Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 7, 2011

పల్లకీ సేవ

0 comments Posted by tyagaraju on 8:52 AM


07.05.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్శులు

పల్లకీ సేవ

బాబా యెప్పుడు యెవరిని యెలా అనుగ్రహిస్తారో మనకు తెలియదు. ఈ విషయాన్ని మనము ప్రతీ లీలలోనూ చుస్తున్నాము. మము ఒక విథంగా అనుకొంటే మరొక విథంగా ఆయన తన లీలలను ప్రసాదిస్తారు. ఈ లీలలు మన ఊహకందనివి. అనుభవించినాక పదే పదే మరలా గుర్తుకు తెచ్చుకునేవిగా ఉంటాయి. అటువంటి మరొక అద్భుతమైన లీల ఈ రోజు మీకందిస్తున్నాను.


ఈ లీలను చెప్పినది మా మేనమామగారయిన శ్రీ పెయ్యేటి రంగారావు గారు. దీనిని వారి మాటలలోనే తెలుసుకుందాము.

"నేను కొన్ని సంవత్సరాల క్రితం షిరిడి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గురువారం (చావడి ఉత్సవం) పల్లకి ఉత్సవం జరుగుతోంది. నేను ద్వారకామాయి మెట్ల మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఒక పూజారి గారు, ఇలా రా అనినన్ను పిలిచి ద్వారకామాయి లోపలనున్న బాబా వారి పల్లకిని బయటకు తీసుకురమ్మన్నారు. నేను యెంతో సంతోషంతో
యింకా కొంతమందితో కలిసి పల్లకీని బయటకు తెచ్చాను. తరువాత నేను పూజారితో పల్లకి నేను కూడా మోస్తాను అని అన్నాను.అప్పుడు పూజారిగారు పల్లకీ సేవ, "కోటిమందిలొ యేవొక్కరికో అవకాశం వస్తుంది. ఇది ఇవ్వడమే గొప్ప " అని
పల్లకీ మోయడానికి అవకాశం ఇవ్వలేదు. . తరువాత నేను పల్లకి ఉత్సవం జరుగుతుండగా, పల్లకిమోసేఅతనితో నేను కూడా మోస్తాను ఒక్కసారి నా భుజం మీద పెట్టుకుంటాను అని అడిగాను. అతను నేను కూడా మోయడానికి కొంచెం సేపు అవకాశం ఇచ్చాడు.

తరువాత ఆంధ్రా నించి యెవరో రాజకీయ నాయకుడు రాగా ఆయన కూడా ఉన్నవారితో పాటుగా వారి వెనకాలే వెళ్ళి నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Friday, May 6, 2011

మా అమ్మాయికి ఆపరేషన్ చేసిన డా.సాయి

0 comments Posted by tyagaraju on 7:08 AM



06.05.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
మా అమ్మాయికి ఆపరేషన్ చేసిన డా.సాయి

14.01.2001 బాబా తో దివ్యానుభూతి . బాబా గారు శ్రిమతి ప్రియాంకా రౌతేలా గారి అమ్మాయి కి ఇచ్చిన దివ్యానుభూతిని చదివారు. ఈ రోజు ఆమెని బాబా గారు యెలా రక్షించారో తెలుసుకుందాము.
ఈ లీలను శ్రీమతి ప్రియాంకా గారి మాటలలోనే తెలుసుకుందాము.


****


ఇంతకుముందు నేను మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు, డాక్టర్.సాయి మా కుమార్తెను రక్షించిన లీల చెపుతాను. నేను దీని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఒక సంఘటన ద్వారా బాబా గారు గుర్తు చేశారు, అంచేత యిక ఆలశ్యం చేయకుండా ఇవాళ ప్రచురించడానికి నిశ్చయించుకున్నాను. ఇది 5 సంవత్సరాల క్రితం అంటే 2003 లో జరిగింది. నాకు 7 వ మాసంలోనే మా కుమార్తె పుట్టింది. పుట్టినప్పుడు బరువు 1.2 కే.జీ. పైగా పుట్టినప్పుడు ప్రేవులు శరీరం బయట ఉన్నాయి. బతికే చాన్సెస్ .001 శాతమే కాబట్టి మెర్సీ ఇంజక్షన్ చేస్తాము అని నా భర్తకు డాక్టర్ స్ సలహా ఇచ్చారు. కాని ఆపరేషన్ చేస్తే 2-3 లక్షల దాకా అవ్వచ్చు, కాని అదంతా దండగ, యెందుకంటే యిటువంటి కేసులు మేము ప్రతీరోజూ చూస్తూ ఉంటాము, ఆపరేషన్ వల్ల పిల్లకి నయమవదు అని చెప్పారు. నా భర్త యేమీ వినిపించుకోకుండా, యేమైనా సరే ఆపరేషన్ చేయమని డాక్టర్స్ తో చెప్పారు. డాక్టర్స్ పెద్ద మందుల జాబితా ఇచ్చి వాటిని వెంటనే తెప్పించమని చెప్పారు.



