Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 2, 2011

నేనుండ నీకు భయమేల -- అషిమా, బాబా అనుభూతి

0 comments Posted by tyagaraju on 6:02 AM



నేనుండ నీకు భయమేల -- అషిమా, బాబా అనుభూతి


02.09.2011 శుక్రవారము


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి ప్రియాంకాగారి ఆంగ్లబ్లాగులోని బాబా లీలకు తెలుగు అనువాదాన్ని అందిస్తున్నాను. ఈ లీల వినాయక చవితి రోజున ప్రచురింపబడింది. దానిని యథాతధంగా మీకందిస్తున్నాను.

మొదటగా మీకందరికీ బాబా వారముతోపాటుగా సాయి గణేష్ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. బాబా చెప్పిన ఈ వాక్యాలు మనకందరకూ తెలుసు, "నేనుండ నీకు భయమేల" అని. అది చాలా యదార్థమని మని నేను చెపుతున్నాను నన్ను నమ్మండి. మన దైనందిక కార్యక్రమాలలోకి మనం జాగ్రత్తగా తరచి చూస్తే, మనకు కలిగిన వేల సమస్యలనుండి బాబా మనలని యెలా రక్షించారో, మనం కోరినది ఇచ్చి మనలని యెలా అనుగ్రహించారో అర్థమౌతుంది. ఒక్కొక్కసారి మన అహంకారం వల్ల ఆ విజయం మన వల్లే జరిగిందనే గర్వంతో విఱ్ఱ వీగుతూ ఉంటాము. మనమది చేయకూడదు. సాథించినది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనం దానికి యెల్లప్పుడూ బాబాకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, కారణం చేయించేదంతా ఆయనే, మనం ఆయన అనుగ్రహ ఫలితాన్ని ఆనందిస్తున్నాము.


సాయి మన నిజమైన తల్లి., ఆమె తన బిడ్డలందరి కష్టాలనీ, సమస్యలనీ తుడిచి పెట్టేస్తుంది. బాబా కరుణా సముద్రుడు. సాయి మీద సడలని నమ్మకాన్ని ఉంచుకుంటే మనం యిటువంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించగలం. ఒక్కసారి ఆయనమీద మీనమ్మకాన్ని పెంపొందించుకుంటే ప్రతీక్షణం ఆయన మీవద్దనే ఉన్నారనే అనుభూతిని చెందుతారు. అదే బాబా చెప్పిన ఉవాచ "నామీద యెవరైతే నమ్మకముంచుకుంటారో వారి యోగక్షేమాలను నేను గమనిస్తూ ఉంటాను."


మనం ఏమి చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా మన మదిలో యెప్పుడూ బాబానే నిలుపుకోవాలి, ఆయనమీదే మనసు లగ్నం చేయాలి, ఆయన నామాన్నే పదే పదే ఉచ్చరిస్తూ ఉండాలి, ఆయన పాటలను పాడుకోవాలి, యిలా చేస్తూ ఉంటే కనక మెల్లగా మనం సంపూర్ణంగా ఆయనలోకి ఐక్యమయిపోతాము. కాని అదే సమయంలో మనం మన అహంకారాన్ని ఆయన పాదాలముందు వదలేయాలి. మనం ప్రతీ సమయం యదార్థాన్ని మనతోనే ఉంచుకోవాలి, యిక్కడ యదార్థమంటే సాయి.


ఈ రోజు బాబా వారమునాడు సోదరి అషిమా గారి యింపైన అనుభవాన్ని తెలుసుకుందాము. మీకందరికీ అషిమా గుర్తుండే ఉంటుంది. యిదివరలో ఆమె మనతో చాలా లీలలను పంచుకుంది. ఇప్పుడామె చెప్పే ఈ లీల, ఆమె అసలు యేమీ తయారుకాకుండా క్యాంపస్ యింటర్యూకి హాజరవుతున్నప్పుడు బాబా ఉన్నారనే దానికి గట్టి ఋజువుని తెలియచేస్తుంది. ఈ సంఘటన బాబా ఆందోళనని, భయాన్ని, దురదృష్టాన్ని తొలగించి తన భక్తుల జీవితాలలో ఆశని, సంతోషాన్ని యెలా తీసుకొస్తారో తెలియచేస్తుంది.


అషిమా, క్రమం తప్పకుండా నీ అనుభూతులని మాతో పంచుకుంటున్నందుకు నా హృదయపూర్వక థన్యవాదాలు తెలుపుతూ, నీ శ్రమకి, అంకిత భావానికి విలుననిస్తున్నాము.


అల్లాహ్ మాలిక్

ప్రియమైన ప్రియాంకా, అక్కా,
నా అనుభూతులని కొన్ని చెపుతాను, వాటిని మిగతా సాయిబంధువులందరికోసం మీ వెబ్ సైట్ లో ప్రచురించండి.

