Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 4, 2012

ఏజన్మలోని అనుబంధమో

0 comments Posted by tyagaraju on 8:27 AM

04.02.2012 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఏజన్మలోని అనుబంధమో

ఈ రోజు ఒక అద్భుతమైన బాబా లీలను తెలుసుకుందాము. ఏనాటి జన్మలోనో ఆయనతో ఉన్న అనుబంధం ఈ జన్మలో మనలని ఆయనకు దగ్గరగా చేసుకుంటారు. ఆయన చేసే పధ్ధతి కూడా చాలా విచిత్రంగా, నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఆయన మన ఎదుటవున్నా మనం గుర్తించలేము. ఒకవేళ బాబాయే స్వయంగా మనకు కనిపించినా ఈయనెవరండీ బాబూ బాబా వేషం వేసుకుని వచ్చారు అని అనుకుంటాము. అందుకనే బాబావారు ప్రతీ మనిషిలోనూ, జీవిలోనూ తనని చూడమన్నారు. మాయ మనలని ఆయన ఉనికిని గుర్తించకుండా చేస్తుంది. ఆ మాయ తొలగాలంటే సత్ చరిత్ర పారాయణ చేస్తూ ఆయన చెప్పిన విషయాలని ఎప్పుడు మనసులో గుర్తుంచుకుని ఆయన లీలలను, కధలను మననం చేసుకుంటూ ఉండాలి.

తనకు కలిగిన ఈ అనుభవాన్ని శ్రీ రామకృష్ణగారు విశాఖపట్నంలో సత్సంగం లో చెప్పారట. దానిని విశాఖపట్నం నుంచి శ్రీమతి నౌడూరు శారదగారు నాకు టెలిఫోన్ ద్వారా వివరంగా చెప్పడం జరిగింది. దానిని యధాతధంగా మీముందుంచుతున్నాను. ఇక ఈ అద్భుతమైన బాబా లీలను చదవండి.


శ్రీ రామకృష్ణగారు విశాఖపట్నం పోర్ట్ లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆయన ప్రతీరోజు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. క్రమంలో ఆయనకు ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువకావడం తో తను ధ్యానం చేసుకోవడానికి వీలు కుదరటంలేదనే కారణంతో, యింకా 12 సంవత్సరాలు సర్వీసు ఉండగానే స్వచ్చందంగా పదవీవిరమణ చేసారు. ఆయనకు బాబా అంటే నమ్మకం లేదు. కాని ఆయన భార్యకు బాబా అంటే అపరిమితమైన భక్తి. ఆవిడ ప్రతీరోజు తెల్లవారుజామునే లేచి బాబా పూజలూ, సప్తాహాలు చేసుకుంటూ ఉండేవారు. ప్రతీరోజు ఏదో ఒక ప్రసాదం వస్తోంది కదా అని ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు.

వీరికి సంతానం లేదు. వారొక అబ్బాయిని పెంచుకుంటున్నారు. అతను యింజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండేవాడు. అతనికి యింట్లో చిల్లర డబ్బులు ఎక్కడ కనపడినా తన డిబ్బీలో వేసేసుకుంటూ ఉండేవాడు. తల్లితండ్రులు "ఒరేయ్ ! యింట్లొ చిల్లర కావాలంటే ఉండటల్లేదురా" అని అంటూ ఉండేవారు.

రామకృష్ణగారు ఒకరోజు తెల్లవారుజామునే వ్యాహ్యాళికి వెడుతున్నారు. ఆయనకు దారిలో రోడ్డుమీద రెండురూపాయల నాణెం కనపడింది. చుట్టుప్రక్కల ఎవరూ లేరు. ఆరోజు లక్ష్మివారం, లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేయడమెందుకని ఆయన రెండురూపాయల నాణెం తీసుకుని, యింటికి తిరిగి వచ్చారు. ఆయన ఆనాణాన్నియింట్లో ఉన్న బల్లమీద పెట్టారు.

