Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 25, 2011

బాబాతో నా అనుబంథం ఊహకందనిది

0 comments Posted by tyagaraju on 8:41 AM






బాబాతో నా అనుబంథం ఊహకందనిది -- గౌరి


25.06.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీస్సులు

బాబా లీలలు ప్రచురించడానికి నాలుగు రోజుల విరామం వచ్చింది. యింటి పనులవల్ల, ఒక రోజు కరెంట్ కోత వల్ల, నిన్న ఊరిలో లేకపోవడం వల్ల అంతరాయం కలిగింది. పోస్టింగ్ చేద్దామనుకున్నది యింటివద్ద సిస్టంలో వర్డ్ డాక్యుమెంట్లో ఉండిపోయింది. నిన్న పనిమీద విజయవాడ రావలసివచ్చింది. ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులో ప్రచురితమైన గౌరి గారి బాబా అనుభవాన్ని తెలుగులోకి అనువదించి మీకు బాబా అనుగ్రహంతో అందిస్తున్నాను.


* * *

సాయి బంథువులారా, మీ అడ్డంకులన్నిటినీ చేదించుకోండి, బాబా ఆశీర్వాదానుభూతిని అనుభవించండి. మీరు యెక్కవలసిన మొదటి మెట్టు ఇదే, మిగతాది అసంకల్పితంగానే జరుగుతుంది. "నేను అనుగ్రహింపబడ్డాను" ఈ భావం కనక గాఢంగా ఉంటే, నీ జీవితంలో కష్టాలని అధిగమించడానికి దోహదం చేస్తుంది. అది నీకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది, నీలో దయని నింపుతుంది. నేను అనుగ్రహింపబడ్డాను అనే భావం నువ్వు గ్రహించుకున్ననాడు, ఆవేదనలన్నీ మటుమాయమయిపోతాయి,అసంతృప్తి అంతరించిపోతుంది. అభద్రతా భావం ఆవిరైపోతుంది. ఓర్వలేనితనం కరగిపోయి ప్రేమ తత్వం అంకురిస్తుంది. నువ్వు అనుగ్రహింపబడ్డావు అనే భావం నీలో లేనప్పుడు, అంతా నేనే చేస్తున్నాను అనే భావం నీలో కలుగుతుంది. జీవితంలో మార్పు రావాలని కనక నువ్వు కోరుకుంటే, నేను బాబా బిడ్డని అని నువ్వు అనుకోవాలి. ఈ రోజు నేను ప్రచురించే ఈ బాబా లీల, బాబా తన బిడ్డలకు యెలా సహాయం చేస్తారో, యెలా అనుగ్రహిస్తారో అర్థమవుతుంది.

యునైటెడ్ కింగ్డం నించి గౌరి గారు తన అబుభవాన్ని నాకు మైల్ చేశారు. ఇది చాలా అద్భుతమైన అనుభూతి, ఇది మీలో బాబా మీద నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఈ లీల మీకు సంతోషాన్నిచ్చి బ్రహ్మానందాన్ని కలుగచేస్తుంది. బాబా ని గురించిన నిజమైన అనుభవాలని తెలుసుకోవాలన్న మీ దాహార్తిని యిది తీరుస్తుంది.... అల్లా మాలిక్ ...

సాయిరాం ప్రియాంకా గారు,

నేను నా అనుభవాన్ని సాయి బంథువులందరికి చెప్పాలనుకుంటున్నాను. యెందుకంటే వారిలో సాయి మీద స్థిరమైన భక్తి భావం పెరుగుతుంది.

మన సద్గురు సాయి మీద యిటువంటి అద్భుతమైన సైట్ ని యేర్పాటు చేసినందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ప్రియాంకా గారూ, నేను ఇక్కడ సైట్ లో ఫొటో ని ఇవ్వడము లేదు, మీకు సాథ్యమయితే ఒక ఫోటోని జత చేయండి. యిందులో తప్పులేమన్నా ఉంటే మన్నించండి, నేను మైల్ ఇవ్వడం యిదే మొదటిసారి.

నా జీవితంలోకి బాబా ప్రవేశించిన క్షణం యెప్పుడో నేను గుర్తుకు తెచ్చుకోలేను. చిన్నప్ప్పటినించీ నాకాయన తెలుసు. కిందటి సంవత్సరం నించే నాలో ఆయన మీద భక్తి భావం పెరిగింది. మేము సాథారణంగా, అత్యంత బాబా భక్తిపరుడైన, మాయింటి పురోహితులైనటువంటి శ్రీ అప్పల నరసిం హ శాస్త్రిగారి వద్దకు వెడుతూ ఉండేవారము. మాకెపుడైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన వద్ద సలహాలు తీసుకుంటూ ఉండేవారము. ఇపుడాయన కీర్తి శేషులు. సాయి దయవల్ల ఆయన భార్య ఇపుడన్ని విషయాలూ చూస్తున్నారు. ఆమె పేరు లలితా దేవి. మేమామెని ఆమ్మగారు అని పిలుస్తాము.