నా భర్త మందులు తేవడానికి ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న షాపుకి వెళ్ళారు. ఆయన, షాపులో అతను మందులు ఇచ్చేంత వరకూ వేచి చూస్తూ చాలా ఆందోళనగా ఉన్న సమయంలో, వెనుకనుంచి భుజం మీద యెవరో తట్టినట్లయి వెనక్కి తిరిగి చూసేటప్పటికి, బాబాని భౌతికంగా చూశారు. బాబా యెఱ్ఱని దుస్తులలో ఉండి నా భర్తకి యిలా అభయమిచ్చారు, "బిడ్డా, నీ బిడ్డకు యేమీ అవదు, నేను చూసుకుంటాను."

క్షణాలలో బాబా అదృశ్యమయిపోయారు. నా భర్త చాలా సంతోషించి, మా అమ్మాయికి యేమీ కాదనే థైర్యంతో ఉన్నారు. ఆయన అన్ని మందులతో తిరిగి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు డాక్టర్స్, "మీరు చాలా అదృష్టవంతులు, యెందుకంటే డా.శర్మ ఊరిలోనే ఉన్నారు, ఆయనకి వంట్లో బాగుండకపోయినా మీ అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు, ఈరోజే ఢిల్లీ వెళ్ళిపోతున్నారు" అని చెప్పారు.
మేము డా.శర్మ గారి రాక కోసం యెదురు చూస్తూండగా, బాగా వయసు మళ్ళినాయన ఆపరేషన్ థియేటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళడం చూశాము, ఆయన వయస్సు 70 సంవత్సరాలు ఉండవచ్చు.
ఆయన చేతులు బాగా వణుకుతున్నాయి. కొంతమంది డాక్టర్స్ వచ్చి ఆయనకు స్వాగతం చెప్పడం చూశాము, ఆయనే డా.శర్మ అని అర్థం చేసుకున్నాము. ఆయనని చూస్తూనే, నేను నా భర్తతో "ఆయన చాలా వయస్సు యెక్కువున్న వ్యక్తి, ఆయనే బాగా వణుకుతున్నారు, అరచేతిలో బొమ్మలా ఉండే మన అమ్మాయికి ఆపరేషన్ యెలా చేయగలరు? " అన్నాను.

యేమైనప్పటికి ఆపరేషన్ మొదలు కాబోతోంది, మరోసారి, డాక్టర్స్ నా భర్తతో, "ఈ ఆపరేషన్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు, మీరు మూర్ఖం గా ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నాము అంతే అసలు యేమీ లేనిదానికన్న .001 % చాన్స్, మీరు తరువాత రెండవ బిడ్డకోసం ప్రయత్నించవచ్చు" అని చెప్పారు. ఆపరేషన్ ప్రారంభమయింది, డా.శర్మ, నవ్వుతూ బయటకు వచ్చి, నా భర్తను అబినంధించి ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు. కూడా ఉన్న డాక్టర్స్ బృందం ఆశ్చర్యపోయారు, యెందుకంటే వారికి అసలు సకెస్స్ అవుంతుందని యేవిథమైన ఆశ లేదు. డాక్టర్ గా వచ్చిన వయసుమళ్ళిన వ్యక్తి , తనంతట తానుగా వచ్చిన బాబా తప్ప మరెవరూ కాదని మాకు తెలుసు. అందుకనే మేము మా చిన్నరికి సాయినా అని పేరు పెట్టుకున్నాము. తను సాయినాథ్ ఇచ్చిన వరప్రసాదం. ఇప్పుడామెకు 5 సంవత్సరాలు, మంచి ఆరోగ్యంతో ఉంది. అంతే కాదు తను చిన్నప్పటినుంచీ బాబా భక్తురాలు. యెన్నొ సాయి భజనలతో పాటుగా తనకి మరాఠీలొ బాబా ఆరతి కూడా తెలుసు. చాలా సార్లు తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు సాయి, సాయి, సాయి అని అంటూ ఉంటుంది. తన దివ్య హస్తాలతో ఆపరేషన్ చేసి బాబా మా అమ్మాయికి ప్రాణ దానం చేశారు. మా అమ్మాయి ఆపరేషన్ విజయవంతమవడంతో డాక్టర్స్ కి నోట మాట రాలేదు. నేనెప్పుడూ చెపుతున్న విథంగా బాబా , భౌతిక సంబంథమైన బాథలను మాత్రమే కాదు, మానసిక బాథలను కూడా నివారించగలిగలిగిన ప్రపంచలోకన్న గొప్ప వైద్యుడు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, May 5, 2011

సాయి సూత్రాలు -- సాయిని ప్రార్థించడమెలా

0 comments Posted by tyagaraju on 1:59 AM






05.05.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరకు బాబావారి శుభాశీశ్శులు

ఈ రోజు సాయి సూత్రాలని పోస్ట్ చేస్తున్నాను. కాని యింకా యేదైనా సమాచారం ఇద్దమని అనిపించింది.
ఇప్పుడు పోస్ట్ చేస్తున్న రెండూ కూడా శ్రిమతి ప్రియాంకా గారు తమ ఆంగ్ల బ్లాగులొ యెప్పుడో ప్రచురించారు. సాయిని ప్రార్థించే విథానాలలో ఆమె చెప్పినట్లు, యెప్పుడు యేది యెలా చేయాలొ అంతా బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుందని రాశారు. అది ముమ్మాటికీ నిజం. యెందుకంటే నేను కూడా వీటి గురించి రాద్దామని అనుకోలేదు. ఇవి ఇంతకుముందు చదివినట్లు కూడా గుర్తు లేదు. బాబా ఈ రోజు వీటి గురించి రాయమని ఆదేశం.

