Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 30, 2011

జలంథర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

0 comments Posted by tyagaraju on 3:46 AM



















30.04.2011 శనివారము

జలంథర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు

ఈ రోజు జలంథర్ లోని బాబా మందిరానికి సంబంథించిన అద్భుతమైన లీలా విశేషాలని తెలుసుకుందాము. ఇది ఇంతకు ముందు శ్రిమతి ప్రియాంకా రౌతేలాగారి ఆంగ్ల బ్లాగులో ప్రచురింపబడినది.

ఈ లీలని గురువారమునాడే పోస్ట్ చేద్దామని తెలుగులోకి తర్జుమా మంగళవారమునాడే మొదలుపెట్టాను.

కొంతవరకు అనువాదము చేశాను. బుథవారమునాడు కొంత చేశాను. మరల సాయంత్రము చేద్దామని సాయిదేవా వెబ్ సైట్ ఓపెన్ అవలేదు. అన్ని వెబ్ సైట్లు ఓపెన్ అవుతూండగా ఇది మాత్రమే యెందుకు అవటల్లేదో అర్థం కాలేదు. ప్రియాంకా గారికి ఫోన్ చేశాను. ఆవిద చూసి వెబ్ సైట్ ఓపెన్ అవుతోంది, ప్రోబ్లెం యేమీ లేదని చెప్పారు. దుబాయిలో ఉన్న మా అమ్మాయికి, హైదరాబాదులో ఉన్న మా అమ్మాయికి ఫోనె చేసి కనుక్కున్నాను. చక్కగా ఓపెన్ అవుతున్నాయి. నెల్లూర్ సుకన్య గారిని అడిగితే తనకు కూడా ఓపెన్ అవుతోందని చెప్పారు. అలా గురువారమునాడు కూడా ఓపెన్ అవలేదు. కారణం తెలియలేదు. గూగుల్ నుంచి ప్రయత్నించాను. అయినా యేమీ లాభం లేకపోయింది. ఇక శుక్రవారమునాడు యెదురుగా ఉన్న బాబా ఫోటో చూస్తూ "బాబా నా తప్పులేమన్నా ఉంటే క్షమించు అని, నెట్ కనెక్ట్ చేసేముందు కంప్యూటర్ ని 3 సార్లు రిఫ్రెష్ చేసి, నెట్ కనెక్ట్ అయాక, ముందర షిర్డిసాయిదేవా వెబ్ సైట్ ఓపెన్ చేశాను. బాబా దయ వల్ల ఓపెన్ అయింది. ఈ రోజుకి అనువాదం పూర్తి చేసి మీ ముందు ఉంచుతున్నాను.

ఇక బాబా అద్భుతమైన లీలను మనసారా చదివి ఆనందించండి.


ఫ్రియాంకా రౌతేలాగారు జలంథర్ వెళ్ళినప్పుడు అక్కడి బాబా మందిరము దాని చరిత్ర గురించి తమ ఆంగ్ల బ్లాగులో ప్రచురించడం జరిగింది. దానిని యథాతథంగా ఈ రోజు మీకందిస్తున్నాను.

