Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 9, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (25)

0 comments Posted by tyagaraju on 11:57 PM



10.02.2012

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బా ని స డైరీ - 1994 25 వ. భాగాన్ని చదువుకుందాము

(ఈ రోజు తిరుపతి యాత్రకు వెడుతున్న కారణంగా మరల ప్రచురణ 14 తారీకు)

సాయి.బా.ని.. డైరీ - 1994 (25)

13.09.1994

నిన్నటిరోజున కష్ఠ సుఖాలు - వివేకము - వైరాగ్యము గురించి చాలా ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి కష్ఠ సుఖాలు - వివేక వైరాగ్యాల గురించి వివరించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల వివరాలు. 1) కష్ఠాలు సుఖాలు అనేవి మన నడవడికతోనే వస్తాయి. మన నడవడికను జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవలసినది మనమే. అందుచేత మన కష్ఠ సుఖాలకు కారణం యింకొకరు అని అనడములో అర్ధములేదు.

2) బత్తాయిపండ్లను వ్యాపారి (శ్రీసాయి) నుండి మనము కొనగలము. పండ్లను బిలచి యివ్వమని వ్యాపారిని మనము కోరవచ్చు. తర్వాత పండ్లలోని తొనలను తినవసినది, రసమును త్రాగవలసినది మనే అని గ్రహించటము వివేకమునకు మూలము.





3) మన జీవితము ఏడు అంతష్తుల మేడవంటిది. మొదటి ఆరు అంతస్థులు అరిషడ్ వర్గాలు. ఏడవ అంతస్థు మాత్రము (శిరస్సు) ఏడు ద్వారాలు కలిగియుండి భగవంతునికి చేరువలో యుంటుంది. శ్రీ సాయి ఏడు అంతస్థుల భవనానికి లిఫ్ట్ వంటివారు. వారు మనలను ఏడవ అంతస్తుకు చేర్చటానికి సిధ్ధముగా యండగా మన భార్యపిల్లలు లిఫ్ట్ ను మొదటి ఆరు అంతష్తుల మధ్యనే తిరగనిస్తూ ఉంటారు. ఏడవ అంతస్థులోనికి వెళ్ళనీయరు. నీవే ధైర్యము చేసి లిఫ్ట్ ద్వారా ఏడవ అంతష్తుకు చేరాలి అని గ్రహించటము వైరాగ్యమునకు మూలము.

14.09.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము గురించి, వాటిని ఆచరణలో పెట్టడము గురించి చాలా ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా సమస్యకు సమాధానము తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో (పల్లెటూరివాని రూపములో) తత్వాలుపాడుకొంటు నాముందరనుండి వెళుతున్నారు.

నేను ఆయనను ఆపి, తత్వాలు అంత చక్కగా మర్చిపోకుండ ఎలాగ పాడగలగుతున్నారు అని అడిగినాను. ఆవ్యక్తి అంటారు - "తత్వాలు కంఠస్థము చేయటము గొప్పకాదు. తత్వాలను ఆచరణలో పెట్టడము గొప్ప విషయము. అందుచేత తత్వాలు రోజూ వల్లె వేసుకొంటూ వాటిని జీవితములో ఆచరణలో పెట్టిననాడు జీవితములో చికాకులు యుండవు. రోజూ నీవు త్రాగే మంచినీరు ఒకే సరస్సులోనివి అయిఉండాలి. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆసరస్సులోని నీరు నీతో సీసాలలో తీసుకొని వెళ్ళివాటినే త్రాగాలి. విధముగా ఒకే సరస్సులోని నీరు నీవు త్రాగిననాడు నీ ఆధ్యాత్మిక దాహము త్వరలో తీరుతుంది." నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయికి నమస్కరించినాను. ఒకే సరస్సులోని నీరు అంటే ఏమిటి అని ఆలోచించినాను. "శ్రీ సాయి సత్ చరిత్ర" అని మనసులో సమాధానము దొరికినది.

