Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, July 30, 2011

బాబా వారి చందనపు మందిరం

0 comments Posted by tyagaraju on 11:46 PM




31.07.2011 ఆదివారము

బాబా వారి చందనపు మందిరం


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి భక్తులందరికీ బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు బాబా వారి చందనపు మందిరాన్ని గురించిన విశేషమైన లీల తెలుసుకుందాము.

ఒక సవరణ

శ్రీ సాయితో మొదటి కలయిక (పరిచయం) అన్న అథ్యాయంలో జ్యోతీంద్ర గారి కుటుంబాన్ని గురించి చెపుతూ ఆయన మామయ్య కూడా వైద్యుడుఅని రాయడం జరిగింది. మామయ్యకు బదులుగా బాబాయి, లేక పెదనాన్న అని గ్రహించమని కోరుతున్నాను. జ్యోతీంద్రగారు రాసిన దానికి ఆంగ్ల అనువాదంలో (బహుశా ఆయన మరాఠీలో రాసి ఉంటారు) అంకుల్ అని రాయడం జరిగింది. అందు చేత పొరపాటున తల్లివైపు అని భావించి మామయ్య అని రాయడం జరిగింది. గ్రాండ్ మదర్ ని నానమ్మ గా చదువుకోవలసినదిగా కోరుతున్నాను. ఈ పొరపాటుని సాయి బంథువులలో ఒకరు నిన్ననే నా దృష్టికి తీసుకుని వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తరువాత ప్రచురించేవాటిలో దీనికణుగుణంగా రాయడం జరుగుతుంది. పొరపాటుకు మన్నించమని కోరుతున్నాను.




సాయిబాబా వారి చందనపు మందిరం

ఓం శ్రీ సాయినాథాయ నమహ

యింతకు ముందు వివరించినట్లుగా తార్ఖడ్ కుటుంబంవారికి షిరిడీ దర్శనాలు యెక్కువయాయి. బాబాపై వారి ప్రేమ పూర్ణచంద్రోదయంలాగా వృథ్థి పొందుతూ వచ్చింది. షిరిడీలో ఉన్నపుడెల్లా వారు, తాము బాబా వారి పాదాల వద్దే ఉంటున్నామని అనుకుంటున్నప్పటికీ, ప్రతిసారి అది సాథ్యం కాదు. బాంద్రాలోని తమ యింటిలో ఉంచుకుని పూజించుకోవడానికి ఒక పెద్ద సైజు బాబా ఫోటో ఉంచుకోవాలనే కోర్కె వారిలో బలంగా పెంపొందింది. దీని వెనుక వున్న ఆలోచన యేటంటే, వారు షిరిడీ నుంచి వచ్చాక, బాబా వారిని తమ దృష్టి పథం నుండి, మనసులోను, మరచిపోకుండా ఉండటానికి. తండ్రీ, కొడుకులిద్దరిదీ కూడా ఒక విచిత్రమైన మనస్తత్వం. వారెప్పుడూ కూడా బాబా మీద తమకున్న ప్రేమని ఒకరికొకరు చర్చించుకునేవారు కాదు. వారికి బాబా మీద అపరిమితమైన నమ్మకం. తమ మనసును తెలుసుకొని, సరియైన సమయంలో తమ కోరికలను తప్పక తీర్చడానికి యేర్పాటు చేసే సర్వాంతర్యామి అని వారికి తెలుసు. అందు చేత బాబా వారు చెప్పిన రెండు ముఖ్యమైన విషయాలు శ్రథ్థ, సబూరి.

ఒకరోజు తెల్లవారుఝామున బాబా సాహెబ్ గారికి, జ్యోతీంద్రగారికి, కల వచ్చింది. వారు అందంగా చెక్కబడిన మందిరంలో బాబా కూర్చుని ఉండటం చూశారు. ఆ కల వారి మనసులో గాఢమైన ముద్ర వేసింది. వారిద్దరూ మంచి చిత్రకారులు కాబట్టి, లేచిన తరువాత తాము కలలో చూసిన మందిరం చిత్రం గీశారు. వారిద్దరూ పలహారం చేయడానికి బల్ల వద్దకు వచ్చినప్పుడు యిద్దరూ కూడా ఒకరి ఆలోచనలను ఒకరు చెప్పుకుని ఉదయాన్నే తమకు వచ్చిన కలల గురించి కూడా చర్చించుకున్నారు. యిద్దరూ వారు వేసిన చిత్రాలను పట్టుకుని వచ్చి చూసి, రెండూ కూడా ఒక్కలాగే ఉండటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు వెంటనే అటువంటి మందిరం తమ యింటిలో ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. వారిద్దరూ అన్వేషణ చేసి చందనపు కలపని కొన్నారు. ఒక మంచి వడ్రంగిని నియమించి తాము వేసిన చిత్రాలను చూపించి అటువంటిది ఒకటి చెక్కి యిమ్మని పురమాయించారు. వారు ఉన్న బాంద్రా యింటికి చిన్న డాబా వుంది. అక్కడ మందిరం నిర్మాణపు పని ప్రారంభం అయింది. మందిరం పూర్తవడానికి సంవత్సరం పైన పట్టిందనుకుంటాను. చివరికి చందనపు మందిరం 9 అ. పొడవు, 2. 1/2, 2 1/2 చ..అ. తో మందిరం తయారయింది. యిపుడు వారికి ఒక సందేహం వచ్చింది, మందిరంలో పెట్టి పూజించడానికి బాబా పటాన్ని యెక్కడనించి తేవాలి.


ప్రియ పాఠకులారా, బాబాగారెప్పుడూ తనని కెమేరాతో ఫోటో తీయనిచ్చేవారు కాదని మీకందరకూ తెలుసు. అందు చేత ఆయన ఫోటో సంపాదించడమనేది కష్ట సాథ్యమయిన విషయం. కాని తమకు వచ్చిన కల కూడా బాబాగారి సృష్టే కాబట్టి, అంతా ఆయనే చూసుకుంటారనే థీమాతో, నమ్మకంతో ఉన్నారు.


వారి అలవాటు ప్రకారం ఒక శుక్రవారమునాడు మథ్యాన్నం బొంబాయిలోని చోర్ బజార్ కి వెళ్ళారు. వారెప్పుడూ వేసుకునే దుస్తులు అంటే బాబా సాహెబ్ కోటు, పైజామా, ఆంగ్ల టోపీతో, జ్యోతీంద్ర గారు కోటు, పైజామా నలుపురంగు గాంథీ టోపీ థరించి ఉన్నారు. వారిద్దరూ చోర్ బజార్ సందులలో తిరుగుతూ వెడుతున్నప్పుడు ఒక అద్వితీయమైన సంఘటన జరిగింది. ఒక ముస్లిం షాపు యజమాని గట్టిగా అరుస్తూ వచ్చి "యేయ్ ! దొరలూ , యిన్ని రోజులుగా మిమ్మలిని కసుకోవాలని యెదురు చూస్తున్నాను. నా దుకాణంలో మీకొక పార్శిల్ ఉంది" అన్నాడు. బాబా సాహెబ్, జ్యోతీంద్రగారు ఉలిక్కిపడి, ఆ షాపతను తమకేదో దొంగిలించిన సరుకు అంటగట్టాల్ని చూస్తున్నాడని ఆందోళన పడ్డారు. యింతమంది జనం ఉండగా మమ్మల్నే యెందుకు పిలిచారని ప్రశ్నించారు. ఆ షాపతను అంతా వివరంగా చెబుతాను షాపులోకి రండి అని కోరాడు. షాపులోకి వచ్చిన తరువాత, "కొద్ది రోజుల క్రితం సాథువులా ఉన్న వయసుమళ్ళిన పెద్ద మనిషి వచ్చి తనకు ఒక పార్శిల్ యిచ్చినట్లు చెప్పాడు. ఆయన, ఒక శుక్రవారమునాడు ఒక హిందూ తండ్రి, కొడుకు ఈ ప్రదేశానికి వస్తారని చెప్పాడు. వారికోసం ఒక పార్శిల్ యిచ్చి, ఈ పని చేసి పెట్టినందులకు గాను రూ.50/- కూడా యిచ్చినట్లు చెప్పాడు.


అందు చేత జంటగా వచ్చే మనుషులందరినీ తాను జాగ్రత్తగా గమనిస్తున్నాననీ, యిప్పుడు తమని సరిగా గుర్చించినట్లు చెప్పాడు. అప్పుడతను ఆ పార్శిల్ని తీసుకు వచ్చి వారికందించాడు. అది దొంగిలించిన సొత్తేమోనని వారికింకా అనుమానంగా ఉంది. అందుచేత తీసుకునేముందు అతని చేతనే ఆ పార్శిల్ విప్పించారు. షాపతను పార్శిల్ విప్పాడు. అది చక్కటి చెక్క ఫ్రేములో బిగించబడి ఉన్న నలుపు, తెలుపు రంగులలో ఉన్న బాబా చిత్రపటం.



వారిద్దరికీ కళ్ళలో నీళ్ళు నిండి, ఆ పార్శిల్ తమకు వుద్దేశించినదే అని నిర్థారించారు. వారు అతనికి యెంతో కృతజ్ఞతలు చెప్పి, కొంత డబ్బు యివ్వ చూపారు. ఆ పార్శిల్ యిచ్చిన వ్యక్తి ఖండితమైన ఆజ్ఞ ఇవ్వడం వల్ల తాను యేవిథమయిన డబ్బు తీసుకోనని నిరాకరించాడు. వారెప్పుడూ స్టుడ్ బేకర్ కారులో ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వారా ఫోటొని జాగ్రత్తగా బాంద్రాకు తీసుకుని వెళ్ళగలిగారు. వారికి యింకొక ఆనందకరమైన, ఆశ్చర్యకరమైనదొకటి కలిగింది. అదేమిటంటే ఆ ఫోటో ఫ్రేము యెటువంటి మార్పులు చేయబడకుండానే మందిరంలో సరిగా సరిపోయింది. తార్ఖడ్ కుటుంబమంతా సంతోషంతో పొంగిపోయింది. వారి సంతోషానికి అవథులు లేవు. వారా సాయిబాబా ఫోటోని చందనపు మందిరంలో ప్రతిష్టించారు.

మా నాన్నగారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం 5 గంటలకే నిద్ర లేచి బాబా నుదిటిమీద చందనం అద్ది, దీపం, అగరువత్తులు వెలిగించి పూజ చేస్తూ ఉండేవారు. పంచదార పలుకులు నైవేద్యం పెట్టి, మధ్యన్నం భోజన సమయంలో తీసుకుంటూ ఉండేవారు. వారంతా యిప్ప్పుడు తమ తరువాతి షిరిడీ యాత్ర కోసం ఆత్రుతగా యెదురు చూస్తున్నారు.