నేను మా కుటుంబంతో జలంథర్ వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి రెండు లేక మూడు రోజులు ఉందామని వెళ్ళాము, అక్కడ సాయి మందిరం ఉందని కూడా తెలియదు. నేను యింటర్నెట్ లో కూడా వెతికాను కాని యెక్కడా బాబా మందిరం ఉన్నట్లుగా నాకు దొరకలేదు. యేమైనప్పటికీ మేము జలంథర్ చేరుకున్నాము, బాబా మందిరం గురించి కొంచెం ప్రయత్నిద్దామనుకున్నాను. అదృష్టవశాత్తు మా స్నేహితులకి యెక్కడ ఉందో ప్రదేశం తెలుసు గాని, సరిగ్గా తెలియదు యెందుకంటే వారెప్పుడు ఆ మందిరానికి వెళ్ళలేదు. ఇక్కడ నేను చెప్పదలచుకున్నదేమంటే మా జలంథర్ ట్రిప్ ముందు అనుకున్న ప్రోగ్రాం కాదు, కాని బాబా గారు నాకోసం వేరే ఉద్దేశ్యంతొ చేయించి ఉండవచ్చు. ఆయన నాకోసం అక్కడికి వెళ్ళి మందిరం గురించిన సమాచారమంతా తెలుసుకోవడానికి కావలసిన సౌకర్యవంతమైన యేర్పాటులన్ని చేశారు. అక్కడికి వెడతానని నేనెప్పుడూ అనుకోలేదు, సుందరమైన జలంథర్ బాబా మందిరంలో బాబాని దర్శించుకుని అనుగ్రహ పాత్రురాలినయ్యాను. ఆయన లీలలు, చర్యలు చాలా నిగూఢంగా ఉంటాయి. ఓ! దేవా! నీ పాదాలమీద నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, ఈ జన్మలోను, వచ్చే జన్మలన్నిటిలోనూ నీ పాదాలే నాకు ఆశ్రయముండేలా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మేము జలంథర్ మంగళవారము చేరుకున్నాము, మరునాడు అంటే బుథవారమునాడు షిరిడి సాయి మందిరాన్ని దర్శిద్దామనుకున్నాము. మరలా బాబా లీలనుగ్రహం నామీద ప్రసరించినందుకు, నేను సంతోషంగా ఉన్న సమయంలో, ఈ బాబా మందిరం చరిత్ర గురించిన సమాచారం నాకు లభ్యమవుతుందా అనే అలోచనలో నిమగ్నమయ్యాను. కాని మేము అక్కడికి చేరుకున్న మరుక్షణమే బాబా గారు ప్రతీదీ ముందుగానే నిర్ణయించారు. బాబా గారి సుందరమైన పెద్ద మందిరాన్ని చూశాక నాసంతోషానికి అవథులు లేవు. (యిందులో ఇచ్చిన ఫోటొలన్ని నా మొబైల్ తో తీసినవ అందుచేత అంత క్లియర్ గా లేవు)

మందిరం వెలుపలి భాగం చాల అందంగా నిర్మించారు, ఆ ఆకృతి అందాన్ని చూసిన తన్మయత్నంలోనించి తేరుకునేటప్పటికి నాకు 15 నిమిషాలు పట్టింది. ఆకృతిని చూసి ఆశ్చర్య పడుతుండగా నా కళ్ళు ఒక బోర్డ్ మీద పడ్డాయి, దాని మీద ఇలా రాసుంది "పంజాబులో ఇదే మొట్టమొదటి బాబా మందిరము". మందిరం లోపల పెద్ద బాబా విగ్రహం ఉంది. నాయాత్రలు, నేను యెక్కడకు వెళ్ళినా బాబా మందిరాన్ని దర్శించడానికి అనుకోకుండా జరిగే యేర్పాటులు అన్నీ కూడా బాబాగారు ఒక విథంగా మా కుటుంబం మీద కురిపించే అనురాగము మరియు అనుగ్రహము అని ఒప్పుకుని తీరవలసినదే.

నేనెక్కడికి వెళ్ళినా బాబా అక్కడ వుంటారు, తను ఉన్న చోటకి నన్ను వచ్చేలా చేస్తారని గ్రహించినప్పుడు యెంతో మహత్వపూర్ణంగా ఉంటుంది. నా సద్గురు సాయీ నేను నీకెల్లప్పుడూ ఋణపడి ఉంటాను. నా తండ్రి సాయి నాకు ఇన్ని అవకాశాలని ఇస్తున్నందుకు నేనెప్పుడు విథేయురాలిగా ఉండాలన్నదే నా అంతర్గత కోరిక.

బాబా దర్శనం అయిన తరువాత, నేను అన్నివైపుల అడుగుతూ, ఈ క్రింది విథంగా జలంథర్ బాబా మందిరం చరిత్రని వివరించిన గగన్ కాల్ రా గారిని కలుసుకున్నాను. మీకిప్పుడు అదంతా వివరిస్తాను.

సెప్టెంబరు, 5 వ తారీకు, 1996 న సాయి మందిర్ జలంథర్ ప్రారంభింపబడింది. ఇది కాల్ ర కుటింబీకుల స్వంత మందిరం. గగన్ జీ గారు గతంలోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. 1992 లో మా కుటుంబమంతా కూడా చాలా ఆర్థిక బాథలలో ఉన్నాము. పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఆ సమయంలో గగన్ జీ చదువును ఆపేయవలసి వచ్చింది. ప్రైవేటుకి ఇవ్వడానికి, యితర చదువుకి సంబంథించిన ఖర్చులకి కూడా డబ్బు చెల్లించలేకపోయేవారు.