నాకు యిద్దరబ్బాయిలు. పెద్దబ్బాయికి 4 సంవత్సరాలు, చిన్నబ్బాయికి 8 నెలలు. నేను మాయన కూడా యునైటెడ్ కింగ్ డం లో ఉంటాము. ఆయన కూడా బాబా భక్తులు. నేనుమా చిన్నబ్బాయిని కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్ గారు నాకు జెస్టైటనల్ డయాబిటీస్ రావచ్చని చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. వెంటనే నేను "మా అమ్మగారితో" (లలితా దేవిగారు) అన్ని వివరాలూ చెప్పి డాక్టర్ గారు చెప్పిన విషయం కూడా చెప్పాను.

మా అమ్మగారు నన్ను సాయి సచ్చరిత్ర చదవమని చెప్పారు. ఆ పుస్తకం పెరు వినడం నా జీవితంలో అదే మొదటిసారి. సాయి సచ్చరిత్ర యెక్కడ దొరుకుతుందొ యెటువంటి ఆధారం నాకు లభించనందుకు నాకు బెంగ పట్టుకుంది.

బాబా మన అవసరాలని కనిపెడుతూ ఉంటారని మనకు తెలుసు. నా విషయంలో కూడా అదే జరిగింది. అంతర్జాలంలో (యింటర్నెట్) నాకు ఈ పుస్తకం లభించింది. నేను చదవడం మొదలు పెట్టి బాబా దయతో యేడువారాల పారాయణ పూర్తి చేశాను. ఈ ఆథ్యాత్మికమైన గ్రంథం చదవడం మొదలుపెట్టగానే సాయి నాకు కలలోకి రావడం మొదలుపెట్టారు.

నేను కలలో సాయిని మొదటిసారి చూసినప్పుడు, సాయి నాకు ఒక వార్తా పత్రికని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఈ కల అర్థం అవలేదు. కాని కొన్ని రోజల తరువాత మాత్రమే నాకు ఉదయాన్నే నాకింకొక కల వచ్చింది. ఆకలలో నేను షిరిడీలో ఉన్నానట, యెఱ్ఱని దుస్తులలో ఉన్న పూజారిగారు నాకు కొన్ని పుష్పాలనిస్తున్నారట. మన దేవ సాయి నుంచి కూడా నాకు అక్షింతలు లభించాయి.

యింతవరకు నాకు షిరిడీ గురించి యేమీ తెలియదని, షిరిడీలో పూజారి యేదుస్తులు వేసుకుంటారో కూడా నాకు తెలియదంటే మీరు నమ్మగలరా.


మరునాడు ఉదయం నేను లేచిన తరువాత,అంతర్జాలంలో నేను వార్తా పత్రిక చదువుతున్నాను. నా ఆశ్చర్యమేమంటే ఆరోజు గురుపూర్ణిమ. నా ఆనందానికి అవథులు లేవు. అంటే దాని అర్థం గురుపూర్ణిమ రోజునే నాకు షిరిడీ కల వచ్చింది.

అదేరోజున నాకు ఆన్ లైన్ షిరిడీ దర్శనం గురించి తెలిసింది. నేను ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నప్పుడు, నా కలలో యెఱ్ఱని దుస్తులతో యే పూజారైతే కనిపించారో అదే పూజారిగారిని నేను ప్రత్యక్ష ప్రసారంలో చూశాను. నేను అనుగ్రహింపబడ్డాననే భావం నాకు కలిగిందంటే నమ్మండి. ఒక విథంగా కొంచెం నమ్మకం పెట్టుకున్నంత మాత్రం చేతనే నా జీవితంలో బాబా నాకు తన ఉనికిని చూపించారు.
కొన్ని నెలల తరువాత మేము భారత దేశానికి వచ్చి, మా అమ్మగారి యింటికి వెళ్ళాము.ఒక రోజున మేము సాయి గుడికి మందిరానికి వెళ్ళాము, గుడికివెళ్ళి బాబా విగ్రహాన్ని చూడగానే నేను యెంతో సంతోషంతో అరిచాను. మేము ఆరతి ని చూశాము.

తరువాత మాఅయన పక్కనున్న షాపులో సాయి సచ్చరిత్ర పుస్తకం కొందామనుకున్నారు. ఆ సచ్చరిత్ర పుస్తకం కొని తెచ్చేదాకా నేను గుడిలోపల హాలులో యెదురు చూస్తు వేచి ఉన్నాను. నేనక్కడ గుడిలోపల హాలులో యెదురుచూస్తూ, బాబాతో నేనీరోజు నీ గుడిలో యెందుకున్నాను, నువ్వు నాకు కలలో అక్షింతలు ఇచ్చినట్లుగా ఇప్పుడు నాకెందుకివ్వకూడదు అని బాబాని అడిగాను.

