Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 22, 2011

సాయితో సా యి బా ని స అనుభవాలు - 20

0 comments Posted by tyagaraju on 8:35 AM









22.10.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో సా యి బా ని స అనుభవాలు -- 20

ఈ రోజు సాయితో సా యి బా ని స అనుభవాలలో 20వ అనుభవాన్ని తెలుసుకుందాము.


సాయితో సాయి బా ని స అనుభవాలు 20శ్రీ సాయి సచ్చరిత్ర 42, 43, 44 అధ్యాయాలలో శ్రీ సాయి మహాసమాధి గురించిన వృత్తాంతము, సాయి భక్తులందరికీ తాము అనాధలమయ్యాననే భావన ఎలా కలిగిందో అంతా విపులంగా విశదీకరింపబడింది. నేను 1918 విజయదశమినాడు షిరిడీలో ఉండి ఉంటే నేను ఆయన మహాసమాధి సంఘటనను చూసి ఉండేవాడినే కదా, కాని నేను జన్మించినది 1946 లో. అందు చేత శ్రీ సాయి మహాసమాధి సంఘటన అనుభూతిని నేను పొందలేకపోతున్నానే మరి ఈ జన్మలో అటువంటి అనుభూతిని పొందాలనే కోరికతో ఉన్నాను. ఈ కోరికను సాయి నెరవేరుస్తారా అని ఆలోచించ సాగాను. ఈ ఆలోచన ఒక తెలివితక్కువ ఆలోచనగా ఎవరయినా భావించవచ్చు. కాని సాయినాధులవారు తన భక్తుల కోరికలను యెల్లప్పుడూ తీర్చడానికి సిధ్ధంగా ఉంటారు. శ్రీ సాయినాధులవారు ఈ నా కోరికను ఈ జన్మలో 1992 లో తీర్చినారు. ఆ అనుభవాన్ని మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. నా పినతల్లి కామేశ్వరమ్మ, నా పినతండ్రి సోమయాజులు దంపతులకు పిల్లలు లేని కారణంగా నేను వారి వద్ద పెరిగినాను. నా తల్లితండ్రులు తమ ఉద్యోగరీత్యా ఉత్తరభారత దేశంలో ఉండేవారు. నా పినతండ్రి సోమయాజులుగారు తెలుగు పండితులు. చాలా మంది బీద విద్యార్థులకు విద్యాదానం అన్నదానం చేస్తూ ఉండేవారు. నేను వారి వద్ద నా బాల్యము అంతయు గడిపాను. ఆయన తన 78 వ ఏట 23.01.1992 న విపరీతముగా జ్వరముతో బాధపడ్డారు. వెంటనే నేను, ఆయన దత్తతకుమారుడు కలిసి వారిని మల్కాజిగిరిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినాము. 25.01.1992 నాడు, డాక్టర్స్ అన్ని పరీక్షలు పూర్తి చేసి, ఆయన శరీరములోని ముఖ్య అవయవాలు పనిచేయటములేదని ఆయన బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. 