16.09.1994

నిన్నటిరోజున మీర్పేటలోని శ్రీ సాయి గుడికి వెళ్ళి 101 రూపాయలు దక్షిణగా వేసినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆశీర్వదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో మా ఆఫీసులోని కార్మిక నాయకుడు శ్రీ షేక్ పాం షావలి రూపములో దర్శనము యిచ్చి నా చేతిసంచిని బలవంతముగా తీసుకొన్నారు. చేతిసంచిలో శ్రీ సాయితో నా అనుభవాలు వ్రాసుకొన్న డైరీ యున్నది. డైరీ నాప్రాణముతో సమానమైనది. నా డైరీ నాకు యివ్వమని వేడుకొన్నాను. అతను తనకు 100 రూపాయలు యిస్తే డైరీ యిస్తాను అంటారు. నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. నిన్నటిరోజునే కదా శ్రీ సాయికి 101 రూపాయలు దక్షిణ యిచ్చినది మరి శ్రీ సాయి తిరిగి 100 రూపాయలు ఎందుకు దక్షిణ కోరుతున్నారు అని ఆలోచించినాను. నిజానికి 30.08.1994 నాడు రాత్రి కలలో శ్రీ సాయి ట్రాఫిక్ పోలీసు రూపములో దర్శనము యిచ్చి "నీవు పోగొట్టుకొన్న తెల్ల హెల్మెట్ యిదిగో" అని నా హెల్మెట్ నాకు యిచ్చి తనకు 200 రూపాయలు ద్క్షిణ యివ్వమని అడిగినారు. నేను అతితెలివితేటలుకు పోయి నిన్నటి రోజున 101 రూపాయలు దక్షిణ యిచ్చినాను. శ్రీ సాయి మిగిలిన 100 రూపాయలు శ్రీ పాన్ షావలి రూపములో దక్షిణ కోరుతున్నారు అని గ్రహించినాను. రోజు సాయంత్రము తిరిగి మీర్పేటలోని శ్రీ సాయి గుడికి వెళ్ళి శ్రీ సాయికి మిగిలిన 100 రూపాయలు దక్షిణ యివ్వాలని నిశ్చయించుకొన్నాను.

17.09.1994

నిన్నటిరోజున శ్రీ సాయిబందు శ్రీ ఆలూరి గోపాలరావుగారి నుండి జాబు వచ్చినది. ఆజాబుకు ఏమని సమాధానము యివ్వవలసినది అని శ్రీ సాయినాధుని తెలపమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి మందిరాలకు అనుబంధముగా అనాధ ఆశ్రమాలు కనిపించినవి. ఒక అజ్ఞాతవ్యక్తి శ్రీ సాయిమందిరము దగ్గరనిలబడి నాతో అన్న మాటలు. "తల్లితండ్రులు లేక రోడ్డుమీద బ్రతుకుతున్న అనాధ బాల బాలికలను చేరదీసి నాపేరిట కట్టే మందిరాలలో వాళకు ఆశ్రయము యిస్తే నాయజమాని (భగవంతుడు) పిల్లలకు నేను సేవ చేసుకొనే భాగ్యము నాకు ప్రసాదించేవాళ్ళు అగుతారు మీరు"

మాటలకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి పటముముందు నిలబడి అజ్ఞాతవ్యక్తి (శ్రీ సాయి) అన్నమాటలును శ్రీ ఆలూరి గోపాలరావుగారికి వ్రాయాలని నిశ్చయించుకొన్నాను.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




Wednesday, February 8, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (24)

0 comments Posted by tyagaraju on 5:21 PM


09.02.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 - 24వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.. డైరీ - 1994 (24)

30.08.1994

నిన్నటిరోజున మానసికముగా చాలా బాధపడినాను. జీవితముపై విరక్తి కలిగినది. బ్రతకాలని కోరిక మనసులో ఉంది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ జీవించటానికి కావలసిన ధైర్యము ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము నాకు చాలా ధైర్యమును కలిగించినది. వాటి వివరాలు. "అది 1962 సంవత్సరము. భారత చైనాల యుధ్ధము మంచు కొండలలో జరుగుతున్నది. నేను భారత సైన్యములో చేరి యుధ్ధము చేయసాగినాను.