కొంతసేపటి తరువాత మా ఆయన పుస్తకంతో తిరిగి వచ్చారు. పవిత్రమైన పుస్తకాన్ని సద్గురు సాయి పాదాల వద్ద ఉంచి ఇమ్మని పూజారిగారికి ఇచ్చారు. పూజారి గారు అలాగే చేసి పుస్తకం మీద అక్షింతలు ఉంచి పుస్తకాన్ని తిరిగి ఇచ్చారు. నేను కోరిన ప్రతీదీ ఇస్తున్న నా తండ్రి సాయికి నా కృతజ్ఞతలు యెలా చెప్పాలో నా మాటలకందలేదు.
కొన్ని రోజుల తరువాత డాక్టర్ గారు మథుమేహానికి జీటిటి పరీక్ష చేశారు. అది నెగటివ్ గా వచ్చింది. బాబా దయవల్ల మాత్రమే అది సాథ్యమయింది. ఆ తరువాత యెటువంటి సమస్యలు లేకుండా మా రెండవ అబ్బాయిని ప్రసవించాను.

2 నెలల పసి పిల్లవాడయిన మా చిన్న కుమారిడితో మేము మా తల్లితండ్రులతోనూ, మా అత్తవారి తోనూ షిరిడీ కూడా వెళ్ళాము. అక్కడ షిరిడీలో బాబా నాకు చాలా అనుభూతులనిచ్చారు. నేను నా తరువాతి పోస్ట్ లో వాటిని ప్రచురిస్తాను. నేనింకా కొన్ని కుటుంబ సమస్యలను యెదుర్కొంటున్నాను. ఆ సమస్యలన్నీ కూడా బాబా దయవల్ల తీరిపోతాయని నాకు తెలుసు.
నేను చెప్పేది ఒక్కటే సాయి భక్తులందరూ కూడా ఆయన దివ్య చరణాలమీద ధృఢమైన భక్తినుంచుకోవాలి, యెవరూ ఆయన చరణాలని వదలకూడదు.

అనత కోటి బ్రహ్మాండనాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కి జై

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Tuesday, June 21, 2011

నా భార్యకు ప్రాణబిక్ష పెట్టిన బాబా

0 comments Posted by tyagaraju on 8:45 AM



21.06.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

నా భార్యకు ప్రాణబిక్ష పెట్టిన బాబా



శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగునుండి ఒక సాయి భక్తుడు చెప్పిన బాబా చెసిన అద్భుతమైన, ఊహకందని లీల


బాబా మీద నమ్మకం, వెనువెంటనే మనకి సంతోషాన్ని, శాంతిని, స్థిరత్వాన్ని, శాంతస్వభావాన్ని, ప్రేమని తెస్తుంది. అందుచేత మీకు నమ్మకం లేకపోతే, నేను మీకిచ్చే సలహా యేమిటంటే ముందర నమ్మకం కోసం ప్రార్థించండి. యెందుకంటే మీరు సాయి ఉనికిని దర్శించాలనుకుంటే మీకు ఉండవలసినది నమ్మకం...నమ్మకం....నమ్మకం..బాబా మీద నమ్మకం. ప్రతీరోజూ బాబా, యెవరికైతే నమ్మకం ఉంటుందో వారికి తన లీలలు చూపుతున్నారు.

ఈ ప్రపంచంలో నమ్మకం నిలిచిపోవడానికి కారణం ఈ ప్రప్రంచం ఒక సబ్బు బుడగలాంటిది. మీకష్ట కాలాల్లో నీకు దగ్గిరగా ఉన్నవారిని నిన్నాదుకునే వారినీ నువ్వెప్పుడు చూడలేవు, ప్రతీవారు కూడా బుడగలలాగా మాయమయిపోతారు. కాని బాబా నిజానికి బుడగ కాదు. బాబా తను ప్రేమించే బిడ్డలని యెవరికీ యెటువంటి ఆపద రాకుండా క్షేమకరమైన బుడగలలో ఉంచుతారు. అందుచేత మీరు యేది విలువైనదని అనుకుంటున్నారు మీ నమ్మకమా??? నమ్మండి అది ఈ అశాస్వతమైన ప్రపంచంలో మీకు మీ ప్రియమైనవారికి యేదైనా జరిగవచ్చు, అటువంటప్పుడు మనని రక్షించే మన ప్రియతమ తండ్రి సాయి మాత్రమే.