మామూలుగా వారు ద్వారకామాయిలోకి ప్రవేశించి, బాబా గారికి సమర్పించేవి కానుకగా ఇచ్చారు. ఆయన వారిని అక్కడ కూర్చోమని చెప్పారు. షిరిడీలో ఉన్న సాయి భక్తులలో ఒక భక్తుడు, గత కొద్ది రోజులుగా బాబాని ఫోటో తీయడానికి విఫల ప్రయత్నం చేస్తూ, తీయలేకపోయి ఆఖరి ప్రయత్నంగా బాబాని కోరాడు. బాబా వెంటనే కోపగించి అతనితో గట్టిగా అరుస్తూ "ఏయ్ నువ్వు నా ఫొటోని యెందుకు తీస్తున్నావు? నువ్వు నా భావూ ఉన్నచోటకి వెళ్ళు, అక్కడ మందిరంలో ఉన్న ఫొటోలో నువ్వు నన్ను సజీవంగా చూడచ్చు" అన్నారు. యిది విన్న వెంటనే మా నాన్నగారు వెంటనె లేచి బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. మా నాన్నగారు, తాను సాయిని మరచిపోగలిగే దుష్టపు ఆలోచన రాకుండాను, ఆయన పాటలనే ఆయన మీద ప్రార్థన చేసేటట్లుగా వరమివ్వమని మనసులోనే ప్రార్థంచారు. (హేచి దాన్ దేగా దేవా తుఝా వీసర నా వ్హవా)


ఈ విథంగా షిరిడీ సాయిబాబావారు తమంత తాముగా తార్ఖడ్ గాయి యింటిలోని చందనపు మందిరంలోకి

ప్రతిష్టింపబడ్డారు.

స్వర్గీయ నా సోదరుడు రవీంద్రగారి వాసిలో ఉన్న యింటిలో ఈ మందిరాన్ని దర్శించవచ్చు.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు







Friday, July 29, 2011

బాబా సాహెబ్ తార్ఖడ్ తో కలిసి రెండవసారి కలయిక

0 comments Posted by tyagaraju on 6:44 PM



30.07.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు


ఈ రోజు తార్ఖడ్ కుటుంబంవారు, బాబావారిని తెండవ సారి కలుసుకున్న సంఘటను తెలుసుకుందాము.



బాబా సాహెబ్ తార్ఖడ్ తో కలిసి రెండవసారి కలయిక


సాయిబాబాతో అటువంటి అద్భుతమయిన పరిచయం కలిగిన అనుభూతితో, తల్లీ కొడుకులిద్దరూ కూడా వెంటనే యింటికి తిరిగి వచ్చి, మాతాతగారితో జరిగినదంతా యెప్పుడు చెబుదామా అని చాలా ఆత్రుతతో ఉన్నారు. యేమయినా సాయిబాబా మరికొద్ది రోజులు షిరిడీలో ఉండమని సూచించారు. వారు అందుకు వారి కోరికను మన్నించారు. భక్తులకి సహాయపడుతూ వారికి మార్గదర్శకులు సాయిబాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి మాధవరావు దేశ్ పాడే గారితో వారు చర్చలు జరిపారు. ఉదయం బాబాగారు యెవరి కోసమో యెదురు చూస్తున్నారనీ, అడిగిన మీదట తన తల్లి సోదరుడు తనని కలుసుకోవడానికి వస్తున్నట్లుగా చెప్పారనీ మాథవరావు దేశ్ పాండే గారు చెప్పారు. మాథవరావు గారు, సామాన్యంగా భక్తులందరు అనుసరించేదేమిటంటే బాబాగారి అనుమతి తీసుకున్న తరువాతే షిరిడీ వదలి వెడతారని కూడా చెప్పారు. అప్పుడు వారు బాంద్రాలో ఉన్న బాబా సాహెబ్ గారికి, తాము అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతిని పొందామని అందుచేత షిరిడీలో యింకా ఉంటామని ఉత్తరం వ్రాశారు. అలా వారు షిరిడీలో వారం రోజులు ఉన్నారు. తరువాత వారు బాబాగారి వద్ద అనుమతి తీసుకుని మరలా బాబా సాహెబ్ తార్ఖడ్ గారితో తిరిగి వస్తామని మాట యిచ్చి, వారి స్వస్థలమైన బాంద్రాకు తిరిగి వచ్చారు.

వారు ఉన్న ఆ వారం రోజుల కాలంలో, మిగతా సాయి భక్తులయిన శ్రీ మహల్సాపతి, కాకా సాహెబ్ మహాజని, శ్యామా రావు జయకర్ మొదలైన వారినందరినీ కలుసుకున్నారు. వారు మొత్తం విషయమంతా మా తాతగారికి తెలియచెప్పి షిరిడీలోని శ్రీ సాయిబాబా మామూలు వ్యక్తి కాదని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆయన మంచి మందులనివ్వడమే కాదు, ఆయనలోఅతీతమయిన శక్తులు కూడా ఉన్నాయని చెప్పారు. మా తాతగారు, మా అమ్మమ్మగారి మనోభావాలని చాలా తేలికగా తీసుకున్నారు. కాని వీటినే మా నాన్నగారినుంచి విని కొంచెం ఆశ్చర్యపోయారు. ఆయనకి తాము మరలా తరువాత షిరిడీ వచ్చేటప్పుడు బాబా సాహెబ్ తో వస్తామని చెపినట్లుగా కూడా, తెలియచేశారు.


ప్రియమైన పాఠకులారా, నేను గట్టిగా నమ్మేదేమిటంటే, బాబా సాహెబ్ గారు కూడా శ్రీ సాయిబాబా గారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అందుచేత ఈ కాలంలో ఆయన తన స్నేహితులయిన శ్రీ షాంరావ్ వ్ జయకర్, శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్, జస్టిస్ థురంథర్ గారిని కలుసుకుని వారందరూ కూడా సాయి భక్తులని తెలుసుకున్నారు. ఆఖరికి మా తాతగారు షిరిడీకి కుటుంబంతో ఒక విలాస యాత్రగా వెళ్ళడానికి అంగీకరించారు. ఆయన చాలా తీరిక లేని వ్యక్తి కాబట్టి ఉద్యోగానికి శలవు పెట్టి వెళ్ళడం కష్టం. అందుచేత, శుక్రవారం నష్ట పోకుండా, వారాంతంలో శుక్రవారం రాత్రి తన స్నేహితులతో సహా వెడదామని నిర్ణయించుకున్నారు.


వారు మన్మాడ్ కి, రాత్రి రైలులో ప్రయాణిస్తున్నారు. మా నాన్నగారు, అమ్మమ్మగారు పక్కలు పరచుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మగవాళ్ళందరూ పేకాటలో మునిగిపోయారు. రైలు నాసిక్ రోడ్ స్టేషన్ ని వదిలింది. తల చుట్టూ తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక ఫకీర్ పెట్టెలోకి ప్రవేశించాడు. అతను మా తాతగారి వద్దకు వచ్చి థర్మం చేయమని అడిగాడు. మా తాతగారు అతనివైపు చూసి, అతని స్థితికి జాలి పడ్డారు. అయన ఒక రూపాయి వెండి నాణెం తీసి, అతనికిచ్చి వెళ్ళిపొమ్మని చెప్పారు. ఫకీరు తన దృష్టిని ఆ రూపాయి నాణెం మీదకి మళ్ళించారు. యెందుకంటే ఆ రోజుల్లో ఒక రూపాయి దానం చేయడమంటే అది చాలా పెద్ద మొత్తం. యిక్కడ నేను పాఠకులకి చెప్పదలచుకునేదేమిటంటే మా తాతగారు ఖటావు గ్రూప్ ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీ, యింకా 1908 సంవత్సరంలో ఆయనకి నెలకి జీతం రూ.2,000/-. ఆయన ఆ ఫకీరుతో 5 వ జార్జ్ బొమ్మతో ముద్రించబడి విడుదల చేయబడ్డ ఆనాణెం అసలయినదేననీ అది 1905 లో చలామణిలోకి వచ్చిందనీ, , అందుచేత దాని గురించి యేవిథమయిన భయం అక్కరలేదని చెప్పారు. తమ పేకాటకి అంతరాయం కలుగుతోండటంవల్ల అతనిని అక్కడినుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. అప్పుడాఫకీరు వెళ్ళిపోయాడు.


మరునాడు ఉదయానికి వారు షిరిడీ చేరుకున్నారు. మా అమ్మమ్మగారు, నాన్నగారు, వారికా ప్రదేశం బాగా తెలిసింది కాబట్టి మా తాతగారికి దారి చూపించారు. వారు స్నానాలు కానిచ్చి, ఫలహారం తీసుకున్నారు. తరువాత పూజా సామాగ్రితో ద్వారకామాయిలోకి ప్రవేశించారు. మా నాన్నగారు, అమ్మమ్మగారు, బాబా కి వంగి నమస్కరించి వారి పాదాలను స్పృశించారు.


బాబా అపుడు వారివైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, మా తాతగారివైపు తిరిగి, "మ్హతర్య ' (ముసలివాడా) నా తల్లి, సోదరుడు నిన్ను వేడుకుని తరవాత నిన్ను ఒప్పించడంతో వారి ప్రోద్బలంతో నువ్వు షిరిడీ రావడానికి అంగీకరించావు నువ్వు నన్ను గుర్తించావా?" అన్నారు బాబా. మా తాతగారు లేదన్నట్లుగా చెప్పారు. ఆపుడు బాబా తన చేతిని కఫ్నీ జేబులో పెట్టి ఐదవ జార్జ్ బొమ్మ ఉన్న ఒక రూపాయి వెండినాణాన్ని బయటకు తీశారు. దానిని మా తాతగారికి చూపిస్తూ "కనీసం, నిన్న రాత్రి నువ్విచ్చిన దీనినైనా గుర్తిస్తావా?" అన్నారు. యిప్పుడు మా తాతగారు క్రితం రాత్రి రైలులో జరిగిన సంఘటనని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆయన తిరిగి యేదయినా చేప్పేలోపే బాబా ఆయంతో "ఏయ్ ! రాత్రి నువ్వు చూసిన ఫకీరు నేను తప్ప మరెవరూ కాదు" అన్నారు. బాబా సాహెబ్ తక్షణమే దు ఖంలో మునిగిపోయారు. ఆయన తన తప్పుని తెలుకున్నారు. బాబాని ఒక యాచకుడిగా భావించారు. రాత్రి తను చేసిన పనికి చాలా విచారించారు. ఆయన బాబా ముందు వంగి క్షమించమని అడిగారు. జ్యోతీంద్ర మరియు తన భార్య బాబాగారి గురించి చెప్పినది నూటికి నూరు శాతం నిజమని తెలుసుకున్నారు. పైగా, బాబా గారు సామాన్య వ్యక్తి కాదు నిజం చెప్పాలంటే ఆయన "భగవంతుని దూత" అనుకున్నారు.

ఈ సంఘటన తరువాత బాబ సాహెబ్ తార్ఖడ్ గారిలో అపూర్వమైన పరిణామం సంభవించింది. ఆయన యిక ప్రార్థనా సమాజ్ వాది కాదు. ఆయన బాబా మీద ఆథ్యాత్మికమయిన ప్రేమని పెంపొందించుకున్నారు. బాబాతో చర్చించిన తరువాతే ఆయన ముఖ్యమయిన నిర్ణయాలను తీసుకోవడం మొదలు పెట్టారు. బాబా గారు కఫ్నీలు కుట్టించుకోవడానికి బట్టల తానులు పంపడం మొదలుపెట్టారు.