ఒకరోజు ఆయన మేడమీద ఉండగా మధ్యాహ్న్నం ఒక సాధువు వచ్చి బిక్ష అడిగాడు. భార్యకు బాబా అంటే భక్తి ఉన్నందువల్ల, ఆయన భార్యను పిలిచి సాధువుకు బియ్యం వేయమని చెప్పారు. కాని సాధువు బియ్యం వద్దు, డబ్బులు ఇవ్వమన్నాడు. రామకృష్ణగారు జేబులో చేయిపెట్టి చూస్తే అన్ని పది రూపాయల నోట్లు ఉన్నాయి. అపుడాయన సాధువుతో చిల్లర లేదని చెప్పారు. అపుడా సాధువు "ఒక రోజు గురువారమునాడు నీకు దారిలో రెండురూపాయల నాణెం దొరికింది. దానిని యింట్లో బల్లమీద పెట్టావు. దానిని తెచ్చి యివ్వు" అన్నాడు. రామకృష్ణగారు కిందకి వచ్చిబల్లమీద ఉన్న రెండు రూపాయల నాణెం తీసి సాధువుకు ఇచ్చి, తిరిగి మేడమీదకు మెట్లు ఎక్కుతూ, ఆఖరి మెట్టు ఎక్కి వరండాలోకి వెడుతూండగా ఆయనకి హటాత్తుగా గుర్తుకువచ్చింది. తనకి రెండురూపాయలు దొరికినట్లు సాధువుకు ఎలా తెలుసు? పైగా అది కూడా తనయింట్లో బల్లమీద ఉందని ఎలా తెలిసింది? ఆయన వెంటనే వెనక్కి తిరిగి కిందకి చూసారు. అక్కడ సాధువు కనపడలేదు. వెంటనే కిందకి దిగివచ్చి భార్యకు చెప్పగా, ఆమె ఆవచ్చిన సాధువు బాబా అన్నారు. వెంటనే యిద్దరు తలుపులు దగ్గరగా వేసి వీధిలోకి వచ్చి అన్నివైపులా చూసారు. కాని సాధువు ఎక్కడా కనపడలేదు. అప్పటినుంచి ఆయన కూడా బాబాకి భక్తుడయారు. యిన్నిరోజులుగా బల్లమీద రెండురూపాయల నాణెం అలా ఉన్నా గానీ వారి అబ్బాయికూడా దానిని తన డిబ్బీలో వేయలేదు. అదికూడా అతని కంట పడి ఉండకపోవచ్చు.

యిలా ఉండగా రామకృష్ణగారికి విపరీతమైన క డుపునొప్పి వస్తూ ఉండేది. ఆయన బంధువు ఒకరు డాక్టరు. 2006 . సంవత్సరంలోఒకరోజున చాలా సీరియస్ అయింది. ఆయన బంధువు రామకృష్ణగారిని కాకినాడ ఆస్పత్రిలో చేర్పించి ముగ్గురు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచారు. రామకృష్ణగారు మగతగా ఉండేవారు. డాక్టర్స్ ముగ్గురూ వస్తూ ఆయనను పరీక్షిస్తూ ఉండేవారు. రామకృష్ణగారికి అప్పుడప్పుడు కొంచెం తెలివి వచ్చి చూసినప్పుడు తన కాళ్ళవద్ద ఒక డాక్టరు తెల్లని దుస్తులు ధరించి కూర్చుని వుండటం చూసేవారు. తనకు సేవ చేయడానికి డాక్టరును నియమించి ఉండవచ్చని అనుకున్నారు. ఒకరోజున ఆయన అలా గదిలో మగతగా ఉన్నప్పుడు, ఒక కార్డియాలజిస్ట్ ఆగదివైపు వెడుతూ, రామకృష్ణగారి శరీరం నీలం రంగులోకి మారుతుతూఉండటం చూసి వెంటనే ఒక నర్శ్ ని పిలిచి ఆక్సిజన్ పెట్టించారు. సమయంలో అటువైపు ఒక కార్డియాలజిస్ట్ రావలసిన సందర్భంకూడా లేదు. మరి ఆయన అగదివైపు ఎలా వచ్చారో తెలియదు. 3 వారాల తరువాత రామకృష్ణగారు కోలుకున్నాక తనకు వైద్యం చేసిన ముగ్గురు డాక్టర్స్ కి కృతజ్ఞ తలు తెలుపుతూ , నాలుగవ డాక్టర్ గురించి అడిగారు, ఆయనకి కూడా ధన్యవాదాలు చెపుదామని. అప్పుడా డాక్టర్స్, మీకు వైద్యం చేసి కేసు షీట్లొ అన్నీ రాసినది మేము ముగ్గురమే. నాలుగవ డాక్టర్ అసలు ఎవరూ లేరు, కార్దియాలజిస్ట్ కూడా ఎవరో తెలియదు అన్నారట. అప్పుడాయనకు ప్రగాఢంగా నమ్మకం ఏర్పడింది. తనవద్ద తెల్లని దుస్తులలో కూర్చుని వున్న నాలుగవ డాక్టర్ బాబా తప్ప మరెవరూ కాదని.

ఇప్పుడు వివరించిన బాబా లీలకు డాక్టర్ సాయి అని పేరు పెట్టవచ్చు. కాని ఆ పేరు చదవగానే బాబా లీల చదువుతున్నపుడు వచ్చిన నాలుగవ డాక్టర్ బాబాయె అని పాఠకులకు ముందే తెలిసిపోతుంది. అందులో థ్రిల్ ఉండదు. అందుచేత వేరె పేరు పెట్టడం జరిగింది.


(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Thursday, February 2, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (20)

0 comments Posted by tyagaraju on 5:53 PM




03.02.2012 శుక్రవారము

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈరోజు సాయి బా ని స డైరీ 1994 20 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (20)


14.07.1994

నిన్నటిరోజున భగవంతుడు యిచ్చిన శరీరము గురించి చాలా సేపు ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ - శరీరమునకు యివ్వవలసిన రక్షణ గురించి చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి రూపము లేని కాంతి కిరణాలుగా దర్శనము యిచ్చి మానవ కంఠముతో అన్న మాటలు

(1) నాకు రూపము లేకపోయిన నా భక్తుల బరువు బాధ్యతలు అనే రధము లాగటానికి ఈగరూపములోను, తూనీగ రూపములోను కష్ఠపడుతునానే.


మరి నీకు శరీరము ఉందే, నీ బరువు బాధ్యతలను పూర్తి చేసుకొనేంతవరకు నీ శరీరమును నీవు జాగ్రత్తగా కాపాడుకోవలసినదే అనేది గుర్తు ఉంచుకో. (2) మానవ జన్మ ఎత్తినతర్వాత శారీరిక బాధలేకాకుండ మానసిక బాధలు అనుభవించాలి. మానసిక బాధలు శారీరక బాధలుగా మారకుండ భగవంతుని అనుగ్రహము సంపాదించాలి.

18.07.1994

నిన్నటిరోజున నా యింటి వాస్తులోని లోపాలు సరిదిద్దుకోవటానికి అనుమతిని ప్రసాదించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి రాత్రి కలలో చూపిన దృశ్యము నన్ను చాలా ఆకట్టుకొన్నది. వాటి వివరాలు. శ్రీ సాయి నన్ను 1967 సంవత్సరమునకు (వెనక్కి) తీసుకొని వెళ్ళినారు. నేను రాజస్థాన్ కోట పట్టణములో పనిచేస్తున్న రోజులు. నేను పట్టణములోని పాకిస్థాన్ (పవిత్ర స్థానము) మిఠాయి భండార్ కు వెళ్ళినాను. దుకాణములో మిఠాయి కొనటానికి హిందువులు, ముస్లింలు కార్లులో వస్తున్నారు. దుకాణము యజమాని ఒక ముస్లిం. అతని దుకాణములో హిందూ దేవతల ఫొటోలు యున్నవి. దుకాణదారుడు హిందూ దేవతలకు పూజలు చేస్తున్నాడు. నేను ఆదుకాణము దగ్గరకు వెళ్ళగానే ఆముస్లిం దుకాణదారుడు నన్ను ప్రేమతో పిలచి నా చేతికి మిఠాయి యిచ్చి తినమన్నారు. నాకు తెలివి వచ్చినది. శ్రీ సాయి విధముగా నా యింట వాస్తు దోషాలు సరిదిద్దుకోవటానికి అనుమతిని ప్రసాదించినారు.

