Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 14, 2011

సాయి ప్రేరణ :: తెలుగు స్కాన్ కాపీ

0 comments Posted by tyagaraju on 9:00 AM
14.05.2011 శనివారము


సాయి ప్రేరణ :: తెలుగు స్కాన్ కాపీ


ఓం సాయిరాం

సాయి బంథువులందరకు ఒక విజ్ణప్తి ::

నెల్లూర్ నుంచి సుకన్య గారు మన సాయి బంథువులందరికి ఒక ముఖ్య విషయం తెలియచేస్తున్నారు.

యెవరికయినా సాయి ప్రేరణ స్కాన్ కాపీ తెలుగు లో కావాలంటే

సుకన్య గారి మైల్ ఇ.డీ. కి మైల్ చేస్తే వారు పంపుతారు.

మీమ్రు మైల్ లో విషయం : "సాయి ప్రేరణ యిన్ తెలుగు" అని

హెడ్డింగ్ పెట్టి మైల్ చేయండి.

మైల్ ఇ. డీ. sukanyags@gmail.com

40 రోజులు పారాయణ చేసినవారికి వారి సమస్యలనన్నిటినీ

తీరిపోతాయి.

సాయి డివోటీ :: సుకన్య

కమలము - ప్రత్యేకత

0 comments Posted by tyagaraju on 3:21 AM





14.05.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్శులు


కమలము - ప్రత్యేకత

మనం కమలాన్ని ప్రత్యేకంగా యెందుకు గుర్తిస్తాము. ::

సత్యానికి ప్రతీక కమలం. అందానికి పవిత్రతకి చిహ్నం. (సత్యం, శివం, సుందరం) మనము కూడా భగవంతుడిని కమలంతో పోలుస్తాము. పద్మదళాయతాక్షుడు, చరణ కమలాలు, పద్మములవంటి చేతులు, హృదయ కమలం.

కమలం సూర్యోదయంతో విచ్చుకుని రాత్రి అయేటప్పటికి వాడి పోతుంది.

మన బుథ్థి, మనస్సు, అంతహ్ కరణం జ్ణానమనే వెలుగుతో వికసించాలి. యిక వాడిపోకూడదు. కమలం బురదలోనుంచైనా పెరుగుతుంది. తన చుట్టూ యెటువంటి పరిసరాలు ఉన్నా గాని అది తన అందాన్ని అందరికీ కనువిందు చేస్తూ ఉంటుంది. దాని అందం చెక్కు చెదరదు. యిది మనకి యేమని తెలియ చేసుందంటే, మనం కూడా ఆ కమలంలాగే స్వచ్చంగా, నిర్మలంగా, సౌందర్యంగా, యెటువంటి పరిస్థితులలోనయినా కూడా ఉండాలని చెబుతుంది. అంటే పైకి అందంగా ఫేస్ పౌడర్ దట్టించి మేకప్పు చేసుకుని కాదు.
హృదయ సౌందర్యం ఉంటే మన వదనం కూడా ప్రసన్నంగా ఉండి అందంగా కనపడుతుంది.

అందుచేత కమలం చుట్టూ యెంత బురద ఉన్నా చూసేవారి చూపులు కమలం యొక్క అందాన్ని వీక్షిస్తాయే గాని, బురదవైపు దృష్టి పడదు. అలా మన శరీరాకృతి కాదు, యెదటివారు చూసేది, మన మంచితనం, మాట తీరు, వినయం. ఇవన్ని ఉన్న మానవుడు అందంగా లేకపోయినా యెవరూ పట్టించుకోరు. మనసులోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు. మనిషి అందంగా ఉండవచ్చు. మనసు మంచిది కాకపోతే యెంత అందంగా ఉంటే యేమి లాభం.

తామరాకు యెల్లప్పుడు నీటిలో ఉన్నాగాని దానికి నీరు అంటదు. అలాగే జ్ణానం ఉన్న మానవుడు కూడా అలాగే వాంఛలు యేమీ అంటించుకోకుండా ఉంటాడు. యెల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు.

యిదే విషయం భగవద్గీతలో :

బ్రహ్మాన్యాథ్యాయ కర్మాణి
సంగం త్యాక్తవ కరోతియాహ
లిప్యతే నాసా పాపేన
పద్మపత్రం యివం భాసా

యెవడయితే కర్మలు చేసి వాటిని భగవంతునికి సమర్పిస్తాడో వానికి యెటువంటి పాపములు అంటవు. భవబంథాలనుండి విముక్తి లభిస్తుంది. అనగా నీటిలో ఉన్న తామరాకుకు నీరు యెలా అంటదో మానవుడికి కూడా యివి అంటవు.

దీనిని బట్టి మనం తెలుసుకోవలసినది యేమిటంటే ఆథ్యాత్మిక జీవనం కోరుకునే భక్తులు గాని, సాథకులు గాని జ్ణాన మార్గంలో పయనించాలి. మన శరంలో కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి. అవే షట్ చక్రాలు. ప్రతీ చక్రం కూడా కమలంతో పోల్చబడి ఉన్నాయి. ఒక్కో చక్రానికి కొన్ని రేకలు ఉన్నాయి. ఉదా: షస్రార చక్రానికి వెయ్యి కమల రేకులు ఉన్నాయి. అత్యున్నతమైన జ్ణాన సిథ్థి పొందిన వానికి ఈ సహస్రారం తెరుచుకుంటుంది.

థ్యానం చేసేవారికి మూడవ కన్ను కూడా తెరుచుకుంటుంది.
మూడవకన్నును ప్రత్యక్షంగా కనులు మూసుకున్నప్పుడు కనపడుతుంది.

మనం థ్యానం పద్మాసనంలొ కూర్చుని చేస్తాము.

విష్ణువు యొక్క నాభినుంచి కమలం పుట్టింది. ఆ కమలమునుంచి బ్రహ్మ, ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఉద్భవించాడు.

ఈ కమలానికి సృష్టికర్తకి లింకు. బ్రహ్మలోకానికి కూడా ఈ కమలం ప్రతీక. స్వస్తిక్ గుర్తు కూడా ఈ కమలం నుండే వచ్చింది.

అందుచేత, మన సాయి మన హృదయకమలంలో స్థిరంగా ఉండాలంటే, మనము ఉంచుకోవాలంటే యేమి చేయాలి.
సాయి బోథనలు ప్రతీసారి నెమరు వేసుకుంటూఉండాలి. యెప్పుడు సాయినామ స్మరణ మన నోటిలో నిరంతరం కదలాడుతూనే ఉండాలి.

బాగా భక్తి భావం ఉన్నవాళ్ళు ప్రతిమాట ముందు సాయి అనే పదం చేర్చి మాట్లాడతారు. ఆఖరికి మనము తినే పదార్థాలు గాని కూరగాయలు గాని వాటి ముందు భగవంతుని నామాన్ని చేర్చి పలుకుతారు. ఒకాయన రామ భక్తుడట.
రామ ములక్కాయ, రామ వంకాయ, రామ సాంబారు ఇలా పలుకుతాడట.

ఒకసారి నేను రైలులో వస్తున్నాను. యిద్దరు నా కంపార్ట్ మెంట్లో ఉన్నారు. అందులో ఒకతను సాయి భక్తుడు గావును. మరి యే సాయి భక్తుడో తెలియదు. యేది యేమైనప్పటికి , అతను తన తోటివానిని పెరుముందర సాయి అని , మిగతావారిని కూడా సాయి అని సంబోథించాడు. యింతలో టీ అమ్మే కుర్రవాడు వచ్చాడు యితను ఆ టీ అబ్బాయిని "యే సాయిరాం టీ " అని పిలిచాడు. అందుచేత యేదైనా మనం అలవాటు చేసుకుంటే చాలు. యిక ప్రతీక్షణం సాయి నామం మననోటిలో కదలాడుతూ ఉంటుంది.

కొంతమంది స్త్రీలను చూడండి. చక్కగా మడిబట్ట కట్టుకుని వంట చేసుకునేటప్పుడు కూడా, లక్ష్మీ సహస్రం గాని, విష్ను సహస్రం గాని చదువుకుంటూ వంట చేస్తారు. ఆ వంట పవత్రమౌతుంది.

యిప్పుడు మడి కట్టుకుని వంట చేసేటంతటి తీరికెక్కడ ఉంది. అంతా స్పీడు యుగం. ఎల్.కే.జీ. పిల్లవాడి నించి కూడా స్కూలుకి పంపాలంటే ఉరుకులు పరుగులు, స్నానం చేయడానికి కుడా సమయం లేకుండా వంట పనులు.

