                              
                                         31.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో నీకు 28వ. అధ్యాయముపై వివరణ యిస్తాను.  శ్రీసాయి ఏవిధముగా తన భక్తులను శిరిడీకి పిలిపించుకొన్నది వివరించుతారు శ్రీహేమద్రిపంతు.  ముఖ్యముగా శ్రీలాలా లక్ష్మీ చందును,  బరహంపూర్ లొని ఒక భక్తురాలిని శిరిడీకి రప్పించుకొన్న వైనము పరిశీలిస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది.  శ్రీసాయిని గురించి తెలియని వ్యక్తులకు శ్రీసాయి స్వప్న దర్శనము ఇచ్చి వారిని శిరిడీకి రప్పించుకొన్నారు. దీనిని బట్టి మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటి?  ఆలోచించు.  నీవే శ్రీసాయి భక్తుడువి కాకాపోయిన వెనుకటి జన్మలో నీకు శ్రీసాయికి సంబంధము ఉంటే చాలు, శ్రీసాయి ఈ జన్మలో నీకు స్వప్నములో కనిపించి నిన్ను శిరిడీకి రప్పించుకొంటారు.  దీనిని శ్రీసాయి ప్రత్యేకత లేదా గొప్పతనము అని కూడా అనవచ్చును.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయియొక్క అభిప్రాయమును శ్రీహేమాద్రిపంతు ఈ విధముగా తెలియపర్చుతారు.  "పండుగదినము గడుపుటకుగాని, తీర్ధయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదు అనేది బాబా అభిప్రాయము".  ఇది మనబోటి సామాన్య కుటుంబీకులకు చాలా ముఖ్య విషయము.  అప్పుచేసి పూజ పునస్కారాలు, దానాలు ధర్మాలు చేయరాదు.  నాసంపాదనలో కొంత శాతము వీటి నిమిత్తము విడిగా పెట్టి ఆ డబ్బుతోనే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినాను.  నీవు కూడా ఈవిధానాన్ని పాటించిననాడు నీకు చికాకులు ఉండవు.  శ్రీసాయి తన ప్రియ భక్తులను పిచ్చుకతో పోల్చేవారు.  వారు తమ భక్తులను పిచ్చుక కాలికి దారముకట్టి లాగినట్లుగా శిరిడీకి రప్పించుకుందును అని చెప్పినారు.

శ్రీసాయికి ఉన్నప్రియ భక్తులలో ముఖ్యుడు మేఘశ్యాముడు.  అతని గురించి హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో వివరించినాడు.  ఆనాడు నేను మేఘశ్యాముడిని చూడలేదు.  కాని మేఘుని గురించి చదువుతుంటే నేనుకూడా మేఘశ్యాముడులాగ శ్రీసాయికి ప్రియభక్తుడిని కాగలనా లేదా అనే ఆలోచనలలో మునిగిపోతు ఉంటాను.  నిజమైనసాయి భక్తుడు కోరుకొనే కోరిక ఒక్కటే అది, శ్రీసాయి పాదాలమీద ఆఖరి శ్వాస తీసుకొని, శ్రీసాయి చేతుల మీదుగా పంచ భూతాలలో కలసిపోవాలి.  ఈఅదృష్టము మేఘశ్యామునికి లభించినది.  అటువంటి అదృష్టము కొరకు మనము    కూడా ప్రయత్నము చేయాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 
ద్వారకామాయి గీత్ మాలాలో ఆనాటి మధురగీతాలను చూడండి..
http://www.facebook.com/dwarakamai?ref=hl
షిరిడీ సాయి దర్బార్...
http://www.facebook.com/ShirdiSaidarbar1?ref=hl



Monday, April 8, 2013

శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము

0 comments Posted by tyagaraju on 7:22 AM
                   
                         
                              
08.04.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

          
శ్రీ విష్ణుసహస్రనామం 60 వ.శ్లోకం, తాత్పరయం

శ్లోకం :    భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః         |

              ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతి సత్తమః            ||

తాత్పర్యం:  పరమాత్మ శక్తులను, మహిమలను గలవాడు.  చీకటిని నశింపచేయువాడు.  ఆనందము కలుగ చేయువాడు.  వన పుష్పములచే చేయబడిన మాలను ధరించినవాడు.  అదితి యొక్క కుమారుడు.  నాగలిని ధరించినవాడు.  మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టి నంతటిని భరించి సహించువాడు.  సన్మార్గమున నడచువారిలో అత్యంత ముఖ్యుడైనవాడు.  


శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము
                                                 30.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి ఏనాడు ఏ పుస్తకము చదవలేదు.  కాని, తన భక్తులచేత ఆధ్యాత్మిక రంగములో ముఖ్యమైన పుస్తకాలను తనే స్వయముగా చేతితో పట్టుకొని, ఆభక్తులను ఆశీర్వదించి, వారి చేత ఆపుస్తకాలను చదివించెను.  ఆయన తన హిందూ భక్తుల చేత చదివించిన ముఖ్య పుస్తకాలలో 1. గురుచరిత్ర 2. విష్ణుసహస్ర నామము 3. గీతా రహస్యము అనేవి ముఖ్యమైనవి.  మానవుని ఆధ్యాత్మిక రంగ అభివృధ్ధికి పుస్తక పఠనము కూడా చాలా అవసరము అని శ్రీసాయి ఈవిధముగా తెలియచేసినారు.  సాయి భక్తులు ఈ పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయాలని కోరుతున్నారు.  ఈ పుస్తకాల వ్యవహారములో రామదాసికి మరియు శ్యామాకు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీసాయి ఇలాగ అంటారు.  "ధనము యిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు".  ఈవిషయము నాజీవితములో అనుక్షణము జ్ఞప్తికి వస్తుంది.  ధనము ఉంది అనే అహంకారముతో నీవు ఏవష్తువునైన కొనగలవు.  కాని మనుష్యులను కొనలేవు.  అవసరమువచ్చినపుడు మంచి పనుల నిమిత్తము ధనము విరివిగా ఖర్చు పెట్టు, వెనకాడవద్దు.  ప్రతి విషయానికి ధనానికి లంకె పెట్టవద్దు.  ఎవరికైన ధన సహాయము  మరియు మర్యాద చేయవలసివచ్చినపుడు ప్రేమతో చేయి.  డబ్బు గురించి ఆలోచించుతు మనుషులను దూరంగా ఉంచకు.  ధనము ఖర్చు ఆగిపోతుంది అనే భావనతో నీబాధ్యతను నీవు చేయకపోతే భగవంతుడు ఏదో విధముగా ఆపని పూర్తి చేయించుతాడు.

ఆతర్వాత జీవించినంత కాలము ఆపని చేయలేదు అనే అసంతృప్తి నీకు మిగులుతుంది మరియు లోకులు వేసే నింద మిగులుతుంది.  ఈ విషయములో నాజీవితములో జరిగిన రెండు ఉదాహరణలు వ్రాస్తాను.  నాపినతల్లి భర్త నాతండ్రి దగ్గరనుండి ఏమీ ఆశించకుండానే నన్ను నా చిన్నతనములో తన యింట ఒక పది సంవత్సరాలు ఉంచు కొని నాకు విద్యాబుధ్ధులు నేర్పినారు.  నా ఈ శరీరములో ప్రాణము ఉన్నంత కాలము నేను నాపినతల్లి భర్తను మరచిపోలేను.  నేను సదా వారికి కృతజ్ఞుడిని. యింక నా జీవితములో ప్రవేసించిన యింకొక వ్యక్తి నామావగారు అంటే నీ తల్లియొక్క తండ్రి.  నేను ఆయన దగ్గరనుండి ధన సహాయము కోరుతాననే భయముతో ఆయన నానుండి తప్పించుకొని తిరుగుతు ఎదుట పడినపుడు నన్ను అవమానించుట వలన నేను జీవించినంత కాలము వారిని మరచిపోలేను.  మొదటి వ్యక్తిని చూచినపుడు, తలచినపుడు. తలను గౌరవము, భక్తి భావనతో క్రిందకు దించుతాను.  మరి రెండవ వ్యక్తి విషయములో గౌరవము, భక్తిలను ప్రదర్శించలేను.  అందుచేత జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము కాదు అనే విషయాన్ని మరచిపోవద్దు.  శ్రీమతి ఖాపర్దే విషయములో శ్రీసాయి ఆమె భక్తికి మెచ్చి ఆమె గత జన్మల వివరాలను మనలకు తెలియపర్చుతారు.  మానవుడు మంచి పనులు చేయటము మన జన్మజన్మలలో ఏవిధముగా అభివృధ్ధి చెందుతాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చును.  మనము కూడా శ్రీసాయి ఆశీర్వచనములలో మంచి పనులు చేస్తు మంచి జన్మము పొందుదాము.
 