గగన్ జీ గారి తల్లి గొప్ప భక్తిపరురాలు. ఆమె తన యింటిలో నున్న మందిరంలో చిన్న బాబా ఫోటొ ఒకటి పాతది ఉంది. దానికే ఆమె రోజు పూజ చేస్తూ ఉండేది. ఒకరోజు దీపావళినాటి రాత్రి దీపావళి చేసుకోవడాన్ని పక్కన పెట్టండి, తమ యింటిలొ ఆహారానికి కూడా డబ్బులేదనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. గగన్ జీ గారి తల్లి బాబా ముందర కూర్చుని యేడిచింది. "బాబా నువ్వు నీటితో దీపాలను వెలిగించావు, గోడమీద. నా యింటిలో తినడానికి కూడా యేమీ లేదు, యిక దీపావళి యెలా చేసుకోను బాబా " అని యేడిచింది. సరిగ్గా అప్పుడే యిద్దరు కుఱ్ఱవాళ్ళు వారి వద్దకు వచ్చి, వృత్తి రీత్యా ఉపాథ్యాయుడైన గగన్ జీ తండ్రిగారిని ప్రైవేటు చెప్పమని అడిగారు. యీ అబ్బాయిలిద్దరూ ట్యూషన్ ఫీజు ముందుగానె చెల్లించారు. వారందరికి యిది కొంచెం ఆశ్చర్యమనిపించింది, యెందుకంటే సాథారణంగా ముందుగానే ఫీజు ఇచ్చే పథ్థతి లేదు. ఆ రోజు వారందరూ తమ ఆకలిని తీర్చుకోవడమే కాక దీపావళి కూడా చేసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. కాల్ రా కుటుంబం మొత్తమందరికి సాయి భక్తి అప్పుడే మొదలైంది. ఆరోజునించి కార్ లా కుటుంబమంతా బాబాని యెక్కువ భక్తితోను నమ్మకంతోను పూజించడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తూ ఉండగా గగన్ జీ తండ్రిగారి వద్దకు యింకా యింకా ట్యూషన్స్ రావడం మొదలు పెట్టాయి, యింకా యెప్పటినినిచొ పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసు గెలిచి వారి ఫాక్టరీ వారికి తిరిగి వచ్చింది. యిక ప్రతీదీ కూడా వెనకకు తిరిగి రావడం మొదలుపెట్టాయి. బాబా దయతో తక్కువ కాలంలోనే వారు తమ స్వంత ప్లాటు కొనుక్కున్నారు. ఒకరోజున అనుకోకుండా చిన్న కుక్క పిల్ల ఒకటి (3 నెలల వయసు) వాళ్ళ యింటి ప్రవేశ ద్వారం వద్ద బయట కూచుని ఉంది. ఆ కుక్కపిల్లని మొదటగా చూసింది గగన్ జీ తల్లిగారే. కొంచెం పరీక్షగా చూసేటప్పటికి అది చాలా అనారోగ్యంతో ఉంది. గగన్ జీ గారు దానిని పశు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి దానికి అవసరమయిన వైద్యం చేయమన్నారు.

కొద్ది రోజులలోనే, కుక్కపిల్ల కోలుకుంది. అది కాల్ రా గారి కుటుంబంలో ఒక భాగమయిపోయింది. గగన్ జీ తల్లి దానికి ప్రేమగా రాజు అని పేరు పెట్టారు. రాజు మిగత కుక్కలకన్న వేరుగా ఉండేది. గగన్ జీ తల్లిగారు బాబా పూజ చేస్తున్నప్పుడల్లా అది ఆవిడ ఒళ్ళో కూర్చుంటూ ఉండేది. ఒకరోజున ప్రార్థిస్తూ ఆమె రాజు తో, యేదీ, నీకళ్ళల్లొ బాబా ని చూడగలమేమో చూస్తాను అని, దాని కళ్ళల్లో బాబా ఫొటొ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూశారు.

అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కాల్ రా కుటుంబమంతా పూర్తిగా బాబా భక్తిలో నిమగ్నమైపోయారు. వారి వ్యాపారం కూడా బాగా అభివృథ్థి చెందుతూ, రోజులు గదిచేకొద్దీ కాల్ రా గారి కుటుంబం ఐశ్వర్యం దిశగా పయనించారు. యితర ఆస్తులే కాకుండా వారికి కొంత స్థలం కూడా ఉంది. అందులో వారు సొంతంగా ఇల్లు కట్టుకుని, యింటి ముందర చిన్న బాబా మందిరం కూడా కట్టుకుందామనే యోచనలో ఉన్నారు.

ముందర అనుకున్న ప్రకారం చిన్న మందిరంలో పెట్టడానికి చిన్న బాబా విగ్రహం కొనడానికి, 1995 లో కార్ లా కుటుంబం జయపూర్ వెళ్ళారు, కాని అక్కడకి వెళ్ళి సుందరమైన పెద్ద బాబా విగ్రహాన్ని చూశాక, యిక ఆగలేక పెద్ద విగ్రహానికి ఆర్డర్ ఇచ్చారు. అంత పెద్ద విగ్రహానికి తాము ఆర్డర్ ఇవ్వడం వారికే చాలా ఆశ్చర్యం వేసింది.

విగ్రహం పూర్తవడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఈ లోగా గగన్ జీ తల్లిగారికి 21 జూన్ ఉదయం 4.30 కి ఒక కల వచ్చింది. అందులో ఆమెకు యేమీ కనపడలేదు, కాని బాబా గారి మాట వినపడింది.

"ఇప్పుడు నా కోసం సమాథిని కూడా నిర్మించు" ఆమె నిద్రనుండి లేచింది, నా కోసం సమాథి నిర్మించు అన్నారు, దీని అర్థమేమిటి, తాము బాబా సమాథి యెట్లా నిర్మించాలి అని ఆశ్చర్య పడింది. దాని గురించి యింకా ఆలోచించేలోపలే, తన మంచం కింద తన చిన్న కుక్క రాజు చనిపోయి ఉండడం చూసింది. అప్పుడామెకి అర్థమయింది, రాజు, బాబా తప్ప మరెవరూ కాదని.

రాజు చనిపోయిన 3 నెలలకి, జయపూర్ నించి, బాబా విగ్రహం తయారయింది, వచ్చి తీసికెళ్ళమని ఫోన్ వచ్చింది.

కార్ లా కుటుంబం యింకా మరికొంతమంది కుటుంబ సభ్యులతో పెద్ద విగ్రహాన్ని తీసుకురావడానికి పెద్ద ట్రక్కులో బయలుదేరి వెళ్ళారు. విగ్రహాన్ని తీసుకుని షిర్డీ వెళ్ళి అక్కడే ప్రాణప్రతిష్ట చేయించారు. గగన్ జీ గారు ఆ రోజులని గుర్తుకు తెచ్చుకున్నారు. వారు ట్రక్కుని సమాథి మందిరానికి పక్కనే నిలిపి ఉంచారు. పూజారిగారు అక్కడే అన్ని పూజాదికాలు, ప్రాణప్రతిష్ట మొదలైనవన్ని చేశారు. షిరిడీ లో ప్రాణప్రతిష్ట చేసిన తరువాత, కార్ లా కుటుంబాము వారి యింటి వద్దకు తెచ్చి విగ్రహ స్థాపన చేశారు. సాయి తాను స్వయంగా కోరిన కోరిక ప్రకారం రాజు సమాథి ఈ మందిరంలోనే చెశారు.

యే ఆలోచన మందిర అభివృథ్థికి తోడ్పడింది ? బాబా చేసిన ఈ లీలలు అగోచరము. అది మానవుని ఆలోచనా శక్తికందనిది. ఈ రోజున ఈ సుందరమైన పెద్ద మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూఉన్నారు. షిర్డీలో జరుగుతున్నట్లే హారతి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. హారతీ, యింకా మిగతా కార్యక్రమాలన్ని కూడా కార్ లా కుటుంబము వారే చేస్తున్నారు. కార్ లా కుటుంబము వారికి ఈ తరంలోనే కాదు, వచ్చే అన్ని తరాల వారికి కూడా బాబా ని సేవించుకునే అనుగ్రహం కలిగింది.