27.01.1992 నించి ఆయన నోటిద్వారా ఏవిధమయిన ఆహారము తీసుకోలేని స్థితిలో ఉన్నారు. శ్రీ సాయి షిరిడీలో 28.09.1918 నించి జ్వరముతో బాధపడుతూ 01.10.1918 నించీ ఆయన మహాసమాధి చెందిన దినము 15.10.1918 వరకు ఎటువంటి ఆహారము తీసుకోలేదు. శ్రీ సోమయాజులుగారి దత్తత కుమారుడు తన యింటినిర్మాణము పూర్తిచేసుకుని 29.01.1992 నాడు గృహప్రవేశానికి శుభముహూర్తము నిర్ణయించుకున్నాడు. దానికి కావలసిన ఏర్పాటులన్నీ కూడా ముందుగానే జరిగిపోయాయి. ఇంతవరకు ఆ యింటినిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చుచేయడం జరిగింది. తన తండ్రి బ్రతికిఉండగా గృహప్రవేశము సజావుగా జరుగుతుందా లేదా అని అతను ఆందోళన పడసాగినాడు. ఇటువంటి సంఘటనే మనకు శ్రీ సాయి సచ్చరిత్రలో కనపడుతుంది. శ్రీ సాయి సశరీరంతో ఉన్నసమయములో గోపాల్ ముకుంద్ బూటీ ఒక లక్ష రూపాయలు వెచ్చించి బూటీవాడాని నిర్మించినాడు. శ్రీ సాయి ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న సమయములో శ్రీ సాయి ఈబూటీవాడాలో ప్రవేశిస్తారా లేదా అనే సంశయంతో ఉన్నాడు. నా మనసుకూడా శ్రీ సోమయాజులుగారు తనకుమారుడు నిర్మించిన నూతన గృహములో ప్రవేసిస్తారా లేదా అని ఆందోళన కలిగింది. అంతా సజావుగా జరిగిపోవాలని శ్రీ సాయినాధులవారిని వేడుకున్నాను. 29.01.1992 నాడు, నా పినతండ్రిని ఆస్పత్రినుండి ఆంబులెన్స్ లో తీసుకునివచ్చి గృహప్రవెస కార్యక్రమాన్ని పూర్తిచేసినాము. గృహప్రవెశ కార్యక్రమము అనుకున్నప్రకారముగా విజయవంతముగా జరిగింది. మానవుడు ఒకటి తలిస్తే దైవము మరొకటి తలుస్తాడనే సామెత ఇక్కడ జరగసాగింది. నా పినతండ్రి సోమయాజులుగారి ఆరోగ్యము క్షీణించ సాగింది. గృహప్రవేశము పూర్తి అయినతరువాత వారిని సికిందరాబాదులోని గాంధి ఆస్పత్రిలో చేర్చినాము. గాంధీ ఆస్పత్రిలో వారికి వైద్యము ప్రారంభించినారు. నేను 30.01.1992 నాడు ఉదయము గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాను. నేను గాంధి ఆస్పత్రి చేరుకుని అక్కడి డాక్టర్స్ తో మాట్లాడినాను. వారు శ్రీ సోమయాజులుగారు కొన్ని గంటలు మాత్రమే బతుకుతారు అని చెప్పినారు. నేను నా పినతండ్రి దగ్గిరకి వెళ్ళినాను. ఆయన నన్ను శ్రీ సాయి సచ్చరిత్ర తీసుకుని అందులోని యధాలాపముగా ఒక పేజీ తీసి చదవమన్నారు. యధాలాపంగా ఒక పేజీ తీసి చదవసాగాను. అది 27 వ అధ్యాయము. అందులో బాబా ఖాపర్డే భార్యతో అన్న మాటలు, "రాజారం రాజారాం అని ఉచ్చరించు. ఈ విధంగా చేసిన నీజీవిత లక్ష్యం నెరవేరుతుంది. నీమనసుకు శాంతి లభిస్తుంది". ఈ సందేశాన్నే నేను వారికి తెలియచేసాను. శ్రీ సోమయాజులుగారు రాజారాం రాజారాం అని ఉచ్చరించ సాగినారు. మధ్యాహ్న్నము 12 గంటలకు మధ్యాహ్న హారతి చదివి వినిపించమన్నారు. మధ్యాహ్న ఆరతి అనంతరము వారు తిరిగి రాజారాం మంత్రము జపించసాగారు. డాక్టర్స్ వచ్చి శ్రీ సోమయాజులుగారికి అంతిమ క్షణాలు వచ్చినాయని చెప్పినారు. ఆ సమయములో వారి దత్తత కుమారుడు వారి పక్కన లేడు. నేను గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళి తులసి ఆకులను తీసుకుని వచ్చి తులసి తీర్ధమును తీసుకుని ఆయన నోటిలో పోసినాను. అప్పుడు సమయము మధ్యాహ్న్నము ఒంటిగంట ముప్పయి నిమిషాలు. నా పినతండ్రి సోమయాజులుగారు రెండు గుటకలు తులసితీర్ధమును లోపలికి తీసుకుని నా ఒడిలో ఆఖరి శ్వాస వదలినారు. నేను రెండవసారి తీర్ధమును పోసినపుడు ఆ తీర్ధము ఆయన నోటినుండి బయటకు వచ్చివేసింది. 15.10.1918 విజయదశమినాడు నానాసాహెబ్ నిమొంకర్ శ్రీ సాయికి తులసి తీర్ధము ఇచ్చినారు. శ్రీ సాయికి ఆయన రెండవసారి పోసిన తీర్ధము బయటకు వచ్చివేసింది. శ్రీ సాయి దశమి ఘడియలలో మధ్యాహ్నము తన ఆఖరి శ్వాసను 2.30 నిమిషాలకు తీసుకున్నారు. శ్రీ సోమయాజులుగారు ఏకాదశి ఘడియలలో మధ్యాహ్న్నము 1.30 నిమిషాలకు తన ఆఖరి శ్వాసను తీసుకున్నారు. ఆయన ఆఖరి శ్వాస తీసుకున్న అనంతరము నేను వారి దత్తకుమారుడికి శ్రీ సోమయాజులుగారి మరణము గురించి తెలియచేసి శ్రీ సోమయాజులుగారి పార్ధివ శరీరాన్ని వారి దత్తత కుమారుడు నిర్మించిన నూతన గృహానికి తీసుకుని వెళ్ళినాము. శ్రీ సోమయాజులుగారి శరీరాన్ని నూతన గృహములో కొద్ది గంటలు ఉంచి ఆయన పార్ధివ శరీరానికి గంగా జలముతో స్నానము చేయించి, 30.01.1992 గురువారము సూర్యాస్తమయమునకు ముందుగా మల్కాజిగిరిలోని శ్మశాన వాటికకు తీసుకునివచ్చి ఆయన దత్తకుమారుని చేత దహనసంస్కార కార్యక్రమును పూర్తి చేయించినాను. తదుపరి దశదిన కర్మకాండలు పూర్తి చేయించినాను. ఈ సంఘటనలన్నిటిలోనూ ఆనాడు 1918 విజయదశమినాడు శ్రీ సాయి మహాసమాధి సంఘటనలను గుర్తు చేసుకున్నాను.




సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు









Wednesday, October 19, 2011

బాబాతో సాయి బా ని స అనుభవాలు 19

0 comments Posted by tyagaraju on 8:52 AM



19.10.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

07.10.2011 తరువాత మరల ఈ రోజు బాతో సాయి బా ని స అనుభవాలను ప్రచురిస్తున్నాను. విజయదశమికి ముందురోజు అనగా మహర్నవమినాడు మా పెద్దకుమార్తెకు అమ్మాయి జన్మించింది. అందువల్ల నేను హైదరాబాదులో ఉన్నకారణంగా చాలా ఆలస్యం జరిగింది. అన్యధా భావించవద్దు.

ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 19వ అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.

బాబాతో సాయి బా ని స అనుభవాలు 19

శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం లో బాబాగారు భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని నయం చేసి అతనిని మృత్యువునుండి రక్షించిన విథానము విపులముగా వివరింపబడింది.అదేవిథంగా 1996 వ సంవత్సరములో శ్రీ సాయి ప్రమాదకరమైన హృదయసంబంధమైన వ్యాథినుండి నన్ను కాపాడిన విషయము వివరిస్తాను.

అది 1996 వ సంవత్సరం ఏప్రిల్, నేల 20 వ తేదీఉదయము ఏడుగంటల సమయము.,. నేను పెరటిలోని పూలమొక్కలకు నీళ్ళు పెడుతూండగా నాకు ఛాతీ లో విపరీతమైన నొప్పి వచ్చి చెమటలు పట్టసాగింది. నేను వెంటనే మా వీధిలో ఉన్న డాక్టర్ ఆర్.ఏ రావు గారి వద్దకు వెళ్ళాను. ఆయన అది హార్ట్అటాక్ (గుండె పోటు) అని నిర్ధారించి నాలిక కింద సార్బిట్రేట్ మాత్ర పెట్టుకోమని చెప్పివెంటనే వైద్యం చేయించుకోమని సికిందరాబాదులోని సీ.డీ.ఆర్. ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. నన్ను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతూండగా, నేను శ్రీ సాయిని ప్రార్థించి శ్రీ సాయి సచ్చరిత్రలోని ఒక పేజీ ని తెరచి చూశాను. అది 15వ అధ్యాయం, అందులో ఇలా ఉందీ, "ఎవరయితే భక్తిభావంతో ఈ అధ్యాయాన్ని ప్రతీరోజూ చదువుతారో సద్గురు సాయిబాబా అనుగ్రహంతో వారి బాధలన్నీ తొలగిపోతాయి". ఈ వాక్యాలు చదివినతరువాత శ్రీ సాయినాధులవారు నన్ను తప్పకుండా రక్షిస్తారని ధైర్యం వచ్చింది. నాకు పూర్తి ఆరోగ్యము కలిగిన తరువాత ప్రతీరోజూ 15 వ అధ్యాయము పారాయణ చేస్తానని సంకల్పించాను. నా స్నేహితులు నన్ను ఆటోలో సీ.డీ.ఆర్. ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఆస్పత్రి వద్ద నన్ను స్ట్రెచర్ మీదకి మారుస్తున్నప్పుడు నాకు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆసమయములో నా దృష్టి ఆస్పత్రి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న మెడికల్ హాలు మీద పడింది. దానిమీద "సాయిశక్తి మెడికల్ హాలు "అనే అక్షరాలతో శ్రీ సాయి నన్ను దీవిస్తున్నట్లుగా పటము కనపడింది. నాకు తప్పకుండా నయమవుతుందనే భావన కలిగింది. నాకు చాలా ఖరీదయిన ఇంజక్షను ఇచ్చినతరువాత ఐ.సీ.యూ. లో ఉంచినారు. అది 28.04.1996 నాడు ఉదయము యాంజియోగ్రాము పరీక్షల నిమిత్తము హైదరాబాదులోని సీ.డీ.ఆర్.ఆస్పత్రిలోకి తరలించినారు. అక్కడ యాంజియోగ్రాము పరీక్షల తరవాత నాగుండెలో మూడు ఆర్టరీలలో బ్లాక్స్ ఉన్నట్లుగా తేలింది. నిపుణులైన వైద్యులు బైపాస్ ఆపరేషన్ చేయాలని నిర్థారించారు.

అది 01.05.1996 రాత్రి బాబాను ప్రార్థించినాను. శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనమిచ్చి నీ యింట ముగ్గురు దొంగలు పడినారు. నీవు పగటివేళ పోలీసులను పిలిపించి ఆ దొంగలను తరిమివేయడం మంచిది. పాఠకులందరికీ ఈ సందేశము విచిత్రంగా తోచవచ్చు. నేను ఈ సందేశంపై బాగా ఆలోచించాను. నా గుండెలోని మూడు ఆర్టరీలు పూడుకుని పోయినాయి. ఈ కష్టము తొలగాలంటే పగటివేళ మాత్రమే ఆపరేషను చేయించుకోవాలి అని నిర్థారణకు వచ్చాను. నేను డాక్టర్స్ తో మాట్లాడిన తరువాత వారు 16.05.1996 గురువారము నాడు మధ్యాహ్న్నము రెండు గంటలకు ఆపరేషను చేయడానికి నిర్ణయించారు.