శ్రీ సాయి సేవలో
నీతండ్రి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Sunday, April 7, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 26వ. అధ్యాయము

0 comments Posted by tyagaraju on 8:15 AM
  
    
       
         
07.04.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

            
శ్రీ విష్ణుసహస్రనామం 59వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:            వేధాస్స్వాంగో జితః కృష్ణో ఢృఢస్సంకర్షణొచ్యుతః           |

                    వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షోమహామనాః           ||

తాత్పర్యం:  పరమాత్మను సృష్టికర్తగా మరియూ శరీరములు, రూపములు, తనలోని భాగములుగా, వ్యక్తమైనట్టి తండ్రిగా ధ్యానము చేయుము.  మనసుకు యింద్రియములకు అందని గొప్ప చిత్రమయిన చీకటి యను అంతర్యామిగా, తనయందు జీవించుచు మరల తనలోనికి స్వీకరింపబడు దేహములుగా, జారిపడు వానిగా, నీటికధిపతియైన వరుణునిగా, మరియూ ఆయన కుమారుడైన భృగువుగా, విశ్వవృక్షమును పుట్టించుటకు కారణమైన వానిగా, పద్మమునందలి దళములుగా, అందరి యందలి ఒక్కటిగా నున్న మనస్సుగా ధ్యానము చేయుము.      


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

26వ. అధ్యాయము
                                                   29.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈఉత్తరములో శ్రీసాయిని మానసికముగా ఏవిధముగా పూజించాలి అనేది శ్రీహేమాద్రిపంతు ఆంతరిక పూజా విధానములో వర్ణించినారు.  నిజముగా ఆవిధముగా పూజించాలి అనే తలంపు రాగానే మనసు సంతోషముతో నిండిపోతుంది.  నీవు ఎవరి పాదాలకైనా నమస్కరించు సమయములో శ్రీసాయిని మనసార తలచుకొని అవతలి వ్యక్తిలో శ్రీసాయిని చూస్తూ నమస్కారము చేయి.  ఆ అనుభూతిని, సంతోషాన్ని అనుభవించు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి తనతోటి యోగి యొక్క శిష్యుని చూచి పలికిన పలుకులు ఎంత గంభీరమైనవి.  "ఏమైనను కానిండు, పట్టు విడవరాదు.  నీగురునియందే యాశ్రయము నిలుపుము, ఎల్లపుడు నిలకడగానుండుము.  ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము.  మన అదృష్టము వలన మనము వారి పాదాలను నమ్ముకొన్నాము.  మన సంతోషానికి మనమనసులే సాక్షి.  శ్రీసాయి తనతోటి యోగీశ్వరులను సదా గౌరవించేవారు.  వారి సాంప్రదాయమును మనము గౌరవించాలి.  శ్రీసాయి ఆలోచనలలో ఆత్మహత్య మహాపాపము.  ఆవిషయములో శ్రీసాయి స్వయముగా ఏవిధముగా తన భక్తుడు గోపాలనారాయణ అంబాడేకర్ ను రక్షించినది శ్రీహేమాద్రిపంతు వివరించినారు.  చదివి అర్ధము చేసుకో.  జీవితములో కష్టాలు అనేవి ప్రతి మానవుడికి వస్తాయి.  వాటికి ఆత్మహత్య పరిష్కారము కాదు అంటారు శ్రీసాయి.  "కొడుకు కూడా తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక" అంటారు శ్రీహేమాద్రిపన్తు.  మరి నేను కోరుకొనేది నీవు కూడా శ్రీసాయి భక్తుడుగా మారాలని -  నాకోరిక తీర్చుతావు కదూ.

నీతండ్రి


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List