పైన చెప్పిన విషయానికి సంబంధించి నేను ఈ రోజు ప్రచురించేది మీకు సాయి మీద నమ్మకాన్ని మరింత పెంచుతుంది. యెందుకంటే నేను ప్రతీసారి భక్తుల యొక్క నిజమైన అనుభవాలని ప్రచురించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వారి అనుభూతులు శ్రథ్థ, నమ్మకం దారిలో వెళ్ళడానికి కదలే మెట్ల దారిలా ఉపయోగపడుతుంది.

అమెరికానించి నాకు మైల్ వచ్చింది. ఆయన కోరిన మీదట వారి పేరును ప్రస్తావించటంలేదు.

ఆయన చెప్పిన ఈ అనుభవాన్ని చదవండి. ఈ లీల చదివాక మీకు కూడా ఒడలు గగుర్పొడుస్తుంది, యెందుకంటే మొదటిసారి చదవగానే నేను కూడా అటువంటి అనుభూతికి లోనయ్యాను.

సాయిరాం ప్రియాంకా గారు,

మేము అమెరికాలో ఉంటాము. నేను మీ తెలుగు బ్లాగును చదువుతున్నాను. సాయి లీలలతో నేను చాలా ప్రభావితుడనయ్యాను. నేను కూడా నా జీవితంలో యెన్నో బాబా అనుభూతులను చవి చూశాను. అందులో ఒకటి ఈ క్రింద చెప్పిన లీలని మీతో పంచుకుంటున్నాను.

నాకు 2002 సంవత్సరంలో వివాహం అయింది. వివాహం అయిన తరువాత మేము, నా భార్య తల్లితండ్రుల యింటికి, కోస్తా ఆంధ్రకి ప్రయాణిస్తున్నాము. నేను అంతకుముందు రెండుసార్లు బస్ లో వెళ్ళాను, కాని యెప్పుడు రైలులో అక్కడకు వెళ్ళలేదు. మేము హైదరాబాదు నించి రాత్రి 9 గంటలకు బయలుదేరాము. నేను ఒక ప్రయాణీకుణ్ణి మేము దిగవలసిన స్టేషన్ కి (నా భార్య తల్లితండ్రులు ఉండే ఊరు ) యెన్ని గంటలకు వెడుతుందని అడిగాను. అతను మరునాడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెడుతుందని చెప్పాడు.

ఆ రాత్రి ప్రయాణంలొ, నేను నా స్నేహితుడు ఒంటిగంట దాకా కబుర్లు చెప్పుకుంటూ తరువాత నిద్ర పోయాము. ఉదయం 4.30 ప్రాంతంలో నా స్నేహితుడు నన్ను నిద్రలేపి బూట్లు వేసుకుని దిగమన్నాడు, మన ఊరు వచ్చేసింది అని చెప్పాడు. నేను, ఒకతను 7 గంటలకు వస్తుందని చెప్పాడు అన్నాను. నా స్నేహితుడు, అతను తప్పు చెప్పాడు, మన వూరు వచ్చేసింది అని అన్నాడు.

నేను బెర్త్ మీంచి కిందకి దిగి బూట్లు లేసులు కట్టుకుంటూ, నా భార్య యేది అని అడిగాను. ఆమె సామాన్లు సద్దుతోంది అని చెప్పాడు. ఈ లోపులో రైలు వేగంగా వెళ్ళడం మొదలు పెట్టింది. నేను నా భార్య బెర్త్ వైపు చూస్తే అక్కడామె లేదు. నేను నా స్నేహితుడితో చెప్పి యిద్దరం తలుపు దగ్గిరకి వెళ్ళాము. అక్కడ తలుపు దగ్గిర చూసి చాలా షాక్ కి గురయ్యాము. నా భార్య తలుపు హాండిల్ ని పట్టుకుంది, రైలు చాలా వేగంగా వెడుతోంది.

నా స్నేహితుడు ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పటికి, ఆమె హాండిల్ ని వదలివేసింది. నేను, నా స్నేహితుదు అదిరిపోయాము. నా స్నేహితుడు బోగీలో చైన్ లాగమని చెప్పాడు. నేను చైన్ లాగాను. రైలు ఆగి పోయింది. మేము రైలు నించి కిందకి దిగేటప్పటికి ప్లాట్ ఫారం మీద చాలా మంది గుమిగూడారు, యేదొ జరిగిందని అనుకున్నాను నేను.

నేను నా స్నేహితుడు ఆ గుంపు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాము. నా భార్య ఒక ముసలామె ఒడిలో ఉండటం చూశాము. ఆ ముసలావిడ నా భార్యకి మంచినీళ్ళు పట్టిస్తోంది. కొంత సేపటి తరువాత యెం జరిగిందని నా భార్యను అడిగాను.

