Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 13, 2011

మేఘుడు శివునికి స్నానము చేయించుట

0 comments Posted by tyagaraju on 6:15 PM









14.08.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు



మేఘుడు శివునికి స్నానము చేయించుట


షిరిడీలో స్థిర నివాసం యేర్పరచుకున్న గొప్ప సాయి భక్తుడు మేఘ. అతను గొప్ప శివ భక్తుడు. బాబాకు అది తెలుసు. అందుచేత బాబా అతనికి ప్రతిరోజూ తన దేవుడికి పూజ చేసుకోవడానికి శివలింగాన్ని బహూకరించాడు. బాబా కూడా మేఘుడిని అమితంగా ప్రేమిస్తూఉండేవాడు. అదే, షిరిడీలో అతని అంతిమయాత్రలో కూడా పాల్గొనేలా చేసింది. బాబా ఆ అంతిమయాత్రలో కలిసి అతని శవం మీద స్మశానం వరకూ పూలు జల్లుతూ వెళ్ళారు. తన నిజమైన భక్తునిమీద దుఃఖాన్ని, ప్రేమను తెలియచేస్తూ సాథారణ మానవ మాత్రునివలె కన్నీరు కార్చారు.

మేఘుడు బాబానే తన శంకరుడిగా యెంచుకున్నాడు. దానివలననే ఆయన, మేఘునికి తన నుదిటిమీద త్రిశూలం గీయాలనే కోరికకి అనుమతినిచ్చారు. ఒక మహాశివరాత్రినాడు మేఘుడికి, బాబాని గంగాజలంతో (గోదావరీ జలం) స్నానం చేయిద్దామనే కోరిక కలిగింది. బాబా అంత తేలికగా ఒప్పుకోరని తెలిసి అతను బాబాని ముందుగానే తనకి అనుమతినివ్వమని వేడుకోవడం మొదలుపెట్టాడు. ఆఖరికి యెంతో వేడుకొనగా మేఘుని చేత స్నానం చేయించుకోవడానికి ఒప్పుకున్నారు.


అనుమతి లభించినందుకు మేఘుడు చాలా సంతోషించాడు. ఒకరోజు ముందరే మేఘా తన సన్నిహితులందరినీ అభిషేక ఉత్సవం తిలకించడానికి ఆహ్వానించాడు. ముందురోజు రాత్రే మేఘ, షిరిడీకి 11 కి.మీ.దూరంలో ఉన్న గోదావరికి, గంగాజలం తీసుకురావడానికి షిరిడీనించి బయలుదేరాడు.




మేఘాలాంటి నిజమైన భక్తునికి దూరం సమస్య కాదు. అతను గంగాజలం తీసుకుని మధ్యాహ్నా న్నానికి ముందే షిరిడీకి తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి అయిన తరువాత మేఘుడు బాబాని అభిషేకానికి రమ్మని కోరాడు. బాబా అతనితో సరదాగా అన్నానని తనలాంటి ఫకీరుకు అటువంటి పనులు ఒప్పవని చెప్పారు.

బాబా అతనితో షిరిడీలోని శివుని గుడిలో శివలింగానికి ఆ గంగాజలాన్ని పోయమని చెప్పారు. అప్పుడు మేఘుడు బాబాతో, తాను లింగానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తున్నాననీ, బాబానే తను శివునిగా భావిస్తున్నందువల్ల, శివ భక్తులందరికీ శివరాత్రి పర్వదినం కాబట్టి తనను నిరాశపరచవద్దని చెప్పాడు.


మేఘుడు చాలా మూర్ఖంగా ఉండటంతో, బాబా అతనితో ఒక షరతు మీద మాత్రమే తనమీద నీరుపోయడానికి ఒప్పుకుంటానని చెప్పారు. గంగ శివుని శిరసునుండే ఉద్భవించింది కాబట్టి, తను ముందుకు వంగుతాననీ అపుడు మేఘుడు తన శిరసుమీదనే నీరుపోయవచ్చనీ చెప్పారు. మేఘునికి యిష్టం లేకపోయినప్పటికీ ఈ షరతుకు లోబడి ఒప్పుకున్నాడు. అపుడు బాబా తనున్నచోటు నుంచి లేచి లెండీ బాగ్ వైపు నడిచారు.



అక్కడ బాబా యెప్పుడూ స్నానానికి ఉపయోగించే ప్రత్యేకమయిన రాయి ఉంది. ఆయన దాని మీద కూర్చున్నారు. తన శిరసు ముందుకు వంచి మేఘునికి నీరుపోయమని సంజ్ఞ చేశారు. మేఘుడు బాబా శిరసు మీద నెమ్మదిగా నీరు పోయడం ప్రారంభించాడు కాని అతనికావిథమైన స్నానం తృప్తి కలిగించలేదు. అందుచేత తానన్ని రోజులుగా తన మనసులో ఆలోచించుకున్న విథంగా చేయడానికి నిర్ణయించుకున్నాడు. అతను హటాత్తుగా బకెట్లో మిగిలి ఉన్న నీటిని "హర హర మహాదేవ్" అంటూ బాబా శరీరం మొత్తమంతా పోశాడు. తన కోరికను పూర్తిగా తీర్చుకున్నందుకు మేఘుడు ఉల్లాసంతో నాట్యం చేయడం మొదలు పెట్టాడు. కాని యిది యెంతోసేపు నిలవలేదు. తాను బాబా శరీరం మొత్తమంతా నీరు పోసినప్పటికీ, ఆయన తలమాత్రమే తడిసి మిగిలిన శరీరభాగం కఫ్నీతో సహా పొడిగా ఉందని అతనికి వెంటనే అర్థమయింది. అపుడు బాబా అతనితో "హే ! గంగ శివుని శిరసునుండి ప్రవహిస్తుందనీ, ఆయన మిగిలిన శరీరాన్ని తాకదనీ నీకు తెలుసా" అన్నారు. మా నాన్నగారు ఈ వినోదాన్నంతా యితర ఆహ్వానితులతో కూడా కలిసి వీక్షిస్తూ ఉన్నారు. బాబా తను చెప్పిన మాటే ఆఖరి నిర్ణయమని దానిని థిక్కరించే థైర్యం యెవరికీ లేదని తనకి తెలియచెప్పాలనే ఆయన ఉద్దేశ్యమని మేఘునికి అర్థమయింది.