********************************

సాయి బంథువులారా చూశారా బాబా వారి లీల, మరియు అనుగ్రహం. ఇక్కడ మనం గ్రహించవలసినది జాగ్రత్తగా గమనించండి. గగన్ జీ గారి తల్లి పాత బాబా ఫొటొ ఒకటి ఉంటే దానినే తన యింటిలో చిన్న మందిరంలో పెట్టుకుని పూజిస్తూ ఉండేది. ఆమె యెప్పుడు తమ దీన స్థితి గురించి బాబాని నిందించలేదు. ఒక దీపావళి రోజున కూడా ఆమె బాబా కి నైవేద్యము కూడా యేమీ సమర్పించలేదు. ఆర్తితో విలపించింది.

"బాబా, నువ్వు నీటితో దీపాలని వెలిగించావు. మా యింటిలో తినడానికే తిండి లేదు, యిక దీపావళి యెలా చేసుకోము బాబా" అని రోదించింది. ఇక్కడ బాబా గారు , తనకి యేమి సమర్పించలేదని మిన్నకుండిపోయారా? మంచి అందమైన ఫొటో పెట్టుకోకుండా పూజిస్తున్నారని మిన్నకున్నారా? లేదు. ఆయన యేమి చెప్పారు. నాకు కావలసింది భక్తి, ఓర్పు, సహనం, శ్రథ్థ అన్నారు. బాబా గారు ఆమె ఆర్తికి, భక్తికి చలించి పోయారు. వెంటనే తన లీలని ప్రకటించారు.

యెంతటి అదృష్టవంతులు వారు.

సాయీ మమ్మలనందరిని నీ భక్తిమార్గంలోనే పయనించేటట్లు అనుగ్రహించు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


Thursday, April 28, 2011

బాబాతో నా పరిచయం

0 comments Posted by tyagaraju on 10:22 PM


29.04.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరకు బాబావారి శుభాశీశ్శులు

బాబాతో నా పరిచయం

ఈ రోజు మనము సుకన్య గారు సేకరించి పంపిన ఒక బాబా భక్తురాలు చెప్పిన బాబా లీలను గురించి తెలుసుకుందాము. మనం యింతకు ముందు బాబా గురించి తెలియని వారిని కూడా బాబా గారు ఒక చిన్న లీల లేక అద్భుతం చూపించి, తనకు దగ్గిరగా చేసుకుంటారని, యిక మనం ఆయనని విడిచి పెట్టము అని, తెలుసుకున్నాము. అటువంటిదే ఈ లీల.



యూ.ఎస్. నించి సాయి సిస్టర్ మాయా గారు చెప్పిన బాబా లీల.

నిజానికి మన ప్రియమైన బాబా గారిగురించి నాకు కిందటి సంవత్సరం మథ్యలోనే తెలిసింది. ప్రతి రెండునెలలకు నా భర్తకి కన్ను ఎఱ్ఱగా అవుతూఉండేది. . అటువంటప్పుడు ఆయనకి చాలా బాథగా ఉండేది, ఆఫీసుకు వెళ్ళలేకపోయేవారు, విపరీతమైన్ నొప్పి, వెలుతురు కూడా చూడలేకపోయేవారు. నేను వర్ణించలేను. ఇలా, మా పెళ్ళైన రోజునుంచే జరుగుతూ ఉండేది. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలుగా ఆయన బాథను చూస్తూ, యేడ్చినా, ప్రార్థించినా, యేమీ ఉపయోగం లేకపోయింది.

ఒకరోజున నేను మా అబ్బాయిని స్కూల్ నించి తీసుకురావడానినికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒకావిడ, " నీకు బాబా గారి గురించి తెలుసా, నువ్వు బాబాని యెందుకు ప్రార్థించకూడదు" అని అడిగింది. బాబాని ప్రార్థిస్తే తనకు మనశ్శాంతి లభిస్తుందని చెప్పింది. నేను యింటికి వచ్చి గూగుల్ లొ బాబా గురించి వివరాలన్ని తెలుసుకున్నాను. మొదట్లో నేను సందేహించాను, కాని మా యింటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి ప్రార్థించాను. ఈ లోపున మా ఆయనకి అన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది, కాని బాబా దయ వల్ల వైద్య పరీక్షలన్నీ అనుకూలంగా వచ్చాయి.