రాత్రి వేళల్లో ద్వారకాయాయిలో వెలిగంచడానికి పెట్రొమాక్స్ లైట్లు కూడా పంపించారు. మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడెల్లా సాయంత్రం వేళల్లో వాటిని వెలిగిస్తూ ఉండేవారు. ద్వారకామాయిలో నిర్ణయించిన ప్రదేశాల్లో వాటిని వేళ్ళాడదీస్తూ ఉండేవారు. దీనిని గురించిన ఒక ఆసక్తికరమయిన విషయం ఉంది, దానిని తరువాత వివరిస్తాను.


ప్రియ పాఠకులారా, ఈ రీతిగా తార్ఖడ్ కుటుంబంలోని ముగ్గురికి షిరిడీ సాయిబాబావారితో అనుబంథం యేర్పడింది. నిజానికి ఒక శక్తివంతమైన అయస్కాంతంలాగా బాబా, వారిని తమవైపుకు లాక్కున్నారు. వారందరూ కుడా బాబా మీద అమితమైన ప్రేమని పెంపొందించుకున్నారు. వారికి అనుభవాలు కలుగుతున్నాయన్న సామాన్యమయిన కారణంతో వారి షిరిడీ దర్శనాలు యెక్కువయాయి. వారి స్వభావానికి అవి అద్వితీయం. అవి లీలలు తప్ప మరేమీ కావు. అవే వారికి సాయి బాబా భగవంతుని అవతారం అని యెలియచేశాయి. నేను మీకు ఈ అనుభవాలన్నిటినీ చెప్పబోతున్నాను. వాటిని చదివిన తరువాత మీరు కూడా నాతో యేకీభవిస్తారని నాకు తెలుసు.


బాబా ఆ ఒక రూపాయి వెండినాణాన్ని మా తాతగారికి తిరిగి యిచ్చి, "ముసలివాడా! నీ నాణాన్ని నీకు తిరిగి యిస్తున్నాను.దీనినే నువ్వు పూజించు, నీ సంకల్పం నీకు ఫలవంతమయిన జీవితాన్నిస్తుంది. నన్ను నమ్మండి. ఈ పవిత్రమయిన ద్వారకామాయిలో నేనెప్పుడూ అబథ్థం చెప్పను" అన్నారు. ఆ విథంగా బాబా మా తాతగారిని "మ్హతారయా" అనీ మా నాన్నగారిని "భావూ" అని సంబోథించి, తరువాత జరిగే అన్ని సంభాషణలలో కూడా అదే విథంగా కొనసాగిస్తూ ఉండేవారు.




(తరువాయి భాగంలో బాబాగారి శాండల్ వుడ్ మందిరం)


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Thursday, July 28, 2011

శ్రీ సాయితో మొదటి కలయిక

0 comments Posted by tyagaraju on 8:27 PM



29.07.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు తార్ఖడ్ కుటుంబమువారి బాబా స్వీయానుభూతులలో మొదటిసాయి బాబా తో పరిచయం గురించి తెలుసుకుందాము.



శ్రీ సాయితో మొదటి కలయిక (పరిచయం)





ఓం శ్రీ సాయి నాథాయనమహ

ఈ సంఘటన ఒక వేసవికాలపు రోజున జరిగింది. జ్యోతీంద్ర అప్పుడే మెట్రో సినిమా దగ్గరున్న యిరానీ రెస్టారెంట్ లో ఫలహారం చేసి, తను చదివే సెంట్.గ్జేవియర్ స్కూలుకి వెడుతున్నాడు. స్కూలు విరామ సమయం లో యిరానీ రెస్టారెంట్ కి వెళ్ళి ఫలహారం చేయడం అతనికి ప్రతీరొజూ జరిగే కార్యకరమం. ఆ రోజు అతను రోడ్డు దాటుతున్నప్పుడు తెల్లని దుస్తులలో ఉన్న ఒక ఫకీరు అతన్ని పిలిచి ధర్మం అడిగాడు. జ్యోతిరాజా ఒక పైసనాణెం (రాగి నాణెం మథ్యలో కన్నం ఉండేది, దీనినే చిల్లు కాణీ అనేవారు) జేబులోంచి తీసి దానిని ఆ ఫకీరుకిచ్చి స్కూలుకు వెడుతున్నాడు. కాని ఆ ఫకీరు అతన్ని ఆపి, అది ఒక పైసానాణెం 1894 సంవత్సరంలోనిది అని జ్యోతీంద్రతో అన్నాడు.

ఆ రోజులలో ప్రజలు ఒక పైసాను థర్మంగా యిస్తూ ఉండేవారు. ఆ విథంగా ఒక పైసా ఒక విద్యార్థినుంచి ధర్మంగా ఇవ్వబడటం చాలా పెద్ద మొత్తం. జ్యోతీంద్ర, ఫకీరుతో, తనకి ప్రతీరోజూ మథ్యాన్న పలహారం నిమిత్తం నాలుగు అణాలు ఇవ్వబడతాయని, అందుచేత ఒక పైసా థర్మంగా ఇవ్వగలనని చెప్పాడు. అంతే కాకుండా ఈ ఒక పైసా ఇంకా చలామణిలోనే ఉంది కాబట్టి ఫకీరుకు దాని గురించి బెంగ అక్కరలేదని చెప్పాడు. అప్పుడా ఫకీరు "అల్లా భలా కరేగా" అన్నాడు. అప్పుడు జ్యోతీంద్ర స్కూలికి వెళ్ళిపోయాడు. యిక ఈ విషయం గురించి మరచిపోయాడు.


జ్యోతీంద్ర గారికి యిద్దరు అన్నయ్యలు. సత్యేంద్ర, రవీంద్ర. వీరు మెడికల్ కళాశాలలో చదువుతూ ఉండేవారు. సత్యేంద్ర గారు యింకా జీ.జీ.ఎం.సీ. (గ్రాడుయేట్ మెడికల్ కాలేజ్ - యిదే తరువాత ఎం.బీ.బీ.ఎస్. గా రూపాంతరం చెందింది) డిగ్రీ సాథించారు. ఆయన రచయితకు మామయ్య, ఈయన మాతుంగాలోని కొంకన్ నగర్ లో ఉండేవారు. (యిప్పుడాయన లేరు. ఆయన కొడుకు, కూతురు అక్కడ ఉంటున్నారు.) జ్యోతీంద్ర గారి సోదరుడు డాక్టరు, ఆయన మామయ్య డాక్టరు ఆయన తాతగారు ప్రముఖ మెడికల్ ప్రాక్టీషనరే కాకుండా బొంబాయి వైస్రాయిగారికి కుటుంబ వైద్యుడు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతీంద్రగారికి అది వైద్యుల కుటుంబం.)


కాని జ్యోతీంద్రగారి కుటుంబంలో యింతమంది వైద్యులు ఉన్నాగాని, జ్యోతీంద్ర గారి తల్లి అంటే రచయితగారి అమ్మమ్మగారికి మైగ్రైన్ తో విపరీతమయిన తలనొప్పితో బాథపడుతూ ఉండేది. అన్ని రకాల మందులను వాడి చూశారు, కాని అది యింక నివారణ కాదని తేలిపోయింది,


వారింటిలో వారితో కలిసి పని చేస్తూ ఒక పనిమనిషి ఉండేది. ఆమె, బాంద్రా మసీదు దగ్గిరున్న పీర్ అని పిలవబడే మౌలానా బాబా వద్దకు వెళ్ళమని సలహా యిచ్చింది. ఆయన కొన్ని ఆయుర్వేద మందులిస్తారని, నయమవని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పింది.


యిపుడు, ఆ రోజులలో ఒక హైందవ స్త్రీ మసీదుకు వెళ్ళి ఒక పీర్ను కలుసుకోవడమంటే చాలా కష్ట సాథ్యమయిన విషయం. మా అమ్మమ్మగారు తన కుమారుడు జ్యోతీంద్ర గారికి సలహా ఇచ్చింది. స్వభావ సిథ్థంగా చాలా థైర్యవంతుడయిన ఆయన ఒక బురఖా యేర్పాటు చేసి తన తల్లిని కారులో పీర్ మౌలానా బాబా వద్దకు తీసుకుని వెళ్ళాడు. కాని ఒక మానవ మాత్రుడు తీరని వ్యాథితో బాథ పడుతున్నప్పుడు మత కట్టుబాట్లను చేదించడం కష్టం కాదు. కాని మౌలానా బాబాని కలుసుకున్న తరువాత వారి కష్టాలు నెమ్మదించడానికి బదులు యెక్కువయాయి. మౌలానా బాబా మా అమ్మమ్మతో ఆమె బాథ పడుతున్న వ్యాథిని నయం చేయడానికి తన వద్ద మందు లేదని చెప్పాడు. కాని ఆమెతో "షిరిడీలో నా సోదరుడు సాయిబాబా అనే ఆయన ఉన్నాడు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన మీకు నయం చేసి మీ బాథలన్నిటినీ పోగొడతాడు" అని చెప్పాడు.


యిప్పుడు వారిద్దరూ పెద్ద కష్టంలో పడ్డారు. మొదటగా మా తాతగారు ప్రార్థనా సమాజ్ వాది. యెక్కువ అహంకారి. ఆయన అటువంటి బాబాలని కలుసుకోవడానికి అనుమతివ్వరని వారికి తెలుసు. యిక రెండవది, షిరిడీ యెక్కడ ఉంది, అక్కడకు యెలా వెళ్ళాలన్నదే పెద్ద ప్రశ్న.


యేమయినప్పటికీ జ్యోతీంద్ర వెనుకాడలేదు. ప్రియ పాఠకులారా ! యిక్కడ నేను నమ్మేదేమిటంటే వారు శ్రీ సాయిబాబాను కలుసుకోవాలని ముందే వారి భవితవ్యం వ్రాసి ఉండబడి ఉంటుంది. అందుచేత యెవరూ కూడా వారిని ఆపలేరు.


ఆయన మెట్రొ థియేటర్ వద్ద నున్న యిరానీ రెస్టారెంట్ యజమానినించి సమాచారాన్నంతా సేకరించారు.

షిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలో ఉందని, అక్కడికి వెళ్ళాలంటే యెవరైనా రైలులో మన్మాడ్ మీదుగా కోపర్గావ్ వెళ్ళాలని తెలుసుకున్నారు. కోపర్గావ్ నుంచి, 9 కి.మీ. దూరంలో ఉన్న షిరిడీకి గుఱ్ఱపు బండిలో వెళ్ళాలి. దీనర్థం యేమిటంటే యింటినుంచి బయలుదేరితే కనీసం 3 రోజులు యింటికి దూరంగా ఉండాలి. యేమయినప్పటికీ జ్యోతీంద్ర వాళ్ళ నాన్నగారి అనుమతి సంపాదించి ప్రయాణానికి అన్ని యేర్పాట్లు చేశారు. ఒక శుక్రవారం సాయంత్రం తల్లి, కొడుకులిద్దరూ షిరిడీకి బయలుదేరారు. శనివారం ఉదయానికి వారు షిరిడీలో ఉన్నారు. వారు అంతా విచారించి, తరువాత స్నానాదికాలు అన్నీ కానిచ్చి శ్రీ సాయిని కలుసుకోవడానికి ద్వారకామాయికి చేరుకున్నారు. వారు, సాయిబాబా పవిత్రమైన థుని ముందు కూర్చుని ఉండటం చూశారు. (బాబా వెలిగించిన అగ్ని). మా అమ్మమ్మగారు బాబా ముందు వంగి ఆయన పాదాలను స్పుశించారు..






వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారిద్దరిమథ్య యేమి జరిగిందన్నది ఈ క్రింది విథంగా ఉంది.


బాబా మా అమ్మమ్మగారితో "అమ్మా ! నువ్వు వచ్చావు. బాంద్రా నించి నా సోదరుడు నిన్ను నావద్దకు పంపించాడు. దయచేసి కూర్చో. అమ్మా, నీకు చాలా విపరీతమయిన తలనొప్పి ఉంది అవునా?" అప్పుడు సాయిబాబా తన అయిదు వేళ్ళను ఊదీ ఉన్న పళ్ళెంలో ముంచారు. (పవైత్రమైన భస్మం) ఊదీతో నిండి ఉన్న ఆ చేతితో మా అమ్మమ్మగారి నుదిటిమీద కొట్టారు. ఆయన, నుదిటిని అయిదు వేళ్ళతో గట్టిగా పట్టుకుని అన్నారు "అమ్మా, యిప్పటినుంచి నీవు చనిపోయేవరకు నీ తలకు యిక యెటువంటి నొప్పిరాదు. ఈ తలనొప్పి పూర్తిగా నివారణయింది"

ప్రియ పాఠకులారా, సాయి చేసిన ఈ చర్యకి మా అమ్మమ్మగారు ఆశ్చర్య చకితులయారు. ఆమె తన బాథ గురించి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. బాబాగారికి తమ రాక గురించి, ఆమె బాథ గురించి యెలా తెలుసు? నేననుకునేదేమిటంటే బాబాగారు చేసిన ఈ రెండు చర్యలవల్ల మా అమ్మమ్మగారిని గురించిన విషయం తెలిసింది. ఒకటి వారిద్దరిమథ్య జరిగిన చూపులు, అనగా దృష్టి కలయిక, మరియు ఊదీ నిండిన చేతితో నుదిటిమీద కొట్టడం. మా అమ్మమ్మగారికి యెప్పుడు అటువంటి శక్తివంతమైన మోతాదులో మందు యివ్వబడలేదు. యేమి జరిగిందన్నది , ఆమెకు అనుభవమైనదల్లా తనకు బాగయినట్టు. తలనొప్పి వల్ల వచ్చిన ఆమె వదనంలోని విచారం మటుమాయమయిపోయింది. ఆమె యిపుడు కొత్తగా కనపడుతోంది. ఆమె మా నాన్నగారు జ్యోతీంద్ర గారితో బాబాకు నమస్కరించమని చెప్పింది. యిదంతా చూసి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి యింతకు ముందు యెపుడు అలా ఆజ్ఞాపించలేదు. అపుడు మానాన్నగారు బాబా ముందుకు వంది ఆయన పాదాలను సృశించారు. వెంటనే బాబా ఆయనతో "ప్రియమైన భావూ (సోదరా), నువ్వు నన్ను గుర్తించలేదా?" మా నాన్నగారు లేదన్నట్లుగా జవాబిచ్చారు. అపుడు బాబా ఆయనతో "నా వైపు చూడు, బాగా గుర్తుకు తెచ్చుకో, మరలా జ్ఞప్తికి తెచ్చుకోవటానికి ప్రయత్నించు" అన్నారు. మా నాన్నగారికి యేమీ గుర్తుకు రాలేదు. అపుడు బాబా తన కఫ్నీ జేబులో చేయి పెట్టి ఒక పైసా రాగి నాణెం తీశారు. ఆయన దానినే మా నాన్నగారికి చూపించారు. "ఏయ్ భావూ ! 1894 సం. సంబంథించిన ఈ రాగినాణెం గుర్తుందా? నువ్వు స్కూలికి వెళ్ళేటపుడు ఒక ఫకీరుకు థర్మంగా ఇచ్చావు."


యిపుడు మా నాన్నగారు ఈ అథ్యాయం మొదటలో వివరించిన సంఘటనని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఆయన నేత్రాలు కన్నిళ్ళతో నిండిపోయాయి. ఆయన వెంటనె తన చేతులతో బాబాగారి కాళ్ళు పట్టుకున్నారు. బాబా ఆయనని లేవనెత్తి అన్నారు, "ఏయ్ భావూ, ఆ రోజు మథ్యాన్నం నువ్వు కలుసుకున్న ఫకీరు నేను తప్ప మరెవరూ కాదు, నివ్విచ్చిన ఈ పైసాని నీకు తిరిగి యిస్తున్నాను. దీన్ని తీసుకుని జాగ్రత్తగా భద్రపచుకో. అది నీకు యెన్నో పైసలని పెడుతుంది."


చదువుతున్న ప్రియమైన భక్తులారా, మా అమ్మమ్మగారికి, నాన్నగారికి ఆనందదాయకమైన సాయి దర్శనం జరిగిందని యిపుడు మీరు నాతో తప్పకుండా ఒప్పుకుంటారు. వారిద్దరికీ అది మరపురానిది. అప్పటినుంచీ వారు తమకు తెలియకుండానే యెప్పటికీ సాయివైపు ఆకర్షితులయ్యారు.సాయితో ఈ మొట్టమొదటి పరిచయం తరువాత తార్ఖడ్ కుటుంబం సాయిబాబాని తమ గురువుగా యెంచుకున్నారు. వారు పూర్తిగా సాయి భక్తికి అంకితమయి పోయారు. మా అమ్మమ్మగారి తలనొప్పి శాశ్వతంగా నివారింపబడింది. భగవంతుని యందు ఆమె భక్తి రెట్టింపయింది. మా యింటిలో ఆ పైసా నాణెం పూజకోసం ఉంచబడింది.


సాయిబాబాని కలుసుకున్న తరువాత యేంజరిగిందని మేము మా నాన్నగారిని అడుగుతూ ఉండేవారం. బాబాగారి కళ్ళల్లో కరుణారసమైన చూపులు యెంతో ఆకర్షింపబడేటట్లుగా ఉండి, ఆయన వైపుకు లాగుతూంటాయని ఆయన శక్తివంతమైన చేతుల స్పర్శ యెటువంటి గాయాన్నయినా మాన్ పగలదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సాయి బాబా యెప్పుడు తాను భగవంతుడినని చెప్పుకోలేదని మీకు తెలుసు. ఆయన తానెప్పుడు దేవుడి దూతనని చెబుతూ ఉండేవారు. యేమయినప్పటికీ మా నాన్నగారు ఖండోబా ఆలయ పూజారి (తరువాత గొప్ప సాయి భక్తుడిగా మారారు) మహల్సాపతి భగత్ మొట్టమొదటిసారిగా చూసినప్పుడే "రండి సాయీ రండి" అని సరిగా నామకరణం చేశారని చెబుతూ ఉండేవారు.



మన భారతదేశం యెంతోమంది ఆథ్యాత్మిక బాబాలకు నిలయం. వారి భక్తులు వారికి తగినట్లుగా పిలుస్తూ ఉంటారు. సాయి అన్న పేరు అన్నిటినీ తెలుపుతుందని సూచిస్తుందని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆయన వివరించినదాని ప్రకారం మరాఠీలో సాయి అనేమాటకి అర్థం "సాక్షాత్" (సత్యమైన) అనగా ఈశ్వర్ (భగవంతుడు). అలా ఆయన దృష్టిలో సాయిబాబా అంటే సాక్షాత్ ఈశ్వర్ బాబా. నేనిక్కడ తప్పక చెప్పవలసినదేమిటంటే మా నాన్నగారు షిరిడీ దర్శించినప్పుడు అనుభవించినది చాలా అద్భుతం. ఒక సామాన్యమైన మానవుడు అటువంటి దివ్యానుభూతిని పొందినప్పుడు సాయిబాబాకి దేవతా సంబంథమయిన దైవిక శక్తులు ఉన్నాయనే ఒక నిర్ణయానికి వస్తాడు. అటువంటి అనుగ్రహాన్ని పొందిన కుటుంబంలో జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతుడినని నాకు నేను భావించుకుంటున్నాను. సాయిగారి అనుగ్రహం మనందరి మీద యెల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.

ఓం శ్రీ సాయినాథాయనమహ.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Wednesday, July 27, 2011

బాబావారితో తార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు

0 comments Posted by tyagaraju on 9:50 PM


28.07.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

బాబావారితో తార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు


ఈ రోజున ఒక అద్భుతమైన సాయి లీలలతో 17 అథ్యాయాలు మీకు అందించడానికి బాబా వారు అనుగ్రహించినందుకు బాబా వారికి థన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం బాబా లీలలను చదవడం యెంతో ఆనందాన్నిస్తుంది. కాని బాబాతో ఉండి ఆయన లీలలను స్వయంగా అనుభవించినవారు తమ అనుభూతులను చెప్పినప్పుడు మనకి యింకా ఆనందం కలుగుతుంది. అటువంటి అనుభూతులను తార్ఖడ్ కుటుంబమువారు అనుభవించిన అనుభూతులను తమ తండ్రిగారు చెప్పగా శ్రీ వీరేంద్ర తార్ఖడ్ గారు మన సాయి భక్తులందరికీ అందించారు. వాటి యొక్క అనువాదాన్ని ఈ రోజునుంచీ మీకు అందిస్తున్నాను.

ఈ లీలల ఆంగ్ల పీ.డీ.ఎఫ్. పైల్ ని శ్రీమతి సుప్రజ, అమెరికానించి పంపించారు. నాకీ అవకాశం బాబావారు ఆమె ద్వారా నాకందించినందుకు వారికి నా థన్యవాదాలు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

ముందు మాట

ముంబాయి సాంతాక్రజ్ శ్రీ జ్యోతీంద్ర రామ చంద్ర తార్ఖడ్, షిరిడీ సాయి బాబా వారి యొక్క తమ ప్రత్యక్ష అనుభవాలని చక్కగా చెప్పారు. నిజానికి సాయిబాబా చెప్పిన బొథనలని తమ వివరణ ద్వారా యెంతో విశిష్టంగా మన ముందుకు తెస్తున్నారు. (మనముందుంచుతున్నారు)

రచయిత, పబ్లిషర్ (ప్రచురణకర్త) అయిన శ్రీ వీరెంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ శాంతాక్రజ్ ముంబాయిలో నివసిస్తున్న విశ్రాంత యింజనీర్ గారు. సాయి భక్తులందరికీ వీరి గురించి తెలుసు. రచయిత వ్రాసిన 17 అథ్యాయాలలో 16 అథ్యాయాలు వారి తండ్రిగారి స్వీయానుభవాలు. తనకు బాగా గుర్తున్నంతవరకు రాసిన ఈ విషయాలని పాఠకులు, స్వర్గీయ శ్రీ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు వ్రాసిన సచ్చరిత్రతో పోల్చి సరి చూసుకోవచ్చు.
శ్రీ వీరేంద్ర తార్ఖడ్ గారు తమ తండ్రిగారి స్వీయానుభవాలని సాయి భక్త పాఠకులందరికీ అందించారు, నేను వారిని వాటియొక్క రుచిని, సారాన్ని, ఆస్వాదించమని కోరుతున్నాను.