చైనీయులతో యుధ్ధము చేస్తు నేను దారి తప్పి ఒక చిన్న గ్రామమునకు చేరినాను. అక్కడ యున్న ఒక బౌధ్ధలామ యింటిలో తలదాచుకొన్నాను. నాలాగ దారితప్పి నిస్సహాయముగా ఒక ముస్లిం ఆఫీసరు, క్రైస్థవ ఆఫీసరు కూడ అయింటిలో తలదాచుకొన్నారు. యింటిలో ఒక పంజాబీ స్త్రీ తన తప్పిపోయిన భర్త రాక కోసము ఎదురు చూడసాగినది. బౌధ్ధలామా ప్రేమ మాకు కావలసినంత ధైర్యము ప్రసాదించినది. యింతలో చైనావారు నన్ను పట్టుకోవటానికి ఆయింటిని చుట్టు ముట్టినారు. ఆయింటిలోని భారతీయులందరు బౌధ్ధలామ ఆశీర్వచనాలతో ధైర్యముగా నిలబడి యుధ్ధము చేసి చైనీయులను తరిమి కొట్టినాదు. ఒక్కసారిగా తెలివి వచ్చినది. నిద్రనుండి లేచి శ్రీ సాయి పటమునకు నమస్కరించినాను. సమయములో శ్రీ సాయి పటములో శ్రీ సాయికి బదులు బౌధ్ధ లామ కనిపించినారు. శ్రీ సాయి ఆశీర్వచనములతోను నాతోటి ఆధ్యాత్మిక మిత్రుల సహాయముతో నా మానసిక శత్రువులను (చైనీయులను) తరిమికొట్టి జీవించటానికి కావలసిన ధైర్యమును పొందగలిగినాను.

05.09.1994

నిన్నటిరోజున సంసార బంధాలపై ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సంసార బంధాలపై సందేశము ప్రసాదించు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి రాత్రి కలలో మా ఆఫీసులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వారి సంసార బాధలను చూపించి నాకు కనువిప్పు కలిగించినారు. ఆదృశ్యాలనుండి నేను సేకరించిన సందేశము.

1) జీవితములో బరువు బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి అనే తపనతో మొదటి భార్య చనిపోయిన తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత, తిరిగి వివాహము చేసుకొని సంసార బంధాలలో మునిగి తేలేవారు కొందరు.

2) జీవితములో బరువు బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి అనే తపన లేకుండ మొదటి భార్య పిల్లలు యుండగానే రెండవ భార్యను వివాహము చేసుకొని సంసార బంధాలలో మునిగి తేలేవారు కొందరు.

3) జీవితములో బరువు బాధ్యతలను సరిగ నిర్వర్తించి పిల్లలను పెంచి పెద్ద చేసి, వృధ్ధాప్యములో కూడా యింకా యింకా ధన సంపాదన చేస్తు సంసార బంధాలలో మునిగి తేలేవారు కొందరు.

మూడు రకాల మనుషులలో నీవు ఏకోవకు చెందుతావు నీవు ఆలోచించుకొని నీ బరువు బాధ్యతలను త్వరగా పూర్తి చేసుకొని సంసార బంధాలనుండి బయటపడు.

11.09.1994

నిన్నటిరోజున జీవితములో మనకు తోడునీడగా యుండేవారు ఎవరు అని ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సమస్యకు సమాధానము చెప్పమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినది. దృశ్య వివరాలు :

"నేను ఒక రైలులో ప్రయాణము చేయుచున్నాను. నేను ఎక్కిన రైలు పెట్టెలో నిండా జనము యున్నారు. కాని ఒక్కరు నాకు తెలిసినవారు కారు. అందరు కొత్తవారే. ప్రతివారు తమ గమ్యస్థానము (స్టేషన్) గురించి ఎదురు చూస్తూ ప్రయాణము సాగించుతున్నవారే.