మీకు నవ్వు రావచ్చు. చెప్పేది వెర్రితనం కావచ్చు. ఒకచోట చదివాను. వంట చేసేటప్పుడు పులుసు గాని కూర గాని కలియపెట్టేటప్పుడు గరిటతో "ఓం" అని రాస్తే చక్కగా ఉంటుంది అని. మీకు తెలుసో తెలియదో గ్లాసులో ఉన్న మంచినీటిని మంత్రిస్తే అది పవిత్రమవుతుంది.

మనకు అద్భుతమైన సాయి మంత్రం ఉంది కదా. మనం వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు సాయి నామ స్మరణతోనే చేయండి. మనం యెలాగూ సాయికి సమర్పించే , భోజనం మొదలు పెడతాము. తినేముందు కొంచం అన్నం తీసి బయట గోడ మీద యేదైనా పక్షుల కోసం ఆహారంగా పెట్టండి. వాటిని ప్రత్యేకంగా పిలవనక్కరలేదు. ఆహారాన్ని వెదుకుతూ అవే వస్తాయి.

నాకు యెన్నొ సంవత్సరాలనించి అలవాటు. తినే ముందు కొంచం అన్నం ముద్ద చేసి గోడమీద పెడతాను. అక్కడ ఆసమయానికి కాలులు సిథ్థంగా ఉండి వెంటనె తినడానికి వస్తాయి. అఖరికి బయటినించి టిఫిన్ తెచ్చుకున్నా కొంచం అందులోనించి తీసి బయట కాకుల కోసం పెడుతూ ఉంటాను.
అవి తింటుంటే అదొక తృప్తి. రైలులో ప్రయాణం చేసేటప్పుడు కూడా, బిస్కట్టు తిన్నా అందులో కొంత బయటకు విసురుతాను. పిచుకలు గాని, కాకులు గాని ఆహారంగా తీసుకుంటాయని.

ఇప్పుడు నేను చెప్పినదంతా యేదో సోది అనుకోకండి. భగవంతుడికిష్టమైన పనులు. కాదంటారా?

భగవ్ద్భక్తిలో ఉన్నవాడు భగవంతునికిష్టమైనవన్నీ చేస్తాడు. అది యితరులకి పిచ్చితనంగా కనిపించినా పట్టించుకోడు.

బాబాయే చెప్పారు ఆకలిగొన్నవారికి కాస్త అన్నం పెట్టు అని. తనని అన్ని ప్రాణులలోనూ చూడమన్నారు.

అప్పుడే మనసాయి మన హృదయంలో స్థిరంగా ఉంటాడు. బాబాయే మన మనసులో ఉన్నప్పుడు మనకి నిశ్చింత


****************



ఆథ్యాత్మికతను పెంచుకునే మార్గాలు::

నిరాశా, నిస్పృహలతో బాథపడుతూ ఉన్నప్పుడు ఉన్నతమైన గ్రంథాలను పఠించాలి, లేద మహనీయులు, మహాత్ములు రాసిన ఆథ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఒక నెలకాలం కేటాయించి తీర్థయాత్రలు చేయాలి లేదా ఒక పవిత్ర స్థలంలో ఉంటూ నెలరోజులుగాని, ఒక పక్షం రోజులుగాని గడపాలి. అక్కడ సమయాన్ని జపము, భజన, థ్యానంతో గడపాలి. కొంత దూరం నడవాలి. యివి అలజడితో నిండిన మనస్సుకు, అలసిపోయన నీకూ ప్రశాంతతనిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నమ్మకాన్ని, ఆత్య్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి.

మనశ్శాంతిని పరిరక్షించుకోవాలంటే ఆథ్యాత్మిక చింతనలను పెంపొందించుకోవాలి. అది మన జీవితాన్ని ఒక క్రమమైన పథ్థతిలో నడవటానికి దోహదం చేస్తుంది.




ఈ రోజు బాబా లీల కాకుండా కొన్ని ఆథ్యాత్మిక విషయాలు రాయడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చకపోతే నాకు మైల్ చేయండి. తరువాతనించి బాబా లీలలనే ప్రచురిస్తాను. యెందుకంటే మథ్య మథ్యలో బాబా తత్వం గురించి, కొన్ని ఆథ్యాత్మిక విషయాల గురించి నాకు తోచినంతలో వివరణ ఇద్దామనె ఉద్దేశ్యం. నా మైల్ tyagaraju.a@gmail.com )


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Wednesday, May 11, 2011

మొదటిసారి షిరిడీ యాత్ర - అనుభవాలు

0 comments Posted by tyagaraju on 8:35 PM




















12.05.2011 గురువారము


మొదటిసారి షిరిడీ యాత్ర - అనుభవాలు




ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులందరకు బాబా వారి శుభాశీశ్శులు

ఈ రోజు మనము సుకన్య గారు సేకరించి పంపిన ఒక బాబా లీల గురించి చదువుకుందాము.

ఈ లీలానుభవం శ్రి సాయి రామ ప్రకాష్ గారిది. ఆయన బెంగళూరు వాస్తవ్యులు. ఆయన మొట్టమొదటిసారిగా షిరిడీ వెడుతున్నప్పటి అనుభూతి ఈ రోజు మనమందరం చదువుకుందాము.

ఈ లీలని వారి మాటలలోనే తెలుసుకుందాము


నాపేరు రామసాయి ప్రకాష్. మాది బెంగళూరు. నేను షిరిడి దర్శించడం మొదటిసారి, నేను ఒక్కడినే ప్రయాణం ప్రారంభించాను ... అప్పుడు.........

యెలా వర్ణించాలో నాకు తెలియదు. నా అనుభవాన్ని వివరించడానికి నాకు మాటలు రావు.

బాబా దయ వల్ల నేను ప్రయాణం ప్రారంభించాను. రైలు కంపార్టు మెంట్ లో నాకొక యువకుడు తారసిల్లాడు. అతను కూడా షిరిడి వస్తున్నాడు. నా సీట్ నంబరు 34, అతనిది 38. అతను ఒక్కటే అడిగాడు "మీరు కూడా షిరిడీ వస్తున్నారా" అని. అప్పుడు నేను "అవును యిదే మొదటిసారి నాకు సహాయం చేయగలరా " అన్నాను. అప్పుడతను అన్నాడు, ఆందోళన పడద్దు, నేను 10 సంవత్సరాలనుండీ షిరిడీ వెడుతున్నాను, ఇది నా 17 వ సారి వెళ్ళడం. అప్పుడు నేను సంతోషించాను. యెందుకంటే అతనికి షిరిడీలో చుట్టు పక్కల ప్రతీ ప్రదేశం తెలుసునని చెప్పాడు. అరగంటలో అతను నాకు దగ్గరి స్నేహితుడుగా అయ్యాడు (నా కుటుంబములోని వ్యక్తిగా). అతను నన్ను, మళ్ళి యెప్పుడు తిరిగి వెడతారు అని అడిగాడు. నేనింకా నిర్ణయించుకోలేదు, యెందుకంటే తిరుగు రిజర్వేషన్ చేయించుకోలేదని చెప్పాను. అతను "నేను 20 తారీకున తిరిగి వెడతాను, మీరు కూడా నాతో వస్తారా" అని అడిగాడు. అప్పుడు నేను, "వస్తానని చెప్పాను. అప్పుడతను బంగళూరులో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి తత్కాల్ లో రెండు టిక్కట్టులు రిజర్వె చేసి, ఆ టిక్కట్ట్లని తన మైల్ ఐ.డీ. కి పంపమని చెప్పాడు. (మరుసటిరోజు పొద్దున్నే 17 తారీకున, అతని స్నేహిటుడు టికెట్స్ రెజర్వె చేసి మైల్ లో పంపించాడు)

అప్పుడు నేను వసతి గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడతను, తను తన యిద్దరు కజిన్స్ తొ వస్తున్నానని, వాళ్ళు అప్పుడే హోటల్లొ గది రిజర్వె చేశారని చెప్పాడు. అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. కాని, అప్పుడు ఒకామె తన కొడుకుతో మా కంపార్టు మెంట్ లో కి వచ్చింది. ఆమె కూడా షిరిడీ వస్తొంది. గంట సేపు మాట్లాడుకున్నాక, నేను షిరిడీలో యక్కడ ఉంటానని అడిగింది. అప్పుడు నేను యింకా నిర్ణయించుకోలేదు, కాని నా స్నేహితుడు నాకు గది యేర్పాటు చేశాడని చెప్పాను. అప్పుడామె, తను అప్పటికే ఒక రోజుకి గది బుక్ చేశానని, మధ్యాహ్నము, రాత్రి భోజనం ఉచితమని చెప్పింది. తాను ఆ గదిలో కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటానని, తరువాత తన అబ్బాయితో నాసిక్ వెడతాని చెప్పింది. మీకిష్టమయితే, మీరు ఆ గదిలో ఉండచ్చు, నేను ఒక రోజుకి డబ్బు చెల్లిస్తాను అని అంది.
ఇక్కడ బాబా లీల చూడండి. సాయి నాకు తిరుగు ప్రయాణానికి టిక్కట్టు యేర్పాటు చేశారు, ఉండటానికి ఒక గది, 16 సారులు షిరిడీని దర్శించి అనుభవమున్న మితృడు, యింక బాబానించి నాకేమి కావాలి.