లార్డ్ బాబా వారి సాహచర్యంతో జ్యోతీంద్రగారు, అనుభవించిన సంఘటనలు, రచయిత తనకు గుర్తున్నంత వరకు ప్రచురించినవి. నిజాలకు చాలా దగ్గరగా ఉండి బాబా వారియొక్క శౌర్యాన్ని చాలా చక్కాగా చెప్పబడ్డాయి. రచయిత ఒక అద్వితీయమైన రీతిలో లార్డ్ సాయితో తన తండ్రిగారి చాలా దగ్గరి అనుబంథాన్ని వర్ణించి చెపుతున్నారు. నేను ఖచ్చితంగా చేప్పేదేమిటంటే యిది చాలా ప్రశంసించదగ్గది. నేననుకునేదేమిటంటే వివరణలన్నీ యేమి చెపుతున్నాయంటే, భక్తులు షిరిడీని దర్శించినప్పుదు, సమాథిమందిరాన్ని,ఖండోబా మందిరాన్ని తప్పక దర్శించాలి. బాబా చెప్పిన సూత్రాలు శ్రథ్థ, సబూరీ (నమ్మకము, ఓర్పు) వారి జీవితం సాఫీగా సాగాలంటే వీటిని ఆచరించాలి.

నేను చెప్పదలచుకున్నదేమంటే, సాయిబాబాకు అత్యంత భక్తులలఓ ఒకరైన మా తాతగరైనటువంటి శ్రీ మహల్సాపతి చిమనాజీ నగారే (భగత) ప్రత్యక్షంగా చూసిన దాని ప్రకారం, శ్రీ బాబా సాహెబ్ తార్ఖడ్ గారు తమ జీవితాన్ని చాలా సౌకర్యవంతంగా గడపగలిగారు. ఈ పుస్తకం చదివితే, సాయి భక్తులైన పాఠకులకి కొంత మార్గదర్శకం, మరియు ఆత్మ తృప్తి యిస్తుందని నాకు నిశ్చయంగా తెలుసు. ఈ ముందు మాట రాస్తున్నపుడు నేననుభవించినది, ఈ పుస్తకం మరొకసారి మనలని సాయి బాబాకుదగ్గరగా తీసుకుని వెడుతుంది. మహల్సాపతి మనవడినైన నేను, ఈ ముందు మాట రాసినందుకు నా గౌరవంగా భావిస్తున్నాను. నిజానికి, యిది మా కుటుంబానికి నిజమైన గౌరవమని నేను అనుకుంటున్నాను.

రామచంద్ర అత్మారాం తార్ఖడ్ అనవడే బాబా సాహెబ్ తార్ఖడ్, షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థాన్ యేర్పడడానికి శ్రీ దాసగణూ మహరాజ్ తో కలిసి గొప్ప సాయం చేశారు. సంస్థానానికి మొట్టమొదటి కోశాథికారి. ఆయన యింకా సాయిలీల పత్రిక ప్రచురణకు పూనుకొని , మొట్టమొదటి సంచికకు ముందుమాట వ్రాసి, ఆ విథంగా చరిత్రను సృష్టించారు.

నేను సాయి భక్తులందరికి చెప్పదలచుకున్నది, స్వర్గీయ శ్రీ అన్న సాహెబ్ ధబోల్కర్ గారు వ్రాసిన సాయి సచ్చరిత్ర 9 వ అథ్యాయంలో లార్డ్ సాయి మీద తార్ఖడ్ కుటుంబానికి ఉన్నటువంటి స్వచ్చమైన భక్తిని తెలియ చేస్తుంది.

ఆఖరుగా ముందు మాటని యిలా చెపుతూ ముగించదలచుకున్నాను. "అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాథిరాజ యోగిరాజ ప్రబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై"

రాబోయే కాలాల్లో శ్రీ సాయిబాబా వారి ఈ వృత్తాంత్తాంతాలన్నీ కూడా అసంఖ్యాకమైన సాయి భక్తులందరూ బాగా గుర్థుంచుకోవాలని సవినమ్యంగా నేను కోరుకుంటున్నాను.

ఖండోబా మందిరం ముందు "సాయీ రండి" అని శ్రీ సాయిబాబాని ఆహ్వానించిన మా తాతగారయిన శ్రీ మహల్సాపతి గారి జ్ఞాపకార్థం ఈ ముందు మాటని అందితమిస్తున్నాను.

యిప్పుడు నేను ఈ ముందు మాటనిశ్రీ వీరేంద్రజోతీంద్ర తార్ఖడ్ గారికి ప్రచురణ నిమిత్తం అందిస్తున్నాను.

(సం.) మనోహర్ మార్తాండ నగారే.



పరిచయం

ప్రియ పాఠకులారా, నేను ఈ ప్రత్యక్ష అనుభవాలని రాసేముందు ఇవి నా స్వంత అనుభవాలు కావన్నఒకే ఒక్క కారణంతో మిమ్ములని క్షమాపణ వేడుకుంటున్నాను. కాని అవన్నీ కూడా మా తండ్రిగారయిన శ్రీ జ్యోతీంద్ర రామచంద్రతార్ఖడ్ గారు తాము జీవించిఉన్నపుడు మాటి మాటికి చెప్పినవె.

నా చిన్నతనంలో ఆయన చెబుతూండగా నేను వింటున్నప్పుడు నా కవి అద్భుతమైన కథలలాగా అనిపించేవి. నేను పెద్దవాడినవుతూండగా శ్రీషిరిడీ సాయి బాబా గానిమానవాతీత శక్తుల గురించి అర్థం కాసాగింది. మా నాన్నగారు, సామాన్య మానవుడు పొందడానికి కష్టసాథ్యమైనటువంటి అమూల్యమైన అనుభవాలని , ఒక విథమైన ఆథ్యాత్మిక అనుభూతిని సాయిబాబా వారి సాన్నిహిత్యంలో తన 10 సంవత్సరాల జీవిత కాలంలో అనుభవించారు.

నేనెప్పుడు అనుకునేదేమిటంటే ఈ బహూకరింపబడిన అనుభవాలని మీకు తెలియ చెప్పాలని, కాని మన రోజువారి కార్య క్రమాలలో అటువంటి ఆథ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం మనకి కష్ట సాథ్యం.

యిప్పటికి నేను చాలా సార్లు సాయి బాబా వారి కర్మ భూమి యైన షిరిడీని చాలా సార్లు దర్శించాను. ఈ దర్శనాల్లో నేను చాలా మంది సాయిభక్తులని కలుసుకున్నాను. ఈ కలుసుకోవడాలలో, సామాన్యంగా ఒక ప్రశ్న వచ్చేది, నేను కూడా సాయి భక్తుడినేనా అని.

నేనలా చెప్ప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది, యెందుకంటే మా నాన్నగారు చేసే సాయి పూజ పథ్థతి వల్ల. నేను అటువంటి ఆథ్యాత్మిక విథికి దగ్గరగా లేను. యింకా సాయి భక్తులకి శ్రీ సాయిబాబాతో నాకు అద్వితీయమైన అనుబంథం ఉండేదని చెపుతూ ఉండేవాడిని. యెందుకంటే మా నాన్నగారు జీవించి ఉన్నపుడు ఆయనతో సాన్నిహిత్యం. షిరిడీలో చాలా చురుకుగా ఉండేవారు. ఆ ముఖ్యమైన కారణం వల్లే నేను షిరిడీ దర్శించాను. మా తర్ఖడ్ కుటుంబంలో అటువంటి సాన్నిహిత్యానికి ప్రథాన కారణమైన ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు.

మా అమ్మమ్మగారు ( మా నాన్నగారి తల్లి), మా తాతగారు, శ్రీ రామచంద్ర ఆత్మారాం తార్ఖర్, మరియు మా నాన్నగారు శ్రి జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్. ఈ ముగ్గురికీ కూడా శ్రీ సాయిబాబాతో 1908 నుంచి 1918 వరకూ అంటే ఆయన మహాసమాథి చెందే వరకు అనుబంధం ఉంది. ఈ అనుబందం ఫలితంగా, ఆ తరువాత మాకుటుంబంలోని వారందరికీ సాయి బాబా భగవంతుడయారు. సాయి భక్తుడు, మా నాన్నగారు అనుభవించిన దివ్యానుభూతిని వర్ణించి చెప్పమని నన్ను కోరేవాడు. అప్పుడు నేను (బలవంతాన) అందుకు బథ్థుడనై నా మదిలోకి అప్పటికప్పుడు యేది వస్తే అది చెప్పేవాడిని. యిది షిరిడీలోని లెండీ బాగ్ లో జరుగుతూ ఉండేది. ముఖ్యంగా ఆ అనుభవాన్ని విన్న తరువాత ఆ భక్తుడు నా ముందుకు వంగి నా పాదాలని స్పృశించేవాడు. నా కప్పుడు నేను యేమీ చాతకాని వాడిని అని అనిపిస్తూ ఉండేది. ఒకసారి పూనాలోని సాయి బృదం వచ్చినన్ను పూనా వచ్చి సాయి అనుయాయీలందరికి ఆ అనుభవాలన్నిటినీ వివరించి చెప్పమని నన్ను కోరడం జరిగింది. నేనందుకు ఒప్పుకుని నేను నా భార్యా పిల్లలతో పూనా వెళ్ళాను. ఆ కార్యక్రమం రెండు గంటల పాటు జరిగింది. నేను చెప్పడం పుర్తి అయ్యాక నాకు నమస్కారం చేయడానికి నా ముందు పెద్ద లైను ఉంది. నేను గృహస్తుడిని కాబట్టి ఆ అనుభవాలన్నీ మా నాన్నగారివనే సామాన్య కారణంతో నేనిటువంటి వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. యింకా నేను చెప్పేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. యిదే సమయంలో నేను ఉద్యోగ విరమణ చేసిన తరువాత, మా తార్ఖడ్ కుటుంబసభ్యుల అనుభవాలను వ్రాయడానికి చాలా సమయం ఉంటుందని, దానిని ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాను.

షిరిడీ సాయిబాబా మీద నాకున్న ప్రేమను, భక్తిని, తెలియచేయడానికనుకోండి. 2003, జూన్ 18 న నాకు 60 సంవత్సరములు నిండాయి. మరియు ఈ రోజు ఆగష్టు 15, 2003 అనగా మనప్రియమైన భారత దేశ 57 స్వాతంత్ర్య దినమునాడు నేను ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించాను.
ప్రియమైన సాయి భక్త పాఠకుడా నేను, శాశ్వతమైన సాయి సచ్చరిత్ర వ్రాసిన కీర్తిశేషులు అన్నా సాహెబ్ థబోల్కర్ గారి లాగ గౌరవనీయులైన హేమాడ్ పంత్ నూ కాదని చెప్పదలచుకున్నాను.

షిరిడీ సాయిబాబా గారి జీవితమంతా తెలియచెప్పేటటువంటి 54 అథ్యాయాలు కల ఈ పవిత్రమైన పుస్తకాన్ని నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. ఈ పవిత్రమయిన గ్రంథంలో షిరిడీ లో మా నాన్నగారు ఉన్నప్పటి సంఘటనలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు చూచి, నాకు చెప్పినవాటిని మీకు నేను సవినయంగా వివరిస్తున్నాను.