2011 లో నేను యింజనీరింగ్ 8 వ సెమిస్టర్ లో ఉన్నాను, కాలేజీ కాంపస్ ఉద్యోగానికి అర్హత వచ్చింది. ఇండస్ట్రియల్ శిక్షణా కార్యక్రమం వల్ల పట్టణంలో లేకపోవడం వల్ల నాకు రెండు అవకాశాలు చేజారిపోయాయి. ఆఖరికి జనవరి 13, 2011, గురువారమునాడు ఒక మంచి కంపనీ మా కాలేజీ కాంపస్ కి వచ్చింది, కాని నేను తయారుగా లేకపోవడం వల్ల పరీక్షకు వెళ్ళడానికి భయం వేసింది. కాని నా స్నేహితురాళ్ళు ఒకసారి ప్రయత్నించు, అనుభవం కూడా వస్తుంది అని నన్ను ఒప్పించారు.


నేను అయిష్టంగానే ఒప్పుకున్నాను. ఆరోజు నా గురువారం వ్రతం. పొద్దున్నే మేము కాలేజీ కి వెళ్ళాము. నేను యెంపిక కాబడనని నాకుతెలుసు యెందుకంటే 300 పైన ఉన్న విద్యార్థులకి 30 ఖాళీలే ఉన్నాయి. మొదటి రౌండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో చాలామంది ని వడపోత పోసేస్తారు. అంచేత నేను యెంపిక కాబడనని నాకు ఖచ్చితంగా తెలుసు, కాని అది బాబా లీల ...నేను యెంపిక అయినట్లు నా పేరు వెల్లడించారు. నాకెందుకు ఆశ్చర్యం వేసిందంటే బాగా చదివే నా స్నహితులెవరూ యెంపిక కాబడలేదు.


తరువాత రౌండ్ టెక్నికల్ యింటర్వ్యూ. బాబా దయ వల్ల మొదటి రౌండ్లో యెంపిక కాబడినప్పటికీ నాకు టెక్నికల్ పరిజ్ఞానం అంతగా లేదుకాబట్టి, తప్పకుండా వాళ్ళు నన్ను తొలగించేస్తారని అనుకున్నాను.మిగతావారంతా టెక్నికల్ యింటర్వ్యూకి తయారవుతూండగా , నేను నాకు అదృష్టాన్నిచ్చే సాయిబాబా ఫొటో చూసి (నేను దీనిని నా స్నేహితురాళ్ళకి, యింటర్వ్యూలో ఉత్తిర్ణులవనివాళ్ళకీ కూడా ఇచ్చాను, తరువాత వచ్చిన కంపనీ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, తరువాత వాళ్ళు బాబాకి మంచి భక్తులుగా మారారు) సచ్చరిత్ర చదువుకున్నాను. ఆఖరికి యింటర్వ్యూ చేసే అతని దగ్గరికి నా వంతు వచ్చింది. నా ముందు ఉన్నవాళ్ళందరినీ చాలా కఠినమైన ప్రశ్నలు అడిగాడు, కాని నన్ను యెక్కువగా ఆశ్చర్యపరచినదేమిటంటే నన్ను విషయానికి సంబంధించి సామాన్యమైన ప్రశ్నలు, నేను చెప్పగలిగేవి మాత్రమే అడిగాడు. నన్నతను యెందుకు వణుకుతున్నావని అడిగాడు. నేనతనికి సచ్చరిత్ర చూపించాను. అతను తను కూడా సాయిబాబా భక్తుడినేనని చెప్పాడు. ఆ రౌండ్ పూర్తయింది, అంతా కూడా బాబా నిర్ణయంప్రకారమే జరిగినట్లుగా అనిపించింది.


తరువాత మూడవ రౌండ్ మొదలైంది. ఆరోజు రాత్రి 11 గంటలకి తిరిగి వచ్చాను. పొద్దుటినించీ యేమీ తినలేదు. కాని నాకు ఆరోజంతా ఆకలనిపించకుండా బాబా మంచి శక్తిని ప్రసాదించారు. ఫలితాలు మరుసటి రోజు అనగా 14, జనవరి, 2011 న రావచ్చు. యింతకు ముందు 2010 లో ఈ సంవత్సరం అంతగా బావుండలేదు, 2011 కొత్త సంవత్సరం మంచి శుభవార్తతో మొదలయేలా చూడమని బాబాని ప్రార్థించాను.


జనవరి 1 , యే విశేషం జరగకుండా మామూలుగానే జరగడంతో కొంచెం నిరాశ కలిగింది. జనవరి, 14, 2011 న ఫలితాలు వచ్చినప్పుడు, బాబా దయవల్ల నేను యెంపిక కాబడ్డాను. నిజానికి ఆరోజు మకర సంక్రాంతి ఈ రోజే కొత్త సంవత్సరం అని నా కర్థమైంది. బాబా నేనడిగిందిచ్చారు. మనలో ఉన్న గాఢమైన కోరికలని బాబా తీరుస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు, కాని అదే సమయంలో మనమడిగింది యెప్పుడు ఇవ్వాలో తెలుసు. సరైన సమయంలో సరైనది ఇస్తారు. బాబా నువ్వు చూపించే కరుణకి, ప్రేమకి నేను కృతజ్ఞురాలిని.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, September 1, 2011

సచ్చరిత్ర - మన సమస్యలకు సమాథానం

0 comments Posted by tyagaraju on 9:25 AM

01.09.2011 గురువారము

సచ్చరిత్ర - మన సమస్యలకు సమాథానం


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

వినాయక చవితి శుభాకాంక్షలు

ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు సేకరించి పంపిన జ్యోతి గారి బాబా అనుభవాన్ని తెలుసుకుందాము.