బాబా కూడా మేఘునికి తానే ప్రత్యక్షంగా శివుడినని తెలుసుకునేలా చేయాలని కోరుకున్నారు. అప్పుడు మానాన్నగారికి బాబా చేసే అనేకములైన పనులు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం, కొంత కాలం గడిచేటప్పటికి బాబా తన చుట్టూ ఆదర్శప్రాయమైన భక్తులని పెంపొందించుకున్నారు. భగవంతుని అస్తిత్వాన్ని ఆయన అఖండమైన శక్తులగురించి, ప్రజలు వాటికి తమ అనన్యమైన భక్తి ద్వారా గౌరవమివ్వాలని వారు తమ నిగూఢమైన చర్యల ద్వారా ప్రజలని ప్రభావితం చేస్తూ ఉండేవారు. అలాంటివారిలో కొందరు మేఘా (లార్డ్ శివ), నానావలి (లార్డ్ హనుమాన్), యిక దాసగణు (లార్డ్ విఠోబా). నిజానికి దాసగణు తన ఆరతిలో ఒక దానిలో యేమి చెబుతున్నారంటే "షిరిడీ మాఝే పండరిపుర సాయిబాబా రమావర్ (షిరిడీయే నా పండరిపురము సాయిబాబాయే నా విఠోబా) అని. బాబా సంతోషంగా ఉన్న సమయంలో "హే భావూ ! నేను దేవత లక్ష్మీదేవిని తప్ప మరెవరినీ కాదు, నేను ద్వారకామాయిలో కూర్చుని నేనెన్నడూ అబథ్థం చెప్పను" అని అంటూ ఉండేవారు. ఆయన జీవితకాలమంతా తనకి తాను దేవుని దూతననే చెప్పుకున్నారే కాని దేవుడినని చెప్పుకోలేదు. ఆయన యేది ఉఛ్ఛరిస్తే అది తప్పకుండా జరిగేది. మా నాన్నగారు బాబా చెప్పినవాటిని తిరిగి గుర్తు చేసుకుంటూ ఉండేవారు. "హేయ్ భావూ ! ఈ మానవ శరీరాన్ని వదలివెళ్ళిపోయిన తరువాత షిరిడీకి ప్రజలు పంచదారకోసం వచ్చిన చీమల బారుల్లా రావడం నువ్వు చూస్తావు".


ఈ రోజు మీరు సంవత్సరంలో ఏ రోజునైనా షిరిడీని దర్శించండి, సంవత్సరాల క్రితం బాబా చెప్పిన మాటకి ఋజువు మీకు లభిస్తుంది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


అగ్ని మీద అధికారం

0 comments Posted by tyagaraju on 4:43 AM








13.08.2011 ఆదివారము


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు



అగ్ని మీద అధికారం


ఒక సారి ద్వారకామాయిలొ పవిత్రాగ్ని ఉన్నచోట,బాబా వెలిగించిన "థుని" బాగా భయంకరంగా మండిపోవడం మొదలు పెటింది బాబా గారు అప్పటికే ఈ ప్రపంచాన్నించి వదలి వెళ్ళిపోతారని ముందుగానే సూచించారు. అందుచేత నేననుకోవడం "విజయదశమి" రోజు ప్రముఖంగా మనకు తెలిసిన దసరా. అది సాయంత్ర సమయం. మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు.



ప్రతి సాయంత్రం ఆయన ద్వారకామాయికి వచ్చి, అక్కడ కూర్చుని ఆసక్తికరంగా జరిగే వాటినన్నిటినీ గమనిస్తూ తరువాత పెట్రొ మాక్స్ దీపాలు వెలిగిస్తూ తన విథిని నిర్వహిస్తూ ఉండేవారు.ఆ రోజు బాబా హటాత్తుగా లేచి నుంచున్నారు. థుని వద్దకు వెళ్ళి కొన్ని కట్టెలను కదిపి ద్వారకామాయిలో పైకి కిందకి చూస్తూ ఏదో గొణగడం మొదలు పెట్టారు. యిది చాలా అసాథారణమైనది. మా నాన్నగారికి అనుకోని సంఘటన. ఏదో జరగబోతోందనిపించింది. నేనిక్కడ తప్పకుండా చెప్పవలసినదేమిటంటే పుట్టుకతో బాబా మతం హిందువా, ముస్లిమా అని తెలుసుకోవాలనే ఆత్రుతతో ఆ రోజుల్లో చాలా మంది భక్తులుండేవారు. ఏమయినప్పటికీ ఆయన మానవ రూపంలో ఉన్నారు కాబట్టి, ఆయన తన పుట్టుకని కూడా మానవ శరీరం నించే తీసుకుని వుండచ్చు. కాని అటువంటప్పుడు ఆయన తలిదండ్రులు హిందువులా, ముస్లిములా అన్నది ప్రశ్న? మా నాన్నగారు కూడా దీనికేమీ తీసిపోరు.

