Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 28, 2011

మరువరాని బాబా దర్శనానుభూతి

0 comments Posted by tyagaraju on 5:19 AM
28.05.2011 శనివారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

కొన్ని అనివార్య కారణాల వల్ల బాబా ఫోటో, గులాబీ అందించలేకపోతున్నాను.



మరువరాని బాబా దర్శనానుభూతి


ఈ రోజు బెంగళూరు శ్రీ సతీష్ గారిని బాబా వారు యెలా అనుగ్రహించారో తెలుసుకుందాము. శ్రీ సతీష్ గారు తమ బాబా లీలానుభవాన్ని సుకన్యగారికి పంపించగా, దానిని మీకు తెలుగులో మీకు అందిస్తున్నాను


ఈ రోజు నాకొక అద్భుతం జరిగింది. నేను బాబాని చూశాను. వారి అనుగ్రహం నాకు కలిగింది.

కొన్ని వారాలు, నెలల క్రితం నించి నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉండి నన్ను చాలా చికాకు పరుస్తున్నాయి. నిన్న రాత్రి నేను బాబాని, ఈ కష్టాలు, బాథలు యెందుకని నన్ను వదలివెళ్ళిపోవటల్లేదు అని అడిగాను. రాత్రంతా నాకు నిద్ర లేదు. ఈ రోజు ఉదయం నేను యెప్పుడూ దర్శించే బాబా మందిరానికి వెళ్ళాను. నేనెప్పుడు వారాంతములలోనే బాబా గుడికి వెడుతూ ఉంటాను. కాని ఈ రోజు యెందుకు వెళ్ళానో నాకే తెలియదు. నేను బాబాతో, నువ్వే కనక నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నువ్వు వున్నట్లుగా నాకు నీ దర్శనం కావాలి అన్నాను.

బాబా మీద నాకు బొత్తిగా కోపంగా ఉంది. బాబాని ప్రార్థించిన వెంటనే నేను గుడినించి బయటకు వచ్చాను. బయట ధోతీ పైజామా (మాసిన బట్టలు) థరించి ఉన్న ఒక ముసలి వ్యక్తిని చూశాను. అతను "నాకు ఒక కప్పు టీ ఇప్పించగలవా" అని అడిగాడు. రెండు నిమిషాలు నేను షాక్ తిన్నాను, తరువాత అతనితో "అలాగే" అని చెప్పాను. దగ్గరలో ఉన్న టీ స్టాల్ కి తీసుకునివెళ్ళి టీ ఇప్పించాను. ఈలోగా నేను ఆ ముసలి వ్యక్తిని, అతని వివరాలు, అతను యెక్కడనించి వస్తున్నాడు అని అన్ని వివరాలు అడగడం మొదలుపెట్టాను. అతను తన పేరు "సంత్ రాం" అనీ, తాను భిక్షమీదే అథారపడి జీవిస్తున్నట్లు చెప్పాడు. నేను అతని కళ్ళల్లోకి చూసి, "బాబా" నిన్ను గుర్తించాను."అన్నాను. అతను ఒక చిన్న నవ్వు నవ్వి "అవును" అన్నాడు. అతను నా కళ్ళల్లోకి చూసి, ఒక కన్నీటిని రాల్చాడు. నేను గట్టిగా "బాబా, బాబా " అని యేడిచాను.

ఆ ముసలి వ్యక్తి కూడా నాతోపాటుగా యేడిచాడు. అతను నాతో " నీ విథి నువ్వు నిర్వర్తించు, మిగతాది నేను చేస్తాను" అన్నాడు. నేనతనితో నాకు కొన్ని సమస్యలున్నాయని చెప్పాను. "యేమీ చింతించద్దు, దేవుడు రక్షిస్తాడు అని చెప్పాడు.

నేను బాబా ని డబ్బేమన్నా కావాలా అని అడిగాను. అతను వద్దన్నాడు. తను అన్ని దేవాలయాలని దర్శిస్తానని బిక్షగా యేది లబిస్తే అదే తింటానని చెప్పాడు. నేనతనితో కొన్ని బిస్కట్స్ కొని ఇస్తానన్నాను. అతను వద్దన్నాడు.