మరునాడు మధ్యాహ్నం 2 గంటలకి మేము కోపర్ గావ్ చేరుకున్నాము. మేమంతా అంటే నేను, నా మితృడు, అతని యిద్దరు కజిన్స్, ఆ స్త్రీ, వాళ్ళ అబ్బాయి మొత్తం ఆరు మందిమి ఒక ఆటో మాట్లాడుకున్నాము. మొట్టమొదట మేము బాబా 16 సంవత్సరాలు తపస్సు చేసిన తపోభూమిని దర్శించుకున్నాము. తరువాత మేము గోదావరి నది కి వెళ్ళి, ముఖం కడుక్కుని కొంత నీరు నెత్తిమీద చల్లుకున్నాము. తరువాత మేము లాద్జ్ కి వెళ్ళాము. మేమంతా స్నానాలు చేసి సాయంత్రం 5 గంటలకి ఖండొబా మందిరానికి వెళ్ళాము. 6.30 కి మేము దర్శనానికి వెళ్ళాము. 8.30 కి మేము సమాధి మందిరంలో దర్శనం చేసుకున్నాము. తరువాత మేము చావడికి చేరుకున్నాము. ఆరోజు గురువారం కాబట్టి రాత్రి 9.15 కి మేము పల్లకీ సేవ (చావడి ఉత్సవం ) చూశాము.

మేము రాత్రి 10 గంటలకి రూముకి వచ్చాము, భోజనం చేసి తిరిగి ద్వారకామాయికి వచ్చాము. మేము ద్వారకామాయిలో సచ్చరిత్ర చదువుకుంటూ, ఉన్నాము, "ఓం సాయిరాం" రాస్తూ ,రాత్రి 1.30 దాకా ఉన్నాము. తరువాత రూముకి తిరిగివచ్చి నిద్రపోయాము.

పొద్దున్నే టిఫిన్ చేసి, ష్యామా గారి యింటికి , మహల్సాపతి యింటికి, తరువాత లక్ష్మీబాయి షిండే యింటికి వెళ్ళాము.

మధ్యాహ్నం 12 గంటలకి పంచముఖి గణేష్ (విష్ను గనేష్) మందిరానికి వెళ్ళాము. ఇది షిరిడీనించి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడికి వెళ్ళి దర్శనంచేసుకుని అక్కడే ప్రసాదం (లంచ్) తీసుకున్నాము. ప్రతీరోజు మధ్యాహ్నం 12.30 కి గుడికి వచ్చినవాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం పెడతారట.

ప్రసాదం (ఆంధ్రా భోజనం) చాలా రుచికరంగా ఉంది.

తిరిగి వచ్చి గుడికి వెళ్ళాము.

బాబా లీల ::

సాయంత్రం నా స్నేహితుడు సాయిథాం కి తీసుకుని వెళ్ళాడు. (నేనకోవడం చాలా మందికి ప్రదేశం తెలీదు) షిరిడీ నించి 22 కి.మీ. కోపర్గావ్ నించి 6 కి.మీ. అక్కడ ధోనీ బాబా, లేక చవన్ బాబా అనె పేరుతో ఒక సాయి భక్తుడు ఉన్నారు. సాయిబాబా ప్రేరణతో ఆయన సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటారు. (జ్యోతిష్యం, లేక భవిష్యత్తు చెప్పడం, లేక సాయిబాబా ఆయన శరీరంలోకి వచ్చి చెపుతూ ఉండవచ్చు).

సాయిథాం ఆవరణలో సాయిథామ అని పిలవబడే ఒక చిన్న యిల్లు ఉంది. యింకా ఒక సాయి మందిరం కూడా ఉంది. యింకా ఒక గది ఉందిగాని అది కింద భూగృహంలో ఉంది.

అప్పటికే అక్కడ కొన్ని లీలలు ఉన్నాయి.

1. సాయిథాం లో బాబా విగ్రహం ముందర నేలమీద పాలరాతి పలకల మీద "ఓం, త్రిశూలము" కనిపించాయి.

2. బాబా గుడి వెనక ఒక కొబ్బరిచెట్టు ఉంది. ఆ చెట్టులో మీకు సాయిబాబా వదనం కనపడుతుంది.. (టెలివిజన్ మరియు వార్తా పత్రికలు ఫొటొలతో సహా ఇచ్చాయి) (ఫొటొ సాయిథాం గదిలో ఉంది)

3. కింద నేలమాళిగలో ఉన్న గదిలో బాబా ముందర గోడమీద ఉన్న పాలరాతి పలకలో సాయిబాబా వదనం కనపడింది.

4. అక్కడ శునకం ఆరతి యిస్తుంది.

మేము ముగ్గురం, అక్కడకి రాత్రి 7.15 కి వెళ్ళాము. ధోనీ బాబా యిల్లు సాయిధాం కి యెదురుగా ఉంది. సాయిథాం లోకి వెళ్ళాక, మేము బాబా ని చూడటానికి వెళ్ళాము, కాని మేము ధోనీబాబా ని చూసినప్పుడు ఆయన కోపంతో అరవడం మొదలుపెట్టారు " పొండి, .. పొండి ... నేను యేమీ చెప్పను ఇక్కడినించి వెళ్ళిపొండి..

మేము తిరిగి గుడికి వచ్చాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ధోనీ బాబా తన యింటినించి సాయిథాం వైపు వెళ్ళడం చూశాము...మళ్ళీ మేము తిరిగి అక్కడికి వెళ్ళాము. యేమైనా ఆయన మమ్మల్ని చూసి మళ్ళి అరవడం మొదలుపెట్టారు .. "వెళ్ళిపోండి.. నేను మీకేమీ చెప్పదలచుకోలేదు". అప్పుడు నేను ధోనీబాబాతో "నేను మిమ్మలనించి యేమీ ఆశించడంలేదు, నాకేమీ చెప్పద్దు, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ పాదాలు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి" అన్నాను. అందుకాయన ఒప్పుకుని మాముందర నిలిచున్నారు. యేమైనప్పటికి నేను ఆయన పాదాలు ముట్టుకున్నాను, హటాత్తుగా ఆయన ప్రసన్నంగా మారి నన్ను ఆశీర్వదించారు, నా భుజం మీద చేయి వేసి లోపలకు రమ్మన్నారు. నన్ను సాయిబాబా ఫోటొ దగ్గిరకి తీసుకుని వెళ్ళి, అరుస్తూ బాబా నిన్ను దక్షిణ అడుగుతున్నారు, దక్షిణ ఇవ్వు..బాబా దక్షిణ అడుగుతున్నారు దక్షిణ ఇవ్వు మళ్ళి తిరిగి అన్నారు..

హటాత్తుగా నేను షాక్ తిని సాయిబాబా ఫొటో దగ్గిరకి వెళ్ళి, నేను నా పర్స్ తెరిచి చూశాను. అందులో రెండు నోట్లు ఉన్నాయి. ఒకటి 500/- మరొకటి 100/- నోటు. మొదట 500/- రూపాయల నోటు ఇద్దామనుకున్నాను. అప్పుడు నా మనసు మారిపోయింది 100/- రూపాయల నోటు బాబా ఫోటో ముందర పెట్టి వెనక్కి వచ్చాను. అప్పుడు ధోనీ బాబా "మొదట నువ్వు 500/- పెడదామనుకున్నావు..తరువాత 100/- రూ.పెట్టావు అవునా" అని అడిగారు. నేను "ఆవునని చెప్పాను. అప్పుడాయన అన్నారు "నిన్న నువ్వు షిరిడీలో 500/- ఇచ్చావు అవునా" ?
నేను "అవును" అని చెప్పాను. (యెందుకంటే కిందటిరోజు గురువారము నేను షిరిడీలో 501/-రూ. డొనేషన్ ఇచ్చాను.
అప్పుడాయన నవ్వుతూ "బాబా నించి నీకేమి కావాలి?" అన్నారు.
నాకేమీ వద్దు అని చెప్పాను. అప్పుడాయన, తొందరలోనే నీ వివాహం అవుతుంది వెళ్ళు అన్నారు. అప్పుడాయన నీకెవరైనా జెం స్టోన్ పెట్టుకోమని సలహా ఇచ్చారా? అని అడిగారు. నేను అవునన్నాను. జెం స్టోనె పెట్టుకోమని నీకెవరు చెప్పారు? అన్నారు. కొంతమంది జ్యోతిష్కులు 2-3 సంవత్సరాలనించి చెప్పారు, కాని నేను పెట్టుకోలేదు అని చెప్పాను. నేను నా అఱచేయితెరిచాను , ఆయన ఒక రాయి ఇచ్చారు. (అది చాలా అద్భుతం ఆయన తన సూన్య హస్తాన్నించి ఒక మెరిసే రాయినిచ్చారు). అప్పుడాయన ఆ రాయి సాయిబాబా ఇచ్చారు, నేను కాదు, అని చెప్పారు.
అప్పుడాయన నా స్నేహితుడితో "యితను సాయిబాబా బిడ్డ..యితనికి ఆయనమీద నిజమైన భక్తి ఉంది..యితని చేతిలో సాయిబాబా చేయి ఉంది" అన్నారు. ఆ సమయంలో నా అనుభూతిని వర్ణించలేను. మేము బయటకి వచ్చిన తరువాత, ఆయన తన యింటిలోనించి ప్రసాదం పొట్లాలు నాకు నా స్నేహితులకి ఇచ్చారు. మా స్నేహితులుకూడా, తమకు కూడా యేదైనా చెప్పమని అడిగారు. అప్పుడాయన "మీరు సాయంత్రం ఆరతికి ముందు రండి, ఇప్పుడేమీ చెప్పను" అన్నారు.

