Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 16, 2011

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 8

0 comments Posted by tyagaraju on 5:25 PM


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా.ని.స. అనుభవాలలో 8 వ.అనుభవాన్ని తెలుసుకుందాము.

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 8

శ్రీ షిరిడీ సాయి సశరీరంతో షిరిడీలో ఉన్న రోజులలో బాబా గారి అనుమతితో షిరిడీ ప్రజలు బయట గ్రామాలకు వెళ్ళేవారుమరియు వారిని దర్శించుకోవడానికి వచ్చినవారు వారి అనుమతి ఆశీర్వచనాలనూ తీసుకున్నతరవాతనే తిరిగి తమస్వగ్రామాలకు వెళ్ళేవారు. అది ఒక నియమంలా ఉండేది. పధ్ధతిని పాటించినవారంతా యెటువంటి కష్టాలూ లేకుండాతమ యాత్రలను పూర్తి చేసుకునేవారు. శ్రీ సాయి ఆదేశాలను పాటించనివారు అనేక కష్టాలను యెదుర్కోవలసి వచ్చేది. విషయాలన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో విపులీకరంగా చెప్పబడింది. 1992 లో బాబాగారి ఆదేశానికి వ్యతిరేకముగా నేనుకొనసాగించిన ప్రయాణము వివరాలు మీకు తెలియపర్చదలచుకున్నాను.

అది 1992 సంవత్సరము ఏప్రిల్ నెల. నాభార్య బలవంతము వలన నంద్యాల పట్టణములో ఉన్న నాకు కాబోయేఅల్లుడి గురించిన వివరాలు సేకరించడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అప్పటికే వివాహము నిశ్చయముఅవడం వల్ల అలాచేయడం భావ్యం కాదనుకున్నాను. కాని నా భార్య వెళ్ళితీరవలసిందే అని పట్టు పట్టింది. సందిగ్ధావస్తలో నాకు సలహాను ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించి కళ్ళుమూసుకుని శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. అది 9 అధ్యాయములో 84 పేజీ. అందులోని సందేశము "పల్లె విడిచి బయటకు పోవలదు “. సందేశముద్వారాబాబా నన్ను నంద్యాల పట్టణానికి వెళ్ళవద్దని ఆదేశించుచున్నారని గ్రహించాను. కాని నా భార్య బలవంతం మీద నాకాబోయే అల్లుడి వివరాలు తెలుసుకొనుటకు రాత్రి నంద్యాల పట్టణమునకు బయలుదేరాను. మరుసటి ఉదయమునాడు (మహాశివరాత్రి పర్వదినము ) నా అల్లుడుగారి యింటికి వెళ్ళాను. ముందుగా తెలియపరచకుండా హటాత్తుగా వారియింటికి చేరుకోవటము వారికి కొంచెం ఇబ్బంది కలిగించింది. నేను మహానందిలో మహాశివరాత్రి పుణ్యదినమునపూజలు చేయించడానికి మహానందికి వెడుతూ అతనిని చూడటానికి వచ్చినానని అబధ్ధము చెప్పినాను. ఆయనఆరోజున తన స్నేహితులతో కలిసి అహోబిలం వెళ్ళడానికి నిశ్చయించుకుని నన్ను కూడా వారితో కలిసి రమ్మనిచెప్పినారు. నేను వారి ఆహ్వానానికి అంగీకరించి వారితోను వారి స్నేహితులతోను కలిసి అహోబిలము చేరుకున్నాను. అహోబిలములో శ్రీ నరసిం హస్వామికి పూజలు పూర్తి చేసుకుని మధ్యాహ్న్నము 12 గంటల తరువాత బస్సు స్టాండ్ కువచ్చినాము. సాయంత్రము 4 గంటల వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు లేవని తెలుసుకుని అందరమూ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కాలినడకన బయలుదేరాము. మండుటెండలో నేనునడవలేకపోవుచున్నాను. బాగా అలసిపోయి నిస్సత్తువగా ఉన్నాను. తాగడానికి మంచినీరు లేదు. సేదతీర్చుకుందుకూ చెట్లకు ఆకులు లేక నీడ కూడా లేదు. మార్గము గుండా పోవుతున్న చిన్న వాహనములవారుఎవ్వరూ మాకు సహాయము చేయడాని తమ వాహనాలను ఆపలేదు. నాకు కాబోయే అల్లుడు అతని మిత్రులువడివడిగా ముందుకు నడవసాగారు. నేను మండుటెండలో నడవలేక రోడ్డుకు అడ్డముగా నిలబడి శ్రీసాయినామమును జపింప సాగినాను. నా అదృష్టము వశాత్తు ఒక లారీ నా ముందు ఆగినది. నేను కనులు తెరిచి లారీ వైపు చూసినాను. లారీపై శ్రీ షిరిడీ సాయినాధులవారి అభయహస్తముతో ఉన్నపటము మరియు శ్రీ షిరిడీసాయి లారీ సర్వీసు