అది 16.05.1996 సాయంత్రము అయిదు గంటల ప్రాంత సమయం. నాకు ఆపరరేషను చేయవలసిన డాక్టర్స్ యెవరూ రాలేదు. సాయంత్రము ఆరు గంటల ప్రాంతములో అసిస్టంట్ డాక్టరులు వచ్చి నన్ను ఆపరేషను థియేటరులో ఆపరేషను చేయడానికి లోపలకు తీసుకుని వెళ్ళినారు. ఆపరేషను థియేటరులోనికి వెళ్ళేముందు నా మనసు కీడును శంకించసాగింది. ఆ సమయంలో నేను నా డైరీలో ఈ వాక్యాలు వ్రాసాను."నేను మృత్యువుతో పోరాడటానికి వెళ్ళుతున్నాను. శ్రీ సాయి నాతోడు ఉన్నారు. నేను ఆపరేషనునుండి బ్రతికి బయటకు వస్తే ఆ విజయము శ్రీ సాయికే చెందుతుంది". ఈ వాక్యాలను నా డైరీలో వ్రాసి ఆ డైరీ నా భార్య చేతికి ఇచ్చి ఆపరేషను థియేటరులోకి వెళ్ళినాను. రాత్రివేళ జరిగే ఈ ఆపరేషను జరగకుండా చూడమని శ్రీ సాయిని ప్రార్థించి ఆపరేషను బల్లమీద నిస్సహాయంగా పడున్నాను. అది 6.గం.30 నిమిషాల సమయము. ఆపరేషను థియేటరులోని టెలిఫోను మ్రోగసాగింది. అక్కడ ఉన్న నర్స్ ఆఫోను అందుకొని అక్కడ ఉన్న డాక్టరులకు ఈ రోజు ఆపరేషను చేయవలసిన ప్రధాన డాక్టరు (చీఫ్ సర్జన్) డా.ప్రసాదరావుగారు ఆపరేషను చేయడానికి అనివార్య కారణాలవల్ల రాలేకపోతున్నారనీ ఈ ఆపరేషను మరుసటిరోజు ఉదయము 9 గంటలకి నిర్ణయించబడిందని తెలియచేసింది. ఈ వార్త విన్న నేను సంతోషముతో ఆపరేషను బల్లమీదనించి లేచి శ్రీ సాయినాధులవారికి ధన్యవాదాలు తెలియచేశాను.

అది 17.05.1996 అమావాశ్య ఉదయము 9 గంటల సమయము. డాక్టర్స్ తిరిగి నన్ను ఆపరేషను థియేటరులోకి తీసుకువెళ్ళినారు. 10 గంటలకు ప్రారంభ మయినటువంటి ఆపరేషను సాయంత్రము 4 గంటలకు విజయవంతముగా ముగిసినది. ఆపరేషను అనంతరము నన్ను ఐ.సీ.యూలో పరుండబెట్టినారు. అది 18.05.1996 ఉదయము 8 గంటల సమయము. నాకు స్పృహ వచ్చినది. నా ఎదురుగా అనస్థషిస్టు (మత్తుమందు ఇచ్చు డాక్టరు) డా.బ్రహ్మయ్య గారిని చూడగలిగాను. ఆయనలో శ్రీ సాయిని చూసి రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించాను. ఆయన నామీదకు వంగి మొదటగా ఎవరిని చూడదలచుకున్నావు అని అడిగినారు. "మొదటగా శ్రీ సాయిని చూడాలని అనుకుంటున్నానని" చెప్పాను. ఆయన నాభార్యకు కబురు చేసినారు. నా భార్య ఆనంద భాష్పాలతో చిరునవ్వుతో ఉన్న శ్రీ సాయి పటాన్ని తీసుకునివచ్చి నాకు చూపించినది. శ్రీ సాయియొక్క ఆ చిరునవ్వే ఈనాడు శ్రీ సాయి సేవలోను సాయి భక్తుల సేవలోను తరించే అదృష్టాన్ని ప్రసాదించింది.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List