అతను, "ప్రపంచంలో చాలా మంది పేదవారున్నారు. కొంతమందికి సరైన తిండి కూడా లేదు" అన్నాడు. నేనతనిని నా నుంచి కొంత డబ్బు తీసుకోమని బలవంతం చేశాను. కాని అతను నిరాకరించాడు. అతను " నువ్వు నాకిప్పుడు టీ ఇప్పించావు, అలాగే మథ్యాహ్నం యెవరోఒకరు తినడానికి యేదోఒకటి ఇస్తారు." అన్నాడు. అతని కళ్ళు చూడటానికి చాలా ఆకర్షణీయంగానూ, ఆనందకరంగానూ ఉన్నాయి. నేనతనికి ఒక సాయి ఫొటో ఇస్తానన్నాను, దానికతను సమ్మతించాడు. అతనా ఫోటోని పరీక్షగాచూసి, తీసుకున్నాడు. "ఇప్పుడతను వెళ్ళాలి" అన్నాడు. నేనతని పాదాలను ముట్టుకున్నాను. "అంతా సరి అవుతుంది" అన్నాడు.

నేను నా కారువద్దకు వెళ్ళి లోపల కూర్చున్నాను. కారు లోపల పెద్దగా యేడిచాను. శశికళా సిస్టర్ కి ఫోన్ చేసి, నేను బాబాని చూశాను అని యేడిచాను.

నేను మరొకసారి అనుగ్రహింపబడ్డాను. నా అనుభూతులని నేను మాటలలో వర్ణించలేను. నా జీవితంలో యింత గట్టిగా నేనెప్పుడూ యేడవలేదు. సాయి భక్తులందరికి నేను చేసే విన్నపం యేమిటంటే మనకెప్పుడు సాయి ఉన్నాడు. మనం శ్రథ్త సహనంతో ఉండాలి అంతే.

నాకు చాలా సంతోషంగా ఉంది.




సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

సాయిరాం

సతీష్

Thursday, May 26, 2011

మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక

0 comments Posted by tyagaraju on 10:59 PM


27.05.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక



ఈ రోజు మనము మొదటి సారి షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకున్న సాయి భక్తులు, విశాఖపట్నము వాస్తవ్యులు శ్రీ నౌడురు రామకృష్ణమూర్తిగారి అనుభవాలను తెలుసుకుందాము. వారి అనుభవాన్ని వారు చెప్పిన మాటలలోనే. శ్రీ నౌడూరు రామకృష్ణగారు మా తోడల్లుడుగారు కూడాను. శ్రీ రామ కృష్ణగారు వారు వారి అబ్బాయి పనిమీద ముంబాయి వెళ్ళి అక్కడినించి షిరిడీ వెళ్ళడం జరిగింది. యిక అక్కడ షిరిడీలో అనుభవాల పరంపరని తెలుసుకుందాము.

మేము ముంబాయినించి ఈ సంవత్సరం మే నెల 11 తారీకున బుథవారము బయలుదేరి
గురువారమునాడు ఉదయం 5.30 కి షిరిడీ చేరుకున్నాము.
ఉదయం 7.30 కి సాయి దర్శనం అయింది చాలా సెపు అక్కడె వున్నాను ఒక దండ కొసం
బాబాను చూస్తూ వెనక్కి నడుస్తున్నా వెంటనె ఒక ఆయన దండ తెచ్చి నాకు
ఇచ్చారు . నేను చాలా సంతోషించాను. .30 నిమిషాలు అక్కడే వున్నాను. 8.30 కి బయటకి వచ్చాను. తరువాత 10.30 కి దర్శనం కోసం వెళ్ళాను అక్కడ ఒక చిన్న కుఱ్ఱవాడు వచ్చి చిన్న వస్త్రం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇచ్చి బాబా వారికి యివ్వమన్నాడు. నేను వాటిని ఇచ్చి ఆ వస్త్రం ఇవ్వమని అడిగాను. కాని పూజారి గారు ఇవ్వలేదు. కాని తరువాత పూజారిగారె సెక్యూరిటీగార్డ్ ద్వారా వెళ్ళిపోతున్న నాకు ఇప్పించారు. నాకు చాలా అనందం వేసింది.


