Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 10, 2011

సాయితో సాయి బా.ని.స. అనుభవాలు - 2

0 comments Posted by tyagaraju on 7:49 PM


11.09.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా.ని.స.బాబాతో అనుభవాలు 2వ అనుభవాన్ని గురించి తెలుసుకుందాము.
సాయితో సాయి బా.ని.. అనుభవాలు - 2
1991 లో నేను మా అమ్మాయికి వివాహానికి మంచి సంబంధ కోసం ప్రయత్నిస్తున్నాను కాని కుదరలేదు. ఎన్నోచోట్లకుతిరిగి , పెళ్ళికోడుకుల తల్లితండ్రులని అమ్మాయిని చూడమని మా యింటికి ఆహ్వానించాను.
యెన్నో విథాలుగాఅభ్యర్థించినప్పటికీ మా అమ్మాయిని చూడటానికి యెవరూ రాలేదు. 01.01.1992 నూతనసంవత్సరమునాడు మాఅమ్మాయి వివాహం గురించి శ్రీ షిరిడీ సాయిబాబావారిని సందేశం ఇమ్మని అడిగాను. కళ్ళు మూసుకుని శ్రీ పత్తినారాయణరావుగారురాసిన సచ్చరిత్రలోని
ఒక పేజీ తెరిచాను. ఆశ్చర్యకరంగా అది 47 అధ్యాయం 387 పేజీ, అందులోఇలా ఉంది "దీని గురించి చింత పెట్టుకోవద్దని
నేనతనికి చెప్పాను, వరుడే ఆమెను వెతుక్కుంటు వస్తాడు". 1992 లోమా అమ్మాయి వివాహమవుతుందని సూచిస్తోందని తెలిసి నేను చాలా సంబర పడ్డాను.
1992 జనవరిలో నాస్నేహితుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి మా అమ్మాయి వివరాలు, జాతకం అడిగారు. వాటిని సామాజిక సేవకుడు వివాహసంబధాలనుకుదిర్చేతనస్నేహితుడుశ్రీసోమయాజులుగారికిఇస్తాననిచెప్పినారు.. నిజానికి సోమయాజులుగారితోనా కంతగా పరిచయం లేదు.
17.02.1992 నేను ఉదయం 9 గంటలకి ఆఫీసుకు వెళ్ళేటప్పటికి నా బల్లమీద ఫోన్ మ్రోగసాగింది. నేను రిసీవరు తీసిఅవతలినుండి యెవరు మాట్లాడుతున్నారని అడిగాను. “తను పెళ్ళికొడుకుననీ మీఅమ్మాయిని చూడటానికివిశాఖపట్నం నుంచి వచ్చాననిసమాథానం చెప్పినాడు. నేను సందిగ్ధంలో పడి బాబాని ప్రార్థించాను. శ్రీసాయిబాబాగారు ముందుకు వెళ్ళమని నాకు వెంటనే సలహా ఇచ్చారు. నేను వరుడుని అతని తల్లితండ్రులనిమాయింటికి మధ్యాహ్న్నం 2.30 కు ఆహ్వానించి మా అమ్మాయిని పరిచయం చేశాను.వారు మా అమ్మాయితోసుమారు గంట సేపు మాట్లాడిన తరువాత విశాఖపట్నం వెళ్ళిపోయారు.19.02.1992 పెళ్ళికొడుకు తండ్రి నుంచి,తమకి అమ్మాయి నచ్చిందని నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునేందుకు నన్ను, నా భార్యని రమ్మని టెలిగ్రాం ఇచ్చారు. మాఅమ్మాయి అంగీకారం తీసుకుని 20.02.1992 విశాఖపట్నం చేరుకున్నాము. సంబంధం ఖాయంచేసుకున్నాము. శ్రీ సాయి మా అమ్మాయికి మంచి వరుడిని ఇచ్చారని సంతోషించాను. వివాహం హైదరాబాదులో10.05.1992 ఉదయం 6.58 కి నిర్ణయమైంది. పెళ్ళి పనులన్ని సజావుగా సాగేలా సహాయం చేయమని, వివాహంబాగా జరిపించమనీ బాబాని ప్రార్థించాను. 22.03.1992 మధ్యాహ్న్నం నిద్ర పోతున్నప్పుడు శ్రీ సాయిబాబా మాతండ్రిగారి రూపంలో (కీ.శే .ఆర్.వీ.రావు) దర్శనమిచ్చి మా అమ్మాయి వివాహానికి సహాయం చేస్తాననీ వివాహానికికూడా వస్తానని మాటిచ్చారు. చనిపోయిన మనిషి (మాతండ్రిగారు) వివాహానికి వచ్చి విథంగా సహాయం చేయగలరా అని నేను ఆశ్చర్యపోయాను.
శ్రీసాయి సచ్చరిత్రలో 40 అధ్యాయం 342 పేజీలొ శ్రీ సాయిబాబా ఇలా చెపుతారు "నన్నే గుర్తుంచుకొనువారిని నేనుమరువను. నాకు బండిగాని, టాంగా గాని, రైలుగాని విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను." శ్రీ సాయిబాబా మా తండ్రిగారి రూపంలోమా అమ్మాయిపెళ్ళికి.రాలేరనింపించింది. శ్రీ సాయి సచ్చరిత్ర 28 అధ్యాయం 240 పేజీలో శ్రీ సాయిబాబా అన్న మాటలు "నాకు రూపమూ,ఆకారము అక్కరలేదు నేను అంతటా ఉంటాను" సాయి సచ్చరిత్రలో 40 అధ్యాయం 342 పేజీలో శ్రీ సాయి ఇలాఅంటారు "నా మాటలు నిలబెట్టుకోవడానికి ప్రాణములనైన విడిచెదను. నా మాటలు నేనెప్పుడూ పొల్లు చేయను."