అనే అక్షరములు చూసి తన్మయత్వములో కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయినాను. నా కాబోయేఅల్లుడు వారి మిత్రులు లారీ డ్రైవరు అందరూ కలిసి నన్ను లారీలో పరుండబెట్టినారు. లారీ డ్రైవరు మమ్ములనిదగ్గరలో ఉన్న గ్రామములో చేర్చినాడు. లారీ డ్రైవరు నన్ను దగ్గిరలో ఉన్న హోటలుకు తీసుకుని వెళ్ళి తాగడానికి ఒకసోడా కొని పెట్టి తన చేతి సంచీనుండి ఒక గజ నిమ్మపండు ఇచ్చి నా చేత నిమ్మరసము తాగించాడు. లారీ డ్రైవరుమమ్మలని అక్కడ వదలిపెట్టి వెడుతూ అన్నమాటలు " ఇక మీదట నీగురువు మాటలను పెడచెవిని పెట్టి యిటువంటికష్టాలను కొని తెచ్చుకోవద్దు." మాటలకు నేను నిశ్చేష్టుడినయ్యాను. సాక్షాత్తూ శ్రీ సాయినాధులవారే లారీ డ్రైవరురూపములో వచ్చి నన్ను కాపాడినారని తలచి వారికి నా రెండు చేతులతో నమస్కరించి కృతజ్ఞతలుతెలియచేసుకున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Thursday, September 15, 2011

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 7

0 comments Posted by tyagaraju on 6:16 PM


16.09.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. అనుభవాలలో 7 వ అనుభవాన్ని తెలుసుకుందాము.

సాయితో సాయి.బా.ని.. అనుభవాలు - 7

సాయి ఆపదలో ఉన్న తన భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తారని మనకందరకూ తెలుసు. బలరాంమా న్ కర్మశ్చీందర్ ఘర్ లో ధ్యానము చేసుకున్న తరువాత దాదర్ లోని తన యింటికి బయలుదేరాడు. పూనే రైల్వే స్టేషన్ కి చేరుకుని దాదర్ కువెళ్ళే రైలు కోసం యెదురుచూడ సాగాడు. రైలు టిక్కట్టు కొనడానికి ప్రయత్నించినా విపరీతమైనజన సమూహంలో టిక్కట్టు కొనలేకపోయాడు. మానసిక ఆందోళనతో తాను తన యింటికి వెళ్ళలేనని బాధపడసాగాడు. తనను కష్టాన్నుండి గట్టెక్కించమని సాయిని ప్రార్థించాడు. మరుక్షణమే సాయి ఒక పల్లె టూరివానిరూపములో ప్రత్యక్షమై తన వద్ద దాదరు వరకూ టిక్కట్టు ఉన్నదని కొన్ని కారణాంతరాలవల్ల తను ప్రయాణంచేయలేకపోతున్నానని చెప్పి టిక్కట్టునతని చేతిలో పెట్టాడు. మాన్ కరుకు యేమి జరిగిందో తెలుసుకునేలోపల పరిచిత వ్యక్తి జన సందోహంలో మాయమయిపోయినాడు. పల్లెటురివాడిచ్చిన టిక్కట్టుతో మాన్ కర్ తన యింటికిక్షేమంగా చేరుకున్నాడు. ఇది సాయి సచ్చరిత్ర 31 అధ్యాయంలో వివరింపబడింది.