12.30 హారతికి అక్కడే హారతి పాడాను. నా జేబులో హారతి పుస్తకం వుంది.

తరువాత 5.30 కి దర్శనం అయింది బాబావారి దర్శనం రెండు సార్లు చేసుకున్నాను. మూడవసారి కూడా దర్శనానికి వెళ్ళాను. అక్కడ సమాథి మీద ఒక పువ్వుల పువ్వుల వస్త్రం పెద్దది ఒకటి ఉంది. నా మనసులో ఆ వస్త్రం కావాలనుకున్నాను. కాసేపు అయిన తరువాత ఒకావిడ వచ్చి సమాథికి మళ్ళీ దణ్ణం పెట్టు అన్నారు. నేను దణ్ణం పెట్టుకున్నాక పూజారిగారు దణ్ణం పెట్టుకోవడం అయింది కదా, యింకా యేమి కావాలి అన్నారు. నాకు ఆ వస్త్రం కావాలి అని బయటకే అనేశాను. మొదట ఇవ్వను అన్నారు. కాని సమాథి మీద ఉన్న ఒక మీటరు పొడవు ఉన్న చిన్న వస్త్రం ఇచ్చారు. నాకు చాలా అనందం వేసింది.




రాత్రి 9.30 కి మరలా దర్శనం అయింది ఒకే రోజు 4 దర్శనాలు అయ్యాయి ద్వారాకమాయి చావడి ధుని వేపచెట్టు దర్శానాలు అయ్యాయి . శుక్రవారం ఉదయం 7.30 కి వెళ్ళాను. ఒక పెద్ద వస్త్రం సమాథి మీదవుంది అది నాకు కావాలని వుంది నాకు మనసులో . మరలా వస్త్రం లభించింది. అలా మూడు వస్త్రాలు బాబా దయ వలన నాకు లభించాయి. నా ఆనందం చెప్పనలవి కాదు. ఒకటిన్నర రోజులో నాకు ఎనిమిది దర్శనాలు అయ్యాయి.
బాబా వారి దర్శనం అయ్యాక బయట అందరకూ లైనులో ఊదీ ఇస్తున్నారు. ఒకరికి ఒక ఊదీ పాకెట్ మాత్రమే ఇస్తున్నారు. నాకూ ఒకటి ఇచ్చారు. నేను మరొకటి కావాలని అడిగాను. వెంటనే నాకు మరొకటి ఇచ్చారు. నా వెనకున్న ఆయన కూడా తనకీ మరొకటి కావాలని అడిగాడు. ఊదీ ఇచ్చే అతను రెండు ఇవ్వరు అన్నాడు. ఆయన నన్ను ఉద్దేశించి, నా ముందున్న ఆయనకు ఇచ్చారుగా అన్నాడు. అప్పుడు ఊదీ ఇచ్చే అతను ఆయన అదృష్టం అది అన్నాడు. అలా బాబా వారు నాకు మరొక ఊదీ ని కూడా ప్రసాదంగా ఇచ్చినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

మరునాడు శుక్రవారము నాడు ఉదయం పల్లకీ సేవ జరుగుతోంది. బాబా ని పల్లకీలో ఊరేగిస్తున్నారు. నేను యెదురుగా నించుని నేను కూడా పల్లకి మోస్తానని సంజ్ణ చేశాను. పల్లకీ మోసే ఒకాయన నన్ను పిలిచి దా తీసుకో అని పల్లకీని మోసే అవకాశాన్నిచ్చారు. కాసేపు పల్లకీ మోసే భాగ్యం కూడా కలిగింది నాకు.

నేను నాసిక్ వెడదామని శుక్రవారం రాత్రి అనుకున్నాను. అక్కడ వసతి గురించి ఒక అలోచనవచ్చింది ఎలాగా అనుకున్నా లాకర్ లో సామాను ఉంచి బయలుదేరుదాం అనుకున్నా గది ఖాళీచేసాము కూడా. వెంటనే ఈరాత్రి ఇక్కడే వుండు అని బాబా సందేశం నాకు ఇచ్చినట్లు గా వచ్చింది. అక్కడ రాత్రి ఇబ్బంది పడతారు అని. ఆగిపోయాము. మరొకసారి రాత్రి బాబాదర్శనం అయింది. శనివారం ఉదయం మరొక దర్సనం అయింది. శనివారం ఉదయ నాసిక్ 10.30. కి వెళ్ళి పంచవటి ముక్తిధాం గోదావరి స్నానం త్రయంబకేశ్వర దర్శనం అయ్యాయి. ఘ్రుణేశ్వరం లో నేను ఈశ్వరుని కి పాలతో అభిషేకం చేశాను.