రైలు ఆగిన ప్రతి స్టేషన్ లోను కొంతమంది ప్రయాణీకులు మాటమంతి లేకుండ దిగి వెళ్ళిపోతున్నవారే. ఒకే రైలు పెట్టెలో అంత సంతోషముగా మాట్లాడినవారు కనీసము తమ స్టేషన్ వచ్చినది, వెళ్ళి వస్తాము అని మాటకూడ అనకుండ దిగిపోతున్నరే అనే బాధ నాలో ఎక్కువ కాసాగినది. సమయములో రైలు పెట్టెలో ఒకమూల కూర్చున్న ముసలి ఆయన (తెల్లని కఫనీ, నెత్తిమీద తెల్లని బట్ట, మెడలో రుద్రాక్షమాల, బుజాన ఒక జోలి వేసికొని యున్న ఆయన) నా దగ్గరకు వచ్చి రైలు ప్రయాణములో ఒకరికి ఒకరు తోడుగా ప్రయాణము చేయరు. ప్రతివ్యక్తి ఒక్కడిగానే రైలు ఎక్కుతాడు. రైలులో పదిమందితో కలసి మాట్లాడుతాడు. తన స్టేషన్ రాగానె దిగిపోతాడు. నేను కొన్ని లక్షల సంవత్సరాలనుండి రైలులో ప్రయాణము చేస్తున్నాను. నేను ఒక్కడినే ఎంతోమందికి తోడుగా రైలులో ప్రయాణము చేసినాను. నీకు నామీద నమ్మకము యుంటే నాతో స్నేహము చేయి. నేను నీకు తోడుగా రైలు ప్రయాణములో యుంటాను. నీ స్టేషన్ రాగానే నిన్ను అక్కడ దింపి నీవు నీ గమ్యస్థానము చేరేలాగ చూస్తాను". ఒక్కసారిగా నిద్రనుండి మెలుకువ వచ్చినది. నేను మంచముమీద పరుండి యున్నాను. మరి రైలు ప్రయాణము సంగతి ఏమిటి అని ఆలోచించసాగినాను.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Tuesday, February 7, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (23)

0 comments Posted by tyagaraju on 5:21 PM



08.02.2012 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 23.వ. భాగాన్ని చదువుకుందాము

సాయి
.బా.ని.. డైరీ - 1994 (23)

08.08.1994

నిన్నటిరోజున జీవితములో "నిజము పలకటములోను, అబధ్ధము పలకటములోను, గల వ్యత్యాసము గురించి ఆలోచించినాను. సమస్యకు నాకు పరిష్కారము లభించలేదు. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సమస్యపై వివరణ యివ్వమని కోరినాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన వివరణ వివరాలు.

"నీవు ఒక త్రాగుబోతు యింటికి వెళ్ళి ఆయింటి యిల్లాలు దగ్గర మీయింటి యజమాని పచ్చి త్రాగుబోతు అనే నిజము చెబితే ఆమె సంతోషించుతుందా లేక మీ యింటి యజమానిలో ఒక మంచి గుణము ఉంది అని మంచి గుణాన్ని చెబితే ఆమె సంతోషించుతుందా ఒక్కసారి ఆలోచించు. అలాగే మామిడి పళ్ళలో 90 శాతము పళ్ళు తియ్యగా ఉంటాయి.

10 శాతము మామిడి పళ్ళు పుల్లగా ఉంటాయి. పుల్ల మామిడిపళ్ళరుచిని గుర్తు పెట్టుకొని మామిడిపళ్ళు అన్నీ పుల్లగా ఉంటాయి అని అనగలమా ఆలోచించు".

అందుచేత జీవితములో నిజము అబధ్ధము అనెవి రెండు అంశాలు. వాటిని సరిగా అర్ధము చేసుకొని మనము మంచి మార్గములో పయనించాలి అంటారు శ్రీ సాయి.

12.08.1994

నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ ఆధ్యాత్మిక రంగములోని విషయాలు చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల సారాంశము.

ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి ఆటంకాలు.