ఆమె, తను నిద్ర మత్తులో రైలు దిగుతూండగా, రైలు కదిలిందని అప్పుడు తలుపు హాండిల్ పట్టుకున్నానని, రైలు కదలుతున్న వేగానికి పట్టుకోలేక వదలివేశానని చెప్పింది. హాండిల్ ని వదలి వేసిన వెంటనె ఆ వేగానికి తను రైలు చక్రాల వైపు విసురుగా వెళ్ళింది, అప్పుడే అద్భుతమైన విచిత్రం జరిగింది. ఒక ముసలి వ్యక్తి (మన బాబా) ఆమె కాళ్ళని పట్టుకుని వెనుకకు లాగాడు. యిప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, అటువంటి చిన్న పల్లెటూరి స్టేషన్ లో ఆ ముసలి వ్యక్తి యెలా వచ్చాడు, వచ్చి వెంట్రుకవాసిలో ఆమెని
యెలా లాగగలిగాడు? అది చాలా అద్భుతం. ఆ సంఘటన తరువాత నా భార్య బాబా భక్తురాలిగా మారిపోయింది. మాకింకా బాబా అనుభూతులు చాలా ఉన్నాయి. వాటిని తరువాతి మైల్ లో పంచుకుంటాము.

జై సాయిరాం.

@@@@@@@@

ఈ రోజు ఉదయం శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులో చదివాను. ఇది చదువుతుంటే చివరి రెండు పేరాలు యింకా చదవకుండానే యేమి జరిగి ఉండవచ్చొ ఊహించుకునేటప్పటికి నా కళ్ళల్లోంచి కన్నీరు రావడం మొదలుపెట్టింది. మానవ మాత్రుడికి సాథ్యమేనా ఆవిథంగా రక్షించడం? పైగా అది ఉదయం 4.30, కొంచెం చీకటిగా ఉంటుంది. ఒకవేళ వెలుతురున్నా మానవ మాత్రుడికి ఆ సమయంలో యేమి చేయాలో కూడా తొందరగా స్ఫురణకు రాదు. వేగంగా వెడుతున్న రైలు నుంచి పడబోతున్న వ్యక్తిని కాళ్ళు పట్టుకుని లాగడమంటే, అలా చేయడం యెవరికి సాథ్యం? మన బాబాకి కాదూ? అవును బాబా బాబా బాబా. సర్వకాల సర్వావస్తలలోనూ నేనప్రమత్తుడనై ఉంటానని చెప్పారు. బాబా సర్వ శక్తిమంతుడు. బాబా తన భక్తులనెప్పుడు సదా రక్షిస్తూనే ఉంటారు. కాని మనకి కావలసినది ఆయన మీద నమ్మకం, శ్రథ్థ, భక్తి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



Monday, June 20, 2011

బాబా అనుగ్రహంతో పోయిన సొమ్ము 72 గంటలలో దొరకిన లీల

0 comments Posted by tyagaraju on 8:21 AM



20.06.2011 సోమవారము

బాబా అనుగ్రహంతో పోయిన సొమ్ము 72 గంటలలో దొరకిన లీల


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంధువులకి బాబా వారి శుభాశీస్సులు


ఈ రోజు శ్రీ ఏ.ఎస్. కుమార్ గారు వివరించిన బాబా లీలని తెలుసుకుందాము. సేకరణ కుమారి సుకన్య, నెల్లూరు.




సాయి భక్తుడు శ్రీ ఎ.ఎస్. కుమార్ గారు వివరించిన బాబా లీల.


అది ఆగస్ట్ 14, 2010 సంవత్సరం. ఉదయం నించి నాకు యెందుకనో అశాంతిగా ఉంది. మా పెద్దమ్మాయి కూడా కొంచెం జ్వరంతో బాథపడుతోంది. తను చాల విథేయత గల అమ్మాయి తను యెప్పుడు యేమీ అడగదు, దేనికీ పేచీ పెట్టదు. కానీ ఆరోజు ఉదయం నించి కొంచెం మొండితనంగానూ విపరీతంగానూ ప్రవర్తిస్తోంది. తన కోరిక యేమిటంటే తను నా సోదరుడి యింటికి వెళ్ళాలని. తను చాలా మొండి పట్టు పట్టడంతో, ఆఖరికి నేను, నా భార్య మా సోదరుడి యింటికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడే ఉందామని నిర్ణయించుకున్నాము. నేను నా భార్యకి మధ్యహ్ న్నం వెళ్ళమని, నేను నా ఆఫీసు పని పూర్తి అయిన తరువాత వస్తానని చెప్పాను.