ప్రియ పాఠకులారా దయ చేసి నన్ను మన్నించండి. యెందుకనగా ఆ సంఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు గాని, సమయం గాని తెలియచేప్పే స్థితిలో లేను కాని, 1908 నుంచి 1918 వరకూ మా నాన్నగారు షిరిడి 17 సార్లు దర్శించారు. ఒకసారి షిరిడీ వెడితే అక్కడ 8 రోజులనుంచి ఒక నెల వరకు ఉండేవారు. ఈ 17 సార్లు వెళ్ళే క్రమంలో, నన్ను నమ్మండి మా నాన్నగారికి మొట్టమొదటి శ్రీ షిరిడీ బాబా వారి యొక్క దివ్యమైన అనుభూతి కలిగింది. నిజం చెప్పాలంటే అవి అతీంద్రియము. నిజానికి, ఆయన సెంట్ గ్జేవీయర్ స్కూల్ లో విద్యార్థి గా ఉన్నప్పుడే రాసి ఉండవలసినది అనుకున్నాను. నేను ఈ రాస్తున్నదానికి కారణం, శ్రీ సాయిబాబా మీద మనకున్న గాఢమైన, మనహ్ పూర్వకమైన శ్రథ్థ (నమ్మకం). స్వచ్చంగా తెలియచేప్పటానికి అది నాకు అపరిమితమైన మనశ్శాంతినిస్తుంది.

ప్రియమైన సాయి భక్త పాఠకుడా, ఈ పుస్తకం చదివిన తరువాత నాకు కూడా కొన్ని దివ్య్యానుభూతులు కలిగి ఉండచ్చని మీరు అనుకోవచ్చు, కాని నేను సవినయంగా మనవి చేసేదేమిటంటే ఖచ్చితంగా మానాన్నగారు అనుభవించినలాంటివి మాత్రం కాదు. నేను గట్టిగా నమ్మేదేమిటంటే, ఆయన పూర్వ జన్మ సుకృతం వల్ల శ్రీ సాయిబాబా గారితో అనుబంధం యేర్పడింది. యింకా ఆయన అనుభవాలన్ని కూడా ఆయన వివాహనికి ముందువి అనగా ఆయన వయసు 14 నుంచి 25 సంవత్సరాల కాలంలో జరిగినవి. చాలా సార్లు నేను ఆశ్చర్య పోతూ ఉంటాను, అటువంటి దివ్యమైన అనుభూతులను పొందుతూ మా నాన్నగారు సంసార జీవితాన్ని యెందుకు కోరుకున్నట్లు. సరే, అప్పుడు నేను ఉండేవాడిని కాదు, ఈ పుస్తకం కూడా, వెలుగు చూసి ఉండేది కాదు.

యిపుడు క్లుప్తంగా తార్ఖడ్ కుటుంబం గురించి పరిచయం.

మా నివాస ప్రాంతం వాసీ ఫోర్ట్ (ఫోర్ట్ ఆఫ్ బాసీన్) దగ్గరున్న తార్ఖడ్ గ్రామం. అంధుచేత మా యింటి పేరు తార్ఖడ్ కర్. చరిత్ర ప్రకారం మా పూర్వీకులు, గొప్ప మరాఠీ యోథుడైన చిమాజీ అప్పాగారితో బాసిన్ కోట యుథ్థంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. పోర్చుగీస్ వారు ఓడిపోయారు.

వారి ధైర్యానికి గుర్తుగా చిమాజీ అప్పాగారు తార్ఖడ్ గ్రామాన్ని జాగీరుగా యిచ్చారు. తరువాత బ్రిటీష్ వారు మరాఠాలనుంచి కోటని వశం చేసుకున్నారు. మా ముత్తాత గారయిన పాండురంగ తార్ఖడ్ గారు ముంబాయికి మకాం మార్చారు. ఆయన విల్సన్ కాలేజ్ దగ్గిర చర్నీ రోడ్ చౌపతీలో బంగళా కట్టుకున్నారు. పాండురంగ గారికి యిద్దరు కొడుకులు, దబోబా, మరియు ఆత్మారాం. వీరిలో దబోబా గారు ప్రముఖ వ్యాకరణకారుడు. మరాఠీ మాట్లాడేవారికి వ్యాకరణ పుస్తకాలు చక్కగా తప్పులు లేకుండా ఆంగ్ల భాషని రాయడం, మాట్లాడే, మరాఠీ వారికి వ్యాకరణ పుస్తకాలు రాసేవారు. రెండవ కొడుకయిన ఆత్మారాం వృత్తిరీత్యా వైద్యుడు. యింతకుముందు పని చేసిన ముంబాయి వైస్రాయి గారికి కుటుంబ వైద్యుడు.

మా తాతగారయిన రామ చంద్ర ఆత్మారాం గారు కాటన్ టెక్స్ టైల్ లో స్పెషలిస్ట్, యింకా ఖటావూ గ్రూప్ ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీ. ఆయన బాంద్రాలో తన నివాసాన్ని యేర్పాటు చేసుకున్నారు. తరువాత ఆయనకి శ్రీ షిరిడీ సాయి బాబాతో పరిచయం యేర్పడింది. షిరిడీ సాయి సంస్థాన్ యేర్పాటు చేసిన వారిలో ఆయన ఒకరు. దానికి మొట్టమొదటి కోశాథికారి కూడా. ముంబాయి, మహారాష్ట్ర ప్రజలకి బాబా సందేశాలనందిస్తున్న దాసగణు మహారాజ్ కి తనకు సాథ్యమయినంతలో సహాయం చేస్తూ ఉండేవారు.
మీరు షిరిడీని దర్శించినప్పుడు సమాథి మందిరంలో, ఆ కాలంలో ఉన్నటువంటి భక్తుల ఫోటోలను చూడవచ్చు.

స్వర్గీయ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు వ్రాసిన సాయి సచ్చరిత్రలో ఆయన కాలంలో షిరిడీలో బాబా గారి సమగ్ర సమాచారం లభిస్తుంది.

సాయి సచ్చరిత్రలోని 9 వ అథ్యాయం సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబానికి సంబంధించిన అనుభవాలని తెలియ చేస్తుంది. అందులో చెప్పిన తార్ఖడ్ స్త్రీ మా అమ్మమ్మగారు, ఆమె కుమారుడు మా నాన్నాగారయిన శ్రీ జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్ గారు. ఈ పుస్తకంలో యిపుడు నేను చెప్పబోయే స్వీయానుభవాలు యెక్కువగా మా నాన్నగారు జ్యోతీంద్ర గారివి. ఆయ్న 15 జూన్ 1895 లో జన్మించారు, 16 ఆగష్టు, 1965 లో మరణించారు. ఈ సందర్భంలో క్లుప్తంగా రచయిత గురించి పరిచయం యివ్వతగినది.

నా పేరు వీరేంద్ర జ్యోతిరాజా తార్ఖడ్. జ్యోతీంద్ర గారి రెండవ కుమారుడిని. (మొదటి కొడుకు రవీంద్ర మరణించాడు). వృత్తిరీత్యా నేను యింజనీరుని. నేను రెండు కంపెనీలలో, క్రాంప్టన్గ్రీవ్స్ కం పెనీ లి. లోనూ, సీమెన్స్ యిండియా లి.లోనూ మానేజర్ హోదాలో పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ చేసి శాంతా క్రజ్ లో ఉంటున్నాను.

ప్రియమైన సాయి భక్తులారా, ఈ పుస్తకం చదివిన తరువాత నాతో మాట్లాడాలంటే మాట్లాడాలంటే మాట్లాడవచ్చు కాని మనం ఒకరికొకరం లార్డ్ సాయి మీద మనకున్న భక్తిని తెలుపుకోవడానికి మాట్లాడుకోవాలి.


(సం.) వీ.జే. తార్ఖడ్.


(రేపు శ్రీ సాయితో మొదటి పరిచయం)


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు






Tuesday, July 26, 2011

భక్తుని పిలుపు విన్న బాబా

0 comments Posted by tyagaraju on 2:52 AM


26.07.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన ఒక బాబా లీలని తెలుసుకుందాము. ఇంది ఒక భక్తుని పిలుపుకు వెంటనె స్పందించిన బాబా అద్భుతమైన లీల. ఇందులో భర్తకి తన భార్యకు మరణమే శరణ్యం అని బాబాని వేడుకున్న పరిస్థితిలో బాబా స్పందించి పక్షవాతాన్ని వెనువెంటనే తగ్గించిన లీల అద్వితీయం, అపూర్వం.



భక్తుని పిలుపు విన్న బాబా

కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య నా పెద్ద కుమారుని తో కొద్ది రోజులు వుండటానికి జనక్ పురి వెళ్ళింది. ఒక రోజు పొద్దున్నే వాడినుంచి అమ్మకి చాలా సీరియస్ గా ఉందని, డా.సుథీర్ వర్మతో వెంటనే రమ్మని ఫోన్ కాల్ వచ్చింది.

నేను, మా చిన్న అబ్బాయి, డా.సుథీర్ వర్మతో కలిసి జనక్ పురి వెళ్ళాము. డా.వర్మ పరీక్షించి నాభార్యకు పక్షవాతం వచ్చిందని, ఆమె కుడివైపు భాగమంతా చచ్చు పడిపోయిందని ఆమెకు మాట కూడా పడిపోతుందని చెప్పారు.

ఆమె ఇక జీవితాంతము అంగ వైకల్యంతో మంచినీళ్ళకి కూడా ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆథారపడుతూ ఉండాలిసిందేనని తలచుకునేటప్పటికి నేను షాక్ కి గురయ్యాను. ఇక నిరాశతో, అటువంటి పరిస్థితిలో ఆమె చనిపోవడమే మంచిదని, నేను బాబాని ప్రార్థించి మనవి చేసుకున్నాను. తను యెంతో అంకితభావంతోను, ప్రేమతోను, కుటుంబానికెంతో సేవ చేసిన తనని ఆ స్థితిలో నేను చూడలేననిపించింది.


తరువాత రాజా గార్డెన్ దగ్గిరున్న నర్సింగ్ హోం లో చేర్పించడానికి నేను అన్ని యేర్పాట్లు చేసి, ఆమెని తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు, మా అబ్బాయి నవ్వుతూ నన్ను పైకి రమ్మన్నాడు. వాడి నవ్వు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. కాని నేను నా భార్య బెడ్ వద్దకి వెళ్ళాక, ఇంకా ఆశ్చర్యం వేసింది. నా భార్య అసలు యేమీ జరగనట్టుగా చక్కగా ఆరోగ్యంగా లక్షణంగా ఉంది.

మేము టాక్సీ మాట్లాడుకుని నర్సింగ్ హోం దగ్గిరకి వెళ్ళేటప్పటికి డా.వర్మ గేట్ వద్ద చక్రాల కుర్చీతోను, ఆస్పత్రి స్టాఫ్ తోను నా భార్యని లోపలికి తీసుకునివెళ్ళడానికి సిథ్థంగా ఉన్నారు. యెటువంటి ఆథారం లేకుండా ఆవిడ టాక్సీ దిగేటప్పటికి " డా.వర్మ గారు "మిస్టర్.కపూర్, యేమిటి నేను చూస్తున్నది? అన్నారు. "డాక్టర్, మీకే బాగా తెలుసు, మెడికల్ సైన్స్ " నేను సమాథానమిచ్చాను.