నేను బాబా గుడికి వెళ్ళడం మొదలు పెట్టిన తరువాత, నా భర్తకి కొంచెం బాగున్నట్టుగా ఉన్నట్టు అనిపించింది నాకు, ఇప్పటి వరకు తనకి కళ్ళు ఎఱ్ఱ పడటం లక్షణాలు కనిపించలేదు ఒక్కసారి మాత్రం కన్ను ఇరిటేషన్ గా ఉందని చెప్పడం తప్ప. అప్పుడు నాకు భయం వేసింది, బాబాని ప్రార్థించాను, కన్ను ఇరిటేషన్ అలర్జీ వల్ల వచ్చింది, మరునాటికి తగ్గిపోయింది.

బాబాగారు, నన్ను కారు ప్రమాదం నించి కూడా తప్పించారు, ఆయన దయవల్ల పోలీస్ కేసు అవలేదు. అప్పుడు ఒకరోజు సాయి సోదరుడు శిరీష్ ద్వారా ప్రార్థన కోరికని పంపించాను. నేను నా కుటుంబ సభ్యులవల్ల, ప్రియమైనవారి వల్ల నొచ్చుకున్నప్పటికి వారిని రక్షించమని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. మా ఆడపడుచుకి యెన్నాళ్ళయినా పెళ్ళి సంబంథం కుదరలేదు. సాయి సోదరుడు శిరీష్ భక్తులందరి ప్రార్థన కోరికలన్ని 3 రోజులలో షిరిడీ చేరాయన్న సంగతి నేను చదవడం జరిగింది. ఉదయం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భారతదేశం నించి ఫోన్ వచ్చింది, ఆమెకు పెళ్ళి సంబంథం ఒకటి వచ్చిందని దానిని నిశ్చయం చేసుకుంటున్నారని చెప్పారు. బాబా ఆశీర్వాదంతో తను తొందరలోనే జీవితంలో స్థిర పడుతుంది.

ఇంకొక విషయమేమంటే, నాకు బాబాని పరిచయం చేసిన ఆమెకు నా కృతజ్ఞతలు చెపుదామనుకున్నాను కాని యెందుకనో మరచిపోయాను. నేను మా కుటుంబంతో షాపింగ్ కి వెళ్ళాను. అక్కడ షాపులో ఆమెను చూశాను. కాని ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం మరిచాను. మరునాడు నేను వేరే షాపుకి వెళ్ళాను. అక్కడ కూడా ఆమె కనపడింది. అప్పుడూ నేను కృతజ్ఞతలు చెప్పలేదు. మూడవరోజున మేము షాపింగ్ కి వేరే చోటకి వెళ్ళాము అక్కడ కూడా ఆమె కనపడింది. వరుసగా మూడు రోజులుగా నేనామెను యెందుకు చూస్తున్నానో నాకు ఆశ్చర్యం గా ఉంది. యింటికి వస్తూ ఆమె యెందుకు అలా తరచూ నాకు కనపడుతోందని ఆలోచించాను. అప్పుడు గుర్తుకువచ్చింది, బాబా ని పరిచయం చేసిన ఆమెకు కృతజ్ఞతలు చెపుతానని బాబాకి ఇచ్చిన మాట. మరునాడు స్కూల్ వద్ద ఆమెను కలిసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను.

బాబా గారు నాతో ఉన్నారనడానికి, నాకు దగ్గరగా ఉన్నారనడానికి చాలా అనుభవాలున్నాయి. కొన్ని గమనించకుండానే పోతూ ఉంటాయి, కొన్ని మాత్రం నేను ఆలోచించిన తరువాత, అవును నాకు సహాయం చేస్తున్నది బాబాయే అని అనిపుస్తూ ఉంటుంది. కాని తెలిసో తెలియకో ఈ జన్మలో గాని, కిందటి జన్మలో గాని బాబాకి మాత్రమే తెలిసున్న నేను చేసిన నా తప్పులన్నిటిని క్షమించమని నేను సవినయంగా బాబాని వేడుకుంటున్నాను. బాబా ఈ లీలని పోస్ట్ చేయడంలో ఆలశ్యం చేసినందుకు నన్ను మన్నింపు బాబా. నాకింకా కొన్ని సమశ్యలున్నాయి, బాబా దయ వల్ల అవి తొందరలోనే తీరతాయి. బాబా నువ్వెప్పుడూ మాతోనే వుండమని వినయంగా వేడుకొంటున్నాను, మాకు ఈ ప్రాపంచిక అడ్డంకులని నమ్మకంతో, భక్తితో యెదుర్కొనే శక్తిని ప్రసాదించు. మా బుథ్థి నిశ్చలంగా ఉండి మా మనసంతా భక్తితో నిండి చివరికి గమ్యాన్ని చేరేలా చెయ్యి.