గతకొద్ది సంవత్సరాలుగా సాయిబాబా నాకు యెన్నోవిథాలుగా రక్షకుడిగా ఉన్నారు. జరిగిన కష్టాలన్నిటినీ యింత సులభంగా దాటగలనని అనుకోలేదు. ఎన్నో విషయాలని నేనర్ధం చేసుకునేలా చేసినందుకు, నా జీవితంలో సమాథానం లేని ప్రశ్నలకు కూడా సమాథాన్నిచ్చిన లార్డ్ సాయిబాబా కి నేనెల్లప్పుడూ కృతజ్ఞురాలిని. నాచుట్టూ ప్రతీక్షణం ఆయన ఉన్నాడనే అనుభూతిని చెందుతూ ఉంటాను.


బాబా నా జీవితంలోకి మా నాన్నగారి ద్వారా వచ్చారు. మానాన్నగారు జీవితాంతమూ యెదురు తిరిగే స్వభావంతోనే ఉన్నారు, కాని 1984 లో ఆయనకు షిరిడీలో ఒక వారం పైగా ఉండే అవకాశం వచ్చింది. ఆయనక్కడ ఒక ప్రాజెక్ట్ నిమిత్తమై ఉన్నారు. నా బాబాని సజీవంగా చూసినవాళ్ళని కొంతమందిని ఆయన కలుసుకోవలసి వచ్చింది. మా నాన్నగారు బాబాని పూజించనప్పటికీ, ఎలాగో బాబాని మా జీవితంలోకి తీసుకొచ్చారు. ఒకసారి సాయి మాయింటికి వచ్చారు, ఆయన యింక యెప్పటికీ వెళ్ళలేదు. నేనందరినీ పూజిస్తున్నప్పటికీ, నేను కాలేజీ లో ఉన్నత విద్య చదువుతున్నప్పటికి గాని బాబా గొప్ప తనాన్ని తెలుసుకోలేకపోయాను.


అనుభవం :: 1


2004 లో నేను ఎం.బీ.ఎ. చదువుతున్నాను. ఆ సంవత్సరం మా బాచ్ చాలా ఆలశ్యంగా చేరడంవల్ల, మొదటి సెమిస్టర్లో 16 పేపర్లకి పరీక్ష రాయవలసి వచ్చింది. ఒక్క నెల సమయంలో 16 సబ్జెక్ట్స్ కి పరీక్షకి తయారవడమంటే ఎలాగో మీరే ఊహించుకోండి. నేనప్పుడు శ్రథ్థ గలదాన్ని కాదు. నిజానికి నేను (సరాసరి మార్కులు) యావరేజ్ విద్యార్థినిని. అయినప్పటికీ నేను చదవడానికి చాలా కష్టపడ్డాను. నేనంతగా కేంద్రీకరించలేకపోయాను. విషయాలు గుర్తు పెట్టుకోవడం నాకు చాలా కష్టం. అది కష్టమైన పరిస్థితి. ఒక పేపరుకన్నా యెక్కువే నేను తప్పుతాననే భావం నాలో ఉంది. నేను ఏడిచాను .. ఏడిచాను... ఫలితాన్ని గురించి నాకు చాలా భయం వేసింది.

శ్రీ సాయి సచ్చరిత్ర గొప్పతనాన్ని గురించి యెంతో మా అమ్మగారి ద్వారా వినడం వల్ల, ఫలితం గురించి బాబా ని అడుగుదామని నిర్ణయించుకున్నాను. నేనాయనను ప్రార్థించి జవాబిమ్మని అర్థించాను. చూడకుండా గుడ్డిగా సచ్చరిత్రలో ని ఒక పేజీతెరచి చూశాను. అది 29వ అథ్యాయం, అది టెండూల్కర్ కుమారుడి కుటుంబం గురించి వారి అబ్బాయి పరీక్షా ఫలితం గురించి అతను పరీక్ష తప్పుతాడనే భయంతో ఉండటం గురించినది. బాబా అతని తల్లితో అంటారు, "అతనిని ప్రశాంతంగా పరీక్షకు తయారవనీ, అతనీ సంవత్సరం తప్పక ఉత్తిర్ణుడవుతాడు. నామీద నమ్మకం ఉంచమని చెప్పు, నిరాశ చెందవద్దని చెప్పు." ఇది చదివాక నాకు ప్రశాంతత లభించింది, 16 పేపర్ల లోనూ పాసవుతాననే నమ్మకంతో పరీక్షా గదిలోకి వెళ్ళాను, అన్నిటిలోనూ ఉత్తీర్ణురాలినయ్యాను. ఆని సబ్జెక్ట్స్ లోనూ నూ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి.ఇది నాలో సాయి మీద ఒక కొత్త మక్కువని కలిగించింది, అప్పటినించి నా నమ్మకం యెప్పుడు సడలలేదు.