1) పరస్త్రీ వ్యామోహము

2) ధన సంపాదనపై వ్యామోహము

3) కీర్తి ప్రతిష్ఠలపై వ్యామోహము

ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి శుభసూచనలు:

అనుక్షణము భగవంతుని తలచుకొంటూ -

రోజూ శ్రధ్ధ, సహనం అనే మానసిక దీపాలు వెలిగించటము.

25.08.1994

నిన్నటిరోజున గృహస్థ ఆశ్రమములోని తలనొప్పి గురించి ఆలోచించినాను. కుటుంబసభ్యులు నామాట వినటములేదు అనే బాధ ఎక్కువ కాసాగినది. రాత్రి నిద్రకు ముందు శ్రి సాయికి నమస్కరించి నా సమస్యకు సమాధానము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము దాని సారాంశము.

"నేను శ్రీ సాయి పూజ చేసుకొంటున్నాను. కొన్ని కాకులు వచ్చి నా నెత్తి మీద పొడుస్తున్నాయి. నేను భరించలేని తలనొప్పితో బాధ పడసాగినాను. యింతలో బయటనుండి కొన్ని కాకులు నా యింటిలోనికి రావటానికి ప్రయత్నాలు చేయసాగినవి. అపుడు నాయింట ఉన్న కాకులు నన్ను రక్షించటానికి ఐకమత్యముగా బయట కాకులతో దెబ్బలాడి వాటిని తరిమి వేసినవి." దృశ్యము ద్వారా నేను గ్రహించిన సందేశము - గృహస్థ ఆశ్రమములో తలనొప్పి యున్న కుటుంబ సభ్యులు ఐకమత్యముగా యుండటము ఆకుటుంబానికి శ్రీరామ రక్ష".

27.08.1994

నిన్నటిరోజున కుటుంబ వ్యవహారాలలో చాలా చికాకు పడినాను. మనసుకు ప్రశాంతత కరువు అయినది. జీవితముపై విరక్తి కలిగినది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "శ్రీ సాయినాధ నాకుటుంబ సమస్యలు నీకు తెలుసు. దయ చేసి ధైర్యమును ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "అరబ్బు దేశములో పెండ్లికి "పైగాము" రాగానె ఆడపిల్లలు పెండ్లి చేసుకొని సంతోషముగా అత్తవారి యింటికి వెళ్ళిపోతారే. నీవు నీ కుమార్తె వివాహము చేసి రెండు సంత్సరాలు అయినా యింకా ఆపెండ్లి సంగతులు తలచుకొంటు బాధ పడటములో అర్ధము లేదు. అన్నీ సవ్యముగా జరుగుతాయి. ప్రశాంతముగా జీవించు" అన్న మాటలు నాకు ప్రశాంతత ప్రసాదించినది.

28.08.1994

నిన్న రాత్రి శ్రీ సాయి నా సమస్యలకు సమాధానముగా గతాన్ని మర్చిపోవాలి అనే సందేశము యిచ్చినారు. గతాన్ని మర్చిపోవటము అంత సులభముకాదు. నిజ జీవితములో గతాన్ని మర్చిపోయి ప్రశాంతముగా బ్రతకటము ఎట్లాగ అనేది చూపించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి భోపాల్ నవాబు రూపములో దర్శనము యిచ్చినారు. భోపాల్ నవాబు పాడుబడిన భవనమునుండి బయటకు వచ్చినారు. ఆయన కుర్తా, పైజామా, నెత్తిమీద ఎఱ్ఱ రంగు కుచ్చు టోపీ ధరించి చాలా హుందాగా యున్నారు. ఆయన అధికారము పోగొట్టుకొన్నా ఆయనలోని హుందా తనము తగ్గలేదు. పాడుబడిన భవనము ఆయన గత చరిత్రను గుర్తు చేస్తున్నా ఆయనలో ఏమాత్రము చికాకు లేదు. ప్రశాంతమైన మనసుతో ఆపాడుబడిన భవనము ముందు యున్న తోటలో షికారుగా పచార్లు చేస్తున్నారు. ఈవిధముగా గతాన్ని మర్చిపోవాలి అనే సందేశాన్ని శ్రీ సాయి ప్రసాదించినారు.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List