డాక్టర్ : "కాదు, అది మెడికల్ సైన్స్ కాదు, మీ పిలుపు మీ గురు సాయికి చేరింది, ఆయన నయం చేశారు. అనుమానం లేదు సాయి మిమ్మలని అనుగ్రహించారు."

ఎస్.కే.కపూర్,
అంబికా విహార్, న్యూ ఢిల్లీ



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, July 25, 2011

నా జీవితంలో జరిగిన అద్భుతం

0 comments Posted by tyagaraju on 5:16 AM


25.07.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

నా జీవితంలో జరిగిన అద్భుతం


ఈ రోజు యూ .కే. నుంచి అజ్ఞాత భక్తురాలి బాబా అనుభూతిని తెలుసుకుందాము. నెల్లూరు నించి సుకన్య గారు సేకరించి పంపించారు.

నేను ఇప్పుడు నా అనుభవాన్ని చెపుతున్నాను. నా సోదరుడు సాయి సచ్చరిత్ర ను కొని యింటికి తీసుకువచ్చినప్పుడు 2006 సంవత్సరం నించి నేను సాయి భక్తురాలిగా ఉన్నాను. తను యెప్పుడూ దానిని చదువుతూ ఉండేవాడు. ఒక రోజు నేను నా సోదరుడిని అడిగాను, నువ్వు ఏం చదువుతున్నావు అని అప్పటినుంచి సాయి నన్ను తన భక్తురాలిగా చేసుకున్నారు. గతంలో నాకు చాలా అనుభవాలు జరిగాయి నేను మీకు వివరించవచ్చు అవన్నీ కూడా క్లిష్ట పరిస్థితులనుండి సాయి నాకు సహాయ పడి యెలా బయట పడవేశారన్నవే.

ఒకానొక సమయంలో నా తల్లితండ్రులు నా వల్ల బాథ పడ్డారు కాని సాయిమా ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితినుండి బయటపడి అంతా సుఖాంతమైంది.


క్రితం సంవత్సరం నాకు వివాహహమ యిన తరువాత .యూ.కే. వెళ్ళాను. అప్పటినించి, నేను నా భర్త, నేను పోస్ట్ గ్రాడ్యు ఏట్ ని కాబట్టి నా చదువుకు తగిన మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ నేనింకా చెప్పదలచుకునేదేమిటంటే ఇక్కడ ఈ కొత్త ప్రదేశంలో నేను అలవాటు పడటానికి నా భర్త నైతికంగా మంచి ప్రోత్సాహం ఇచ్చి పరిస్థితులన్నీ అడ్డదారిలో వెడుతున్నప్పుడు ఓర్పుతోను, నమ్మకంతోను జీవితంలో యెలా ఉండాలో చెప్పారు. (బాబా మంత్రం). ఇలా ఉండగా ప్రపంచంలో ఉన్న మంచి విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీ చేయాలన్న నా కల. నా ఉన్నత విద్య అయినప్పటినించీ నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను. కాని యే స్కాలర్షిప్ ప్రోగ్రాం కి గాని నేను యెన్నిక కాబడలేదు. అందుచేత నేను నా చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేస్తున్నాను, కాని నా కల అలాగే ఉండిపోయింది. నా భర్త నా కలను సార్థకంచేయడానికి తనశాయశక్తులా భారాన్ని తనమీద వేసుకున్నారు. అందుచేత యూ.కే. , యూరప్ లలో పూర్తి స్కాలర్ షిప్ తో పీ.హెచ్.డీ. కోసం చేసే ప్రయత్నాలు రెట్టింపు అయ్యాయి. కాని యెక్కడినించీ కూడా అనుకూలంగా రాలేదు, తిరస్కారాలే తప్ప. యిటువంటి సంఘర్షణలో, నేను సాయినాథుడికి దూరమయ్యానని నా అంతట నేను తెలుసుకుని, ఆయనని గుర్తు చేసుకోనందుకు పశ్చాత్తాప పడ్డాను. ఒకరోజు, మా యింటికి దగ్గరగా ఉన్న సాయి మందిరానికి వెళ్ళి బిగ్గరగా యేడిచాను. యిలా యెందుకు జరుగుతోంది అని ఆయనని అడిగాను, నా జీవితాన్ని స్థిరత్వాన్నించి అస్థిరంగా యెందుకు చేస్తున్నారని అడిగాను. ఆ సమయంలో గుడి పూజారి వచ్చి యేమిటి నాసమస్య అని అడిగారు. నాకు సరియైన ఉద్యోగం లేదని యిక్కడ ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఉద్యోగం తప్పనిసరి అని అందుచేత యిక్కడ యే ఉద్యోగం చేయడానికైనా సిథ్థమేనని చెప్పాను. యిలా ఉండగా నా భర్త నాకు యెప్పుడూ ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు, ఉద్యోగానికి అప్ప్లికేషన్స్, పీ.హెచ్.డీ. స్కాలర్షిప్ కి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గుడి పూజారిగారు నన్ను రోజు సచ్చరిత్రలోని ఒక పేజీ చదవమని చెప్పారు. నేను మాయింటిలో వేరే వాళ్ళతో కలసి ఉంటున్నామని అందుచేత చదవడానికి వాతావరణం అనుకూలంగా లేదని చెప్పాను. యిం టిలో ప్రశాంతమైన ప్రదేశం కూడా లేదని అందుచేత సాథ్యం కాదని చెప్పాను. అయితే గుడికి వచ్చి చదువుకోమని చెప్పారు. నేను అలాగే చేసాను,

మరుసటి వారం మొదటి లీల జరిగింది, నా భర్త వేరే ప్రత్యేకంగా ఉందామని అప్పుడు మనం ప్రశాంతంగా ఉండవచ్చని నిర్ణయించారు. ఖర్చులు పెరిగినా కూడా అది ఆయన కృత నిశ్చయం. మేము వేరే వెళ్ళిపోయి ఉండటం మొదలుపెట్టాము. సాయి నాకు చదువుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశాని యేర్పాటు చేశారు. ఆఖరికి నేను పారాయణ మొదలుపెట్టాను. యిటువంటప్పుడు నాకు ఇండియన్ బ్రిటిష్ కౌన్సిల్ నించి అతి ముఖ్యమైన స్కాలర్షిప్ కి ఫొన్ ఇంటర్వ్యూ వచ్చింది. నాకు సహాయం చేయమని బాబా ని అర్థించాను. మూడవ రోజున పారాయణ చేస్తున్నప్పుడు, నాకు టెలిఫోనిక్ యింటర్వ్యూ అయింది, ఆరవరోజున ఫలితాలు వచ్చాయి కాని స్కాలర్షిప్ పొందిన విద్యార్థులలో నా పేరు లేదు. నాకు మళ్ళీ నిరాశ వచ్చింది. ఇప్పుడే నాలో ఉన్న అంతర్ శతృవులు నాచేత ఆరవరోజున పారాయణను మానిపించాయి. నేనింకా పారాయణ కొనసాగిద్దామనుకున్నప్పటికి, యేది నన్ను ఆపుచేయించిందో తెలీదు. దాని తరువాత నాకు అపరాథం చేశాననే భావం కలిగింది. విడవకుండా నేను బాబాని నన్ను బాథిస్తున్న నాలో ఉన్న అంతర్ శతృవులని నాశనం చేయమని అడుగుతూ ఉండేదాన్ని. తరువాతి గురువారమునాడు మరలా పారాయణ చేయమని యేదో నన్ను ప్రేరేపించింది, కాని ఈసారి మాత్రం కేవలం సాయిమాకి క్షమాపణ తెలిపేందుకే. గురువారం సాయంత్రం నేను నా భర్తకి వివరించి చెప్పాను, వెంటనే ఆయన క్రితంసారికే పూర్తి చేయనందుకు మొదట మందలించారు, ఈ గురువారం సాయంత్రమే ప్రారంభించమని చెప్పారు. మరలా మొదలుపెట్టి సాయినాథ్ ని ప్రార్థిస్తూ ఉన్నాను. సాయినాథ్ కి క్షమాపణ చెప్పుకుంటూ నా లోపలి శతృవులని అదృశ్యం చేయమని అడిగాను.

సాయిబాబా ప్రశ్నలు జవాబులు వెబ్ సైట్ ని కూడా ఉపయోగిస్తూ అనుకూలమైన జవాబులను కూడా పొందుతున్నాను, ఆయనని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను యేది చేయమంటే అది నాకు చేతనయినంతగా చేస్తూ ఉన్నాను. సాయి నన్ను అన్నదానం చేయమన్నారు. కాని యిటువంటి దేశంలో నిజమైన అన్నార్తులు యెవరో తెలియదు. అంచేత, భారత దేశంలో ఉన్న మా అమ్మగారితో మాట్లాడి, నా తరఫున అక్కడ బీదలకి అన్నదానం చేయమని చెప్పాను. అప్పటినుంచీ ప్రతీ గురువారం అక్కడ అన్నదానం చేస్తున్నారు. ఆతరువాత పారాయణ అయిదవ రోజున జర్మనీ నించి పీ.హెచ్.డీ స్కాలర్షిప్ కి రెండు ఆహ్వాన పిలుపులు వచ్చాయి, రెండూ కూడా నాకు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నాను.

కాని విచిత్రం యేమిటంటే లార్డ్ సాయి నాకు పీ.హెచ్.డీ. మేము ఉంటున్న లండన్లోనే ఇప్పించారు. విశ్వవిద్యాలయం నాకు పూర్తి స్కాలర్షిప్ ఇచ్చింది, ప్రపంచంలో ఇలా పొందిన 15 మంది అభ్యర్థులలో నేను ఒకదాన్ని. ఈ వార్త నాకు పారాయణ ఆఖరి రోజున వచ్చింది. నేను వెంటనే నా భర్తకి ఫోన్ చేసి చెప్పాను, ఆయన సాయి మనకు ప్రతీదీ ఇచ్చారని అన్నారు. ఈ లీలకి నేను బాబా ఫోటొముందు యెంతో యేడిచాను.

నిజంగా బాబా నాకు సహాయం చేసి నామీద దయ చూపించారు. ఈ లీల ద్వారా నేను మిగతా సాయి భక్తులందరికీ చెప్పేదేమిటంటే నమ్మకం, ఓర్పుతో సదా ఆయనని యెల్లప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే సాయినాథ్ ఖచ్చితంగా ఆయన దయని చూపిస్తారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Sunday, July 24, 2011

మన మనసుని చదివే బాబా

0 comments Posted by tyagaraju on 1:35 AM


24.07.2011 ఆదివారము

మన మనసుని చదివే బాబా

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

రెండు రోజులుగా బాబా లీలను ఇవ్వలేకపోయాను. శుక్రవారము ప్రచురిద్దామని ఒక విషయం తయారుచేసాను గాని, కంప్యూటర్లో నాకు కొంత అవగాహన లేమి (అజ్ఞానం) వల్ల తయారు చేసినదంతా తొలగి పోయింది.