అనుభవం :: 2


2004 సంవత్సరంలో మా అమ్మగారికి కాన్సర్ అని నిర్థారణ అయింది, బాబా దయవల్ల యెలాగో తగ్గింది. కాని మరలా 2010 కాన్సర్ మళ్ళి రావడంతో నేను చాలాభంగపడిపోయాను. . ఆమె వయసు 50 సంవత్సరాలయినప్పటికీ నేనావిడని పోగొట్టుకోదలచుకోలేదు. వైద్యులు ఒకదాని తరవాత మరొకటి విచారకర వార్తలను చెపుతున్నారు, నయం చేయడం అంత సులభం కాదనీ దేనికైనా సిథ్థంగా ఉండాలనీ చెప్పారు. ఏది మంచిదో బాబా అదే చేస్తారని నాకు తెలుసు. వ్యాథి నిర్థారణ చేసిన కొన్ని వారాల తరువాత, ఆవిడ కాన్సరు మొదట అనుకున్నత ప్రమాదకరమైనది కాదనీ అది నయమవుతుందనీ మాకు తెలిసింది. యిదంతా బాబా దయ వల్లే జరిగింది. ఆవిడ వైద్యం చేయించుకుంటొంది, లక్షణాలు తగ్గుతున్నాయి. ఈమథ్యనే మేము షిరిడీ యాత్రకు కూడా వెళ్ళాము, అక్కడ ద్వారకామాయిలో, బాబా మరలా నా కళ్ళు తెరిపించి నాకు సమాథానాలనిచ్చారు. బాబా ద్వారకామాయిలో నివసించేవారని మీకందరికీ తెలుసును, అది రాత్రి పొద్దుపోయేదాకా తెరిచే ఉంటుంది. భక్తులందరూ అక్కడకి వెళ్ళి కూర్చుని అక్కడి శక్తిని అనుభవిస్తారు. నేను మా అమ్మగారు అక్కడ సచ్చరిత్రను చదవడానికి వెళ్ళాము. మా అమ్మగారు మసీదుకు ముందరి మెట్టువద్ద కూర్చుని చదువుతున్నారు. నేను నేలమీద కూర్చుని బాబా ఇంకా అక్కడే ఉన్నారనీ తనపిల్లలైన మమ్మలనందరినీ చూస్తున్నారనీ ఊహించుకుంటూ తదేకంగా లోపలకు చూస్తున్నాను. నేను ప్రార్థించి సచ్చరిత్రలోని నాకు తోచిన పేజీ తీశాను, అది 22 వ అథ్యాయం. అందులో బాబా బాలా సాహెబ్ మిరికర్ గారితో చెపుతారు, "నువ్వు కూర్చున్నది మన ద్వారకామాయి, ఆమె ఒడిలో ఉన్న తనబిడ్డల అన్ని ప్రమాదాలనీ, ఆందోళనలనీ తొలగించి వేస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయ గలది. సామాన్య భక్తులకి ఆమె తల్లి. ఆమె అన్ని కష్టాలనుండి రక్షిస్తుంది. ఆమె ఒడిలో కూర్చున్నవాడి కష్టాలన్ని తొలగిపోతాయి. ఆమె నీడలో సేద తీరినవాడికి అనుగ్రహం లభిస్తుంది." యిది నేను ద్వారకామాయిలో ఉన్నప్పుడు జరిగింది. ఆయన బాపూ సాహెబ్ బూటీతో కూడా చెప్పారు, "నానా ఏమిటి చెపుతున్నాడు? నీ చావుగురించి భవిష్యత్తు చెపుతున్నాడా. బాగుంది, నువ్వు భయపడనవసరం లేదు. అతనితో ధైర్యంగా చెప్పు, "చావు యెలా వస్తుందో చూద్దాము." నాకు చాలా సంతోషం వేసి ఉపశమనం పొందాను. నేను ఏడిచాను. నేను కన్నీటిని ఆపుకోలేకపోయాను. బాబా నాకు కావలసిన సమాథానాలనన్నిటినీ యిచ్చారు. ఆయనెప్పుడూ అనుమానాలకు తావివ్వరు. యదార్థంగా మా అమ్మగారికి నయమవుతుందని నాకు తెలుసు, అది వైద్యుల వల్లకాదు, మందుల వల్ల కాదు, నా బాబా దయ వల్లనె. నాకు బాబా అంటే ఇష్టం. అందరికి వారి జీవితంలో ఉన్నట్లుగానే నాకూ సమస్యలున్నాయి, కాని వాటినెదుర్కోవడానికి ఏదోవిథంగా బాబా నాపక్కన ఉంటారు.