ద్వారకామాయి ఉదయం 4 గంటలకు తెరిచారు. నేను కొబ్బరికాయని బాబా ముందు పెట్టాను. (అక్కడ ఒక ప్లాస్తిక్ బకెట్ ఉంటుంది. మనం కోరిక కోరుకుని ఆ కొబ్బరికాయని ఆ బాస్కెట్ లో ఉంచాలి). మేము మరలా ఉదయం ఆరతి అయ్యేంతవరకూ ద్వారకామాయిలో కూర్చున్నాము. తరువాత మేము లాద్జ్ కి వెళ్ళి కొన్ని గంటలు నిద్రపోయాము.

ఉదయం 8 గంటలకి శనిషింగణాపూర్ వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకి వచ్చాము. తరువాత నేను లెండీబాగ్, గురుస్థాన్, నందదీప్, మ్యూజియం,శివాజీ మందిరం, శనిదేవు, గనేష్జీ, దత్త మందిరం, చూశాను. మరలా నేను యింకొకసారి దర్శనం చేసుకున్నాను. తరువాత నేను కొన్ని పుస్తకాలు, కీ చైన్స్, ఫోటోలు, చిన్న విగ్రహాలు, కాలెండర్లు, కొన్నాను. నేను డొనేషన్ ఇచ్చి కొన్ని ఊదీ పొట్లాలు తీసుకున్నాను.

శనివారం రాత్రి మరలా ద్వారకామాయికి వచ్చి 2.30 వరకూ అక్కడ ఉన్నాను. సచ్చరిత్ర చదువుతూ, ఓం సాయిరాం రాస్తూ, సమయం గడిపాను. అక్కడ రాథామోహన్ అని పిలవబడే స్వామి ఒకాయన ఉన్నారు, ఆయనెప్పుడూ సాయిబాబా సేవ చేస్తూ ఉంటారు. ఆయన "సాయి ప్రేరణ" పుస్తకం ఒక కాపీ ఇచ్చి ప్రతీ గురువారం దానిని చదవమన్నారు, కుదిరితే ప్రతీరోజూ చదవమన్నారు. అప్పుడు ఆయన యెఱ్ఱ సిరాతో "ఓం సాయిరాం" రాయమన్నారు. ఆయన నాకు ఒకశివ సాయి ఫొటో కూడా ఇచ్చారు. "సాయి ప్రేరణ" చదివితే మన కోరికలన్ని తొందరలోనే తీరతాయని చెప్పారు.

సాయి ప్రేరణ యెవరికన్నా కావాలంటే నాకు మైల్ చేయండి, స్కాన్ చేసి పంపిస్తాను.

యిందులో చాలా వ్యాకరణ దోషాలూ, పద దోషాలూ ఉంటాయని నాకు తెలుసు. నా తప్పులని మన్నించండి.

బంగళూరులో ఉన్నవారెవరికైనా ఊదీ కావాలంటే నా దగ్గిరనించి పొందవచ్చు. నా వద్దనించి మరేదైనా వివరాలు కాని, సాయి సేవ కాని కావాలంటే నేను సిథ్థంగా ఉన్నాను. సాయి భక్తులకి సేవ చేసే అవకాశాన్నివ్వండి.

సాయికి నేను విథేయుడైన బానిసను. సాయి సేవ గురించి యెవరైనా యెప్పుడైన్న నాతో మాట్లాడవచ్చు.

నేనుప్పుడూ 24/7 X 365 ఉంటాను.

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.

నా అనుభవాన్ని చదివిన భక్తులందరూ దయచేసి నా మైల్ ఇ.డీ. కి జవాబివ్వండి లేకపోతే నా సెల్ల్ నంబరుకి ఎస్.ఎం.ఎస్. ఇవ్వండి. 09986002003.

మీ సమాథానం కోసం యెదురు చూస్తూ ఉంటాను.

నా తరువాతి ఉత్తరంలో సాయిథాం ఫోటోలు, చవన్ బాబా ఫోటోలు ఉంచుతాను.

రాంసాయిప్రకాష్
బెంగళూరు.

--------------------------------------------------------------------------------------------------


పైన ఇచ్చిన చిత్రాలలో ధోనీ బాబా వారిని, శ్రి రామసాయి ప్రకాష్ గారిని, పాలరాతి మీద ఓం త్రిశూలం, ధోనీ బాబా వారు ఇచ్చిన జెం స్టొన్ చూడండి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Tuesday, May 10, 2011

షిరిడి దర్శించే వారికి సమాచారం -- 2

0 comments Posted by tyagaraju on 11:53 PM




11.05.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

షిరిడి దర్శించే వారికి సమాచారం -- 2 పల్లకీ సేవ - 2

సాయి బంథువులందరికి షిరిడీ దర్శన అనుగ్రహ ప్రాప్తిరస్తు


నిన్న మనం షిరిడీ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాము, ఈ రోజు మరికొంత సమాచారం తెలుసుకుందాము.
యింతకుముందు పల్లకీ సేవ లీల ఒకటి చదివాము. ఈ రోజు మరొక పల్లకీ సేవ లీల తెలుసుకుందాము.


ద్వారకామాయిలో మనము చూసే బాబా పటాన్ని శ్రి జయకర్ గారు చిత్రించారు. దాని గురించిన కథ యింతకుముందు ఈ బ్లాగులోనే ఉంది చదవండి. ఈ పటానికెదురుగా వెండి పాదుకలున్నాయి. దాసుగణు మహరాజ్ కి సాయి తన కాలి బొటన వేళ్ళనించి గంగా యమునలు స్రవింపచేసిన లీల ఇక్కడే.

ద్వారకా మాయిలో కి మీరు ప్రవేశించగానే, యెడమవైపునించి లైనులో వెడుతూ ఉంటే, యెడమవైపున చిన్న కొయ్య స్తంభం ఉంటుంది. ఇప్పుడు దాని చుట్టూ రక్షణ వలయంగా సన్నటి స్టీలు రాడ్లు బిగించారు. ఈ కొయ్య స్తంభానికి మోకాళ్ళు తగిలిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. అక్కడినించి మెట్లు యెక్కి పైకి వెళ్ళగానె యెడమవైపున థుని ఉంటుంది. ఈ థుని బాబా గారు జీవించి ఉన్నఫ్ఫుడు వెలిగించిన థుని, ఇప్పటికీ అది వెలుగుతూనే ఉంది. థుని దగ్గరలో రాతిపీట ఉండేది. బాబా అప్పుడప్పుడు దీనిపై కూర్చుని స్నానం చేసేవారు. మసీదు నైఋతి మూలలో థునికి పక్కన ఒక మట్టికుండ వుంది. అందులోని నీరు తాగడానికి, ముఖం కడుక్కోవడానికి వాడేవారు. (యిదివరకు ఈ మట్టికుండలోనీరు భక్తులందరూ తాగడానికి వీలుగా ఉండేది. యిప్పుడు యెలా ఉందో తెలియదు. )

బాబా బిక్షకు వెళ్ళినప్పుడు, తెచ్చిన పదార్థాలన్ని నీటికుండ పక్కనే వున్న కొళంబె (మట్టిపాత్ర) లో వేసి, మూత పెట్టేవారు కాదు. ఈ కొళంబే కూడా చూడవచ్చు. (కొళంబేలో కూడా నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు.)