19.07.1994

నిన్నటిరోజున నా యింట నా ఆప్త బంధువు నన్ను అవమానపరచినాడు. బాధను తట్టుకోలేక చాలా చికాకుపడినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికిన్ నమస్కరించి నా మనసుకు ప్రశాంతత కలిగించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నాకు చిరునవ్వు కలిగించి, మనసులోని బాధను తొలగించినది. వాటి వివరాలు " యింటి యిల్లాలు తన యింటికి తన అత్తగారు, మామగారు వస్తున్నారు అని తెలిసి వారికి గుమ్మములోనే చీపురుతో పూజ చేయటానికి నిలబడి యున్నది. గుమ్మములో ఒక ఆటోవచ్చి నిలబడినది. ఆమె చీపురుతో ఆటోలోనుండి దిగుతున్న వ్యక్తులను కొట్టడానికి సిధ్ధపడినది. సమయములో ఆటోనుండి దిగిన వ్యక్తులు తన తల్లి, తండ్రి అని తెలిసి చాలా సిగ్గుపడిపోయి చూపురు కట్ట బయటకు విసిరి వేసినది. తన తప్పుకు భగవంతుడు సరయిన శిక్ష వేసినాడు అని తలచి యింక జీవితములో అటువంటి తప్పు చేయకూడదని నిశ్చయించుకున్నది." నాకు తెలివి వచ్చినది. భగవంతునిపై నమ్మకము కుదిరినది. మనసులోని బాధ తొలగిపోయినది.

(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు






Wednesday, February 1, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (19)

0 comments Posted by tyagaraju on 7:17 AM


01.02.2012 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 19 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.. డైరీ - 1994 (19)

04.07.1994

నిన్నటిరోజున న్యాయము - అన్యాయము గురించి చాలా సేపు ఆలోచించి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధా - అన్యాయముతో నిండిన ప్రపంచములో సాయి బంధువులు ఎలాగ బ్రతకాలి చెప్పుతండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు మరియు శ్రీ సాయి యిచ్చిన సందేశము.

1. పది రోజులు రాత్రి పగలు కష్ఠపడి సైకిలు త్రొక్కి గిన్నీసు పుస్తకములో పేరు తెచ్చుకొన్న వ్యక్తిని కనీసము పలకరించరు ప్రజలు అదే రాజకీయనాయకుడు కాకపోయినా ఖద్దరు బట్టలు ధరించి రాజకీయనాయకుడిలాగ చలామణి అయితే వానికి ప్రజలు బ్రహ్మరధము పడతారు. యిది ఎక్కడి న్యాయము.

2. చదువురానివాడు బ్లేడ్స్ కంపెనీ పెట్టి లక్షలు కి లక్షలు సంపాదించుతున్నాడు. బాగా చదువుకున్నవాడు ఉద్యోగము లేక వానాకాలములో గొడుగులు బాగు చేస్తామని రోడ్డు మీద తిరుగుతున్నాడే, యిది ఎక్కడి న్యాయము.

3. పెళ్ళిళ్ళలో అందరి ఆకలి ఒక్కటే మరి మగ పెళ్ళివారు భోజనాలు పూర్తి చేస్తేగాని ఆడ పెళ్ళివారు భోజనాలు చేయకూడదు. యిది ఎక్కడి న్యాయము.

4. ఫ్యాక్టరీలో పని లేదని ఊరికే కూర్చోలేక మిషన్స్ కు ఉన్న కరెంటు తీగలు పీకటము, మరియు దొంగిలించటము - యిది ఎక్కడి న్యాయము. యిటువంటి అన్యాయాల గురించి ఆలోచించేబదులు నీవు న్యాయమైన మార్గములో ప్రయాణము చేస్తు శ్రీ సాయికి ప్రీతిపాత్రుడువి కావాలి.

05.07.1994

నిన్నటిరోజున జీవితములో ప్రశాంతత పొందటము ఎట్లాగ అని చాలా సేపు ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని "ప్రశాంతతకు మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "ప్రసాంతి అనేది వేరేగా ఎక్కడ దొరకదు. ప్రశాంతముగా జీవించాలి అనె కోరిక మనిషిలో కలగాలి. అప్పుడే మనిషికి ప్రశాంతత లభించుతుంది." ఉదాహరణగా అటు చూడు. లేడీ డాక్టర్ తన భర్తతోను, యిద్దరు పిల్లలతోను ఎన్ని చికాకులు ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆ రోగులకు సేవ చేయుచున్నది.