@@@@@@@@@@

సాయి బంథువులారా బాబా లీలని చదివారుగా. ఇందులో జ్యోతి గారు ఒక యావరేజీ విథార్థిని. కేవలం ఒక్క నెలలో 16 సబ్జెక్ట్స్ చదివి పరీక్ష రాయడమంటే మాటలుకాదు. కాని ఆమె సమస్యకు తగినట్లుగా 29 వ అథ్యాయం రావడం అది టెండుల్కర్ కుమారుడి పరీక్ష గురించి రావడం కేవలం యాదృచ్చికం కాదు, అది ఆమె సమస్యకు బాబా యిచ్చిన సమాథానం. ఆ సమాథానంతోనే ఆమె పరీక్షలో మొత్తం అన్నీ కూడా అదీ మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలవడం అంతా బాబా అనుగ్రహం. యిక్కడ మనమొకటి గుర్తుంచుకోవాలి. బాబా సహాయం చేస్తారు కదా అని అసలు చదవకుండా పరీక్షకు వెళ్ళామనుకోండి అప్పుడు వచ్చేది సున్నా మార్కులే. యిక్కడ జ్యోతిగారికి ఆ అథ్యాయం లో ఉన్నది చదవగానే ధైర్యం వచ్చింది. కష్టపడి చదివారు. కాని మొత్తం అన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా చదవడం యెవరికీ సాథ్యం కాదు. ఆమె చదువుకున్నవే పరీక్షలో వచ్చేటట్లుగా బాబా గారు ఏర్పాటు చేసి ఉండవచ్చు. చదివినవి కూడా మరచిపోకుండా గుర్తుండేటట్లుగా చేసి ఉండవచ్చు. అందుచేత అచంచలమైన విశ్వాసంతో మనం కృషి చేస్తే బాబా తప్పకుండా సహాయం చేస్తారని దీనిని బట్టి మనకు తెలుస్తోంది. ప్రయత్నం చెయ్యి ఫలితాన్ని ఆయనకి వదలి వెయ్యి. నిశ్చింతగా ఉండు. ధైర్యంగా ఉండు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Tuesday, August 30, 2011

మీతోనే ఉంటా..మీ వెంటే ఉంటా..మీతోనే చేయిస్తా

0 comments Posted by tyagaraju on 12:36 AM

30.08.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


వినాయక చవితి శుభాకాంక్షలు


ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు సేకరించి పంపిన బాబా లీల తెలుసుకుందాము.



మీతోనే ఉంటా..మీ వెంటే ఉంటా..మీతోనే చేయిస్తా


బాబా నీదగ్గిరుంటే నీకెందుకు బెంగ. అన్ని మరచిపో. అంతా బాగుందనే భావనలోనే ఉండిపో. బాబా సహాయం తప్పకుండా అందుతుంది. ఒకోసారి ఆయన మనచేతే మరచిపోలేని సహాయం చేయిస్తారు. అసంకల్పితంగా జరుగుతుంది. దానికి ఉదాహరణగా ఈ రోజు ప్రచురింపబోయే ప్రతిభగారి ఈ లీలను చదవండి.




నా అనుభూతిని మీతో పంచుకోవడానికి బాబా వారు ఇప్పుడంగీకరించారనీ ఇదే తగిన సమయమని నేను భావిస్తున్నాను.


బాబా, నా చిన్నతననం నించీ నాకు బాబా తెలుసు. నేను బాబానుపూజిస్తాను కాని పూర్తిభక్తితో కాదు.

నా చదువు అయిపోయినతరువాత ఒక సంవత్సరం లెక్చరర్ గా పనిచేసి ఒక కోర్స్ చేద్దామని ఉద్యోగానికి రాజీనామా చేశాను. కోర్స్ చేయడానికి యింటికి కొన్ని నెలలు దూరంగా ఉన్నాను. నేనున్న చోటు బాబా గుడికి దగ్గరగా ఉంది.

మేము ప్రతిగురువారము గుడికి వెళ్ళేవాళ్ళము, నేను ప్రతీరోజూ గురుచరిత్ర చదవడం ప్రారంభించాను. నా జీవితంలో ప్రతీ విషయంలోనూమార్పు రావడం మొదలెట్టింది. నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బాబా నన్నావిధగా అనుగ్రహించి ప్రతీ క్షణం నాతోనే ఉన్నారు.


నేను షిరిడీ వెళ్ళాను, అది నాకు అనుకోని యాత్ర. నాకు వివాహమైన తరువాత నేను అయిదవ నెల గర్భంతో ఉన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ కి వచ్చాను. యేమి పొరపాటు జరిగిందో తెలీదుగాని, మా అబ్బాయి కొంచం అనారోగ్య సమస్యతో పుట్టాడు. డాక్టర్స్ బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. యెక్కడకివెళ్ళాలో, యేమి చెయాలో నాకు తెలీలేదు.


కాని నాకు నా సాయి ఉన్నాడు. నేను ఆయనని ప్రార్థించి యెప్పుడూ నామస్మరణ చేస్తూ ఉన్నాను. బాబా ఒక్కరే సహాయం చేసి నయం చేయగలరనిపించింది. కొన్ని రోజుల తరువాత మా అబ్బాయికి సర్జరీ అయి కోలుకోవడం మొదలెట్టాడు.