బాబా మెల్లగా కోప స్వభావంలోకి మారుతున్నారు. ఆయన అక్కడ ఉన్న జనాలనందరినీ తిట్టడం మొదలెట్టారు. యిక్కడ థునిలోని మంట కూడా బాబా కోపస్వభావానికనుగుణంగా అదే స్థాయిలో యింకా పైపైకి ఎగసిపడుతోంది. ద్వారకామాయి మొత్తం కట్టెల మంటల వెలుగుతో వెలిగిపోయింది. బాబా యిప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన తన తలకి కట్టుకున్న నూలు వస్త్రాన్ని తీసి థునిలోకి విసిరివేశారు. హటాత్తుగా నిప్పుమంటలు పైకెగరసాగాయి. బాబావారి పొడవాటి జుట్టు స్వేచ్చ పొందింది. కొంచెం సేపయిన తరువాత బాబా తన కఫ్నీని తీసివేసి దానిని థునిలోకి విసిరేశారు. నిప్పు మంటలు యింకా పైకెగశాయి. ద్వారకామాయి తగలబడిపోతుందా అని ప్రజలు భయపడేంతగ పైకి లేచాయి. బాబా వారి కోపం తారాస్తాయికి చేరింది. ఆయన కోపంగా ప్రజలముందు నిలబడి, సెకను భాగంలో తన లంగోటీని కూడా తీసివేసి మండుతున్న థునిలోకి విసెరేశారు. ఆ విథంగా ఆయన దిగంబరంగా తయారయి అదేస్థితిలో ప్రజలముందు నిలబడ్డారు. అప్పుడాయన అక్కడున్నవారితో తను హిందువా ముస్లిమా అన్నది తేల్చుకోమని గట్టిగా అరుస్తూ అన్నారు. తనకి తాను నిరూపించుకోవడానికి యెటువంటి పథ్థతి? మా నాన్నగారు అప్పుడుచూసిన దానిని నేను మీకిప్పుడు వివరిస్తాను. బాబాగారు తీక్షణమైన అగ్నిలా మండుతూన్న స్థితిలో ఉన్నారని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆయన కను గుడ్లు యెఱ్ఱగా నిప్పు కణికల్లా ఉన్నాయి. వెలుగు కిరణాలని ఉధ్బవిస్తున్నాయి. అ ఆథ్యాత్మిక జ్యోతి గోళపు వెలుగు వెనుక ఆయన శరీరంలోని ప్రతి అణువూ, శరీరం మొత్తం మరుగునపడిపోయింది.
ఆ వెలుతురు కిరణాలు యెంత శక్తివంతంగా ఉన్నాయంటే మా నాన్నగారు కళ్ళు మూసుకోవలసి వచ్చింది. బాబామతమేదో మా నాన్నగారు గుర్తించలేకపోయారని వేరే చెప్పనవసరంలేదు. థునిలోని మంటలు బాగాపైకి యెగసిపడుతూ విపరీతమయిన వెలుగుతో ప్రజ్వరిల్లుతున్నాయి.


బయట తీవ్రమైన ఉరుములు మెరుపులు. అప్పుడు బాబాకి దగ్గరి భక్తుడైన భాగోజీ షిండే కుష్ఠు వాడు (బాబా అతనిని తన కాళ్ళు నొక్కడానికి అనుమతిచ్చేవారు) ముందుకు వచ్చి యెంతో థైర్యంతో కొత్త లంగోటీని ఆయన మొల చుట్టు కట్టాడు.అప్పుడు బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు. ఆయన సటకా తీసుకుని థునికి దగ్గరగా వచ్చారు. ఆయన సటకాతో ఊగీ..ఊగీ.. అంటే అర్థం తగ్గు..తగ్గు... అంటూ మంటలను కొట్టడం మొదలెట్టారు. సటకాతో కొట్టే ప్రతి దెబ్బకి మంటలుయెత్తు తగ్గి ప్రతీదీ మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు బాబాకి కొత్త కఫ్నీ థరింపచేయడానికి జనానికి థైర్యం వచ్చింది. ఆయన జుట్టును కొత్త గుడ్డ ముక్కతో కట్టారు. అప్పటికి చాలా ఆలశ్యమయినప్పటికీ ఈ భక్తులందరూ బాబాని గౌరవంగా తీసుకుని వెళ్ళి మామూలుగానే సాయంకాలపు ఆరతి యిచ్చారు.

మా నాన్నగారిని యెక్కువగా ముగ్థుడిని చేసిన దేమిటంటే బాబాగారి దైవాంశసంభూతమయిన ఘనమైన శరీరం నించి వెలుగు ప్రసరించడం. అగ్నిమీద ఆయన తన శక్తినుపయోగించి అదుపులో పెట్టడం. బాబా విజయదశమిని ఒక కారణం చేత యెన్నుకున్నారు. ఆయన తాను ఈ ప్రపంచాన్నించి ఈరోజున సెలవు తీసుకుంటున్నాననడానికి గుర్తుగాతనభక్తులకు సూచించారు. తరువాత 1918 లో విజయదశమి రోజున బాబా సమాథి చెందారు.


ప్రియ సాయిభక్త పాఠకులారా యిది చదివిన తరువాత మనమందరమూ కూడా బాబా మతమేమిటన్న ఆత్రుతని సమాథి చేయాలనుకుంటున్నాను. యెక్కువ భక్తితో 100 శాతం నమ్మకంతో అయనని సామాన్యంగా పూజించాలి. సాయి అంటే "సాక్షాత్తు ఈశ్వర్" (భగవంతుడు) ఆయనకి మతం లేదు. అంతటా అన్నింటా నిండి ఉన్నాడు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Thursday, August 11, 2011

వరుణదేవునిపై ఆథిపత్యం

0 comments Posted by tyagaraju on 3:08 AM



11.08.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులందరికీ బాబావారి శుభాశీస్సులు


లాప్టాప్ అడాప్టర్ ప్రోబ్లెం వల్ల గత రెండు రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది. కనీసం ఈ రోజునైనా ఇద్దామని మరొక పథ్థతిలో బయట నెట్ సెంటర్ కి వచ్చి ప్రచురించడం జరిగింది. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



వరుణదేవునిపై ఆథిపత్యం


సాయి సచ్చరిత్రలో, షిరిడీలో అనుకోని విథంగా వర్షం వచ్చినపుడు జరిగిన ఒక దృష్టాంతం ఉంది. రెండు మహాశక్తుల మథ్య జరిగిన యుథ్థాన్ని వీక్షించిన అదృష్టవంతులలో మా నాన్నగారు ఒకరు. సాయిబాబా గారు అష్టసిథ్థులు సంపాదించారని, వాటిని అవసరమయినపుదు తన భక్తులు కోరినప్పుడు వారిని కష్టాలబారినుండి పడవేయడానికి ఉపయోగించేవారని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సాయిబాబాయే ఈ భూప్రపంచం మీద భగవంతుని అవతారం కాబట్టి, ప్రకృతి శక్తులు కూడా, ఆయన చెప్పినట్లు సానుకూలంగా శిరసావహించేవి.

అప్పుడు వర్షాకాలం రోజులు. మథ్యాన్నం నించి వర్షం కురుస్తూ ఉంది. ప్రకృతి శక్తులు కూడా, ప్రకృతి శక్తులు కూడా, సాయంత్రమయేసరికి వర్షం యింకా పెద్దదయింది. ఆకాశంలో దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు వీయడం మొదలైంది.