తరువాత అక్కడ పక్కనే మూల బాబా గోథుమలు విసరిన తిరగలి ఉంటుంది. తిరగలి పక్కనే అద్దాల బీరువాలో గోథుమల బస్తా ఉంటుంది. బాలాజి పాటిల్ నేవాస్కర్ సాయిని నిష్కల్మషంగా సేవించిన భక్తుడు. తనకు పండిన పంటనంతా బళ్ళమీద తెచ్చి బాబాకి సమర్పించేవాడు. తరువాత బాబా యెంత ఇస్తే అంత తీసుకునేవాడట. ఇందుకు గుర్తుగా వారి కుటుంబ సభ్యులు కూడా బాలాజీ వంశీకులు నేటికీ సమర్పించే గోథుమల బస్తా యిక్కడుంచుతారు. సంవత్సరానికొకసారి శ్రీరామనవమినాడు ఉదయం ఆ బస్తాలోని గోథుమలు ప్రసాదాలయానికి తీసుకువెళ్ళి, పిండిచేసె, భక్తులకు ప్రసాదంగా పంచుతారు. మళ్ళీ ఆ స్థానంలో కొత్త గోథుమల బస్తా ఉంచుతారు. ఈ గోథుమలు సంవత్సరకాలం నిలవ ఉన్నాకూడా, యే జాగ్రత్తలూ తీసుకోకపోయినా పురుగు పట్టడం, చెడకపోవడం విసేషం.

మసీదులో పడమటి గూటిని నింబార్ అంటారు. నింబారుకు ముందుగా మశీదు పైకప్పు దూలాలకు రెండు కొక్కాలు కనిపిస్తాయి. ఈ కొక్కలకే బాబా కొయ్యబల్ల కట్టుకుని నిద్రించేవారు. నింబారు పక్కనే దీపస్తంభాలుంటాయి. తిరగలి ఉన్న మూల ఒక అలమారలో బాబా చిలిం గొట్టాలుంచేవారు. ప్రస్తుతం యివి ప్రదర్శన శాలలో ఉంచారు. ఇక మశీదు పైనుండి మెట్లు దిగిరాగానే హాలులో ఈశాన్యమూల సాయి ప్రతిష్టించిన తులసి బృదావనం ఉంటుంది. రేకుల షెడ్డులో మెట్లకెదురుగా తూర్పు పక్క గోడనానుకుని ఒక రాయి ఉంటుంది. సాయి తరచు మథ్యాహ్న సమయంలో దానిపై కూర్చునేవారు. ఆ రాతి వెనుక పెద్ద ఫ్రేముతో బ్లాక్ అండ్ వైట్లో బాబాగారి చిత్రపటం ఉంటుంది.

రాతిబండ పక్కనే దక్షిణంవైపున చిన్న పులి విగ్రహం ఉంటుంది. రాతి బండకు పక్కన ఉత్తరం పైపున గుఱ్ఱం , విగ్రహం ఉంటుంది.

ద్వారకామాయి హాలు మథ్యన నేలలో ఒక చిన్న పాలరాతి తాబేలు పలక ఉంటుంది. ఆరతి సమయంలో శ్యామకర్ణ యిక్కడే నిలబడేది.

మధ్యాహ్న ఆరతి తర్వాత, లెండీ బాగుకి వెళ్ళేముందు, సాయంత్రంపూట బాబా మశీదు ముందుగల మట్టిగోడకి ఆనుకుని నిలబడి దారినపోయే గ్రామస్తులను కుశలప్రశ్నలు వేసి పలకరిస్తూఉండేవారు. ఇక్కడ చిన్నమందిరంలో సాయి పాదుకలని అమర్చారు. బాబా ముందుకు వంగి గోడమీద చేతులు ఆనించినచోట మరొక జత చిన్న పాదుకలని అమర్చారు.

మసీదులో దక్షిణం పక్కన గోడని ఆనుకుని సాయి స్వయంగా వంట చేసిన పొయ్యి ఉంటుంది. ఈ పొయ్యికి యెదురుగా 2.5 అడుగుల యెత్తు కఱ్ఱ గుంజ ఉంటుంది. వంట చేసెటప్పుడు బాబా దానికి ఆనుకునేవారు.

బాబా భక్తుడైన సాయ్ శరణ్ ఆనంద్ ఒకసారి తీవ్రమైన మోకాలి నొప్పితో బాథపడుతుంటే మోకాలుని ఆ కఱ్ఱ గుంజకి తాకించి తరువాత దానిచుట్టూ ప్రదక్షిణలు చెయ్యమని సాయి సలహా యిచ్చారు. అలా చేయగానే ఆయన కాలినొప్పి తగ్గింది. (మీరు ద్వారకా మాయిలో దీని ప్రత్యెకంగా చూసి ప్రదక్షిణలు చేయండి. చాలా మందికి ఈ కఱ్ఱ గురించి, దాని విశిష్టత తెలీదు)

చెక్కతో చేయబడిని చిన్న అగరుబత్తి స్టాండు ద్వారకామాయి ప్రవేశద్వారం దగ్గిర కుడివైపున ఉంటుంది.
సాయి మధ్యాహ్న ఆరతి అయిన తరువాత ఈ అరుగుమీద కూర్చుని భక్తులకు ఊదీ ప్రసాదించేవారట.

మశీదులో ప్రవేశించాక యెడమ పక్కన పైభాగంలో పెద్ద యిత్తడి గంట ఉంటుంది. యిది సాయి కాలమ్నించీ ఉంది. దీనిని రోజూ మూడుసార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మోగించేవారు. మశీదు పైన రెండు జండాలు కనిపిస్తాయి.

మసీదు తరువాత చావడి చూడండి. చావడిలో ఉత్తరం గోడకి ఆనుకొని పద్ద రంగుల చిత్రపటం ఉంటుంది. బాబా చావడిలో నిద్రించేముందు రోజు శేజ్ ఆరతి, ఉదయం కాకడ ఆరతికి ఈ పటం ఉన్న చోటలోనే కూర్చొనేవారు. దీనిని గుజరాత్ లోని నౌసారి గ్రామానికి చిందిన అంబారాం అనే 18 సంవత్సరాలు యువకుడు చిత్రించాడు. చావడికి మథ్యలో కటకటాలుండి రెండు భాగాలుగా ఉంటుంది. బాబా తూర్పుభాగంలో నిద్రించేవారు. స్త్రీలు బాబాని యివతలనిండే దర్శించుకోవాలి, సాయి నిద్రించే ఆ భాగంలోకి వారికి ప్రవేశించడానికి అనుమతిలేదు. యిప్పటికీ ఆ ఆచారం అలా పాటిస్తూనే ఉన్నారు.

గురువారమునాడు చావడి ఉత్సవం చూడదగ్గది. షిరిడీలో మూడు రాత్రులు ఉండి నిద్ర చేయాలంటారు. అందుచేత మీరు షిరిడీ వెడితే మూడురోజులలో ఒకటి గురువారం వచ్చేలా చూసుకుని ప్రయాణం పెట్టుకోండి.

లెండీ బాగ్ ::

గురుస్థాన్ కి దగ్గరలో లెండీ బాగ్ ఉంది. సాయిబాబా కాలంలో అది చెట్ల తోపు. తరువాత లెండీ బాగ్ లో రకరకాల గులాబీలు, తులసి, సబ్జా లాంటి మొక్కలతో అందంగా ఉండేది. ఇక్కడ బాబా ఉపయోగించిన బావి కూడా ఉంది. అది కూడా యెవరినయినా అడిగి దానిని కూడా దర్శించండి.

తరువాత, మీరు నందా దీపం , ఔదుంబర వృక్షం, దత్తత్రేయ విగ్రహం ఇవన్ని దర్శించుకోండి. ఇక్కడ ఆవరణలొ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు భక్తులు.

యింకా ఇక్కడ మందిరం ఆవరణలో బాబా భక్తుల సమాథులు కూడా ఉన్నాయి.

సమాథి మందిరంలో కూడా బాబా వారి దివ్య మంగళ స్వరూపాన్ని కూడా దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందండి. బాబా విగ్రహం తయారీ వెనుక గల కథని కూడా యింతకు ముందు బ్లాగులో పోస్ట్ చేయడం జరిగింది. దానిని కూడా యిప్పుడే మరలా ఒకసారి చదువుకోండి. మీకు విగ్రహాన్ని చూడగానే బాబా యొక్క ఆ అద్భుతమైన లీల మదిలో మెదులుతూ శరీరం పులకరించిపోతుంది.


షిరిడీలో ఉండటానికి వసతులు

యిప్పుడు షిరిడీలొ చాలా హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి.