సరిగా నాకు కూడా యిటువంటి అనుభవమే కలిగింది. సాయి భక్తులందరితోనూ దానిని నేనిప్పుడు పంచుకోదలిచాను. 1991 సంవత్సరంలో గోదావరీ నది పుష్కరాలకు వెళ్ళి రాజమండ్రీ రైల్వే స్టేషన్లో సికందరాబాదు రైలుకోసంనిరీక్షిస్తున్నాను. మన భారత దేశంలోని అన్ని నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి యిటువంటి పుష్కరాలుజరుగుతాయి. రాజమండ్రీ రైల్వేస్టేషన్లో నా బంధువు ఒకరు నాకు ఒక పెట్టెను ఇచ్చి దానిని సికందరాబాదులోని తనబంధువుల యింటికి చేర్చమని కోరినాడు. నేను పని చేయటానికి అంగీకరించాను. రైలు మరునాడు ఉదయముఏడు గంటలకు సికందరాబాదు స్టేషనుకు చేరుకున్నది. నేను కూలివాని సహాయంతో పెట్టెను తీసుకుని స్టేషనుబయటికి వెళ్ళడానికి గేటు దగ్గిరకు వచ్చినప్పుడు అక్కడ టిక్కట్టు కలెక్టరు నన్ను ఆపి పెట్టి 30 కిలోలకన్నయెక్కువ బరువు ఉండునని, దానిని తూకము వేయవలెనని ఆదేశించినాడు. నా దగ్గి రున్నసంచీ మరియు పెట్టెనుతూకము వేయగా 39 కిలోల బరువుంది. అదనపు బరువుకు 150 రూపాయలు అపరాధ రుసుము చెల్లించవలెననిఆజ్ఞాపించినాడు. సమయములో నా వద్ద 20 రూపాయలు మాత్రమే ఉంది. నేను టిక్కట్టు కలెక్టరును యెంతప్రాధేయ పడినా అతను నన్ను గేటు బయటకు వెళ్ళడానికి అంగీకరించలేదు. తోటి ప్రయాణీకులందరూ నన్ను ఒకదొంగగా భావించి పలు రకములైన వ్యాఖానాలు చేయసాగారు. అటువంటి ఆపద సమయములో నేను మనసారా శ్రీసాయిని ప్రార్థించి కష్టమునుండి గట్టెక్కించమని వేడుకున్నాను. సమయం లో టిక్కట్టు కలెక్టరుయొక్క పైఅధికారి అటువైపు వచ్చి నా భుజముపై చెయ్యి వేసి దగ్గిరలో ఉన్న ఫ్రిడ్జ్ లో నించి ఒక గ్లాసు మంచినీరు ఇచ్చి పెట్టినీది కాదన్న విషయం నాకు తెలుసు. నీవు ఆందోళన చెందవలదు అని చెప్పి టిక్కట్టు కలెక్టరుతో ఏదో మాట్లాడి గేటుబయట వరకు వచ్చి నన్ను యింటికి వెళ్ళమని చిరునవ్వుతో చెప్పినాడు. క్షణములో నా సాయినాధులవారే టిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆకష్టమునుండి రక్షించి నన్ను ఆశీర్వదించారనే భావనకలిగింది. నన్ను విధంగా రక్షించిన పెద్ద ఆఫీసరు నా సాయి తప్ప మరెవరు? చేతులు జోడించి సాయికిమనస్పూర్తిగా నమస్కరించాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Wednesday, September 14, 2011

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 6

0 comments Posted by tyagaraju on 5:59 PM


15.09.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా ని స అనుభవాలలో 6 వ్ అనుభవాన్ని తెలుసుకుందాము.