9 గురువారముల వ్రత మహాత్మ్యం



శ్రీ రామ కృష్ణగారి థర్మ పత్ని శ్రీమతి శారద గారు కూడా గొప్ప బాబా భక్తురాలు. ఆవిడ ఒక కోరిక కోసం 9 గురువారములూ వ్రతం చేసి, అది తీరితే మరొకసారి వ్రతం చేస్తానని అనుకున్నారు. కోరిక తీరిన తరువాత మరలా, 9 గురువారముల వ్రతము ప్రారంభించి నిన్నటికి, అనగా 26.05.2011 కి 9 గురువారములు నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి. బాబా కి నైవేద్యం పెట్టడానికి యింటిలో పులిహోర కలుపుతున్నారు. యింతలో ఒక ముసలాయన వచ్చి డబ్బులివ్వు అనగా, యెవరో వచ్చారని చూద్దామని శారద గారు బయటకు వచ్చారు. అప్పుడా ముసలాయన ఈమెతో, " ఊఊ డబ్బులివ్వూ, రెండు రూపాయలు, రెండు రూపాయలు అంటూ చేతివేళ్ళు రెండు చూపిస్తూ డబ్బులివ్వమని అన్నారు. ఈమె లోపలకు వెళ్ళి పరసులో చూడగా సరిగా రెండు రూపాయల నాణెం ఉందిట. ఆ రెండు రూపాయలను ఆ వచ్చిన ఆయనకి ఇచ్చి, కొంచెం ప్రసాదం ఇద్దామనే ఉద్దేశ్యంతో ఉండు అని లోపలకి వెళ్ళారు. ఆయనకి కాని బయటకి వచ్చి చూసేటప్పటికి ఆ ముసలతను కనపడలేదు. ఆ మనిషిని యింతకుముందుకూడా చూడలేదుట. అలా వ్రతం పూర్తవగానే బాబావారు దక్షిణ కూడా అడిగి మరీ తీసుకున్నారు.

మనలో శ్రథ్థ భక్తి విశ్వాసం ఉంటే బాబా తప్పకుండా వచ్చి తీరతారని ఆ అనుభవం ద్వారా మనకి తెలుస్తోంది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, May 23, 2011

జీవితాన్ని నిలబెట్టిన బాబా

0 comments Posted by tyagaraju on 8:10 AM




23.05.2011 సోమవారము

జీవితాన్ని నిలబెట్టిన బాబా

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు సాయి సేవకులైన శ్రీ సీ. సాయిబాబా గారు చెప్పిన అద్భుతమైన లీల ఒకటి తెలుసుకుందాము. ఈ లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగులో కొన్నాళ్ళ క్రితం ప్రచురింపబడింది. ఈ రోజు మీకు అందిస్తున్నాను. బాబా ప్రత్యక్షంగా వచ్చి శ్రీ సాయిబాబా వారిని యెలా అనుగ్రహించారో చదివితే ఒడలు గగుర్పొడుస్తుంది. ఆయన చూపిన దయకి మనసు ఆయనకి దాసోహమంటుంది. యెంత అద్భుతమైన రీతిలో బాబా వారు వచ్చారో చదవండి.

చాలా సార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, మన ప్రియమైన సాయిమా ప్రతీవారిని ఒకే సమయంలో యెలా కనిపెట్టుకుని వుంటారా అని. ఆయన ప్రేమ అనుగారం యెటువంటిదంటే ఆయన ప్రేమయొక్క లోతును కొలవడం అసాథ్యం. రోజు నేను శ్రీ సీ. సాయిబాబా గారి, హృదయాన్ని సూటిగా తగిలేటటువంటి అనుభూతిని మీకు చెపుతాను. రోజు సాయిబాబా గారు ఇలా ఉన్నారంటే అంతా బాబా వలననే. ఇక్కడ ఆయన మెయిల్ ని ఇస్తున్నాను.