సాయి సంస్థాన్ వారి భక్త నివీఅస్ ఉంది. ఇది సమాథి మందిరం నించి కిలోమీటరు దూరంలో రహతా వైపుగా మన్మాడ్ రోడ్డుమీద ఉంది. యిందులో రమారమి 500 దాకా గదులు ఉన్నాయి. వరుస క్రమంలో గదులు కేటాయిస్తారు. ఇక్కడనించి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది. మందిరం వరకూ షేర్ ఆటో లు కూడా ఉంటాయి.

సంస్థాన్ వారి ప్రసాదాలయంలో భోజనం లభిస్తుంది. లెండీ బాగ్ కి పక్కన సంస్థాన్ కాంటీన్లో, క్యూ కాంప్లెక్స్ లో కూడా, టీ, కాఫీ, పాలు దొరుకుతాయి.

భక్తులకు ఊదీ, ప్రసాదాలు సమాథి మందిరం యెదురుగా ఉన్న కవుంటర్లో, ఆరతి తరవాత యిస్తారు. రాత్రి శేజ్ ఆరతి తరువాత ఇచ్చే సాయి ప్రసాదం చాలా మథురంగా ఉంటుంది.

భక్తులు సమర్పించిన వస్త్రాలు, గురువారము, ఆదివారములలో ఉదయం 8 గంటలకి కాంటీన్ కి, దీక్షిత్వాడాకి మథ్యలో వేలం వేస్తారు.

భక్త నివాస్ కాంటీన్లో కూడా టిఫిన్, భోజనం దొరుకుతుంది. యింకా మందిరానికి కొద్ది దూరంలోనే చాలా భోజన హోటల్స్ ఉన్నాయి.




మీ షిరిడీ యాత్ర ఫలప్రదం, శుభప్రదం అవాలని, అయేలా చేయమని సాయిని మనసరా ప్రార్థిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.








పల్లకీ సేవ - 2

మనము యింతకుముందు పల్లకీ సేవ గురించి ఒక లీల చదువుకున్నాము. ఇప్పుడు అటువంటిదే మరొక లీల తెలుసుకుందాము. ఈ లీలని హైదరాబాదు నించి శ్రీ నగేష్ గారు పంపించారు. యిది వారి స్వీయ అనుభవం. ఈ అనుభవాన్ని వారి మాటలలోనే తెలుసుకుందాము.

"అందరికీ బాబా ఆశీర్వాదములు"

నేను నిత్యం వెళ్ళే బాబా గుడి లో బాబా విగ్రహం ఎదురుగా ఒక వేప చెట్టు ఉంది ,అక్కడ బాబా గురుస్తానం ఏర్పాటు చేయాలనీ గుడి యజమానులు నిర్ణయించారు
జైపూర్ నుండి బాబా విగ్రహం తెపించారు .ఆ విగ్రహాన్ని ప్యాక్ చేసిపెట్టారు.నేను గుడిలో బాబా ను దర్శనం చేసుకొని బయటికి వస్తున్నాను ఒక స్త్రీ నన్ను చేయి పట్టుకొని "బాబు బాబా పల్లకి తీసి బయట పెట్టండి అని అడిగింది ,నేను మరి కొంతమంది కలిసి ఆ పల్లకి ని తీసి బయటకి తీసుకోని ప్యాక్ చేసిన బాబా విగ్రహం దగ్గర పెట్టమని చెప్పారు మేము అలాగే చేశాము ,యిప్పుడు ప్యాక్ లోని బాబా విగ్రహాన్ని తీసుకో ని వచ్చి బాబా గురుస్థానం దగ్గర పెట్టడం చేశాము. యిదంతా నా చేతుల మీద జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

యిది బాబా నాకు యిచ్చిన గొప్ప అవకాశంగా బావించాను.

సర్వం శ్రీ సాయినాథం సమర్పయామి

షిరిడీ దర్శించేవారికి సమాచారం

0 comments Posted by tyagaraju on 7:08 AM




10.05.2011 మంగళవారము


షిరిడీ దర్శించేవారికి సమాచారం

సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు.

ఈ రోజు మనము షిరిడీ వెళ్ళునప్పుడు కూడా తీసుకు వెళ్ళవలసినవి, అక్కడ చూడవలసిన ప్రదేశములు, అక్కడ మనమెలా సంచరించాలి వీటి గురించి తెలుసుకుందాము.

మనలో చాలా మంది షిరిడీ దర్శించి ఉంటారు, కొందరు మొదటి సారి వెడుతూ ఉండవచ్చు. యింతకుముందు దర్శించినవారికి కూడా కొన్ని విషయాలు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. లేక కొన్ని ప్రదేశాలు తెలిసున్న చూడటానికి సమయం చాలక చూసి ఉండకపోవచ్చు. అందుచేత ఈ సారి వెళ్ళినప్పుడు తప్పకుండా అన్ని ప్రదేశాలు చూసి వచ్చేలాగ ముందరే ప్రయాణం పెట్టుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది.

షిరిడీ వెళ్ళేముందు:
బయలుదేరే ముందు సచ్చరిత్ర వారం రోజులు పారాయణ చేయండి. శ్రథ్థగా చదవండి. సమయమంతా సాయి లీలలతోనూ, సాయి నామ స్మరణతోనూ గడపండి. షిరిడీ వెళ్ళినప్పుడు, మీరు చదివినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండండి.

షిరిడీ వెళ్ళేముందు తీసుకుని వెళ్ళవలసినవి::

1) సాయి సచ్ఛరిత్ర 2) ఆరతుల పుస్తకం 3) సాయి వెలిగించిన థునిలో వేయడానికి రావి, మేడి, తులసి పుల్లలు, గంథపు చెక్క, సాంబ్రాణి, ఆవు నెయ్యి, నవ థాన్యాలు, తేనె, పీచుతో ఉన్న కొబ్బరికాయ, 4) సాయి వెలిగించిన దీపాలలోకి నూనె, 5) ఉదయం హారతి తరువాత బాబాకి మంగళ స్నానం చేయించే నీటిలో కలపడానికి పన్నీరు.

(యివన్నీ కూడా సాథ్యమయినంత వరకు ప్రయాణానికి ముందే సేకరించి పెట్టుకుని కూడా తీసుకెడితే, మనం షిరిడీ వెళ్ళినప్పుడు వీటికోసం షాపుల వద్దకు వెళ్ళి కొనుక్కునే శ్రమ తప్పుతుంది, మనకి సమయం కూడా కలసి వస్తుంది)

షిరిడీ ప్రయాణంలో:

ప్రయాణంలో వీలయినంత యెక్కువ సమయం సాయి రూపాన్ని థ్యానిస్తూ, సాయి నామస్మరణతో గడపాలి. సచ్చరిత్ర, లేక సాయి లీలల పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి.

బాబా మొట్టమొదట అహ్మద్ నగర్ వచ్చారు. అక్కడ ఆలీ అనే మహాత్మునితో కొంతకాలం కలిసి ఉన్నారు. అందుచెత అహ్మద్ నగర్ మీదుగా బస్ లో వెళ్ళేవారు, అది స్మరించి ఆ పుణ్యభూమికి నమస్కరించుకోవాలి.

సాయి షిరిడీ చేరేముందు రహతా గ్రామం వచ్చారు. తరువాత కూడా తరచు దౌలూసేఠ్ అనే భక్తుని చూడటానికి వస్తూండేవారు. సాయి బాబా ఈ గ్రామం నుంచే విత్తనాలు తెచ్చి ప్రస్తుతం సమాథి మందిరం ఉన్న ప్రదేశంలో పూలతోట మొలిపించారు. అందుచేత రహతా చేరగానే సాయికీ, ఆ గ్రామానికి ఉన్న అనుబంథాన్ని స్మరించి ఆ భూమికి నమస్కరించుకోవాలి

షిరిడీ చేరగానే::

నా అనుమతి లేనిదే యెవరూ షిరిడీలో కాలు మోపలేరు అన్నారు బాబా. అనుచేత మనం షిరిడీలో కాలు మోపామంటే ఆయన మనలని రప్పించుకున్నారు. అందుచేత ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.

షిరిడీ ప్రవేశమే సర్వ దుహ్ ఖ పరిహారము అన్నారు బాబా. అందుకని ఆయన దయవల్ల మన కష్టాలన్ని తీరతాయనే నమ్మకంతో ఉండాలి.

షిరిడీ చేరిన తరవాత మనము యెక్కడ నడచినా ఆ బాటలోని ప్రతి యిసుక రేణువూ 60 సంవత్సరాల సాయి సంచరించారని గుర్తుకు తెచ్చుకుని ఆయన పాద స్పర్శతో పవిత్రమైన ప్రదేశమని భావంతో ఉండాలి. బాబా సామాన్యంగా పాదరక్షలు థరించేవారు కాదు. అందుచేత మనం యెండ వేడిమి లేనప్పుడు పాద రక్షలు లేకుండా నడిస్తే మంచిది.