మా ప్రియమైన సాయి చరణాలు, మన ప్రియమైన బాబా మనలనందరిని అనుగ్రహించు గాక.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



Wednesday, April 27, 2011

ఆరోగ్యానికి సాయి సచ్చరిత్ర పారాయణ

0 comments Posted by tyagaraju on 4:42 AM


27.04.2011 బుథవారము

ఆరోగ్యానికి సాయి సచ్చరిత్ర పారాయణ

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


ఇంతకు ముందు మనము బాబా ఊదీతో రోగాలు నయం కావడం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనము సాయి చరిత్ర పారాయణ చేయమని బాబాగారే చెప్పిన లీల గురించి ఈ రోజు తెలుసుకుందాము. బాబా లీలలు అనుభవించినవారికే చక్కగ అర్థమౌతాయి.

షిరిడి నివాసి అప్పాజి సుతార్ 1929 సంవత్సరంలో కాలి మీద కురుపు వేసి ఎగ్జిమాతో బాథ పడుతూ కోపర్గావ్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారట. కాని లాభం లేక మాధవరావ్ దేశ్పాండేతో వైద్యం చేయించుకున్నాలాభం లేకపోయిందిట. అప్పుడు నాసిక్ చేరారట. అక్కడకి చేరిన 8 రోజున ఆయనకు కలలో బాబా దర్శనం ఇచ్చి " నువ్వు షిరిడి వెళ్ళి సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఊదీ ని సేవించు" అని చెప్పారట. అప్పాజీ సుతార్ గారు షిరిడీ వెళ్ళారు. అప్పటిదాకా షిరిడీలో సాయి చరిత్ర పారాయణ చేస్తున్న విఠల్రావ్ అనే భక్తుడు, సిరివాల్ అనే చోటికి వెళ్ళాడట. అప్పాజీ సుతార్ షిరిడీ రాగానే అక్కడున్నవారు బాబా చరిత్ర పారాయణ చెయ్యమన్నారట. చూశారా, బాబా గారు కలలో కనపడి చరిత్ర పారాయణ చేయమని చెప్పి, దానికి తగిన యేర్పాటు కూడా ఆయనే చేసి ఉంచారు.

ఆవిథంగా అప్పాజీ గారు యితర గ్రంథాలతోపాటుగా, సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఊదీ రాసుకోగా, ఆయన వ్యాథి వారం రోజులలో తగ్గిందిట. ఆరోగ్యం చేకూరటానికి చరిత్ర పారాయణ చేయడం కూడా వైద్యంగా బాబాగారు తెలియచేశారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Tuesday, April 26, 2011

మన సమస్య - బాబా జవాబు

0 comments Posted by tyagaraju on 1:21 AM


26.04.2011 మంగళవారము ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంథువులందరకు బాబా వారి శుభాశీస్సులు ఈ రోజు శ్రిమతి ప్రియాంకా గారు తమ ఆంగ్ల బ్లాగులో పోస్ట్ చేసిన "మీ అన్ని సమస్యలకి బాబా గారు సమాథానమిస్తారు" (సాయి ఆన్సర్స్ ఆల్ యువర్ యాంగ్జైటీస్) కు తెలుగు అనువాదము మీకు అందిస్తున్నాను. కాని మనము యేపని చేసినా కూడా సాయి మీద అచంచలమైన భక్తి నమ్మకంతో చేయాలి. ఒకవేళ జవాబు మనము అనుకున్నట్లుగా రాకపోవచ్చు. అటువంటప్పుడు మనం పదే పదే మనకు అనుకూలంగా వచ్చేంతవరకు ప్రశ్నలు అడగరాదు. నిర్ణయాథికారం ఆయనదే. బాబాకన్న మనకు యెక్కువేమీ తెలియదు. మనలని సరియైన మార్గంలో నడిపించేది ఆయనే కనక, మనకి యేదయితే మంచి జరుగుతుందో అదే సూచిస్తారు. ఓం సాయిరాం