ఉరుములతో కూడిన గాలివాన వచ్చే సూచనలు బాగా కనిపించాయి. ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వాటివెనకే పెద్ద ఉరుముల శబ్దాలు కూడా వస్తున్నాయి. ఆ తుఫాను బాగా తీవ్రంగా ఉండి షిరిడీ గ్రామమాన్నంతా విపరీతమయిన వర్షం బాగా గట్టిగా కొడుతోంది.

ప్రతీచోటా నీరు నిలిచిపోవడంతో, అంతకుముందెప్పుడూ అటువంటి ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి చూడకపోవడంతో గ్రామస్తులంతా తమ పశువులతో ద్వారకామాయిలోకి వచ్చి గుమికూడటం మొదలెట్టారు. మా నాన్నగారూ యేమీ తీసిపోలేదు. ఆయన కూడా ద్వారకామాయిలోకి వచ్చారు. మా నాన్నగారు భగవద్గీతలో లో కృష్ణపరమాత్మ, అనుకోకుండా వచ్చిన కనీవినీ యెరుగని ప్రకృతి ఆగ్రహాన్నించి సమస్త ప్రాణులను గోవర్థనగిరి పర్వతం యెత్తి రక్షణ కల్పించిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. అక్కడున్నవారందరికీ అటువంటి భయానక పరిస్థితినుండి రక్షించడానికి 'గోవర్థనగిరీ లాంటివాడు మాత్రమే రక్షించగలడు. అటువంటివాడి అవసరం యిప్పుడు షిరిడీవాసులకు అవసరమయింది.

అందరూ కూడా ఆందోళనలో ఉండి తమ మీద బాబా అనుగ్రహం కోసం యెదురు చూస్తున్నారు. తుఫాను తగ్గే సూచనలు యెక్కడా కనపడలేదు. వెంటనే బాబా ఓర్పు కూడా నశించింది. ఆయన తనున్న చోటునించి లేచి, సటకా చేతిలోకి తీసుకుని ద్వారకామాయి ద్వారం దగ్గిరకి దిగి వచ్చారు. ఆయన అక్కడ ఆరుబయట నిలబడ్డారు. ఆకాశంలో తీవ్రమైన మెరుపు మెరిసింది. బాబా సటకాతో నేలమీద కొట్టి తీవ్రమయిన స్వరంతో గర్జిస్తూ యిక్కడినించి వెళ్ళిపో అన్నారు (జాతేస్కి నై -- మరాఠీలో) ఆయన గర్జింపుయొక్క శబ్ద తీవ్రత యెంతెలా ఉందంటే షిరిడీలో భూకంపం వచ్చిందా అన్నంతగా అక్కడి ప్రదేశం వణికి పోవడం మొదలెట్టింది. మరొకసారి తీవ్రమయిన మెరుపు, షిరిడీనుంచి వెళ్ళిపొమ్మని వరుణదేవుడిని అడుగుతూ బాబా సటకాతో నేలమీద కొట్టడం. ఈవిథంగా మూడు సార్లు జరిగింది. అది రెండు మానవాతీత శక్తుల మథ్య పోరాటమని స్పష్టంగా కనపడుతోంది.బాబా అభ్యర్థన్లకనుగుణంగా తుఫాను, మెరుపులు ఆగిపోయాయి. వర్షం తగ్గి గాలులు మెల్లగా వీచాయి. సుమారు ఒక గంట తరువాత మరొకసారి అంతా ప్రశాంతంగా అయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. బాబా అందరినీ తమ తమ యిళ్ళకు తిరిగి వెళ్ళమ ని చెప్పారు. మా నాన్నగారు తన సాయంత్ర విథి ప్రకారం యథావిథిగా పెట్రొమాక్స్ దీపాలని వెలిగించారు. ఆయుథ్థం గురించి బాబాని అడుగుదామని తగిన సమయం కోసం చాలా యిదిగా ఉన్నారు. యిప్పుడా సమయం వచ్చింది. ఆయన బాబాని, ఆయనకి ప్రకృతిని కూడా శాసించగల స్థాయి ఉందా అని అడిగారు. బాబా సమాథానం చెబుతూ "భావూ ! నా భక్తులు కష్టాలలో ఉన్నప్పుడెల్లా నేను విశ్వమంతటికీ ప్రభువైన భగవంతుడిని, ఆయన దయని వారిమీద కురిపించమని ప్రార్థిస్తాను. భగవంతుడు నా రక్షణకు వచ్చి నాకు సహాయమందిస్తాడు. మా నాన్నగారు ఆ దృశ్యాన్ని మరచిపోలెకపోయారు. అది బాబా వర్షంలోమథ్యలో నిలబడి వరుణదేవునితో షిరిడీని వదలి వెళ్ళిపొమ్మని గట్టిగా అరవడం. బాబా తనే భగంతునిగా విలక్షణమైన రీతిలో కనిపించారు.



సర్వ్మ్ శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, August 8, 2011

పులికి ముక్తిని ప్రసాదించుట

0 comments Posted by tyagaraju on 8:12 AM



08.08.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి సచ్చరిత్రలో మరికొన్ని ఘట్టాలు

ప్రియమైన పాఠకులారా ! మరొకసారి నేను భావించేదేమిటంటే ఈ అథ్యాయంలోని సంఘటనలన్నీ ప్రత్యేకంగా సాయి సచ్చరిత్ర చదివిన వారి కోసం. మిగతావారికి కూడా నిస్సందేహంగా తృప్తిగా ఆసక్తికరంగా ఉంటాయనుకోండి. షిరిడీలో మా నాన్నగారు ఉన్నపుడు, జరిగిన సంఘటనలన్నీ సాయి సచ్చరిత్రలో వివరించబడ్డాయి. వాటిని మా నాన్నగారు మాకు మాటి మాటికి వివరించి చెపుతూ ఉండేవారు. వాటిని నేనిప్పుడు మీముందుంచుతున్నాను. వాటిని మానాన్నగారి ద్వారా నేను విన్నందుకు అదృష్టవంతుడినని నాకు నేను అనుకుంటున్నాను, యెందుకంటే అవి నా హార్డ్ డిస్క్ లో భద్రపరచబడి ఉన్నాయి. యిపుడు వాటిని మీ వ్యక్తిగతం గా మీకు తెలియడం కోసం మీముందు విస్తృత పరుస్తున్నాను. ఒకవేళ యెక్కడయినా చెప్పకుండా దాటవేసి ఉంటే నన్ను మన్నిస్తారని సవినయంగా భావిస్తున్నాను.