సాయితో సాయి.బా.ని.. అనుభవాలు - 6

శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి యిద్దరు విధ్యార్థులను ఎలా దీవించారో, వారు రీక్షలో విజయం సాధించేలా యెలాఅనుగ్రహించారో ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాము. బాబూ తెండూల్ కర్ జ్యోతిష్కులు చెప్పిన మాటలని విని

ఖిన్నుడయి వైద్య శాస్త్ర పరీక్షకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నప్పుడు తన తల్లి ద్వారా బాబా ఆదేశాలను, ఆశీర్వచనాలనూ స్వీకరించి పరీక్షలో ఉ త్తీర్ణుడైన సంగతి మరియు న్యాయశాస్త్ర పరీక్షలో షేవడే అనే విద్యార్థి బాబా ఆశీర్వచనాల్తో విజయము సాథించిన విషయము మనందరికీ తెలిసినదే.

యిటువంటి సంఘటనలే నా జీవితములో కూడా జరిగినవి. విషయాలను మీకిప్పుడు తెలియపరుస్తాను.

అది 1990 సంవత్సరము అక్టోబరు నెల. భారత ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న శాఖాపరమైన పదోన్నతికిమద్రాసులో జరగబోయే పరీక్షలకు వెళ్ళినాను. పరీక్ష నాడు ఉదయము మానసిక ఆందోళనతో అక్కడ అతిధి గృహప్రాంగణములోని ఒక చెట్టుకింద కూర్చుని నా పరీక్షలో విజయాన్ని ప్రసాదించమని బాబాని వేడుకుంటూ, ఒకసందేశమును ప్రసాదించమని కళ్ళు మూసుకుని సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరవగా 45 అధ్యాయం 374 పేజీలోని వాక్యములు నాకు ధైర్యాన్ని ప్రసాదించాయి. వాక్యాలని నేను మీకిప్పుడు తెలియపర్తుస్తున్నాను. "ఇకపొమ్ము, నీవు క్షేమమును పొందెదవు, భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచెఒకటి దానము చేయుము. దాని వల్ల నీవు మేలు పొందెదవు. " వాక్యములు చదువుతున్న సమయములోచెట్టుమీద కోయల కూత నన్నాకర్షించినది. కోయిల తెల్లటి శరీరము, నల్లటి మెడ కలిగి ఉండి నాలో ఆశ్చర్యమునుకలిగించినది. శ్రీ సాయినాధులవారు తెల్లటి కోయిల రూపములో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నరని భావించాను. ధైర్యముతో పరీక్ష వ్రాసి ప్రధమ శ్రేణిలో విజయాన్ని సాధించాను.

మరలా 1997 సంవత్సరం అక్టోబరు నెల. తిరిగి శాఖా పరమైన పదోన్నతికోసము జరిగే పరీక్షకు బొంబాయిలోని మాప్రధాన కార్యాలయానికి వెళ్ళినాను. నాకు తక్కువ విద్యార్హత ఉన్నా, యెక్కువ సీనియరిటీ ఉండుట చేత, పరీక్షరాయడానికి అర్హత పొందినాను. కాని అక్కడికి వచ్చిన యితర అభ్యర్థులందరూ నా కన్న వయసులో చిన్నవారు, మరియు విద్యార్హతలు యెక్కువగా కలిగినవారు. వారితో నేను పోటీ చేయగలనా నే భయంతో సాయీని ప్రార్థించి కళ్ళుమూసుకుని సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. ఆశ్చర్యము 45 అధ్యాయము 374 పేజీ "ఇక పొమ్ము, నీవుక్షేమమును పొందెదవు, భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానముచేయుము. దాని వల్ల నీవు మేలు పొందెదవు."

అదే సమయములో శ్రీ సాయి ఒక పావురము రూపములో నేను కూర్చున్న టేబులు మీద వాలి మూడుసార్లు కూతకూసి నన్ను ఆశీర్వదించి యెగిరి వెళ్ళిపోయినారు. సంఘటనతో బాబా ఆశీర్వచనాలు ఉన్నాయనే ధైర్యముతో పరీక్షవ్రాసి తిరిగి విజయాన్ని సాధించాను.

రెండు సంఘటనలను తలచుకున్నప్పుడెల్లా సాయినాధులవారిపై ప్రేమతో వారి పాదాలను ముద్దు పెట్టుకుని నాకృతజ్ఞతలు యెల్లప్పుడూ తెలియచేసుకుంటున్నాను.

ప్రతీవారికి తమ తమ అనుభవాలు ఉంటాయని నాకు తెలుసు.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List