ఏడు నెలల తరువాత ఆస్పత్రినుంచి విడుదల చేయబడ్డాడు. యింటికి వచ్చేటప్పటికి వాడికి తినడం యెలాగో తెలీలేదు, పాలు తాగడం తెలీదు, ప్రతీదీ కూడా గొట్టం ద్వారనే ఇవ్వవలసి వచ్చింది. బాబా నామస్మరణ చేస్తూ ఆయన మీదే నమ్మకం ఉంచుకున్నాను. అది చాలా కష్ట సమయం కాని బాబా దయతో జీవితమలా సాగింది.

స్నేహితులందరితో కలిసి నేను సాయి వ్రతం చేశాను. రెండు వారాల తరువాత మా అబ్బాయి ఫీడింగ్ ట్యూబు అనుకోకుండా బయటకి వచ్చేసింది. నేను స్పృహలో ఉన్నప్పటికీ నాలోంచి ఆమాటలు యెలా వచ్చాయో తెలీదు, నేను నా భర్తతో ఇక ఫీడింగ్ ట్యూబు అవసరం లేదు నేను నా కొడుకుని, మామూలుగా తినగలిగేలా చేయగలను అని అన్నాను.


అది పనిచేసింది. నేను మెల్లిగా ప్రారంభించాను, వాడు రోజు రోజుకీ అలవాటు పడ్డాడు. వాడిలో వచ్చిన గుణానికి ఆస్పత్రిలో ఉన్న డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. కొంత వయసు వరకు మా అబ్బాయి తినలేడనే అనుకున్నారు ప్రతీవారూ. కాని నా హృదయానికి తెలుసు, బాబా తనే ఈ నిర్ణయాన్ని తీసుకునేలా నాలోజ్ఞానాన్ని కలిగించి, నా కొడుకుకి నయమయి సహాయం చేసేలా చేశారు.


అది నిజంగా బాబా లీల. యేమి చెప్పాలో నాకేమీ తెలీడంలేదు. డాక్టర్స్ చేయలేని పరిస్థితుల్లో మా అబ్బాయికి నయం చేయడమే కాకుండా కొత్త జీవితాన్నిచ్చింది బాబాయే, దీనిని నేను మాటలలో వర్ణించలేను.


ఇది హృదయాన్ని హత్తుకున్నే లీలలో ఒకటి. కాని నా జీవితంలో ఆయన ప్రతీ క్షణం నాతోనే ఉన్నానని తగిన మార్గాన్ని సూచించిన బాబా లీలలు చాలా ఉన్నాయి.

ఇప్పుడు నేనేమి చేసినా, యెక్కడ ఉన్నా నా హృదయం, ఆత్మ అన్ని బాబాతోనే ఉంటాయి. జీవితమంటే నాకు భయం లేదు కారణం నాకు మార్గం చూపించడానికి, సహాయం చేయడానికి ప్రతీ క్షణం బాబా నాతోనే ఉన్నారు.


బాబా దయవల్ల మా అబ్బాయి 'సాయీ' బాగా ఉన్నాడు. వాడి జీవితాంతమూ బాబా వాడితో ఉంటాడని నాకు బాగా తెలుసు.

క్రితం మార్చ్ లో షిరిడీ వెళ్ళే భక్తురాలి ద్వారా నా ప్రార్థనను పంపించాను, ఆమె తాను షిరిడీలో ఉన్నంత సేపూ మా అబ్బాయి పేరే తన మనస్సులోకి వచ్చిందని నాకు మైల్ చేసింది.


ప్రత్యేకంగా ఈ పేరే తన మనస్సులోకి వస్తోందని ఆమే ఆశ్చర్యపోయింది.
పుడామె బాబా అతనితోనే ఉన్నాడని చెప్పింది.
కాని ఒక విషయం మాత్రం చెప్పగలను, కిందటి రెండు సంవత్సరాలనుండి నేను చాలా క్లిష్ట పరిస్థితులనెదొర్కొన్నాను, కాని సమస్యలకి సమాథానం లభించలేదు. కాని నాకెప్పుడూ నేను ఒంటరిదాన్ననే భావం రాలెదు. గంటలకొద్దీ ప్రార్థించిన తరువాత ఆయననించి నాకు సమాథానం లభించేది. నేనెప్పుడనుకున్నా బాబా నాతో ఉన్నారు అనుకునేదాన్ని. ఆ ఆలోచన నాకు సంతోషాన్నిచ్చేది.

నేను భక్తులందరికి కొంత చెప్పదలచుకున్నాను, "మీరు నింజంగా బాబాని నమ్మితే ఆయననేమీ అడగద్దు, (ప్రార్థించండి అంతే) ఆయనకన్నీ తెలుసు, మనకేది ఇవ్వాలో తెలుసు".


నా అనుభవాన్ని చదివినందుకు మీకు కృతజ్ఞతలు.