ఈ రెండు విషయాలూ కూడా అనుకోకుండా చదివి రాసినవే.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు





సాయి చెప్పిన సూత్రాలని పాటించండి - సంతోషంగా ఉండండి.


సాయి బంథువులారా, ఈ రోజు మానవుల ఉన్నతి కోసం బాబా చెప్పిన మాటలను అందిస్తున్నాను. మన సాయిమా చెప్పిన ఈ ఉపదేశాలు మీకు నచ్చుతాయని నాకు తెలుసు. వీటిని జాగ్రత్తగా చదివి నేటినుంచే ఆచరణలో పెట్టండి.

1. యెప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, భగవంతుడు (సాయి) ఈ ప్రపంచంలో యెప్పుడూ ఉంటాడు.

2. అందరితో మంచిగా ప్రవర్తించు, తిరిగి నువ్వు అదే మంచితనాన్ని యితరులనించి పొందుతావు.

3. తప్పులు చేయవద్దు, వాటిని కప్పిపుచుకోవడానికి అతిగా శ్రమపడవద్దు. ఇది కనక ఆచరిస్తే నువ్వు సంతోషంగానూ, శాంతిగాను ఉంటావు.

4. ఇతరులతో నిన్ను పోల్చుకోవద్దు, యెందుకంటే ప్రతివారికి అతనికి/ఆమెకి వారికి యోగ్యమైనదే లభిస్తుంది.

5. బాబా నిన్ను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపమన్నారు, నీ జీవన విథానం యితరులకి మార్గదర్శకం కావాలి.

6. షిరిడీ సాయి ఈ ప్రపంచానికి సృష్టికర్త. సాయినాథుడు నిర్వాహకుడు, సద్గురు సాయి సంహరించేవాడు కూడా.

7. మానవ శరీరం భగవతుడిచ్చిన గొప్ప బహుమతి, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, నీ నాలుకతో యెప్పుడూ, సాయి, సాయి, సాయి అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి, నీ రెండు చెవులూ సాయి వైభవాన్ని, మహత్యాన్ని వినాలి, నీ సుందరమైన కన్నులతో ఆయన దివ్య స్వరూపాన్ని చూడాలి.

8. ఈ ప్రపంచం నిన్ను దూషించనీ, నిందించనీ, అపనిందలు వేయనీ, ఇవన్నీ కుడా నీ శరీరం మీద రంథ్రాలు యేర్పరచవు, నిన్ను గాయ పర్చవు.

9. ఉపవాసం ఉండవద్దు, లేక అతిగా తినవద్దు. మితాహారం తీసుకోవాలి.

10. ఈ ప్రపంచంలో సత్యమే నీ చింతలనుంచి దూరం చేసే నిజమైన స్నేహితుడు.
నువ్వు వాస్తవంతో స్నేహితుడుగా ఉంటే, సాయి సాయం చేస్తారు, సాయి సత్య సంథులకి సహాయపడతారు.

11. యెప్పుడు నీ సంగతి నువ్వు చూసుకో, యితరుల తప్పుల గురించి ఆందోళన పడద్దు.

12. యితరుల సంతోషాన్ని, నీ సంతోషంగా భావించు.

13. అవసరమైన వారికి సాయం చెయ్యి. బీదవారికి ఆహారం ఇయ్యి, నీడ లేనివారికి నీడ చూపించు. సాయి యేరూపంలో నీముందుకు వచ్చి అర్థిస్తారో నీకు తెలియదు.
అందుచేత, బిచ్చగాళ్ళమీద కఠినంగా ఉండద్దు. నీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు, అంతేగాని వారి మీద కోపగించవద్దు.

సాయి చెప్పిన ఈ మహత్తరమైన సూత్రాలని జీవితంలో ప్రతిక్షణం గుర్తుంచుకుని దానికి అనుగుణంగా నడచుకోవాలి.

అల్లాహ్ మాలిక్



సాయిని ప్రార్థించడమెలా -- సులభమైనవి ఫలితాన్నిచేవి

చాలా మంది పాఠకులు బాబాని సరియైన పథ్థతిలో ప్రార్థించే విథానం గురించి అడుగుతూ ఉంటారు. తమ ప్రార్థన విని తమ సమస్యలు తొందరగా తీరాలంటే యేమి చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. యెంతో కాలంగా ఈ ప్రశ్నని అడుగుతున్నా గాని నేను ఈ ప్రశ్నకి సమథానం ఇవ్వలేకపోయాను, యెందుకంటే బాబా యెప్పుడు దీనిని కోరుకోలేదు. కాని ఈ రోజు హటాత్తుగా నేను ఈ విషయం మీద రాద్దామని మొదలు పెట్టాను. ఈ విషయం మీద రాయమని బాబాగారు నన్నుఆదేశించారని నేను అనుకుంటున్నాను, లేక ఈ విషయం మీద రాయడానికి ఇదే సరియైన రోజని మీరు అనుకుంటూ ఉండచ్చు. నేను యెప్పుడు చెపుతున్నట్టుగా బాబాకి తెలుసు మనం యెప్పుడు, యేది చేయాలో....అందుచేత బాబాని సరియైన పథ్థతిలో పూజించే విథానం గురించి రాయమని ఆయన ఈ రోజు ఆదేశించారు. పాఠకులారా, నేను చాలా చిన్న సాయి భక్తురాలిని. ఈ రోజు బాబా ఆశీర్వాదంతో, నేను దీనిని ప్రచురిస్తున్నాను. ఇది మీకు ఉపకరిస్తుందని అనుకుంటున్నాను.

