Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, April 29, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 34వ. అధ్యాయము

Posted by tyagaraju on 6:45 AM

                         
                     
28.04.2013 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రెండు రోజులుగా ప్రచురణ చేయలేకపోయాను..నెట్ కనెక్షన్ కి అంతరాయం వల్ల. 
               
         
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 67 వ.శ్లోక, తాత్పర్యం. 

శ్లోకం :  ఉదీర్ణ స్స్ర్వతశ్చక్షురనీశ శ్శాశ్వతష్థిరః                 | 

          భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోకనాశనః     ||  

తాత్పర్యం:  పరమాత్మను పైకి ప్రకాశించువానిగా, అన్నివైపులా చూచువానిగా, తనకి పైన అధిపతిగా, యింకొకరు లేనివానిగా, శాశ్వతునిగా, స్థిరమైనవానిగా, భూలోకమునకు ఆభరణమై వైభవము కలిగించువానిగా, భౌతిక స్థితికి కారణమైనవానిగా, దుఃఖమునకు అతీతుడై దుఃఖము నిర్మూలనము చేయువానిగా ధ్యానము చేయుము.  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
34వ. అధ్యాయము

                                       06.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమను వర్ణించినారు శ్రీహేమాద్రిపంతు.  శ్రీసాయి మహాసమాధి చెందక ముందు జరిగిన లీలలకు సాక్ష్యము శ్రీహేమాద్రిపంతు రచించిన శ్రీసాయి సత్ చరిత్ర.  1918 వ. సంవత్సరము తరవాత జరిగిన శ్రీసాయి లీలలకు సాక్ష్యము సాయి బంధువులే.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి పలికిన మాటలపై నమ్మకము ఉంచుకో.  నమ్మకముతో "ఎవరయితే ఈ మశీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏవ్యాధి చేతను బాధపడరు".  1989 సంవత్సరమునకు ముందు నేను చాలా సార్లు కీళ్ళ నొప్పులు వ్యాధితో బాధపడినాను.  మరి 1990 సంవత్సరము తర్వాత ఈనాటి వరకు ఆవ్యాధి తిరిగి రాలేదు.  బహుశ యిది ద్వారకామాయి మహాత్మ్యము అని భావిస్తాను.  శ్రీసాయి డాక్టర్ పిళ్ళే విషయములో యిలాగ అన్నారు, నిర్భయముగా నుండమను, అతడేల పది జన్మల వరకు బాధపడవలెను?  పది రోజులలో గత జన్మ పాపమును హరింప చేయగలను."  నాదృష్ఠిలో మానవ మాత్రుడు ఎవడు యిటువంటి ధైర్యము కలిగించే మాట పలకలేడు.  సాక్షాత్తు ఆభగవంతుడే శ్రీసాయి రూపములో అవతరించి తన భక్తుల పాపాలను క్షమించి ఆభక్తునికి భగవంతునిపై ఎనలేని విశ్వాసము కలిగేలాగ చూడగలరు.  యిదే అధ్యాయములో శ్రీసాయి మానవ రూపములో అన్న మాటలు వారి ఔన్యత్యాన్ని చాటుతాయి అవి.."నేను భగవంతుడను కాను.  ప్రభువును కాను  నేను వారి నమ్మకమైన బంటును."  ఈ కలియుగములో ఎంతోమంది మహాత్ములు, యోగులు, భగవత్ స్వరూపులు జన్మించారు.  కాని వారు శ్రీసాయి మాట్లాడినట్లుగా మాట్లాడలేదు.  వారు ఎవరూ శ్రీసాయికి సాటికారు.  శ్రీసాయి అనేకమంది వ్యాధిగ్రస్తుల వ్యాధులను నయము చేసినారు.  కొంత మంది భక్తుల వ్యాధులను తానే స్వయముగా అనుభవించి వారిని వారి వ్యాధులనుండి విముక్తి గావించినారు. తన భక్తుల వ్యాధులను నయము చేసేటప్పుడు "అల్లా మాలిక్ హే - అల్లా అచ్చాకరేగా " అనేవారు.  (అందరికీ దేవుడే దిక్కు - దేవుడు అందరికి మేలు చేస్తాడు) ఈనాడు మన మధ్యయున్న యోగులు, సన్యాసులు, భగవంతుని అవతారమని చెప్పుకొనే వ్యక్తులు ఎవరైన ఈవిధమైన మాటలు అనగలగుతున్నారా!  ఒక్కసారి ఆలోచించు.  నీఆలోచనలలో శ్రీసాయిని పూర్తిగా నిలుపుకో.. శ్రీసాయి నిన్ను కాపాడుతారు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

(ద్వారకామాయి గీత్ మాలా లో పాత పాటల ప్రసారానికై వీక్షించండి..http://www.facebook.com/dwarakamai?ref=h )

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List