లెండి బాగ్ యెదురుగా ఉన్న భవనంలో (దీక్షిత్వాడా వెనుక భాగం) సంస్థాన్ వారి పుస్తకాల షాపు ఉంది. యిక్కడ బాబా ఫొటోలు, సచ్చరిత్ర పుస్తకాలు అన్నీ దొరుకుతాయి. సచ్చరిత్ర ముందే కొనుక్కుని వుంచుకుని బాబాని దర్శించుకున్నప్పుడు అక్కడ పూజారిగారికి ఇస్తే బాబాకి తాకించి, గ్రంథాన్ని పవిత్రం చేసి యిస్తారు.

మందిరంలోని ఆవరణలో పెద్ద హాలు ఉంటుంది. ఇక్కడ సామూహికంగా సాయి సత్యనారాయణ పూజ జరిపిస్తారు. ఉదయం 6.00 నించి కౌటర్లో టిక్కట్టులు అమ్ముతారు.

సచ్చరిత్ర పారాయణ చేసుకొవడానికి పెద్ద హాలు కూడా ఉంది. ఇక్కడ అన్ని భాషల లో నూ సచ్చ్రిత్ర పుస్తకాలు ఉంటాయి.
ఇక్కడ అందరూ ప్రసాంతంగా కూర్చుని కాసేపు చదువుకుంటూ ఉంటారు.

గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేముందు అందులొ అగరు వత్తులు కూడా వెలిగించి పెట్టండి. అక్కడ వేప ఆకులు దొరికితే వాటిని బాబా ప్రసాదంగా తినండి.

సమాథి మందిరంలో బాబా దివ్య మంగళ స్వరూపాన్ని తదేకంగా చూడండి. మీరు లైనులో ఉన్నప్పుడు మీ వంతు వచ్చేవరకు మెల్లగా కదులుతూ ఉండండి. ముందుకు వెళ్ళాలనే ఆరాటంతో ముందరున్నవారిని తోసుకుని వెళ్ళకండి. బాబా దృష్టి అందరి మీద ఉంటుందని గుర్తుంచుకోండి. మన ప్రవర్తనని బట్టే ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. మనం బాబా ని దగ్గిరుండి చూశామా లేదా అన్నది కాదు, ఆయన అనుగ్రహం మనమీద ప్రసరించిందా లేదా అన్నదే ముఖ్యం. ఆయన అందరికీ అవకాసమిస్తారు. ఒకవేళ రద్దీలో మనకి తగిన అవకాశం రాక సరిగా చూడలేకపోయినా, బాబా అనుగ్రహం మనమీద తప్పకుండా ఉంటుంది. బాబా మరొకసారి నీ దర్శన భాగ్యం ఇవ్వు బాబా అని వేడుకోండి.

సమాథికి యెడమవైపునించి వెడితే, బాబా గారి పాదాలు, కుడివైపునించి వెడితే బాబా గారి శిరస్సు భాగము ఉంటాయి.
దర్శించుకుని భక్తి భావంతో శిరసు వంచి నమస్కరించుకోండి.


ద్వారకా మాయిలో మీకిష్టమైనంత సేపు కూర్చుని సచ్చరిత్ర చదవండి.
బాబాని దర్శించుకునేముందు, నైవేద్యానికి పాలకోవా, పూలదండలు, తీసుకుని వెళ్ళండి. కోవా బాబా కి తాకించి ప్రసాదంగా మనకి ఇస్తారు. బాబా కి కప్పడానికి శాలువా కూడా తీసుకుని వెళ్ళండి, బాబాకి తాకించి మరలా మనకి ఇస్తారు. ప్రతీ ఆదివారమునాడు మందిరం ఆవరణలో బాబా వారికి సమర్పించిన శాలువాలు, ఆయనని తుడవడానికి ఉపయోగించిన తువ్వాళ్ళు మొదలైనవై వేలం వేస్తారు. మనము పాటలో పాడుకుని కొనుక్కొవచ్చు. పక్కనే వారి షాపు కూడా ఉంది. అక్కడ కూడా కొనుక్కోవచ్చు.

మంగళ స్నానము::

కాకడ ఆరతి తర్వాత బాబా విగ్రహానికి మంగళ స్నానం చేయిస్తారు. తరువాత వేడి నీరు సిథ్థం చేస్తారు. మనం రోజ్ వాటర్ తీసుకుని వెడితే, ఆ రోజ్ వాటర్ సీసా తీసుకుని ఆ నీటిలో కలుపుతారు. ఆయనకి స్నానం చేయించిన నీటిని బయటకు కుళాయి ద్వారా పంపుతారట. ఆ పవిత్రమైన తీర్థాన్ని మనం తల మీద చల్లుకుని సీసాలో కూడా నింపి యింటికి పట్టుకెళ్ళవచ్చు. యిక్కడే బాబాకి నైవేద్యం పెట్టిన వెన్న ప్రసాదం కూడా ఇస్తారట.

యిక లోపల ఆవరణలో బాబా వస్తు ప్రదర్శన శాల కూడా ఉంది. లోపలికి వెళ్ళగానె, బాబా విగ్రహాన్ని ప్రతిష్టించకముందు సమాథి మీద ఉన్న బాబా చిత్రపటం ఉండేది. దీనిని శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడు చిత్రించినది. ప్రదర్శన శాలలో బాబా గారు ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన వస్తువులన్ని చక్కగా చూడండి.

బాబా గారు స్నానం చేయడానికి ఉపయోగించిన రాయి, వెండి గొడుగు, దీపాలు, వింజామర, మొఖమల్ కఫ్నీ, ఆయన వాడిన పాదరక్షలు, చావడి ఉత్సవంలో బాబా భుజాలమీద కప్పిన కోటు, యిత్తడి లోటాలు, చిలుము గొట్టాలు, అప్పటి గ్రామఫోను, తిరగలి, శ్యామ కర్ణకి చేసిన అలంకారాలు, బాబాకి సమర్పించిన రథము,, రాగి హండాలు, సటకా, బిక్షకు వాడిన డబ్బాలు, మొదలైనవన్ని చూడవచ్చు.

ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే దారిలో మారుతి ఆలయం ఉంది. గణపతి శని మహదేవ మందిరాలు, మహాలక్ష్మీ మందిరము, విఠల్ మందిరము, కానిఫ్ మందిరము, నరసిమ్హ మందిరము, విరోబా మందిరము, మాలుబా మందిరము, ఖందోబా మందిరము వీటినన్నిటినీ దర్శించండి.

అప్పటి సాయి భక్తుల యిళ్ళు::

శ్యామా యిళ్ళు, లక్ష్మీబాయి షిండే యిల్లు (యిది చావడికి యెదురుగా ఉన్న చిన్న వీథిలో కొంచెం దూరంలో ఉంది)
భక్త మహల్సాపతి యిల్లు. (యిది లక్ష్మీ బాయి షిండే యింటికి కొద్ది దూరంలో ఉంది)

బాబా రోజూ భిక్ష చేసిన ఐదు యిళ్ళు:

1) సఖారాం షెలకే: యిది చావడికి చాలా దగ్గరలో ఉంది.

2) వామన్ గోండ్కర్ : యిది చావడికి యెదురుగా సఖారాం యింటికి దగ్గరలో ఉంది.

3) బయ్యాజీ అప్పకోతే పాటిల్: (సాయి కుటీర్) యిది చావడినించి తూర్పుదిశగా యెడమవైపు సందులో నరశిమ్హ లాడ్జి వెనకాల ఉంది.

4) బాయజా బాయి కోతే పాటిల్ యిల్లు : యిది సాయి కుటీర్ పక్కనే ఉంది.

5) నంద్ మార్వాడీ యిల్లు :యిది ద్వారకా మాయికి దగ్గరగానె ఉంది. ఈ యింటికి బాబా ఆఖరుగా బిక్షకు వెళ్ళేవారట.

(ఇది ద్వారకా మాయి యెదురుగా పెద్ద ఫాన్సీ షాపు. షాపు బోర్డ్ మీద నంద్ మార్వాడీ యిల్లు అని తెలుగులో కూడా రాసి ఉండటం చూడవచ్చు)

యింకా చూడవలసిన ప్రదేశాలు:

1) కోపర్గావ్ యిక్కడ బాబా మందిరం చూడవచ్చు. బహుశా 10 కిలోమీటర్లు దూరం అనుకుంటాను. బాబా తపోభూమిలో సాయిబాబా మందిరం, యితర దేవాలయాలు ఉన్నాయి.

