Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, March 29, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 22 వ.అధ్యాయము

0 comments Posted by tyagaraju on 5:19 PM
                          
                              
                                
 30.03.2013  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

      
శ్రీవిష్ణుసహస్రనామం 55వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:    జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః  |

            అంభోనిది రనంతాత్మా మహోదధి శయో అంతకః   ||

తాత్పర్యం :  పరమాత్మను జీవునిగా, వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, సాక్షిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమవంతునిగా, జీవులను బిందువులతో కూడిన మహా సముద్రముగా అట్టి మహా సముద్రమునందు అనంతముగా శయనించి యుండువానిగా, మరల అట్టి సముద్రమే భౌతిక జీవులకు లయస్థానముగా ధ్యానము చేయుము.



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
22 వ.అధ్యాయము

                                      25.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులను విషజంతువుల బారినుండి కాపాడిన సంఘటనలు వివరించబడినవి.  మరి మనిషికి నిలువెల్ల విషమే కదా - అటువంటి మనుషులనుండి కూడ తన భక్తులను అనేకసార్లు కాపాడినారు శ్రీసాయి.  


Thursday, March 28, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము

0 comments Posted by tyagaraju on 5:31 PM
          
    
  
  

29.03.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

     

శ్రీవిష్ణుసహస్రనామం  54వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:       సొమపో మృతస్సోమః పురుజిత్ పురుసత్తమః 

               వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్త్వతాంపతిః 

తాత్పర్యం ::  పరమాత్మను యజ్ఞము చేసి సోమరసమును, అమృతమును స్వీకరించువానిగా, తిరిగితిరిగి విజయములను సాధించువానిగా మానవునియందలి ఉత్తమోత్తమ మానవునిగా, వినయవంతునిగా, జయము కలిగించువానిగా, సత్యమున కంకితమయిన వానిగా, దాశ కులమునందు పుట్టినవానిగా, సాత్వతులవంశము వానిగా ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము

ఈ ఉత్తరములో నేను వ్రాసే విషయాలు చదివితే శ్రీసాయి ఒక్క శిరిడీలోనే లేరు, ఆయనను ఈప్రపంచములో ఏమూలన మనము నిలబడి పిలిచిన అక్కడ దర్శనము యిస్తారు అనేది నేను అనుభవ పూర్వకముగా వ్రాస్తున్నాను.  


Monday, March 25, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 20వ.అధ్యాయము

0 comments Posted by tyagaraju on 8:41 AM
                                   
                  
               
               
25.03.2013 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్రనామం 53వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞాన గమ్యః పురాతనః    |

             శరీర భూత భృత్ భోక్త కపీంద్రో భూరిదక్షిణః ||

తాత్పర్యం:  పరమాత్మను రోజురోజుకూ ఉత్తముడైనవానిగా, ఉచ్చస్థితిలో నున్నవానిగా ధ్యానము చేయుము.  ఆయన మహా వృషభము, మరియు గుప్తముగానుండి రక్షించువాడు.  మిక్కిలి పురాతనమై జీవించి యున్నవాడు.  జ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపదగినవాడు.  శరీరమునందలి పంచభూతములను నిర్వహించుచు మరల శరీరమునందే యుండి భుజించి తృప్తి పడువాడు.  హనుమంతునిగా అవరరించినవాడు, యజ్ఞమును నిర్వహించునప్పుడు విశేషముగా సంపదలను పంచిపెట్టువాడు. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
20వ.అధ్యాయము

                              
                              
                                                    23.01.1992

ప్ర్లియమైన చక్రపాణి,

ఈ రోజు తెల్లవారుఝామున వచ్చిన కలను నీకు ముందుగా తెలియచేసి ఆ తర్వాత శ్రీసాయి సత్ చరిత్రలోని 20వ. అధ్యాయము గురించి  వివరించుతాను.  ఈరోజు తెల్లవారుఝామున (23.01.1994 - ఉ.4) వచ్చిన కలలోని వివరాలు "నేను మరియు మరికొంతమంది నదిలో నావలో ప్రయాణము చేస్తున్నాము. 


Sunday, March 24, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 18,19 అధ్యాయములు

0 comments Posted by tyagaraju on 7:40 AM
                         
                                        
                              
                                       
24.03.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
 

గత మూడు రోజులుగా మన బ్లాగులో రత్నమణి సాయి అందించలేకపోయాను.. మన్నించాలి... ఈ రోజు 16,17 అధ్యాయాలు చదవండి...
                           

శ్రీవిష్ణు సహస్రనామం 52వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:     గభస్తినేమిస్సత్తత్వస్థస్సిం హో భూత మహేశ్వరః   |  

             ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః   ||

తాత్పర్యం:  నారయణుని మార్గము సూర్యగోళము యొక్క వెలుగుచే నిర్ణయింపబడుచున్నది.  ఆయన మనయందు, సామ్యముగను, సిం హముగను, అన్ని భూతములయందలి ఈశ్వరునిగా, మొట్టమొదటి దేవునిగా, మహాదేవునిగా, దేవతలకధిపతిగా, మరియు దేవతలను సం రక్షించువానిగా, ఉపదేశకునిగా ధ్యానము చేయవలెను.   


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
18,19 అధ్యాయములు
                                                                                                22.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో 18-19 అధ్యాయములలోని విషయాలపై నాకు తోచిన అభిప్రాయాలు నీకు తెలియ చేస్తాను.  ఈ నా అభిప్రాయాలను నీవు అర్ధము చేసుకొనిన తర్వాత నీ స్నేహితులకు కూడా పనికివస్తుంది అని తలచిననాడు ఈ ఉత్తరాలు నీ స్నేహితుల చేత కూడా చదివించు. 


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List