ఓం శ్రీ సాయినాథాయనమః
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Sunday, August 28, 2011

బాథయినాగాని, ఆనందకరమైన షిరిడీ యాత్ర

0 comments Posted by tyagaraju on 11:47 PM




29.08.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు నెల్లూరు నించి సుకన్య గారు పంపిన ఒక సాయి లీల పద్మా రామస్వామి గారి అనుభవాని అందిస్తున్నాను.
బాథయినాగాని, ఆనందకరమైన షిరిడీ యాత్ర

బాబా కు నేనిచ్చిన మాట ప్రకారం నేను షిరిడీలో నా దివ్యానుభూతిని తెలియచేస్తాను. షిరిడీలో పారాయణ హాలులో సాయి సచ్చరిత్రను చదవాలని నా మదిలో నున్న భావన. నేను మా చిన్న అమ్మాయితోను, యింకా తోటి సోదరీమణులతోను షిరిడీని దర్శించే అవకాశం వచ్చింది. మూడు రోజులలో అక్కడ పారాయణ పూర్తిచేద్దామని నిశ్చయించుకున్నాము. ఎప్పటిలాగే ఈ సారికూడా, సాయి సచ్చరిత్రలో బాబా గారు ఏ ప్రదేశాలు దర్శించారో అవన్ని కూడా దర్శిద్దామనే నాప్రగాఢమైన కోరిక, వాటినన్నిటినీ ఒక కాగితం మీద వ్రాసుకుని యాత్ర క్షేమంగానూ, ఆనందదాయకం గానూ జరగాలని ప్రార్థించాను.

శుక్రవారమునాడు బొంబాయినుంచి వోల్వో బస్ లో బయలుదేరాము. సాయి భజనలు వింటూ ఆనందంగా ప్రయాణిస్తున్నాము. బస్సు సిన్నార్ లో అయిదు నిమిషాలు ఆగింది. కాళ్ళు కాస్త చాపుకుందామని కిందకి దిగాను. అప్పుడు నా యెడమ కాలి వేలిలో గుచ్చుకున్నట్లుగా అయింది. వెనువెంటనె తొడవరకూ పొడుస్తున్నట్లుగా నొప్పి మొదలైంది. కన్నీళ్ళతో నిండిపోయాను అప్పటికే. నేనెక్కడికి వెళ్ళినా నాతో కూడా ఊదీని తీసుకువెళ్ళడం నాకలవాటు. వెంటనె ఊదీని రాసుకుని కొంచెం నీటితో సేవించాను. నేను కొంత రేకీ హీలింగ్ కుడా ఇచ్చుకున్నాను. కాని నొప్పి భరించలేనంతగా ఉంది. ఆఖరికి రాత్రి 9 గంటలకి షిరిడీ చేరుకున్నాము. అప్పుడు కొంతమంది సంస్థాన్ ఆస్పత్రికి వెళ్ళమని సలహా ఇచ్చారు. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చి కొన్ని మందులు ఇచ్చారు, కాని నెప్పి మాత్రం తగ్గలేదు. నా బంధువు తిరిగి ముంబాయి వెళ్ళిపోదామని సూచించారు, కాని నేను పారాయణ చేయడానికే నిర్ణయించుకుని అది బాబా నన్నలా పరీక్షిస్తున్నారని భావించాను.
బాథతో ఏడుస్తూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. మరునాడు అక్కడ వుండే డాక్టర్ గారు, అది 'వించూ' అని పిలవబడే ఒక విథమైన పురుగు కుట్టడం వల్ల వచ్చిందని అది మంత్ర శక్తి వల్లనే బాగా తగ్గుతుందనీ చెప్పి, అయినప్పటికి నాకు ఇంజక్షన్ ఇచ్చారు. అక్కడ ఉండే ఒకతను రహతా లో ఉండే 'వీరభద్రప్ప ' గుడికి వెళ్ళమని సలహా ఇచ్చాడు. (సాయి సచ్చరిత్రలో 5. అథ్యాయంలో వుంది).

అప్పుడు నేను బాబా వారు అంతకుముందు నివసించిన ప్రదేశమైన రహతా, సచ్చరిత్ర ప్రకారం నేను దర్శిద్దామని రాసుకున్న ప్రదేశానికి బాబా నన్ను వెళ్ళమన్నట్లుగా భావించుకున్నాను. ఆయన చేసే చర్యలను యెవరూ అర్థం చేసుకోలేరు. ఇంజక్షన్, మందులతో తగ్గని నొప్పి బాబా దయతో వెంటనే తగ్గింది. మంత్ర వైద్యం చేయించుకున్న వెంటనే సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి 3 రోజులలో విజయవంతంగా పూర్తి చేశాను. ఈ లోపుగా బాబా తిరుగాడిన మిగతా ప్రదేశాలను దర్శించాను, ఉదాహరణకి రహతాలో కుషాల్ చంద్ గృహం, పంచముఖి గణపతి మందిరం, తపోవనంభూమి, సాకోరీ లో ఉపాసనీ మహరాజ్ ఆశ్రమం, చివరగా కోపర్గావ్ లో సాయిధాం. అక్కడ మేము చౌహాన్ బాబాని కూడా కలుసుకున్నాము. చౌహాన్ బాబా నన్ను చూసిన మరుక్షణంలోనే, షిరిడీకి వచ్చిన వెంటనే నేను చాలా బాథతో ఉన్నానని, ఆసమయమంతా బాబా నాతోనే ఉన్నారనీ చెప్పారు. ఇలా చెబుతూ ఆయన మమ్మల్నందరినీ దీవించారు.