సాయిబాబాకి నేను పూర్తిగా సర్వశ్య శరణాగతి చేసి పెళ్ళి పనులు ప్రారంభించాను. 1992 మార్చ్ నెలలో శుభలేఖలుఅచ్చువేయించి శ్రీ సాయి సూచించిన ప్రకారం మొదటి శుభలేఖ రాజస్థాన్ రణథంబార్ గణపతిమందిరానికి పోస్ట్ చేశాను. రెండవది తిరుపతి వేంకటేశ్వరస్వామికి, మూడవది షిరిడీలోని శ్రీ సాయిబాబా వారికి పంపించాను. తరువాతఅయిదు శుభలేఖలువిదేశాలకు పంపి, కనీసం ఒక్క కుటుంబమైనా విదేశాన్నించి పెళ్ళికి వచ్చేలా చూడమని బాబానిప్రార్థించాను. అమెరికానించి నా శ్రేయోభిలాషులు శ్రీమతి & శ్రీ వీ. సూర్యారావుగారు 09.05.1992 మాఅమ్మాయివివాహానికి హైదరాబాదు వచ్చినపుడు నేను ఆశ్చర్యపోయాను.09.05.1992 వివాహ మహోత్సవానికి సహాయం చేయమని అంతా బాగా జరిగేలా చూడమని బాబాని ప్రార్థించాను. ఆఖరికి 10.05.1992 పెళ్ళిరోజు వచ్చింది. ముహూర్తం ఉదయం 6 గంటల 58 నిమిషాలకు అవడంవల్ల ఉదయం నేనుచాలా హడావిడిగా ఉన్నాను.శ్రీ సాయి సచ్చరిత్ర్త్ర పారాయణకి కనీసం అయిదు నిమిషాలు కూడాకేటాయించలేకపోయాను. ప్రతీరోజు సచ్చరిత్ర పారాయణకి నేను సమయం కేటాయించగలను అనే అహంకారం ఉండేది. ఆరోజు సచ్చరిత్ర ముట్టుకోలేనంతగా సాయి నన్ను బాగా పని వత్తిడిలో ఉండేలా చేసి నా అహంకారాన్ని తొలగించారు. పెళ్ళిలో నేను పూర్తిగా సాయిని మరచిపోయి నా స్నేహితులతోనూ, పెళ్ళికొడుకు బంధువులతోనూ మాట్లాడుతున్నాను. అప్పుడు ఉదయం 11.45 అయింది. పెళ్ళికొడుకు పురోహితుడు ఒక బ్రాహ్మడితో కూడా నా వద్దకు వచ్చి బ్రాహ్మడికికొంత దక్షిణ యిమ్మని అడిగాడు. బ్రాహ్మడుఅతని బంధువేమో అనుకుని రూ.21/దక్షిణ ఇచ్చాను. అప్పుడుఆబ్రాహ్మడు భోజనం పెట్టమన్నాడు. ఆపుడా పురోహితుడు అతనిని భోజన శాలలోకి పంపించి మిగతాఅతిథులందరితోపాటు భోజనం చేయమనిచెప్పాడు.. అతిథులతోను, బంధువులతోను మాట్లాడటానికి నేను భోజనశాలలోకి వెళ్ళినప్పుడు, నేను దక్షిణ ఇచ్చిన బ్రాహ్మడు నా వైపు చూసి నవ్వుతున్నాడు. అతను నన్నింకా డబ్బుఅడుగుతాడేమొనని అనిపించి అక్కడినుండి వెళ్ళిపోయాను. పెళ్ళికొడుకు తరఫువారందరికీ అవసరమయిన పనులుచూడటంలో పుర్తిగా మునిగిపోయాను. సాయంతం 4.30 కి మగ పెళ్ళివారు పెళ్ళికుమార్తెను తీసుకుని విశాఖపట్నంబయలుదేరారు. సాయంత్రం 6.30 కి కూడా భోజనం చేయలేకపోయాను. కొంతమంది బంథువులతో భేదాభిప్రాయాలురావడంవల్ల కొంచం కలతగా ఉన్నాను. భేదాభిప్రాయాల వల్ల రాత్రికూడా భోజనం చేయలేకపోయాను.
ఉదయంముహూర్తం అయినతరువాత వివాహానికి అమెరికానించి వచ్చిన నా శ్రేయోభిలాషి శ్రీ వీ. సూర్యారావు గారు నాకుపలహారం ఇచ్చి " రోజు పని వత్తిడివల్ల నీకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు పలహారం తీసుకో" అ ని చెప్పారు. పలహారం చెయ్యకపోతే ఆరోజు నాకు ఉపవాసం అయిఉండేది. శ్రీ సాయి ఉపవాసానికి వ్యతిరేకి ఆయన తనభక్తులనెప్పుడూ ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు.( అధ్యాయం 32 పేజీ 274.) రాత్రి నేను నిద్రకుపక్రమించేముందు వివాహం చక్కగా జరిపించినందుకు శ్రీ సాయిని ప్రార్థించి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. శ్రీ సాయిబాబా వివాహానికిరాకుండా మాట తప్పారనిభావించాను.
22.03.1992 శ్రీ సాయి వివాహానికి వస్తానని మాటిచ్చారు. ఒకవేళ శ్రీ సాయిబాబా వివాహానికి వచ్చి ఉంటే ఏ రూపంలోవచ్చారు? నాకది ఒక ప్రశ్నఅయింది. నా సందేహాన్ని తీర్చమని శ్రీ సాయిని అడిగాను. శ్రీ సాయిబాబా
నా కలలోబ్రాహ్మణుడి రూపంలో దర్శనమిచ్చి (నానుంచి 21/రూపాయలు దక్షిణగా తీసుకున్న బ్రాహ్మణుడిగా) నవ్వుతున్నారు. నేను మంచం మీదనించి లేచి సాయి పటం ముందు నిలబడి మాట తప్పకుండా మా అమ్మాయి వివాహానికి విచ్చేసినసాయిని గుర్తించ లేకపోయినందుకు నన్ను నేను నిందించుకున్నాను. మరునాడు నా అనుమానంసరిచూసుకోవడానికి, మగపెళ్ళివారి పురొహితుడిని నానుంచి 21/- దక్షిణ తీసుకున్న బ్రాహ్మణుడిని గురించిఅడిగాను. ఆయన, బ్రాహ్మణుడు పెండ్లికి వచ్చిన అపరిచితుడని చెప్పారు. మరి అపరిచితుడు సాయి తప్పమరెవరూ కాదనిపించింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Friday, September 9, 2011