యెలా ప్రార్థించాలి (ప్రార్థించడం యెలా) ::?

కనీసం సాయి భక్తుడికి సమాథానం చెప్పడానికి చాలా చిన్న ప్రశ్న, యెందుకంటే బాబా మనకందరకు తల్లిలాంటివారని మనకి తెలుసు. తన పిల్లలు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు. తన పిల్లలు కష్టాలలో ఉంటే ఆయన బాథ పడతారు. కాని బాబా యెల్లప్పుడు పసిపిల్లలకి అన్నం తినిపించినట్టు తినిపించరు. కొన్ని కొన్ని సమయాల్లో మనంతట మనమె పోరాడుతూ ఉండాలి. తల్లి కూడా ప్రతీచోట పిల్లవానికి సాయం చేయదు, యెందుకంటే పిల్లవాడు ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే తనంతట తనే అన్నిటినీ స్వయంగా యెదుర్కోవాలి. అదే విథంగా సాయిమా కూడా మన కాళ్ళమీద మనం యెలా నిలబడాలో మనకి నేర్పుతారు, మన కర్మలని మనము సరిగా నిర్వర్తించేలా చేస్తారు. ఒకసారి కనక చేస్తే మనం అడిగినా అడగకపోయినా బాబా మనలని కనిపెట్టుకుని ఉంటారు. నీ సడలని నమ్మకం, నిరవథికమైన ఓర్పు, ఇవే నువ్వు సాయికి సమర్పించే ప్రార్థన. ఈ ప్రాపంచిక విషయాలనే మాయ నీ సున్నితమైన మనసుని కప్పివేయకూడదు. ఒక్కసారి సాయి సద్గురు మహరాజ్ చరణాల మీద శరణాగతి చేశాక, నీ భవిష్యత్తు గురించి జీవితంలో వేటిగురించయినా నీకెందుకు చింత. జీవితంలో మీరు అనుకున్నవి సాథించడానికి మీకుపయోగించే చిన్న విథానాలని రాస్తున్నాను.

నీవు తినేముందు బాబాకి సమర్పించు:

ప్రతీసారి నువ్వు భోజనం చేసేముందు బాబాకి సమర్పించాలనే నియమం పెట్టుకో. నువ్వు యెప్పుడూ భోజనం చేసేముందు ప్రతిసారి, ఒక్కసారి కనక అందులోని కొంతభాగాన్ని,బాబాకి అర్పిస్తే మొత్తం ఆహారమంతా సాయి ప్రసాదంగా మారుతుంది. నీకు మంచి ఆరోగ్యాన్నివ్వడానికి దోహద పడుతుంది.

ఆకలిగొన్నవారికి అన్నం పెట్టు:: బాబా అనుగ్రహాన్ని పొందాలంటే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. మనకందరకు తెలుసు, బాబా గారు తన జీవిత కాలమంతా ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చారు. నమ్మండి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మీకు యెంతో సంతోషంగా ఉంటుంది,మీ అంతరాత్మ ప్రత్యక్షంగా సాయితో సంపర్కమవుతుంది.

సాయి సచ్చరిత్ర చదవండి::

మనం రోజూ తిండి తింటున్నట్లుగానే, నిద్ర పోతున్నట్లుగానే .... అదేవిథంగా ప్రతీరోజూ సాయి సచ్చరిత్ర చదవాలి. ఆటంకాలని పక్కన పెట్టండి , ప్రయాణంలో కూడా, సచ్చరిత్ర చదవాలి. బాబా ముందరే కూర్చుని చదవడం ముఖ్యం కాదు, ఇక్కడ కావలసినదల్లా భక్తితో చదవడం ముఖ్యం. నువ్వు చదవదలచుకున్నప్పుడు, ప్రతీరోజు చదవడం అమలు చెయ్యి . నీలో అనుకూలమైన ఆలోచనలు, నీ వ్యవహారంలో, ప్రవర్తనలో వేగవంతమైన మార్పు రావడం నువ్వే గమనిస్తావు.

అవసరమైనవారికి సహాయం చెయ్యి ::

సాయి బంథువులారా నేను మిమ్మల్ని కోరుకునేదేమంటే ఈ ప్రపంచంలో యెవరూ లేని అనాథలకు సహాయం చేయమని. మీవద్దనున్న పాత దుస్తులను వారికివ్వండి, మీ పిల్లల పాత పుస్తకాలనివ్వండి, చేయగలిగితే వారికి వైద్య సహాయం కూడా చేయండి. మీకు చేతనయినతలో యెలా సహాయపడగలరో ఆవిథంగా సహాయం చేయండి. కాని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి రెండవసారి ఆలోచించవద్దు.