ప్రియాంకా బేటీ సాయిరాం. మీరు మన సాయికి యెంతో సేవ చెస్తున్నారు. సాయి మిమ్ములను దీవుంచుగాక. నవీన్ గారి అనుభూతిని చదివాక, బాబా నన్నుకూడా తన మార్గంలోకి యెలా లాక్కున్నారో చెప్పాలనిపించింది. వీలయితే దీనిని మీ బ్లాగులో పబ్లిష్ చేయండి.

నేను ఈష్ట్ కోస్ట్ రైల్వే లో పూరీ రైల్వే స్టేషన్ లో 2004 నుంచి పని చేస్తున్నాను. నేను ఖుర్దా రోడ్ లో ని డివిజినల్ హెడ్ క్వార్టర్స్ లో 2004 వరకూ బాథ్యతాయుతమైన పదవిలో 12 సంవత్సరాలు ఉన్నాను. కొన్ని విజిలెన్స్ అలిగేషన్స్ వల్ల నాకు పూరీ బదిలీ అయింది. నాపేరు సాయిబాబా అయినప్పటికీ 50 సంవత్సరాల జీవిత కాలంలో నేను బాబా గుడికి కాని షిరిడీకి కాని వెళ్ళడం అరుదు. నేను షిరిడీ వెళ్ళినా మామూలుగా వెళ్ళడం తప్ప, భక్తితో కాదు. నాకు పూరీ కి బదిలీ అయిన తరువాత, ఖుర్దాలో నాకు యిల్లు, కుటుంబం ఉండడం వల్ల, ఖుర్దా నించి పూరీ కి వెడుతూ ఉండేవాడిని. రోజుల్లో నేను పూర్తిగా నిరాశలో ఉన్నాను. సెప్టెంబరు 2005 లో హృద్రోగం వచ్చి,ఆంజియో ప్లాస్టీ కూడా అయింది. నా ఆర్థిక పరిస్తితి కూడా దిగజారడం మొదలైంది, నా ఉద్యోగంలొ కష్టమైన పరిస్థితుల వల్ల, ఆర్థిక సమస్యలవల్ల, అనారోగ్య పర్తిస్తుతులవల్ల, లోకాన్ని విడిచి పెడదామనే స్తితిలో ఉన్నాను. 2007 మే నెలలో ఆత్మహత్య చేసుకుందామని బలమైన కోరిక కలిగింది. మథ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒక పూట పని చేశాక జేబులో 15/- రూ. పెట్టుకుని భోజనం చేద్దామని హోటలికి వెడుతున్నాను. తెల్లని కుర్తా, పైజామా థరించి పొడవుగా ఉన్న ఒకపెద్దమనిషి నన్ను దాటుకుంటూ వెళ్ళి నా పేరుతో "సాయీ" అని పిలిచేంతవరకు నేను గమనించలేదు. కొంచెం ఆశ్చర్యంతో తిరిగి చూశాను, పెద్దమనిషికి 70 - 75 సంవత్సరాల వయసు ఉంటుంది. మొహంలో సమ్మొహనకరమైన చిరునవ్వుతో, స్వచ్చమైన హిందీ లో "నాకు 20/- రూ.ఇవ్వగలవా" అని అడిగాడు. అతనికి నాపేరు యెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను, 20/- రూ. అడిగేటప్పటికి యింకా ఆశ్చర్యం వేసింది. అతని సమ్మోహనకరమైన చురునవ్వు చూసి నేను లేదు అని చెప్పలేకపోయాను. కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న నా ఆఫీసుకి వెళ్ళనిస్తే నేను 20/- ఇవ్వగలనని చెప్పగా అతను వెంటనే ఒప్పుకున్నాడు. అతను నాతో కూడా ఆఫీసుకి వచ్చాడు. నేనతనికి 20/-రూ. ఇచ్చాను. అతడు దానిని ఒక బైండు పుస్తకంలో పెట్టుకున్నాడు.
యింకా ఆశ్చర్యంలోనే నిండివున్న నేను, అతను వెళ్ళబోయేముందు, నాపేరు యెలా తెలుసని అడిగాను. మరలా అదే చిరునవ్వు. " సాయి ! నాది షిరిడీ. నాకు ప్రతీవారు సాయి " బదులిచ్చాడు. అతనింకా చెప్పాడు "నువ్విప్పుడు చాలా కష్టాలను యెదుర్కొంటున్నావు. 20/- రూ.తిరిగి తీసుకో, రుద్రాక్ష కూడా. నేను కొంచెం తిట్టుకున్నాను. నేనింకా ఇలా ఆలోచించాను, బహుశా నాగురించి యెవరో చెప్పి ఉంటారు, అంచేత ఆపూజలనీ, పూజలనీ యింకా డబ్బు అడుగుతాడేమోనని. అతనింకా అన్నాడు "సాయీ ! నీ కష్టాలన్ని తీరిపోయిన తరువాత నేను మీ యింటికి వచ్చి 20/- రూ.తీసుకుంటాను." నేనతనిని మథ్యలో వారించి, "నీకు మాయిల్లు యెలా తెలుసు" అని అడిగాను. అతని వదనంలో అదే చిరునవ్వుతో "నేను నీకు చెప్పాను, నేను షిరిడీ నించి వస్తున్నానని, నా కన్నీ తెలుసు " అని బదులిచ్చాడు. నేనతనిని సగం అపనమ్మకంతోను, మిగతా సగం తిట్టుకుంటూ గమనిస్తున్నాను. అతనింకా యిలా చెప్పాడు " యిరవై రూపాయలతో సరుకులు కొని నువ్వు మాత్రమే పాయసం తయారు చెయ్యి, వచ్చే నెల మొదటి మూడు గురువారములు ఒక నల్ల ఆవుకు తినిపించు, నీకంతా బావుంటుంది."