10 గంటలకి నేను యింటినించి ఆఫీసుకు బయలుదేరాను. మాయింటినించి ఆఫీసుకు 2 కి.మీ. దూరం ఉంటుంది. కారు నడుపుతూ, దారిలో వెడుతున్న వివిథ రకాలయిన వాహనాల మీద వెనుకవైపు దాదాపు 20, 25 కన్న యెక్కువ బాబా బొమ్మలు స్టిక్కర్లు చూశాను. బాబా నన్ను దీవిస్తున్నట్టుగా నాకు చాలా అనందం వేసింది. నా భార్య, తాము నా సోదరుడి యింటికి చేరుకున్నట్లు ఫోను చేసింది. మా అమ్మాయికి కూడా జ్వరం తగ్గి కజిన్స్ తో ఆటలలో మునిగిపోయిందని చెప్పింది.


సాయంత్రం నేను ఆఫీసునించి నా సోదరుడి యింటికి బయలు దేరాను. మరలా అన్ని చోట్ల బాబా బొమ్మలను చూశాను. అప్పుడు బాబా నాకేదో చెపుతున్నారనిపించింది. యేదో జరగబోతోందనిపించింది. నేను వెంటనే నా భార్యకు ఫొను చేసి అందరూ కులాసాగా ఉన్నారా అని అడిగాను. దేవుని దయ వల్ల అందరూ బాగానే ఉన్నారని చెప్పింది. అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను కాని యింకా యేదో అసంతృప్తిగానే ఉంది. నేను బాబా ని మా కుటుంబ సభ్యులని స్నేహితులని చల్లగా చూడమని ప్రార్థించాను.


నేను నా సోదరుడి యింటికి చేరుకున్నాను. మేమంతా చాలా సంతోషంగా గడిపాము. ఆ రాత్రికి అక్కడే పడుకున్నాము. కాని నేనింకా సమాథానం కోసం వెతుకుతున్నాను. దానితో నేను సరిగా నిద్ర పోలేకపోయాను. మరునాడు ఆగస్ట్ 15 న మేము తిరిగి మాయింటికి వెళ్ళడానికి తయారయ్యాము, కాని నా సోదరుడు ఉండిపోయి రాత్రి భోజనం చేసి అప్పుడు వెళ్ళమని బలవంతం చేశాడు. నేను సరేనన్నాను. మేము భోజనాలు ముగించుకుని రాత్రి 9 గంటలకి యింటికి తిరిగివచ్చాము. నేను నాభార్యతో నువ్వు పైకి వెళ్ళు నేను పది నిమిషాలలో వస్తానని చెప్పాను.


నేను తిరిగి వచ్చేటప్పటికి నాభార్య, పిల్లలతో కిందే నుంచుని ఉంది. నేను ఆశ్చర్యంతో, యేం జరిగింది, యిక్కడే నుంచుండి పోయారు అన్నాను. బాగా వణికిపోతూ ఆమె మన యిల్లు దోచేశారు అని కళ్ళంబట నీళ్ళు పెట్టుకుంది. ఒక క్షణంపాటు నేనుకూడా నిశ్చేష్టుడినయ్యాను యేం చేయాలో తోచలేదు. మా అమ్మగారు, నా సోదరుడిని పిలిచింది, వెంటనె నా సోదరుడు, స్నేహితులూ వచ్చి నాకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు.


మేము షాక్ నుంచి తేరుకునేటప్పటికి రాత్రి 11 గంటలు అయింది. మేము పోలీసులని పిలిచాము, వారు దొంగతనానికి సంబంధించిన ప్రశ్నలన్నిటినీ వేసి ఎఫ్.ఐ.ఆర్. తీసుకుని తమకు చేతనయినంతగా చెస్తామని చెప్పారు. మా కుటుంబమంతా కన్నీళ్ళతో నిండిపోయి దిగులుగా ఉన్నారు. ప్రతీరోజు నేను పోలీసు స్టేషన్ కి వెళ్ళి యేమయినా ఆచూకీ దొరికిందా అని అడుగుతూ ఉండేవాణ్ణి. నేను బాబా గుడికి వెళ్ళి బాబా ముందు కూర్చుని హృదయపూర్వకంగా ఆయంతో మాట్లాడాను. హటాత్తుగా నాకు ధైర్యం వచ్చినట్టనిపించింది. మరునాడు నాకు పోలీసు స్టేషన్ నించి కబురు వచ్చింది. వారికి కొంత క్లూ దొరికిందని అదే కనక ఫలిస్తే మా సొమ్ము మాకు దొరుకుతుందని చెప్పారు.

మేము కొన్ని ప్రదేశాలకి వెళ్ళాము కాని యేమీ ఫలితం కనిపించలేదు, అలాగే మరునాడు వెళ్ళాము, కొంత ఆశ కలిగింది కాని దొంగను పట్టుకోలేకపోయాము. మరునాడు నేను వెళ్ళేటప్పుడు నాకూడా "మిరకిల్ పుస్తకం" తీసుకునివెళ్ళాను. "మిరకిల్ పుస్తకం మాటలాడుతుందని మీకు తెలుసు "మిరకిల్ పుస్తకం చదువుతే మీ తీరని మీసమస్యలు తీరుతాయి" ఆరోజు నాకు ధైర్యం వచ్చింది. నేను పోలీసు స్టేషన్ కి వెళ్ళాను, వారు నన్ను కూడా తమతో రమ్మన్నారు. అనుకున్న చోటకి మేము రాత్రి 10.30 కి వెళ్ళాము దొంగ ఉన్న చోట దాడి చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.