యెప్పుడూ కూడా యితరుల గురించి చెడుగా మాట్లాడవద్దు ::

ఇది మనమందరము గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. మనం యెప్పుడూ కూడా యితరుల గురించి చెడుగా మాటలాడకూడదు. యెందుకంటే, బాబా చెప్పారు మనం యితరులని నిందిస్తున్నామంటే మన ప్రవర్తన వరాహాన్ని పోలి వుంటుంది. వరాహం అందరూ పారవేసిన చెత్తా, చెదారం తిని సంతోషిస్తుంది. అంచేత యెప్పుడు గుర్తుంచుకోండి, మీరు యితరుల గురించి మంచిగా మాట్లాడలేనప్పుడు, చెడు కూడా మాట్లాడకండి. తెలీకుండానే ఇది మనం చేస్తూ మనంతట మనమే దురదృష్టాన్ని మన జీవితంలోకి కొని తెచ్చుకుంటున్నాము.

సద్గురు సాయినాథ్ మహరాజ్ ఆశీశ్శులు పొందటానికి, ఆచరించటానికి ఇవి చాలా తేలికైన పథ్థతులు. బాబా తనకి రోజూ ప్రార్థన చేయమని కోరటంలేదు, మానవ సేవ చేయమన్నారు. మానవ సేవే మాథవ సేవ. నన్ను నమ్మండి, ఈ పైన చెప్పిన చిన్న చిన్న సేవలు మీ జీవితాన్ని మారుస్తాయి. నా నిత్య జీవితంలో నేను వీటిని ప్రతిరోజూ అనుసరిస్తూ ఉంటాను, నేను తప్పక చెప్పవలసినది బాబా నాకు తరచూ కలలో ఆశీర్వదిస్తూ ఉంటారు. నేను వెళ్ళే ప్రతీచోటకీ ఆయన వస్తూ ఉంటారు. బాబా, నీకు నామీద ఉన్న ప్రేమకి కృతజ్ణురాలిని. మీరు బాబాని ప్రార్థించే పథ్థతిని తెలియచేయండి.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Tuesday, May 3, 2011

బాబా పేరుమీద మీకిష్టమైనది వదలండి

0 comments Posted by tyagaraju on 11:41 PM





04.05.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

బాబా పేరుమీద మీకిష్టమైనది వదలండి


సాయి బంధువులకు బాబా ఆశీర్వాదములు

ఈ రోజు మనము శ్రీమతి ప్రియాంకా గారి బ్లాగునుండి ఒక బాబా లీలను తెలుగులో తెలుసుకుందాము.

మనకు కష్టాలలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. అందుచేత యెన్నో మొక్కులు మొక్కేస్తూ ఉంటాము. కాని ఒకోసారి కష్టాలు తీరగానే మొక్కులు మరచిపోవడం గాని, వాయిదా వేయడం గాని జరుగుతూ ఉంటుంది. అందుచేత మొక్కులు మొక్కేటప్పుడే వాటిని మనం తీర్చగలమా లేదా అన్నది ఆలోచించుకోవాలి. కాని కఠినమైనా గాని అమలు చేయాలి. ఒకొసారి మనం మర్చిపోతే భగవంతుడే మనకి యేదో విథంగా అడ్డంకులు కల్పించి మనకి గుర్తు చేస్తాడు. అది మనని మంచి మార్గంలో పెట్టడానికే తప్ప మరేమీకాదు. లేకపోతే కోరిక తీరిన తరువాత మానవుడు మొక్కిన మొక్కుని తీర్చదుండా గడిపేస్తాడు. మొక్కు విషయంలో భగవంతుడుని మనం మోసం చేయకూడదు.

ఈ సందర్భంగా నేను చిన్నప్పుడు చందమామలో చదివిన చిన్న కథ చెపుతాను.

ఒక వూరిలో కృష్ణుడి గుడి ఉందిట. అక్కడకు వెళ్ళి మొక్కు మొక్కుకున్న వారికి కోరికలు తీరతాయని ఒక నమ్మకం ఉంది. ఆ ఊరిలో ఒక పిసినారి ఉన్నాడు. ఒక సందర్భంలో అతనికి ఒక పని కావలసి ఉండి, కృష్ణుడి గుడిలోకి వెళ్ళి, ఇలా మొక్కుకున్నాడట. "కృష్ణా ! నాకు కనక ఈ పని జరిగితే నీకు చిటికెల పందిరి వేస్తాను" అని. కృష్ణుడికి ముచ్చట వేసి అన్ని పందిళ్ళూ చూశాను గాని, ఈ చిటికెల పందిరి చూడలేదు, సరే, వీడి కోరిక తీర్చి చూద్దామనుకుని ఆ పిసినారి వాడి కోరిక తీరేటట్లు చేశాడు.
తరువాత కోరిన కోరిక తీరిన పిసినారి గుడికి వచ్చి, స్వామీ, నీకు మొక్కుకున్న తరువాత నా కోరిక తీర్చావు. అందుకని నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు చిటికెల పందిరి వేస్తున్నాను, అని, కృష్ణుడి చుట్టూ, నాలుగువైపులా నాలు సార్లు చిటికెలు వేసి, స్వామీ ఇదే చిటికెల పందిరి అని అన్నాడట. కృష్ణుడు ఆశ్చర్యం తో ముక్కు మీద వేలు వేసుకున్నాడట.