2) ఆ ధనవంతురాలును చూడు ఆమె యిద్దరు పిల్లలు బస్సు ప్రమాదంలో చనిపోయిన ఆమె ప్రశాంతముగా బ్రతుకుచున్నది.

3) ఆ కూరగాయల మార్కెట్ లో ఆలంబాడి స్త్రీ తన యిద్దరు పిల్లలను చెంతనే యుంచుకొని కూరగాయలు అమ్ముకొంటు ప్రశాంతముగా జీవించుతున్నది. ఈ దృశ్యాలు చూసిన తర్వాత నాకు మెలుకువ వచ్చినది. లేచి శ్రీ సాయికి నమస్కరించినాను.

11.07.1994

నిన్నటి రోజున సత్ సంగాల గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ ఈ సత్ సంగాలగురించి నీ సలహా ఏమిటి?" దయచేసి తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "సత్ సంగాలలో తెలుసుకొన్న విషయాలను ఆచరణలో పెట్టిననాడే ఆ సత్సంగాలకు ఒక ప్రయోజనము యుంటుంది. సత్ సంగాలలో యిష్ఠులు, అయిష్ఠులు అనే భావము యుండరారు. సత్సంగములో అందరూ సాయి బంధువులే అనే విషయాన్ని నమ్మాలి."

12.07.1994

రోజు ఉదయము రాత్రి శ్రీ సాయికి హారతి యిస్తున్నానే కాని మనసుకు తృప్తి కలగటము లేదు. శ్రీ సాయి నన్ను అనుగ్రహించటము లేదు అనే ఆలోచనలు కలగసాగినవి. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా సమస్యకు పరిష్కార మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నా సమస్యకు పరిష్కారము ప్రసాదించినది. వాటి వివరాలు. "నేను చిన్నప్పటినుండి నా ప్రాణ స్నేహితుడు హెచ్.ఆర్. తో కలసి మెలసి యున్నాను.

నాకు నా స్నేహితుడు ఆరవప్రాణము. నేను అతనికి ఎంత చేరువగా యున్న అతను నన్ను సాధారణ స్నేహితునిగానె చూడసాగినాడు. కాని అతని తల్లి, యితర కుటుంబ సభ్యులు నన్ను చాలా ప్రేమతో చూడసాగినారు. నా స్నేహితుడు ఏనాడు నాకు సహాయము చేయలేదు. విచిత్రము ఏమిటంటే నా స్నేహితుని కుటుంబ సభ్యులు నాకు జీవితములో చాలా సహాయము చేసినారు." నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఈ దృశ్యము నాగత జీవితమునకు సంబంధించినది. శ్రీ సాయికి నాగత జీవితము పూర్తిగా తెలుసు. ఈ దృశ్యము ద్వారా శ్రీ సాయి నాకు యిచ్చిన సందేశము ఏమిటి అని ఆలోచించినాను. నేను అర్థము చేసుకొన్న సందేశము "నీవు పవిత్రమైన ప్రేమతో నన్ను ఫుజించు. నేను ఏదో ఒక రూపములో నీకు సహాయ సహకారాలు అందించుతాను. యిది నా వాగ్దానము." యింకొన దృశ్యములో శ్రీ సాయి ఒక కంటి డాక్టర్ రూపములో దర్శనము యిచ్చినారు.

కొంతమంది సాయి భక్తులు ఆయన దగ్గరకు తమ కళ్ళు పరీక్షింపచేసుకోవటానికి వెళ్ళినారు. ఆ డాక్టర్ తన దగ్గరకు వచ్చినవారితో చిలిపిగా మాట్లాడసాగినారు. కొంతమంది ఆయన చిలిపి మాటలకు సహనము కోల్పోయి వెళ్ళిపోయినారు. అపుడు ఆ కంటి డాక్టర్ (శ్రీ సాయి) అంటారు "నా చిలిపి మాటలకి సహనము కోల్పోతే ఎవరికి నష్ఠము. శ్రధ్ధ, సహనముతో ఉన్నవారికే నేను జ్ఞాన నేత్రాలు ప్రసాదించుతాను.

(యింకా ఉంది)


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List