2) ఉపాసనీ బాబా ఆశ్రమం: షిరిడీకి ఆరు కిలోమీటర్ల దూరంలో సకోరీలో ఉంది.

3) శ్రీ శివనేసన్ సమాథి : ఈయన కోయంబత్తూరుకు చెందినవారు. బాబా కృప ఈయన మీద యెంతో ఉంది. యిది సాయి ప్రసాదాలయం నించి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలో వెళ్ళి రావచ్చు. తప్పక చూడవలసిన ప్రదేశం. చల్లగా ప్రసాంతంగా ఉంటుంది. (నేను వెళ్ళినప్పుడు చూశాను.)

4) శని సింగణాపూర్: యిది షిరిడీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖ శనీశ్వర ఆలయం ఉంది.

యిక్కడకు 7 కిలోమీటర్ల దూరంలో సోనయీలో జగదాంబ రేణుకా మాత మందిరం ఉంది.

తిరుగు ప్రయాణంలో :

షిరిడీలో మనం పొందిన అనుభూతిని, పవిత్ర బావాలని చక్కగా మన మనసుల్లో పదిలపరుచుకోవాలి. మనం ప్రయాణం చేసినంత సేపూ షిరిడీ లో మన అనుభూతులని, మనం చూసిన ప్రదేశాల గొప్ప తనాన్ని నెమరు వేసుకుంటూ సాయి స్మరణతో యిల్లు చేరాలి. మనం షిరిడీ వెళ్ళేది విహార యాత్రకి కాదు అని తెలుసుకోవాలి.

బాబా ఆజ్ఞ లేనిదే యెవరూ షిరిడీలో అడుగు పెట్టలేరు. షిరిడీ యాత్ర మనం అనుకుంటే అయ్యేది కాదు. అందుచేత ఈ అనుభవాన్ని చక్కగా పదికాలాలపాటు మన మనసుల్లో స్థిరంగా గుర్తుండిపోయేలా యాత్ర చేయండి.మనం చేసిన యాత్ర సార్థకమవ్వాలి.

షిరిడీలో అంగ వికలురు, సాథువులులాంటి వారికి ఒక్కరికైనా భోజనం పెట్టించాలి. పవిత్ర క్షేత్రాల్లో మనము చేసే ప్రతీ మంచి పనికి యెన్నో రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్ర వాక్యం.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, May 9, 2011

షిరిడీ కి మీ కోర్కెలు

0 comments Posted by tyagaraju on 3:41 AM

ఓం సాయిరాం

షిరిడీ కి మీ కోర్కెలు







సాయి బంథువులారా

ఉజ్జ్వలా దేవి గారు జూన్ నెల 19 తారీకున షిరిడీ వెడుతున్నారు. సాయి బంథువులందరికి యేమైనా కోరికలుంటే

ఆమెకి మైల్ చేయండి. మీ కోరికలన్ని ప్రింట్ తీసి షిరిడీ లో బాబా వారి సమాథి మందిరంలో బాబా వారి పాదాల వద్ద

ఉంచడం జరుగుతుంది. మీ మీ కోరికలన్ని ఆమెకు పంపించండి.

మైల్ ఐ. డీ.



ఓం సాయిరాం



ప్రతీ రోజు నాకు సాయి అనుభవాలు -- రవి

0 comments Posted by tyagaraju on 1:46 AM





ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి

09.05.2011 సోమవారము

సాయి బంథువులకు శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక బాబా లీలకు తెలుగు అనువాదం పోస్ట్ చేస్తున్నాను.



ప్రతీ రోజు నాకు సాయి అనుభవాలు -- రవి


కొంతమంది సాయి భక్తులు ప్రతీరోజూ ఆయన లీలలను అనుభవిస్తున్నారన్నది నిజం. ఈ రోజు నేను ఒక భక్తునికి బాబా వారు ప్రతీరోజు యేదో విథంగా తమ దర్శనాన్ని కలుగచేస్తున్న లీలని మీకు చెపుతాను. నేను రవిగారి మైల్ చదువుతున్నప్పుడు ఆయన యెన్నో విషయాలని చెపుతున్నట్లుగా నా కనిపించింది.
నేను రవి మైల్ చదువుతున్నప్పుడు అందులో నాకు అతనికి బాబా మీద ఉన్న ధృఢ భక్తి కనపడింది. నేను రవి మైల్ మరియు అతని బాబా మందిరం ఫొటొలు జత చెస్తున్నాను.

"ప్రియాంకా గారు, నేను మీ బ్లాగు చూశాను, నేను కూడా, ప్రతీరోజు బాబాతోకలిగే నా అనుభవాలని మీతో పంచుకుంటాను.
బాబా దయవల్ల నేను కూడా బాబా భక్తుడినే.నాకు ప్రతీరోజు ఆయన అనుభవాలు కలుగుతున్నాయి. ఆయన కటాక్షం నామీద, నా కుటుంబం మీద ఉన్నందుకు నేను మనస్పుర్తిగా కృతజ్ణుడను. మనం కనక ప్రతీ క్షణం గడిచేకొద్దీ సాయిని ప్రార్థించినా, గుర్తుచేసుకుంటూఉన్నా, అప్పుడు బాబా తప్పకుండా ప్రతీరోజు చక్కటి లీలలతో మనలని అనుగ్రహిస్తూ ఉంటారని నేను భావిస్తున్నాను.

ఆయన విథానం కొంచెం వేరుగా ఉంటుంది. ఒకోసారి ఆయన తన ఉనికిని , ఈ మైల్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, లేక యేమైనా బాథాకరమైన అనుభవాల ద్వారా, కలలు, ఆర్థిక నష్టాలు వగైరా, ఇలా ఆయన దివ్య చర్యల జాబితా అంతం లేనిది. సాయి బోథనలనించి నా అనుభవం 1990 నించి ఉంది. ప్రతీ సంఘటన కూడా మంచి అవనీ చెడు అవనీ నాకు గురువారమునాడే (బాబా వారము)_ జరుగుతున్నాయి. నా వివాహము గురువారము నాడు జరిగింది. మా యిద్దరు అబ్బాయిలు కూడా గురువారమునాడే జన్మించారు.
నేను భారతదేశానికి వచ్చేముందు చాలా విపరీతమైన నడుము నొప్పిగా ఉండేది. అప్పుడు నేను సచ్చరిత్ర చదువుతున్నాను, దాని వల్లే బాబా నా నడుము నొప్పిని తీసివేశారు. నాకు మెడకూడా తిప్పలేనంతగా స్పాండిలైటిస్ ఉంది. ఆఖరికి బాబా ఊదీ వల్ల ఆపరేషన్ లేకుండా ఒక అద్భుత లీలగా నయమయింది.

2004 ఫిబ్రవరిలో బాబా దయవల్ల షిరిడీ దర్శించుకున్నాను. షిరిడిలో 7 రోజులు ఉన్నాను. నేను షిరిడీ నించి తిరిగివచ్చిన తరువాత, నేను ఊ.ఎస్.ఏ. లో అడుగుపెట్టగానే సాయి నాకు ఉద్యోగం ఇచ్చారు.

సాయి నాకు మంచి విద్యనిచ్చారు. విజయవంతంగా నేను ఫుడ్ మరియు న్యూట్రిషన్ డీటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను.

చిన్న విగ్రహం కొనుక్కోవడానికి సాయి నాకు అవకాశమిచ్చారు, అది యెన్నోవిథాలుగా అద్భుతమైనది. సుందరమైన ఆ చిన్న విగ్రహంలో బాబా సజీవంగా ఉన్నారు.

ఇక్కడ నా చిన్న మందిరం ఫోటో జత చేస్తున్నాను. జీవితంలో నాకెప్పుడైనా ప్రశ్న గాని, సమస్య గాని యెదురైనప్పుడు సంజ్ణలకోసం ఆకాశంలోకి చూస్తాను. బాబా తగిన సూచన చేస్తారు. చాలా సార్లు నేను "ఎస్" ( "S" ) గుర్తులు ఆకాశం లో చూశాను.

అప్పుడప్పుడు నేను కాగితం మీద, "అవును" "కాదు" అని రాసి చీటీలు వేసి మా అబ్బాయి చేత బాబా సమాథానం కోసం తీయిస్తాను. మీతో నా అనుభవాలని పంచుకుంటున్నందుకు నాకు చాలా అనందంగా ఉంది. జీవితంలో ప్రతీవారికి బాబా అనుభూతులనిచ్చుగాక. యేలీలలను చదివినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకేసారి తన బిడ్డలనందరినీ సమంగా రక్షిస్తున్నందుకు సాయికి కృతజ్ణతలు చెపుతున్నాను.

మీకు కూడా యేమైనా అనుభవాలు ఉంటే రవిగారిలాగే అందిరితో పంచుకోండి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List