పులికి ముక్తిని ప్రసాదించుట


ఈ సంఘటన 1918 సంవత్సరంలో జరిగింది. మా నాన్నగారు దీనిని స్పష్టంగా తిరిగి గుర్తు చేసుకోవడానికి కారణం, బాబాగారు జీవించి ఉన్నపుడు ఆయన షిరిడీని దర్శించడం అదే ఆఖరిసారి అయింది. ఈ సంఘటన తరువాత ఒక వారం తరువాత అనుకుంటాను బాబా మహా సమాథి చెందారు. అ రోజున యెప్పటిలాగే ద్వారకామాయిలో దర్బారు జరుగుతోంది. హటాత్తుగా ద్వారకామాయి బయట పెద్ద అలజడి అయింది. అందరూ కూడా అక్కడేమి జరుగుతోందోనని తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారు. నలుగురు దర్వీషులు (ఫకీర్) బలిష్టంగా ఉన్న ఒక పెద్ద పులిని గొలుసులతో బంథించి యెడ్లబండి మీద తీసుకుని వస్తున్నారు.
వారు ఆ యెడ్లబండిని ద్వారకామాయి ప్రవేశ ద్వారం దగ్గిరకి తీసుకువచ్చి ఆపారు. దర్వీషులలో ఒకతను ద్వారకామాయిలోకి వచ్చి మాథవరావు దేశ్ పాండేతో (బాబాకు సన్నిహిత భక్తుడు) ఆ పులే తమ జీవనాథారం అని మనవి చేసుకున్నారు. వారాపులిని ఒకచోటినించి మరొకచోటకి తిప్పుతూ ప్రదర్శనలు చేసి వచ్చిన ఆదాయాన్ని తమ జీవనానికి, పులికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాని, ఆ పులికి జబ్బు చేసిందని, షిరిడీ గ్రామం నుంచి వెడుతుండగా, గొప్ప సాథువయిన సాయిబాబావారు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అంచేత తమకు అనుమతిస్తే వారు బాథపడుతున్న ఆ పులిని, బాబా వారి వద్దకు తీసుకొద్దామని తమ ఉద్దేశ్యం చెప్పారు. బాబాతో మాట్లాడిన తరువాత, ఆయన పులిని ద్వారకామాయిలోకి తీసుకు రమ్మని అనుమతిచ్చారు. దర్వేషులు అన్ని జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా నడుస్తున్న పులిని తీసుకుని వచ్చారు. అది బాబా సాథారణంగా కూర్చుండే వేదిక మెట్లదగ్గరికి వచ్చింది. అప్పుడది బాబా వైపు చూసి తనముందరి రెండు పంజాలను ముందుకు చాపి, బాబాకి నమస్కారం చేస్తున్నట్లుగా వంగింది.




అప్పుడది హటాత్తుగా పెద్దగా గర్జించింది. ఆ గర్జన శబ్దం చాలా గట్టిగా భయంకరంగా ఉండి ద్వారకామాయి మొత్తమంతా ఒక్క కుదుపుకి లోనయింది. గర్జించిన తరువాత అది అచేతనంగా నేలమీదకు ఒరిగిపోయింది. ఆ నలుగురు దర్వేషీలు ముందుకు పరిగెత్తుకుని వచ్చి చూసేటప్పటికి అది చనిపోయిందని తెలిసింది. వారు బాబాతో ఆ పులి చనిపోయిందని చెప్పి యిపుడు తామా పులి శవాన్ని ఏచేయాలని అడిగారు.బాబా వారికి శివుని గుడి బయట నంది విగ్రహం దగ్గర పులి శవాన్ని సమాథి చేయమని సలహా యిచ్చారు. షిరిడీలోని వారందరూ పులి సమాథి కార్యక్రమాన్ని చూడటానికి గుమిగూడారు. మా నాన్నగారు ఈ జరిగినదంతా వివరంగా ప్రత్యక్షంగా చూడటంవల్ల, బాబాకి పులికి మథ్య ఒక విథమైనది ఏదో జరిగిందని దాని తరువాతనే పులి చనిపోయిందని అనిపించింది.
మా నాన్నగారు ఆయనకి పులికి మథ్య సరిగా ఏ జరిగిందన్నది ఆయనని అడిగి తెలుసుకోవడానికి చాలా ఆతురతగా ఉండి తగిన సమయం కోసం వేచి ఉన్నారు. బాబా చిరునవ్వునవ్వి మా నాన్నగారితో "హేయ్ భావూ ! ఆ పులి భరింపరాని వేదనతో ఉంది. తనిక ఆవేదనని భరించలేనని తనని దానినుంచి విముక్తి చేయమని అర్థించింది. దాని దీనావస్థకి నాకు జాలి వేసింది. నేను దానికి ముక్తిని ప్రసాదించమని దేవుడిని ప్రార్థించాను. నా దేవుడు చాలా దయ కలాడు. ఆయన నా ప్రార్థనలను స్వీకరించి దానికి ముక్తిని ప్రసాదించాడు. ఆ పులి ఈ జనన మరణ చక్రాలనుంచి స్వేచ్చ పొందింది అన్నారు బాబా. బాబా చెప్పిన ఈ వివరణకి మా నాన్నగారు నిశ్చేష్టులయ్యారు. మా నాన్నగారు బాబాతో యింతవరకూ ఆయన మానవమాత్రులమీదే తన అనుగ్రహపు జల్లులను కురిపించడం చూశానని కాని యిప్పుదు మొదటిసారిగా ఒక క్రూర జంతువైనటువంటి పులి మీద కూడా అనుగ్రహపు జల్లులని కురిపించడం ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అపూర్వమైన మానాన్నగారి ఆఖరి షిరిడీ దర్శనం గురించి నేను తరువాతి అథ్యాయంలో వివరిస్తాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



Sunday, August 7, 2011

సాయి సచ్చరిత్ర 9 వ. అథ్యాయం

0 comments Posted by tyagaraju on 8:32 AM


08.07.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీస్సులు

సాయి సచ్చరిత్ర 9 వ. అథ్యాయం

ఓం శ్రీ సాయినాథాయనమహ

తార్ఖడ్ కుటుంబం వారి అనుభవాల భాండాగారాన్ని నేను మీముందు తెరిచాను. యివన్నీ చదివిన తరువాత బాబా మీద మీ నమ్మకం రెట్టింపవుతుందని నాకు బాగా తెలుసు. యిపుడు మనం సాయి సచ్చరిత్రలోని అనుభవాలు చూద్దాము.

సాయి సచ్చరిత్రలోని 9 వ. అథ్యాయం వైపు నేను మీ దృష్టిని మరల్చుదామనుకుంటున్నాను. మన పాఠకులందరూ కూడా ఈ పవిత్రమైన పుస్తకంలో యెంతో జ్ఞానవంతులని నేను భావిస్తున్నాను. వారు ఒక్కసారయిన చదివి ఉంటారు. ఒకవేళ యెవరయినా అలా చేయకపోతే, నా వినమ్రమైన అభ్యర్థన యేమంటే దయచేసి చదవండి. అది షిరిడీ సాయిబాబా వారి జీవితాన్ని గురించి చాలా చక్కగ వివరిస్తుంది. అనేకమైన లీలలను ఆయన షిరిడీలో తను ఉన్న కాలంలో తన భక్తులకు దర్శింపచేశారు.

ఈ పవిత్ర గ్రంథంలోని 9 వ. అథ్యాయం యెక్కువ భాగం తార్ఖడ్ కుటుంబానికేచెందుతుంది. అంటే మా నానమ్మగారు, మాతాతగారయిన రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ అనబడే బాబా సాహెబ్ తార్ఖడ్, యింకా మానాన్నగారు జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్. యింతకు ముందు వివరించినట్లుగా తార్ఖడ్ కుటుంబం విపరీతమయిన ప్రార్థనా సమాజ్ వాదులు. వారు విగ్రహారాథనని నమ్మరు. ఆ కారణం చేత వారికి దేవునియందు నమ్మకం లేదు. యేమయినప్పటికీ వారి అదృష్టం వారిని షిర్డీ సాయిబాబాతో బంథం యేర్పడటానికి తీసుకు వచ్చింది. అప్పుడది ఒక గొప్ప మార్పు. అందుచేత ప్రముఖ ఆరతి కూడా చేప్పేది ఆయన నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడిగా మార్చగలదని (నాస్తికానహీ తూ లావిషినిజ భజని) తార్ఖడ్ కుటుంబంలో యిది అనుభవ పూర్వకంగా నిరూపితమయింది.

సాయి సచ్చరిత్ర రచయిత స్వర్గీయ శ్రీ అన్న సాహెబ్ ధబోల్కర్ గారు తన 9వ అథ్యాయంలో, గొప్ప భక్తుడైన కుమారుడు ఉన్నందుకు బాబా సాహెబ్ తార్ఖడ్ గారు చాలా అదృష్టవంతులని చెప్పారు. మా నాన్నగారు ఉదయం 4 గంటలకే లేచి, స్నానంచేసిన తరువాత యింటిలో తమ మందిరంలో ఉన్న బాబా ఫొటోకి చందనం అద్ది, బాబాకి ఆరతి యిస్తూ ఉండేవారు. ఆయన అయిదు వత్తులవెండి దీపాన్ని (నిరంజన్) వెలిగించి అందులో బాబా యిచ్చిన ఒక పైసా నాణాన్ని ఉంచేవారు. ప్రతిరోజూ ప్రసాదంగా పటిక బెల్లాన్ని సమర్పిస్తూ ఉండేవారు. మథ్యాన్న భోజన సమయంలో దానిని వారందరూ తింటూ ఉండేవారు.

పూజ అయిన తరువాత తండ్రీ, కొడుకులిద్దరూ బైకుల్లాలోని టెక్స్ టైల్ మిల్ కి వెడుతూ ఉండేవారు. బాబా దయవల్ల ఆ రోజుల్లో మాతాతగారు నెలకు రూ.5,000/- మా నాన్నగారు నెలకు రూ.2,000/- జీతం సంపాదిస్తూ ఉండేవారు. ఒక సారి మా తాతగారికి, బాబాగారు కఫ్నీలు కుట్టించుకోవడానికి కాటన్ తానులు పంపిద్దామనే కోరిక కలిగింది. ఆయన జోతీంద్రతో, తల్లితో కూడా షిరిడీ వెళ్ళి బాబాకి సమర్పించి రమ్మని సూచించారు. కాని యింటిలో పూజ ఎవరుచేస్తారనే కారణం చేత జ్యోతీంద్రగారు యిష్టపడలేదు.