***********************************





మనం బాబా మీద యెన్నో ఆశలు పెట్టుకుంటాం, ప్రతీ చిన్న విషయానికి ఆయన సాయాన్ని అర్థిస్తాము యెందుకంటే మనం ఆయన బిడ్డలం కనక. పిల్లలు యెప్పుడు యేది అవసరమొచ్చినా, లేక కష్టాలలో గాని తల్లిని సహాయమడుగుతూ ఉంటారు. మనం బాబాకి అప్పుడప్పుడు మాట ఇస్తూ ఉంటాము (మొక్కులు మొక్కుకోవడం అటువంటివి). మనం ఆయనకి అలా చేసి శరణువేడడం వెనుక కారణం ఉంటుంది.
మన కోరిక తీరిన మరుక్షణంలోనే, బాబా గారు యేమనుకుంటారనే రెండో ఆలోచన లేకుండానే, మనమిచ్చిన మాటని మర్చిపోతాము. కొన్ని సంవత్సరాలుగా నేను నేర్చుకున్నదేమంటే, మనం కనక ఆయనకిచ్చిన మాట తప్పితే, సాయిమా మనలని దండించి మనకొక గుణపాఠం నేర్పుతారు యెందుకంటే మనము ఆయన బిడ్డలం కనక. కనుకనే మనము మన సాయిమాని మోసం చేయకూడదు. ఒకవేళ మనం ఆ తప్పు కనక చేస్తే, యెదురయ్యే పరిస్థితులని యెదుర్కోవడానికి సిథ్థంగా ఉండాలి. యిదంతా మనమంచికోసమే, యెందుకంటే, తల్లి తన బిడ్డలమీద యెక్కువ కఠినంగా ఉండలేదు. నమ్మకం లేకుండా మనము సాయిమాని సంతృప్తి పరచలేము.

ఈ రోజు మీకు విక్రం స్నేహితుని బాబా లీలని మీకు చెపుతున్నాను. విక్రం పంపిన ఈ మైల్ ని మీకు అందించేముందు, నేను విక్రం కి థన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

సాయి భక్తులందరూ కూడా, తమ అనుభవాలని ఇక్కడ పంచుకోవడానికి, ముందుకు వస్తే వారినందరిని నేను వ్యక్తిగతంగా అభినందిస్తాను. విక్రంగారు ఇచ్చిన మైల్ ఇక్కడ జత చేస్తున్నాను.
ఈ రోజు మీకొక అనుభవాన్ని చెపుతున్నాను. ఇది నాకు అనుభూతికన్నా యెక్కువ. మానవ మాత్రుడిగా, ఒక సాయి భక్తునిగా ఇది నా జీవితంలో ఒక గుణపాఠం. ఇదినాకుమంచి స్నేహితుడు, తోటి సాయి భక్తుడు నాకు చెప్పిన లీల.

అతని అనుమతితో నేను కూడా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ సంవత్సరం (2010) యేప్రిల్ లో నా స్నేహితుడు (సాయి భక్తుడు) తన ఎంప్లాయర్ ద్వారా యూ.ఎస్. లో వర్క్ పెర్మిట్ కి అప్ప్లై చేశాడు. అతని అప్ప్లికేషన్ ప్రాసెస్ లో ఉండగా, అతను, తన వర్క్ పెర్మిట్ పని జరిగితే, బాబాకి, తన చెడు అలవాటయిన సిగరెట్టు కాల్చడం గురువారము లలో మానివేస్తానని మాట ఇచ్చాడు.

తొందరలోనే అతని వర్క్ పెర్మిట్ అప్ప్రూవ్ అయింది. ఈ వార్త తెలిసిన వెంటనే అతను సంతోషంతో యెగిరి గంతేయడం నాకు గుర్తుంది. ఒక నెల వరకు అతను తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, గురువారములలో పొగతాగడం మానివేశాడు. కాని ఒక గురువారమునాడు, పని వత్తిడిలో ఆ వత్తిడిని తట్టుకోలేక సిగరెట్టు కాల్చాడు. నైరాశ్యం బాగ యెక్కువగా ఉండటం చేత, తనకి మనస్థైర్యం లేకపోవడంవల్ల బలహీనత వల్ల తన మాట నిలబెట్టుకోలేకపోయానని ఒప్పుకున్నాడు. ఇక ఆగురువారం మొదలు తను ఇచ్చిన మాట మరచిపోయి ప్రతీ గురువారం పొగతాగడం మొదలు పెట్టాడు.