సాయిబానిస అనుభవాలు -- 1

0 comments Posted by tyagaraju on 9:19 AM




09.09.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాసీస్సులు


సాయిభక్తులకు ఒక మనవి ::

ఈ రోజునించి శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగు కొత్త డిజైన్ తో ప్రారంభింపబడింది.
shirdisaideva.com

షిర్డి సాయిబాబా ప్రేయరు క్లబ్ కూడా ప్రారంభింపబడింది.




గత నాలుగురోజులుగా ప్రచురించడానికి వీలు చిక్కలేదు. పొరుగూరిలో ఉద్యోగం వల్ల పొద్దున్న కొంత రాత్రి సమయం కొంత వెచ్చిస్తున్నాను.
ఈ రోజునుంచి అద్భుతమైన బాబా లీలలను మీకందించడానికి బాబా వారి అనుగ్రహం తప్ప మరేమీకాదు. 5వ తేదీ తరువాత ఏమి పోస్ట్ చేద్దామా అని ఆలోచిస్తూండగా ఈ అద్భుతమైన లీలలను పోస్ట్ చేసే అవకాశాన్ని బాబా వారు ఇచ్చినందుకు ఆయనకు మనసారా నా శిరసువంచి పాదాభివందనం చేస్తున్నాను.

సాయిబానిస అనుభవాలు -- 1


శ్రీ రావాడ గోపాలరావుగారు బాబా వారి అనుగ్రహంతో 1989 లో సాయి భక్తునిగా మారారు. శ్రీ రావాడ వెంకటరావు, రావాడ రమణమ్మ పుణ్యదంపతులకు 24, ఏప్రిల్, 1946 లో ఆయన జన్మించారు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉండగా, బాబా వారు ఆయనకి "సాయిబానిస" అని పేరుపెట్టారు. అంటే దాని అర్థం "బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి"

Monday, September 5, 2011

షిరిడీ సాయిబాబా మందిరం : గురుదాస్ పూర్ పంజాబ్

0 comments Posted by tyagaraju on 6:03 PM





06.09.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రిమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులో మార్చ్ 5, 2011 లో ప్రచురింపబడిన గురుదాస్ పూర్ బాబా మందిరం గురించి తెలుసుకుందాము.



షిరిడీ సాయిబాబా మందిరం : గురుదాస్ పూర్ పంజాబ్

2009 డిసెంబరులో శ్రీ ప్రమోద్ మహాజన్ గారు తమ కుటుంబంతో మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళారు. షిరిడీలో ఉండగా ఆయనకి తన స్నేహితుడైన అశోక్ కపిల్ నుంచి ఫోన్ వచ్చింది (ఆయన కూడా సాయి పరివార్ సొసైటీలో సభ్యుడు). కపిల్ గారు, గురుదాస్ పూర్ లో బాబా విగ్రహాన్ని ప్రతిష్టిద్దామనే ఆలోచనలో ఉన్నట్లు అందుచేత విగ్రహ ప్రతిష్ఠాపనకి సంబంధించిన వివరాలన్ని షిరిడీ సంస్థాన్ వారినించి మొత్తం అడిగి తెలుసుకోమని ఫోన్ లో అడిగారు. ఇది వినగానే మహాజన్ గారు చాలా సంతోషించారు. విగ్రహం స్థాపన యెలా చేయాలో మొత్తం సమాచారమంతా రాసి పెట్టుకున్నారు. షిరిడీ సాయి సంస్థాన్ వారు ఇచ్చిన సూచనల ప్రకారం యేమేమి చెయ్యవచ్చు, యేమేమి చేయకూడదో వీటితో సరియైన సమాచారాన్ని తయారు చేశారు.
జనవరి 3, 2010 న ప్రదీప్ గారు కుటుంబంతో గురు దాస్ పూర్ లోని తమ యింటికి తిరిగి వచ్చారు. వెంటనె సాయి పరివార్ సొసైటీ గుర్దాస్ పూర్ లో బాబా మందిరాన్ని నిర్మించాలని యేకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

యిప్పటివరకు బాబా మందిరం నిర్మించడానికి వారికి స్థలం దొరకలేదు. కాని యెవరయినా తన మందిరం నిర్మించదలిస్తే సాయి ప్రతీదీ తనే చూసుకుంటాడన్నది మనకి తెలుసు. వాస్తవానికి ఆయన మందిర నిర్మాణ సమయంలో సాయి ప్రతీ అడుగునీ పర్యవేక్షిస్తూ ఉండగా చూసిన భక్తుల ఉదంతాలు కూడా ఉన్నాయి.
యిక్కడకూడా అదే జరిగింది. షివల చౌదరి మిస్త్రీ కమిటీ ద్వారా సాయి పరివార్ సంఘానికి, బాబా మందిర నిర్మాణానికి స్థలం ఇవ్వబడింది. షివల మందిరం ఉన్న వెనకాల స్థలంలో బాబా మందిరం నిర్మించుకోవడానికి అనుమతినిచ్చారు.

ఈ విథంగా ప్రధాన సమస్య తొందరలోనే తీరిపోయింది. కిందటి సంవత్సరం జనవరి 20, 2010న వసంత పంచమి పుణ్య దినాన హోమాలు, పూజలతో భూమి పూజ జరిగింది.అఖిల భారతీయ గో రక్ష దళానికి జాతీయ అద్యక్షుడయిన శ్రీ కృష్ణానంద్ గారు భూమి పూజ చేశారు.