ఈ రోజు ఒక అద్భుతమైన బాబా లీలను మీముందు ఉంచుతున్నాను. బాబా వారు జీవించి ఉన్నాప్పుడు, ఆయనతో కలిగిన అనుభూతిని భక్తుడు స్వయంగా అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారికి సాయి లీలలో ప్రచురణ నిమిత్తం పంపిన లీల.

మనం సాయికి అంకిత భక్తులం కాకపోయినప్పటికి, ఒకసారి సాయిని పూజిస్తే చాలు, ఆయన మనని తన భక్తుడిగానే గుర్తిస్తారు. మన మనసులో యేమున్నదో కూడా చెప్పగలరు. అటువంటి అద్భుతమైన లీల.


ఈ సాయి లీల శ్రీ వినాయక్ సీతారం మూలేర్కర్ గారు శ్రీ అన్నాసాహెబ్ ధాబోల్కర్ గారికి సాయి లీల పత్రికలో ప్రచురణ నిమిత్తం పంపిన అనుభవం.

నేను థానే ఫారెస్ట్డి డివిజన్ ఆఫీసులో హెడ్ క్లర్క్ గా పని చేస్తున్నాను. మా ఆఫీసు బాంద్రాలో ఉంది.
ప్రతీరోజు పాసెంజర్ రైలులో లొయెర్ పరేల్ నించి బాంద్రాకు వెడుతూ ఉండేవాణ్ణి. బాంద్రాలో ఉన్న నా స్నేహితులలో చాలా మంది బాబా దర్శనానినికి షిరిడీ వెళ్ళి వస్తూ ఉండేవారు. వారు, ఊదీ, ప్రసాదం, ఇంకా కొన్ని వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ,ప్రసాదం ఇస్తూ ఉండేవారు. కొంతమంది నా నుదిటి మీద ఊదీ పెడుతూ ఉండేవారు. నేను వాటిని తీసుకుంటున్నప్పటికి, కొంత నా అజ్ఞానం వల్ల అభిప్రాయం వల్ల నాకు అటువంటివాటిల్లో నమ్మకం లేదని చెప్పేవాడిని.
బాబా నాలో ఆసక్తి ప్రేరేపించేంత వరకు నేను షిరిడి దర్శించనని చెప్పేవాడిని.

పర్తిస్తితుల్లో చాలా రోజులు గడిచిపోయాయి. చాలా మంది షిరిడీ ని దర్శిస్తూ ఉండేవారు, వారు వూహించలేని బాబా లీలలను వర్ణిస్తూ ఉండేవారు. తదనంతరం ముంబాయి, బాంద్రా, వాసి, విరార్, ఆగాషీ, దహను, మరియు అంబర్గావ్ ల నుంచి ప్రజలు షిరిడీకి దర్శనంకోసం వెళ్ళడం కూడా మొదలైంది. కాని నేను నా నిశ్చయానికే కట్టుబడి ఉండి బాబా ప్రేరణ కలిగిస్తే తప్ప షిరిడీ వెళ్ళకూడదనుకున్నాను.

కొద్ది రోజుల తరువాత ఒక గురువారమునాడు యేమి జరిగిందంటే (నేను మామూలుగా ఉపవాసం ఉంటాను) నేను నా రోజువారీ కార్యక్రమాలను ముగించుకుని నిద్రపోయాను. ఈ రోజు బాబాని తప్పకుండా చూడాలి అనే భావంతో నిద్ర లేచాను. తెల్లవారే ముందు నాకు నేను వర్ణించలేనటువంటి దైవ సంబంథమైన దృశ్యం కనబడింది. ఉదయాన్నే టీ తాగి 8 గంటలకి ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాలమీద నా యజమాని సంతకాలు తీసుకున్నాను. నేనాయనని సెలవు కావాలని అడిగినప్పుడు వెంటనె ఇచ్చి ఇలా చెప్పారు "సరే ఒక మంచి పనికోసం వెడుతున్నావు కనక నీకు 3 , 4 రోజులు సెలవు ఇస్తాను".
ఇంకా , "నేను కూడా నాసిక్ లో ఉన్న మా బంథువుని కలుద్దమనుకుంటున్నాను, అందుచేత మనమిద్దరం ఒకే రైలులో వెడదాము" అన్నారు.

ఉదయం 11 గంటలు అవుతుండగా యింటికి వచ్చి నా భార్యతో "ఇవాళ బాబా వెళ్ళడానికి నాకు సంకల్పం కలిగించారు అంచేత మథ్యాన్నం రైలుకు బయలుదేరుతున్నాను" అన్నాను. ఆమె వెంటనే ఒప్పుకుంది కాని, దూర ప్రదేశం, తెలియని కొత్త చోటు, అంత దూరం యెవరూ తెలియని వ్యక్తితో వెళ్ళరు పైగా చలి వాతావరణం అని కొంచెం కలవర పడింది. ఈ విషయాలన్ని నిజమైనప్పటికి , నా మదిలో కలిగిన ప్రేరణ ప్రాథాన్యత పొందింది, అందుచేత గురువారమునాడు నేను చేసే ఉపవాసం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయలుదేరాను.

ఉదయానికి కోపర్గావ్ స్టేషన్ కి చేరుకున్నాను. షిరిడీ వెళ్ళడానికి టాన్ గా కోసం చూస్తూ ఉండగా , అదే రైలు లోంచి దిగిన నా చిన్ననాటి స్నేహితుడైన డాక్టర్. ఆర్. ఆర్. చౌబాల్ కనిపించారు. మేమిద్దరం వెళ్ళేది షిరిడీకే కాబట్టి మా యిద్దరి ఉద్దేశ్యం బాబాని కలుసుకోవడం, దానితో మా సంతోషానికి అవధులు లేవు. మా టాంగా గోదావరి ఒడ్డుకు చేరుకునేటప్పటికి నేను నా చిన్ననాటి స్నేహితుడైన శ్రీ గజానన్ కనేకర్ ని కలుసుకున్నాను. ఆయన నా రాక గురించి తెలుసుకుని టాంగా దగ్గిరకి తన సేవకుడిని పంపి తన అతిథులుగా తన యింటికి ఆహ్వానించాడు. టాంగాలో ఆయన బంగళాకి వెళ్ళగానె ఆయన మమ్మల్ని చూసి చాలా సంతోషించారు. ఆయన మా సామనంతా కిందకి దింపి, అక్కడే ఉండమని బలవంతం చేశారు. ఆఖరున వెళ్ళేటప్పుడు ఆయన మాకు టీ, కొంచెం పలహారం పెట్టారు. ఆరతి సమయానికి మేము బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి యింక మేము వెళ్ళాలని అక్కడికి తొందరగా చేరుకోవాలని యెక్కువ సేపు వుండలేమని యింక వెళ్ళనివ్వమని కోరాము.

యిక మేము ఆరతి సమయానికి 30-45 నిమిషాల ముందుగా షిరిడీ చేరుకున్నాము. మేము కాకా సాహెబ్ డీక్షిత్వాడాలో బసకు దిగాము. కాకా సాహెబ్ గారిని కలుసుకున్నాము ఆయన మాకు అన్ని యేర్పాట్లు చేశారు. కొద్ది సేపటి తరువాత మేము ఆరతికి వెళ్ళాము. బాబాని దర్శించాక నేను యింతకు ముందెన్నడు అనుభవించని బ్రహ్మానందాన్ని సంతోషాన్ని పొందాను.నేను బాబా పాదాలను ముట్టుకోవడానికి సాష్టాంగ పడినప్పుడు "నువ్విక్కడికి రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా" అని బాబా అనేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవే ఆలోచనలు నా మదిలో సుడులు తిరుగుతున్నాయి. బాబా సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకొని మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసాను. బాబా తన కన్నులతోనే నన్ను దీవించారు, తన చేతులతో నా శరీరాన్ని లాలించారు. అప్పుడాయన నన్ను లెమ్మన్నారు. డా.చౌబాల్ గారు కూడా అదే సమయంలో దర్శనం చేసుకున్నారు.

తరువాత, మేము బాబావారి సెలవు తీసుకోవాడానికి బాబా వద్దకు వెళ్ళినప్పుడు (మేమిద్దరం పూనా వెళ్ళడానికి) బాబా గారు డాక్టర్ గారిని అడిగారు "బాంద్రాలో ఉన్న నాభక్తులలో ఒకరు నీ వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు బాగానే ఉన్నాడా?" బాబాగారికి చౌబాల్ గారు డాక్టర్ అని గాని, బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని తెలియదు, కాని ఆయన తన భక్తుని యోగ క్షేమాల గురించి అదిగారు. డా.చౌబాల్ గారు ఆశ్చర్యపోయారు. దీనివల్ల బాబా భగవంతుని అవతారమే అనే మానమ్మకాన్ని బలపరిచింది.

బాబాతో మొదటిసారి కలయిక. బాబా తన భక్తుల యోగక్షేమాల గురించి యెంత జాగ్రత్త తీసుకుంటారో, వారి మనసులను చదవగలరని, దానికి తగ్గట్లుగా సూచనలు చేస్తూ ఉంటారని, వారి మనసులో యేముందో తెలుసుకోగలరనీ దీనివల్ల ఋజువయింది. నా భార్యకు నా షిరిడీ యాత్రకి తగిన సాకులు చెప్పినప్పటికీ, సాయి దర్శనానికి నా షిరిడీ యాత్రలో యెటువంటి చిక్కులు యేర్పడలేదు.

రెండవ అనుభవం: నేను చాలా సార్లు షిరిడీ వెడుతూ ఉన్నానని నా భార్య అనటంతో , నా కుటుంబాన్ని కూడా ఒకసారి షిరిడీకి తీసుకువెళ్ళాలి,

అందుచేత, వారిని షిరిడీ తీసుకుని వెళ్ళాను. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు, నా భార్య స్త్రీలు కూర్చునేచోట వారితో కలిసి కూర్చుంది. కుటుంబలోని రోజువారి కార్యక్రమాల గురించి బాబా వారు వివరిస్తున్నప్పుడు, నా భార్యకు ఆ వివరణ తన స్వంత జీవితం గురించేనని అర్థమైంది. వర్ణించనలవికాని, ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించింది. బాబా వారు మానవుడు యెలా ప్రవర్తించాలో వివరించి చెప్పారు. నా భార్య యెంతటి నిజమైన భక్తురాలయిందంటే, ఆమె యెప్పుడూ " బాబా ని అడగండి, ఆయన చెప్పినట్లు చేయండి" అనేది. అందుచేత, నేను ఒకసారి మా అమ్మాయి వివాహం కోసం అడిగాను. "నీ మనసులో యేమున్నదో అదే మంచిది. వివాహం కూడా అక్కడే అవుతుంది. అమ్మాయి యెల్లప్పుడు సంతోషంగా జీవిస్తుంది" అన్నారు. అమ్మాయికి అనుకున్న ఆబ్బాయితోనే వివాహం జరిగింది, అమ్మాయి వైభవంగా సంతోషంగా ఉంది. బాబా నాభార్య శిరసుమీద చేయి ఉంచి దీవించారు, అది ఆమె మనసులో బాగా గుర్తుండిపోయింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List