సచ్చరిత్రలో చెప్పినట్టు, తల్లి పిల్లవాని మంచికోసం, చేదు మందు గొంతులో పోస్తుంది. అలాగే మహాత్ములు కూడా, ఒకోసారి కఠినమైన పథ్థతులని అవలంబిస్తారు, అది వారి మంచి కోసమే. అదే విథంగా ఇతనికి జరిగింది. అతను బాబాకిచ్చిన మాటని జవదాటిన రెండు వారాల తరువాత, అతని యజమానితో సమస్యలు వచ్చాయి, అందుచేత అతని ఎంప్లాయరు అతని వర్క్ పెర్మిట్ ని వెంటనే రద్దు చేశే నిర్ణయం తీసుకున్నాడు. ఇక అతను భంగపడిపోయి చపల చిత్తుడై, తరువాత యేమిచేయాలో తెలీకుండా అయిపోయాడు.

తన వర్క్ పెర్మిట్ రద్దు కాబడిందనే వార్త తెలిసిన తరువాత, అతని మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన, తెలివితక్కువగా తను బాబాకిచ్చిన మాట తప్పడమే అని. అతను బాబా విగ్రహం యెదుట పశ్చాత్తాప పడ్డాడు,రోదించాడు. ఇదంతా సరి అయితే కనక తాను మళ్ళీ మారుతాననే ఉద్దేశ్యంతో బాబాని కషమించమని
వేడుకున్నాడు. తన ఎంప్లాయరు, యేదో పొరపాటువల్ల జరిగింది, మరలా తిరిగి జాయిన్ అవ్వమని తనని పిలుస్తాడని, రోజుల తరబడి ఎదురు చూశాడు. కాని ఆవిథంగా యేమీ జరగలేదు.

అతను ఉద్యోగం పోగొట్టుకుని యింటి వద్దే నెల ఉన్నాడు. బాబా తన గొంతులో చేదు మందును బలవంతంగా పోసింది తన మంచికేనని అతనికి తెలుసు. తిరిగి తను ఇచ్చిన మాట ప్రకారం గురువారములునాడు పొగ తాగడం మానేశాడు.

తల్లి పిల్లవాణ్ణి, కొట్టినా తిట్టినా, వాడు మళ్ళీ మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటాడని నిర్థారించుకోవడానికే. కాని, పిల్లవాడు, పిల్లవాడే, వాడికి మంచి కి చెడు కి వున్న తేడాను తెలియ చెప్పాలి.

కాని, తిట్టిన తరువాత, దండించిన తరువాత, తల్లి పిల్లవాణ్ణి కౌగలించుకొని, వాడిని క్షమించి వాడిని అక్కున చేర్చుకుని ప్రేమని కురిపిస్తుంది. ఇదే అతని విషయంలోనూ జరిగింది. అతను తిరిగి ఉద్యోగావకాశాలకోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఒక నెలతరువాత అతను కిందటి ఉద్యోగంకన్నా, మంచి ఉద్యోగంలో చేరాడు.

అతనికి వర్క్ పెర్మిట్ తాత్కాలిక ప్రాదిపదికమీద జీతం తీసుకునేలా వచ్చింది. అతని ప్రస్తుత కంపనీ సరియైన వర్క్ పెర్మిట్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని యింకా తీసుకోవలసి ఉంది. అతని భవిష్యత్తు సందిగ్థం, కాని బాబా గారు తనతో ఉన్నారని అంతా ఆయనే చూసుకుంటారని తెలుసు. అతను కఠినమైన మంచి గుణ పాఠం నేర్చుకున్నాడు.
కాని బాబా మంచి దయా సముద్రుడు. ఒకోసారి ఆయన పథ్థతులు కఠినంగా ఉన్నాగాని, ఆఖరికి విజయ తథ్యం.
మనం బాబా చెప్పినట్లు నడుచుకోవడమే. కాని మథ్యలో వదిలి వెళ్ళిపోవద్దు.

నా స్నేహితుని విషయంలో యేమి జరిగింది, బాబా తనమీద కోపగించినందువల్ల కాదని మనం అర్థం చేసుకుందాము. అలా జరగడానికి కారణం దారితప్పి కొట్టుకుపోతున్నవానిని బాబా గారు సరియైన మార్గంలో పెడదామనే ఉద్దేశ్యం..


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Sunday, May 1, 2011

షిరిడీలో బాబా లీలలు

0 comments Posted by tyagaraju on 8:48 AM


షిరిడీలో బాబా లీలలు

01.05.2011 ఆదివారము
షిరిడీలో బాబా లీలలు


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులారందరకు బాబా వారి శుభాశీశ్శులు

ఈ రోజు మనము మరియొక బాబా లీలను తెలుసుకుందాము. బాబా గారు తన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తులు కాకపోయినా యేదోవిథంగా తన లీలను చూపి తనవారిగా చేసుకుంటారు. కాని యెవరికి యెవిథంగా లీలను చూపిస్తారో తెలియదు.



ఈ రోజు బాబా భక్తులైన శ్రీ వెలగలేటి వెంకట వర ప్రసాద రావు గారి యొక్క, షిరిడీలో వారి అనుభవాన్ని వారి మాటలలోనే తెలుసుకుందాము. శ్రీ ప్రసాద రావుగారు మా వియ్యంకుడుగారు. ఆయనది విజయవాడ దగ్గర ఉన్న వెలగలేరు గ్రామం.