మెల్లగా నిలకడగా బాబా అనుగ్రహంతో నిర్మాణం పని జరుగుతూ ఉంది. యెప్పుడు దేనికీ కొరత రాలేదు. నిజానికి నిర్మాణానికి ఏది కావలసి వచ్చినా సాయి భక్తులందరూ సంతోషంగా విరాళం ఇచ్చారు. ఈ విథంగా యెటువంటి ఆటంకాలూ లేకుండా ప్రతీదీ సాఫీగా జరిగిపోయింది.



సరిగ్గా 9 నెలల తరువాత ( 9 బాబా వారి సంఖ్య) సాయిమందిరం పూర్తిగా తయారయింది. విగ్రహ ప్రతిష్టాపనకి 11 అక్టోబరు, 2010 (విజయదశమి) రోజుకి ఖరారు చేశారు.

Sunday, September 4, 2011

మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి

0 comments Posted by tyagaraju on 8:09 AM


04.09.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్లబ్లాగులో 21.09.2008 నాటి ప్రచురణకి తెలుగు అనువాదం అందిస్తున్నాను. యింటర్నెట్ లో యెన్నో వెబ్ సైట్లు, బ్లాగులు ఉండగా మరొకటి అవసరమా అన్న ఆమె స్నేహితురాలి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాథానాన్ని తెలుసుకుందాము.

మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి

ఈ రోజు నా స్నేహితురాలొకామె నన్ను చాలా విచిత్రమైన ప్రశ్న ఒకటడిగింది. ఆమె నన్నిలా అడిగింది.. నువ్వు సాయిబాబాని గురించి యెందుకు రాస్తున్నావు. యిప్పటికే నెట్లో చాలా బ్లాగులు, వెబ్ సైట్లు వున్నాయి, నువ్వు కూడా యింటి దగ్గిర యెందుకంత శ్రమపడతావు...అని....ఒక విథంగా ఆమె కరెక్టే..ఆమె ప్రశ్న కూడా మంచిదే, నేను ఆ ప్రశ్నకి సమాథానం చెప్పదలచుకున్నాను. మొట్టమొదటగా బాబా గురించి రాయడానికి నేను ధైర్యం చేయను, బాబాయే నా చేత రాయిస్తున్నారు, మనం యెంతోమంది ప్రేక్షకుల మధ్య రంగస్థలం మీద ఆడుతున్న ఒట్టి తోలుబొమ్మలం మాత్రమే...దానికి మహా నిర్ణేత...సాయి.

యిక రెండవది, నేను సాయిబాబా మీద బ్లాగ్స్ తయారు చేస్తాను..ప్రపంచవ్యాప్తంగా నేను ఉచితంగా సాయి సచ్చరిత్రలు పంపుతున్నాను...ఉచితంగా ఊదీ పంపుతాను...ఇంకా.. అలా...అలా...

ఈ విశ్వంలో ప్రతీ సాయిభక్తుడి గృహానికి సాయిబాబా చేరాలి..మానవులందరూ తమ జీవితంలో ఒక్కసారయినా సచ్చరిత్రను చదవాలనీ..కారణం ఒక్కసారి చదివితే కనక వారు మారతారు..వారి ప్రవర్తనలోను, ఆలోచనలోను..ప్రవృత్తిలోను...వారు అనుకూలంగా ఆలోచిస్తారు..వారికి దయార్ద్ర హృదయం ఉంటుంది..వారు యితరులని మోసం చేయరు...వారు అసత్యమాడరు...ఇవన్ని నేను అనర్గళంగా ఈ కారణాలన్ని చెపుతూనే ఉన్నాను.
అప్పుడు కారులో నాపక్కన కూర్చున్న నా స్నేహితురాలు ఏడుస్తోందని గమనించాను. అటువంటి ప్రశ్న అడిగినందుకు క్షమించమని అడిగింది.

ఆమె అడిగింది కరెక్టే, ఆమే కాదు, మనమందరమూ కూడా సాయిబాబా గురంచి మనమెందుకు రాయాలి, చదవాలి అని ఆలోచిస్తాము.. అటువంటివారందరికీ నేను ఒకటే చెపుతున్నాను ఒక్కసారి సచ్చరిత్ర చదవండి అప్పుడు ఈ ప్రశ్న మరొకసారి అడగండి.

ఆయనలో నమ్మకముంచుకుంటే బాబా మీ జీవితాన్ని మారుస్తారు. ఒక్కసారి శ్రీ సాయిబాబా పాదాలవద్ద శరణాగతి చేస్తే ఏ సాథనలోను మీ కాలాన్ని వ్యర్థం చేసుకోనక్కరలేదు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List