మేము పోలీసు స్టేషంకి వెళ్ళాము. వారు 90% బంగారం, డబ్బు రికవరీ చేశారు. ఈ తతంగమంతా పూర్తి అయ్యేసరికి తెల్లవారుఝాము 2 గంటలు అయింది. మా కుటుంబం యింకా మా శ్రేయోభిలాషులూ అందరూ చాలా సంతోషించారు. ఉదయం 2.15 కి యింటికి వెళ్ళేముందు, నేను తిన్నగా బాబా గుడికి వెళ్ళి శిరసు వంచి నమస్కరించాను, నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు.


తరువాత నేను కూర్చుని జరిగిందంతా మరలా విశ్లేషించుకున్నాను. బాబా మా కుటుంబం మీద యెంతో దయతో ప్రేమగా చూశారు. ముందర మమ్మల్ని ఉన్నచోటునించి పంపివేసి మా కుటుంబానికి యెటువంటి హాని జరగకుండా చూశారు. అందుచేతనే మా అమ్మాయి ద్వారా మేము యింటినుంచి వెళ్ళేలా చేశారు. మేమే కనక యింటిలో ఉంటే మాకేమి జరిగిఉండేదో నేను ఊహించలేను. నాకు యిద్దరమ్మాయిలు, చిన్న పిల్లలు వాళ్ళు. ఒకమ్మాయికి 5 సంవత్సరాలు, చిన్నమ్మాయికి 2 సంవత్సరాలు. తనెప్పుడూ రోజంతా నాతోనే ఉంటుంది.


బాబా లీలని యేమని వర్ణించను. ఆయన తన భక్తులని యెంతో దయతో కాపాడుతూ ఉంటారు. యేవరయితే నన్ను ఆశ్రయిస్తారో వారిని యెల్లప్పుడు కాపాడి రక్షిస్తానని బాబా . చెప్పారు. మేము పోగొట్టుకున్న సొత్తు విలువ బంగారము, కొంత డబ్బు , దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. దర్యాప్తు అంతా పూర్తి అయాక, ఆఫీసరు గారు ఒక సాయంత్రం నన్ను పిలిచి, నా మొత్తం సర్వీసులో 4 రోజులలో చేదించిన కేసు చూడలేదని మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు. యిది యింకా బాబా లీల అనే భావంలో ఉన్నాను. యిది నిజంగా చిత్రం.


మా కుటుంబాన్ని, మా సంపదనీ రక్షించి కాపాడినందుకు బాబా కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చరణ కమలాల మీద శిరసు వంచి నమస్కరించి మనలనందరిని దయతో చూడమని కోరుతున్నాను.

***********

పై లీలకి నా విశ్లేషణ.


బాబా ని నమ్మని వారు, బాబాని పూజించని వారు, నాస్తికులు ఈ లీల చదివినా విన్నా వారికి ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది.


మరి మీరు బాబాని పూజిస్తూ ఉంటే దొంగ పడి సొత్తు దోచుకోకుండా ముందరే ఆపి ఉండవచ్చుకదా అనే సందహెహం వెలిబుచ్చుతారు.


అలాంటివారికి నేను చెప్పేదేమంటే, కొన్ని పూర్వజన్మ కర్మలని భగవంతుడు కూడా తప్పించలేడు. అందుకనే ప్రతి క్షణం ఆయన నామ స్మరణ చెయ్యమన్నారు. బాబాని నమ్మినవారు కనకనే అమ్మాయికి జ్వరం రావడం, యెప్పుడూ లేనిది, బంధువుల యింటికి వెడదామని మారాము చేయడం, తీరా అక్కడకు వెళ్ళాక, జ్వరం తగ్గి, హాయిగా ఆడుకోవడం యిదంతా బాబా ముందుగానే యేర్పాటు చేసినది. దారిలో కారులో వెడుతుండగా అన్ని వాహనాలమీద బాబా బొమ్మలు కనపడి నేను నీ వెనుక, ముందర ఉన్నాను, నిన్ను యెల్లప్పుడూ కాపాడతాను అని సందేశం ఇచ్చినట్లుగా ఉంది. పెద్ద ఆపద నించి కాపాడారు. పోయిన సొమ్ము కూడా 90 శాతం తిరిగి వచ్చేలా చేశారు. పోయిన సొత్తు కూడా దొరకడం కూడా బాబా లీల కాక మరేమిటి.





సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


Sunday, June 19, 2011

బ్రెస్ట్ కాన్సర్ ని తగ్గించిన బాబా అద్భుత లీల

0 comments Posted by tyagaraju on 7:19 AM





19.06.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీస్సులు

షివపూర్ బాబా లీలలు (తరువాయి భాగం)
బ్రెస్ట్ కాన్సర్ ని తగ్గించిన బాబా అద్భుత లీల



ఈ రోజు షివపూర్ బాబా యొక్క మరొక అద్భుతమైన లీల తెలుసుకుందాము. యిది నిజంగా చాలా అత్యద్భుతమైన లీల. బాబా ఘటనాఘటన సమర్థుడు అని తెలుస్తుంది. షివపూర్ లీలలు చదివిన తరువాత ఒక్కసారయిన షివపూర్ బాబా ని దర్శిద్దామనే కోరిక తప్పకుండా కలుగుతుంది.


నాడియా వాసి అయిన శ్రీమతి లతికా ఘోష్ గారికి రొమ్ము వద్ద యిన్ ఫెక్షన్ మొదలయింది. దురదృష్టవశాత్తు స్థానికంగా ఉన్న వైద్యులు సరిగా గుర్తించకుండా తప్పుడు వైద్యం చేశారు. రోజులు గడుస్తున్నా ఆమె ఆరోగ్యంలో యెటువంటి మార్పు లేదు, ఆమె పరిస్థితి యింకా దిగజారడం మొదలుపెట్టింది. అప్పుడామె యింకా కొన్ని అవలక్షణాలతో బాథపడుతోంది. ఆఖరికి అది కాన్సర్ అని గుర్తించాక, ఆమెని నిల్ రతన్ సర్కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడామె తీవ్రమైన రక్త లేమితో బాథపడుతూంటే అది లుకేమియాగా గుర్తించి ఆమెకు వెంటనే రక్తం మార్చడానికి నిర్ణయించుకున్నారు. చివరికి యిక ఆమె బ్రతకదని , ప్రతీరోజు ఆస్పత్రి చార్జీలు కూడా చెల్లించడానికి వారు అంతగా ఆర్థికంగా ఉన్నవారు కాదుకనక ఆస్పత్రినించి ఆమెని విడుదల చేశారు.

లతి క గారి తోటికోడలు షివపూర్ గ్రామంలోని యింటివారి కోడలు. అమె శ్రీరామనవమినాడు (24, మార్చ్ 2010) బాబా గారి ప్రతిష్టాపన జరుగుతున్న రోజున బాబా దర్శనానికి వచ్చింది. హటాత్తుగా ఆమెకు, లతికా చివరి దశలో ఉందనీ యెంత వీలయితే అంత తొందరగా యింటికి రమ్మని మొబైల్ కి కాల్ వచ్చింది. యిది వినగానే ఆమె అదిరిపడి బాబాముందు ఉద్రేకంగా బిగ్గరగా యేడిచింది. అక్కడి గుడి కమిటీ సభ్యులని , బాబా దయతో లతికా ప్రశాంతంగా దేహాన్ని విడిచి వెడుతుందని కొంత ఊదీ, ప్రసాదం లతిక కోసం అడిగింది. ఊదీ, ప్రసాదం తీసుకుని వెంటనె ఆమె యింటికి వెళ్ళేటప్పటికి లతిక పూర్తిగా అచేతనంలో ఉంది. మెల్లిగా ఆమె చివరిదశలోకి వెడుతోంది. ఆమె వెంటనె లతిక నోటిలో ప్రసాదం ఉంచి కొంత ఊదీ ఆమె నుదిటిమీద పెట్టింది.


తరువాత జరిగిన అద్భుతమైన లీలకి, అక్క్డడ ఉన్నవారికి యెవరికీ నోట మాట లేదు. వెంటనే లతిక లేచి మంచం మీద కూర్చుని పూర్తి స్పృహలోకి వచ్చి, నిలకడగా స్పష్టంగా "నువ్వు యింతకుముందే నాకు ఈ ఊదీ ప్రసాదం యెందుకు తేలేదు" అని అడిగింది. ఇప్పుడు జరిగినది చూసి అక్కడున్న ఆమె బంథువులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. లతిక తోటికోడలు వెంటనే బాబా గుడికి వెళ్ళి బాబా ముందు యేడిచింది. ఇప్పుడు ఆమె కళ్ళలోంచి వచ్చిన కన్నీరు బాబా అనుగ్రహంతో పరిమళించాయి. అవి బాబా మీద ప్రేమకి, భక్తికి ప్రతీకలు....ఘటనా ఘట సమర్థుడు.


ఇప్పుడు లతిక పూర్తిగా కోలుకుంది. యింతకుముందులాగే ఆమె తన పనులన్ని చేసుకుంటొంది.


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List