" నేను గత 20 సంవత్సరాలనుండి, ప్రతీ సంవత్సరం షిరిడీ వెడుతూ ఉంటాను. షిరిడీ వెళ్ళగానే ముందర థూళి దర్శనం చేసుకోవడం అలవాటు. (థూళి దర్శనం అంటే షిరిడిలో దిగగానే కాళ్ళు కూడా కడుక్కోకుండా బయట నున్న కిటికీలోనించి బాబా ని దర్శించుకోవడం). తరువాత గురుస్థానం లోని వేప చెట్టు చుట్టూరా 18 ప్రదక్షిణాలు చేసి 2, 3 వేపాకులు తినడం అలవాటు. ఈ స్థానంలో బాబా గారు దీపాలను వెలిగించిన చోటుకాబట్టి ఇక్కడ ప్రదక్షిణలు చేసి, వేపాకులు తింటే చీకాకులు అవీ ఉండవని, ఆరోగ్యంగా ఉంటారని నాకు చాలా విశ్వాసం, నమ్మకం.

కిందటి సంవత్సరం నేను షిరిడీ వెళ్ళాను. యెప్పటిలాగానే గురుస్థానంలో వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను గాని, యెంత ప్రయత్నించనా ఒక్క వేపాకు కూడా దొరకలేదు. ప్రదక్షిణ చేస్తు మనసులో "బాబా యేమిటిది, ఇవాళ ఒక్క ఆకు కూడా దొరకలేదు, అనుకున్నాను. ప్రదక్షిణ పూర్తి అయ్యి యింక బయటకు వస్తూండగా అక్కడ గోడమీద వేపాకు మండల కట్ట సుమారు 40 ఆకుల దాకా ఉంటాయి, కనపడింది. నాకు చాలా అనందమేసింది. అక్కడున్నవారికి కొన్ని ఆకులను పంచి కొన్ని యింటికి పట్టుకుని వెళ్ళాను.

తిరుగు ప్రయాణంలో బాబా దర్శనం చేసుకుందామని మందిరం వద్దకు రాగానె, అక్కడి అథికారులు ఇవాళ బాబా హుండీ లెక్కిస్తున్నాము, మీరు కూడా లెక్క పెడతారా అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా గారు నాకు యింతటి బృహత్కార్యంలో నాకు భాగం కల్పించినందుకు. సంతోషంగా 4 గంటలు అక్కడ హుండి డబ్బు లెక్కించాను. తరువాత హారతి సమయం అవడంతో అథికారులు అక్కడున్నవారందరిని ఖాళీ చేయించారు. నన్ను అక్కడి అథికారి పక్కన నించోబెట్టి, హారతి అవగానే బాబా గారికి నైవేద్యం పెట్టిన చపాతీలు నన్ను తినమని ఇవ్వడమే కాకుండా, యింటికి కూడా పట్టుకెళ్ళమని ప్రసాదంగా మరికొన్ని ఇచ్చారు.

బాబా గారు, మా కుటుంబ సభ్యులు రాకపోయినా, అందరికీ ప్రసాదం ఇచ్చినందుకు సంతోషంతో యింటికి వెళ్ళాను.

వీరి థర్మ పత్ని శ్రీమతి సునీత గారు కూడా బాబా భక్తురాలు. మొట్టమొదటిసారిగా వీకు కూడా 20 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళారు. అప్పటి రోజులలో షిరిడీ లొ అంతగా భక్త జనం ఉండేవారు కాదట. సమాథి మందిరంలోపల బాబాకి స్వయంగా అభిషేకం కూడా చేసుకునేటంత వీలుగా ఉండేదట
ఆమె అక్కడ షిరిడీలో ద్వారకామాయిలో కూర్చుని చరిత్ర పారాయణం చేసుకుంటున్నారట. అప్పుడు తెల్లని చొక్క థోవతి, పైన టొపి పెట్టుకున్న వ్యక్తి ఈమె వద్దకు వచ్చి భుజం మీద తట్టి తనతో రమ్మన్నారట. ఆ వ్యక్తి ఈ మెను థుని వద్దకు తీసుకుని వెళ్ళి థునిలోని ఊదీని ఈమె నుదిటి మీద పెట్టారట. తరువాత అక్కడ కొళంబేలో ని నీటిని ఇచ్చారు. అక్కడ బాబా ఫొటొ వద్ద చిన్న డబ్బా ఉండేదట. అందులో వూరిలోనివారు, భక్తులు ఆహార పదార్థాలు వేసి ప్రసాదంగా తీసుకుంటూఉండేవారట. ఈ వ్యక్తి అందులోని పదార్థాలని ప్రసాదంగా ఈమెకు ఇచ్చారు. అక్కడ యింకా కొంతమంది పారాయణ చేస్తున్నవారు ఉన్నాగాని యెవరిని ఆ వ్యక్తి పిలవలేదట. తరువాత ఈమె తన భర్తకు జరిగినది చెప్పినప్పుడు, ఆ వ్యక్తిని నేను చూడలేదు అని చెప్పారట.

బాబా గారు తనని నమ్మిన వారిని, నమ్మనివారిని, ఒక్కొక్కరిని ఒక్కొక్క విథంగా అనుగ్రహిస్తూ, తన లీలలను చూపిస్తూ ఉంటారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List