అపుడు మాతాతగారు ఆబాథ్యతను తాను తీసుకుని జ్యోతీంద్ర చేసినట్లే తాను కూడా చేస్తాననీ అందులో యెటువంటి లోటు జరగనివ్వననీ హామీ ఇచ్చారు. ఆ హామీతో మా నాన్నగారు తన తల్లితో షిరిడీకి బయలుదేరారు. తరువాత రెండు రోజులు బాగానే గడిచాయి. కాని, ముడవరోజున మా తాతగారు పూజా సమయంలో కలకండ పెట్టడం మరచిపోయారు. భోజనం చేసే సమయంలో తన పళ్ళెంలో కలకండ లేకపోవడంతో మధ్యాన్నానికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే లేచి షిరిడీలో ఉన్న జ్యోతీంద్ర కి తాను చాలా పెద్ద తప్పు చేసానని బాబాగారిని క్షమించమని అడగమని కోరుతూ ఉత్తరం వ్రాశారు. అక్కడ షిరిడీలో అదే సమయంలో ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. ద్వారకామాయిలో మథ్యా న్న ఆరతి అయిన తరువాత, మా నానమ్మగారు, బాబా గారి దగ్గరకు ఆయన ఆశీర్వాదములు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, బాబా మా నానమ్మగారితో "అమ్మా ! ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది.. యెప్పటిలాగే నేను బాంద్రా వెళ్ళాను. తలుపుకి తాళం వేసి ఉండటం చుశాను. కాని నన్నెవరూ ఆపలేదు యెందుకంటే తలుపుకి ఉన్న చిన్న ఖాళీ గుండా ప్రవేశించాను. కాని తినడానికి యేమీ లేకపోవడంతో పూర్తిగా నిరాశ చెంది ఖాళీ కడుపుతో తిరిగి రావాల్సి వచ్చింది." అన్నారు. బాబా చెపుతున్నదేమిటో మానాన్నమ్మగారికి అర్థం అవలేదు. కాని మానాన్నగారు, ఉదయం పూజా సమయంలో బాబాకి ప్రసాదం పెట్టడం తన తండ్రి మరచిపోయి ఉంటారని అర్థం చేసుకున్నారు. ఆయన బాబాని తన తండ్రి చేసిన పెద్ద తప్పుకు మన్నించమని కోరారు. వెంటనే ముంబాయి వెళ్ళడానికి అనుమతినివ్వమని అడిగారు. బాబా అనుమతినివ్వక యింకా కొన్ని రోజులు ఉండమన్నారు. యేమయినా గాని, మా నాన్నగారు అస్థిమితంగా ఉన్నారు. ఆయన బాబా చెప్పిందంతా వివరంగా తన నాన్నగారికి ఉంత్తరం వ్రాశారు. రెండు ఉత్తరాలూ ఒకదానికొకటి దాటుకుని వారికి చేరగానే వాటిని చదివిన తరువాత తండ్రీ కొడుకులిద్దరికీ కన్నీరొచ్చింది. తమ మీద బాబాకున్న అపరిమితమైన ప్రేమ తెలిసివచ్చింది. బాబా యింకా ఆ ఫోటో ఫ్రేములో తాను సజీవంగా ఉన్నాననీ ప్రతిరోజూ వారు సమర్పించే నైవేద్యాలని తప్పకుండా స్వీకరిస్తున్నట్లు గుర్తు చేశారు.


ఒకసారి వారు షిరిడీలో ఉన్నప్పుడు, మా నానమ్మగారు భోజనం చేసేముందు, ఒక కుక్క తోకాడించుకుంటూ వచ్చింది. మా నానమ్మగారు దానికి ఒక చపాతీ ముక్క పెట్టారు. ఆ కుక్క సంతోషంతో తిని అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపటి తరువాత అక్కడికి ఒళ్ళంతా పెంటతో నిండి ఉన్న వరాహం ఒకటి అక్కడికి వచ్చింది. సాథారణంగా అటువంటి అసహ్యకరమైన ప్రాణిని చూసినప్పుడు యెవరికి గొంతులోఉన్న ముద్దని కిందకు దించుకోలేరు. కాని మా నాన్నమ్మగారు చాలా దయ కలవారు. దేవుడంటే భయం కలది. ఆవిడ ఆ అసహ్యకరమైన వరాహానికి కూడా చపాతీ ముక్కని పెట్టారు. ఆ వరాహం చపాతీ ముక్కను తిని వెళ్ళిపోయింది. తరువాత ఆ రోజున వారు ద్వారకామాయికి వెళ్ళి బాబాకి దగ్గరగా వెళ్ళారు. బాబా ఆమెతో "అమ్మా ! ఈ రోజు నువ్వు నీ చేతులతో దివ్యమైన విందు భోజనం పెట్టావు. నాకింకా త్రేనుపులు వస్తున్నాయి" అన్నారు. అది విని మా నాన్నమ్మగారు ఆశ్చర్యపోయారు. ఆమె బాబాతో "బాబా మీరు పొరబడ్డారు. షిరిడీలో నేను మీకెప్పుడూ భోజనం పెట్టలేదు. నేనిక్కడ వంట కూడా వండలేదు. నిజానికి నేనిక్కడ, సగుణ నడిపే హోటలులో డబ్బు చెల్లించి భోజనం చేస్తాను. " అన్నారు. అప్పుడు బాబా "అమ్మా ! ఈ రోజు మధ్యాన్నం నువ్వు భోజనం చేసేముందు ఒక కుక్కకి ఆ తరువాత వచ్చిన అసహ్యకరమైన వరాహానికి తిండి పెట్టలేదూ? ఆ ఆహారం నాకు చేరింది" అన్నారు. అప్పుడు మా నాన్నమ్మగారు "బాబా, దీనర్థం నీవు ప్రాణుల రూపాలలో వచ్చి నీ భక్తులను పరీక్షిస్తూ ఉంటావు" అన్నారు. బాబా ఆమెతో అన్నారు "అమ్మా ! దయ చేసి ఈ ప్రాణులమీద అలాగే దయ చూపుతూ ఉండు, భగవంతుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. భగంతుడు నీ యింటిలో ఆహారానికి కొరత లేకుండా చూస్తాడు"


యిప్పటికి తార్ఖడ్ కుటుంబం యితర సాయి భక్తులతో యెక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారిలో శ్రీ ధబోల్కర్, శ్రీ పురందరే, శ్రీ తెండుల్కర్. వీరంతా బాంద్రాలో వీరింటికి దగ్గరి దూరంలోనే ఉంటారు. వారు ఒకరికొకరు కలుసుకుంటూ బాబాతో తమకు కలిగిన అనుభవాలని చెప్పుకుంటూ ఉండేవారు. యెప్పుడయినా వారు షిరిడీ వెళ్ళాలనుకున్నప్పుడు దానిని ఆ భక్తుని తరపున చేరవేస్తూ ఉండేవారు. దీని వెనకనున్న వారి ఉద్దేశ్యం బాబామీద తమకున్న స్వచ్చమైన భక్తిని, ప్రేమను తెలిపేటందుకే. ఒకసారి పురందరేగారు తమ కుటుంబంతో సహా షిరిడీ వెడుతున్నపుడు మా నానమ్మగారు, పురందరే భార్యకు రెండు పెద్ద నల్లవంకాయలనిచ్చి ఒక కాయతో పెరుగు పచ్చడి, రెండవదానితో వంకాయ ముక్కల వేపుడు చేసి బాబాగారికి భోజనంలో వడ్డించమని చెప్పింది.