నేనింకా ఆశ్చర్యంలో ఉండగానే అతను వెళ్ళిపోయాడు. నేను మళ్ళి అతనిని చూడలేదు. నేనిదంతా నా కుటుంబ సభ్యులతో చర్చించాను. నా తమ్ముడు సత్య సాయి భక్తుడు. యిది షిరిడి సాయిబాబా లీల తప్ప మరేమీ కాదు అన్నాడు. ఆయనే దక్షిణ అడిగి తీసుకుని మరలా తిరిగి ఇస్తారు. యిటువంటి దృష్టాంతాలెన్నో సాయి సచ్చరిత్రలో కనిపిస్తాయి అని చెప్పాడు. నాకు తెలుగులో సాయి సచ్చరిత్ర ఇచ్చి, యిటువంటి దృష్టాంతాలు తెలుసుకోవాలంటే చదవమన్నాడు. 2007, జూన్ 5 కు ముందు మొదటి గురువారం రెండు సార్లు పారాయణ పూర్తి చేశాను. 2007, జూనె 5 ఉదయం, 20 రూపాయలతో కొన్న సరుకులతో పాయసం చేసి అరటి ఆకులో పెట్టాను. నా స్కూటర్ మీద నల్లటి ఆవుకోసం రెండు గంటలు తిరిగాను, కాని లాభం లేకపోయింది. అపరిచితులని నమ్మినందుకు నన్ను నేను తిట్టుకుంటూ యింటిలో కూర్చుని టీ.వీ చూస్తుండగా, మా చిన్నమ్మాయి గట్టిగా అరుస్తూ యింటిముందర నల్లటి ఆవు వచ్చిందని చెప్పింది. అది నాకోసమే యెదురు చూస్తున్నట్టుగా ఉంది. నా కళ్ళనించి కన్నీరు జాలువారింది. నా అజ్ణానానికి నన్ను నేను తిట్టుకున్నాను. నేను వెంటనే ఆవుకు పాయసాన్ని తినిపించాను. అది ఆకుతో సహా తినేసింది. అప్పటినించి యిక వెనుకకు తిరిగి చూడలేదు. పోయిన ఆత్మ విశ్వాసంతిరిగి వచ్చింది. నా కష్టాలన్ని తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అంతా సాయి. ఆయనే ఇప్పుడు నాకు మార్గ దర్శకుడు. ఆయనే నా జీవితం, అన్ని ఆయనే. యెల్లప్పుడూ సాయి సేవలో. సీ. సాయిబాబా.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List