సంస్థానంలో సేవ చేయాలని నా ప్రగాఢమైన కోరిక. దాని గురించి నేను సంస్థానంలో విచారించగా, వారక్కడ అటువంటిదేమీ లేదని చెప్పారు. నాకు కొంచెం నిరాశ కలిగింది, కాని ఆశ వదలుకోలేదు. ఈ లోగా ఆఖరి రోజున నేను కాకడ ఆరతికి వెడదామనుకున్నాను. తొందరగా లేచి,వెళ్ళబోతూండగా హటాత్తుగా కొంచెం అసౌకర్యంగా ఉండి పడిపోబొతున్నట్లుగా అయింది. కాని యేమయినా సరే ఆరతికి వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను. ఉదయం 3 గంటలకి గుడికి వెళ్ళాను, కాని అక్కడ కుడా వ్యాకులతగా ఉండి వెంటనే హోటలుకు తిరిగి వచ్చేశాను, అక్కడ కూడా మరలా తూలిపోతున్నట్లుగా అయింది. నేనప్పుడు అదంతా బాబాకే వదలివేసి కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. ఉదయం 7 గంటలకి కనీసం ముఖ దర్శనమైనా చేసుకుందామనే కోరిక కలిగింది. అక్కడికి వెళ్ళాను, హటాత్తుగా సంస్థానంలో పనిచేసేవారు నోట్లు వేరు చేసే సేవ చేస్తారా అని అడిగారు. నా ఆనందానికి అవథులు లేవు. నేను వెంటనే దానికంగీకరించాను. అరగంట తరువాత వారు నాన్ను బాబా దర్శనం చేసుకుని వెళ్ళమన్నారు. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన నాకోరికని కూడా తీర్చారు. ఆరతిలో చెప్పినట్లుగా 'జయమని జైస భావ తయ తైసానుభావా'.

బాబా నా జీవితంలోకి ప్రేవేశించిన 5 సంవత్సరాల కాలం నుంచీ, నేను గ్రహించినదేమిటంటే మనం అడిగినవన్నీ బాబా ఇస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆయన మనలని పరీక్షిస్తూ ఉంటారు, యేమిటంటే రెండు నాణాలయిన 'శ్రధ్ధ, 'సబూరీ' లను మనం ఆకళింపు చేసుకున్నామా లేదా అని. ఈ సారి నాకు బాబా ఒక క్రొత్త దివ్యానుభూతినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన మాకు ప్రయాణం దగ్గిరనించీ వసతి వరకూ అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ స్థానికంగా ఉండే ఆటొ డ్రైవరు గణేష్ నంబరు ఇస్తున్నాను, అతనికి అక్కడి ప్రదేశాలన్నీ బాగా తెలుసు. అతని నంబరు 09822881977.

బాబా ధన్యవాదములు, ఓం సాయిరాం



పద్మా రామస్వామి. పైన మీరు చదివిన లీలలో పద్మగారు తనకు తాను రేకీ హీలింగ్ ఇచ్చుకున్నట్లుగా చదివారు. మన సాయి బంథువులకు కొంతమందికి రేకీ అనగా యేమిటొ తెలియకపోవచ్చు. వారి సౌకర్యార్థం దాని గురించి క్లుప్తంగా ఇస్తున్నాను.


రేకీ : విశ్వంలోని ప్రాణ శక్తి. ఈ విథానం జపాన్ దేశీయుడైన డా. ఉసూయీ గారి ద్వారా ప్రచారంలోకి వచ్చింది. రేకీ మాస్టర్ గారి ద్వారా ఉపదేశం తీసుకోవాలి. మనలో షట్చక్రాలు ఉంటాయి. బ్రహ్మ రంధ్రంద్వారా ఈ శక్తిని మనలోకి ప్రవేశ పెడతారు. మనలో ఉన్న చక్రాలన్ని జాగృతమౌతాయి. మనలోకి కొంచెం వేడి ప్రవేశిస్తుంది. దీని లో 3 డిగ్రీలు ఉంటాయి. మొదటి డిగ్రీలొ మన మనమీద చేతులను ఉంచి హీలింగ్ ఇచ్చుకోవచ్చు. యితరులకు కూడా ఇవ్వవచ్చు. 2వ. డిగ్రీలో అంగా డిస్టంట్ హీలింగ్ చేయవచ్చు. అంటే మనిషి యెంతదూరంలో ఉన్నాకూడా రేకీ హీలింగ్ ఇవ్వవచ్చు. 3 వ.డిగ్రీ మాస్టర్ డిగ్రీ అనగా ఆ డిగ్రీ ఉంటే మనం యింకొకరికి రేకీ ఉపదేశాన్నివ్వవచ్చు.

మీకు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ లో రేకీ గురించి సేర్చ్ చేయండి. www.reiki.org or search in google as reiki.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List