మొదటి రోజున పురందరే భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి, మిగతా పదార్థాలతోపాటు బాబా భోజన పళ్ళెంలో వడ్డించింది. బాబా వంకాయ పెరుగు పచ్చడి భుజించి వంకాయ వేపుడు కావాలనే కోర్కెను తెలియచేశారు. షిరిడీలోని (స్థానికంగా ఉండే భక్తురాలు) రాధాకృష్ణమాయి, ఈమె బాబాగారికి భోజన యేర్పాటులన్ని చూస్తూ ఉండేది. ఆమెకేమీ తోచలేదు. ఆమె అక్కడ ఉన్న ఆడవారినందరినీ అడిగి పురందరుని గారి భార్య వంకాయ పచ్చడిని తెచ్చిందని తెలుసుకుంది. యేమయినప్పటికీ అది వంకాయల కాలంకాదు కనక షిరిడిలో వంకాయలు దొరకడం కష్టం. (అంచేత రాథాకృష్ణమాయి వంకాయలు యెక్కడ దొరుకుతాయో కనుక్కొవడానికి పురందరే భార్యవద్దకి పరిగెత్తుకుని వెళ్ళింది.అప్పుడామె తన దగ్గిర ఒకటుందనీ, దానిని మరునాడు బాబాకి వంకాయ వేపుడు చేసి పెట్టడానికని ఉద్దేశించినట్లు చెప్పింది. అపుడు రాథాకృష్ణమాయి ఆ వంకాయను తీసుకొని వెళ్ళి, తొందరగా బాబాకి వేపుడు చేసి పెట్టాకే బాబా వాటిని స్వీకరించి భోజనం ముగించి లేచారు. యిప్పుడిది బాబా తన భక్తులపై స్వచ్చమైన ప్రేమను తెలియచేసే సంఘటన యింకా యేమిటంటే అతన్నినించి/ఆమెనించి వారి భక్తిని స్వీకరించారన్నదానికి నిర్థారణ. పురందరే భార్య బాంద్రాకు తిరిగి వచ్చిన తరువాత ఈ సంఘటన గురించి మా నాన్నమ్మకి చెప్పినపుడు, ఆవిడ యెంతో సంతోషించి, తన హృదయాంతరాళలోనించి బాబావారికి థన్యవాదాలు తెలుపుకున్నారు.


యిదే విథంగా ఒక సాయంత్రం గోవిందజీ (బాలక్ రాం కుమారుడు) తార్ఖడ్ గారి యింటికి వచ్చి తాను, ఆరాత్రికి షిరిడీ బయలుదేరి వెడుతున్నానని చెప్పాడు. తాను, స్వర్గీయుడైన తన తండ్రి అస్థికలను నాసిక్ లో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాననీ, అక్కడినించి షిరిడీ వెడతాననీ చెప్పాడు. అతను చాలా తొందరలో ఉన్నందు వల్ల మా నానమ్మగారికి బాబాకు పంపించడానికి సరైనదేదీ దొరకలేదు. చందనపు మందిరంలో బాబా చిత్రపటం ముందు వుంచబడిన ప్రసాదం కుండలో ఉన్న ఒక "కోవా" దొరికింది. ఆవిడ అతనితో తనకు లోపల యిష్టం లేకపోయినప్పటికీ దానినే యిస్తున్నాననీ కారణం యింతకుముందే దానిని బాబాకు ప్రసాదంగా పెట్టాననీ చెప్పారు. అంతే కాకుండా గోవిందజీ, అస్థికలను నిమజ్జనం చేసే కార్యక్రమానికి తోడు, షిరిడీకి కూడా యాత్రను పెట్టుకున్నారు. భక్త శబరి రాములవారికి తాను రుచి చూసిన రేగిపళ్ళను సమర్పించి భక్తిభావాన్ని చాటుకున్నట్లుగా, తన భక్తి భావం ముందు యిటువంటి న్యాయ సమ్మతం కానటువంటి ఆలోచనలన్నిటినీ పక్కకు నెట్టేశారు.


గోవిందజీ తన మిగతా కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకుని ద్వారకామాయిని చేరుకున్నపుడు అతను కోవా గురించి మర్చిపోయాడు. బాబా అతనిని తనకోసం యేమయినా తెచ్చావా అని అడిగారు. గోవిందజీ తేలేదని చెప్పాడు అప్పుడు బాబా తనకిమ్మనమని ఒకరు యేదో యిచ్చారని అతనికి గుర్తు చేశారు. గోవిందజీ శిలలా మొహం పెట్టి మరలా లేదని చెప్పాడు. బాబా ఇపుడు కోపంతో అరుస్తూ అన్నారు. "ఏయ్ ! నువ్వు బొంబాయినుండి బయలుదేరేటప్పుడు మా అమ్మ నాకుయిమ్మని ఏదో ఇచ్చింది కదా, ఏది అది?"

గోవిందజీకి యిప్పటికి తెలిసింది. అతను తనున్న చోటకి పరిగెత్తుకుని వెళ్ళి కోవా తెచ్చి బాబాకిచ్చాడు. బాబా వెంటనే దానిని తిని గోవిందజీతో అది చాలా మథురంగా ఉందని అమ్మకి చెప్పమని అన్నారు.

ప్రియమైన సాయి భక్త పాఠకులారా, దైవాంశసంభూతమైన ప్రేమానురాగ దృష్టాంతాలు స్వర్గీయ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు సాయి సచ్చరిత్ర 9 వ అథ్యాయంలో యెంతో మనోజ్ఞంగా వర్ణించారు. మా నాన్నగారు వాటిని మాకు వివరించి చెబుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళనుండి కన్నీరు కారుతూ ఉండేది.ఆ విథంగా భగవంతుడినించి తిరిగి పొందినపుడు అలా స్పందించకుండా యే భక్తుడూ ఉండడని నాకనిపిస్తుంది.

నేను ఒకదానికి బాథపడుతున్నాను."యెక్కడికి వెళ్ళారు ఆ ప్రజలంతా (వారందరికీ నమస్కారాలు) ఆ భక్తులంతా యెక్కడ ఉన్నారు? అటువంటి భక్తి ఈ రోజు యెక్కడ ఉంది? కాని బాబా ప్రేమ తనభక్తుల మీద యెల్లపుడూ వ్యాపించి ఉంటుంది.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List