***************

మన సమస్య - బాబా జవాబు

ఇప్పుడు నేను చేస్తున్న పోస్టింగ్, గందరగోళంలో ఉన్నప్పుడు, సరియైన నిర్ణయం తీసుకోవడానికి ఉపకరిస్తుంది. మనమందరమూ కూడా కొన్ని విషయాలలో, సమస్యలతో ఉన్నప్పుడు మనకు అనుకూలంగా లేనప్పుడు , (యేది మంచో, యేది చెడో) ఏది యెంచుకోవాలో తెలియని పరిస్తితులలో సందిగ్థావస్థలో ఉంటాము. అటువంటి సందర్భాలలో మనం పెద్దవారి సలహా అడుగుతూ ఉంటాము, స్నేహితులని సంప్రదిస్తాము, లేకపోతే మన సొంత నిర్ణయాలు తీసుకుంటాము. ఇవన్నీ కూడా తప్పుడు పథ్థతులని నేననను. నిజానికి నేను కూడా ఇవన్నీ చేసినవే, కాని కొన్ని సంవత్సరాల క్రితం నించిబాబా ముందర చీటీలు వేయడం ప్రారంభించాను. నేను ఈ పథ్థతిని "బాబాగారి ఆదేశం" అంటాను. ఇది చాలా తేలికైన పథ్థతి, యింకా చెప్పాలంటే సరియైన పథ్థతి కనక మన సందిగ్థాలన్నీ తొలగించుకుని, బాబాగారు ఇచ్చే మంచి నిర్ణయాన్ని యెంచుకోవచ్చు.

పాఠకులారా, నేనెప్పుడైనా వ్యాకులతతో ఉన్నప్పుడు, లేక రెండు విషయాల మథ్య నిర్ణయం తీసుకొవలసినప్పుడు ఈ పథ్థతిని ఉపయోగిస్తూ ఉంటాను. నేను కూడా ఇప్పుడు మీతో మీతో పాలుపంచుకుంటున్నాను. యెవరయితే ఈ పథ్థతిని అవలంబించాలనుకుంటున్నారో ముందుకు సాగచ్చు, యెందుకంటే నా విషయంలో "బాబా గారి ఆదేశం" సరిగ్గా వచ్చింది, యింకా ఫలితం కనిపించింది కూడా.

కాని, మీరిది ప్రారంభించేముందు మీకు నేను మూడు విషయాల గురించి వివరించనివ్వండి, ఇవి యెక్కడా కూడా రాయబడలేదు. కాని నేను చాలా సంవత్సరాలు పరీక్షించిన తరువాత ఈ సూత్రాలని తయారు చేశాను. వీటిని ఆచరించాలా వద్దా అన్నది యెవరిష్టం వారిది.

మొదటి సూత్రం:

యెప్పుడూ మీరు తీసిన మొదటి చీటీయే బాబా గారు ఇచ్చే అంతిమ తీర్పు గా భావించండి. ఒకే ప్రశ్నకు యెక్కువ సార్లు చీటీలను తీయవద్దు, యెందుకంటే బాబా గారు తాను యేసమాథానమైతే ఇవ్వదలచుకున్నారో అది మొదటి చీటీలోనే తెలియచేస్తారు.

రెండవ సూత్రం:

ఒక ప్రశ్నకి రెందుకన్న యెక్కువ చీటీలు రాయవద్దు.

ఉదాహరణకి మీరు బాబా ని ఉద్యోగం గురించి ప్రశ్న ఉద్యోగం వస్తుందా రాదా అని అడగదలచుకున్నారనుకోండి అప్పుడు చీటీలను ఈ విథంగా రాయండి.

1.. ఒక చీటీ మీద ఇలా రాయండి :: అవును నీకు ఈ ఉద్యోగం వస్తుంది

2. ఇంకొక చీటీ మీద ఇలా రాయండి :: లేదు నీకు ఈ ఉద్యోగం రాదు

మూడవ సూత్రం :

మీరు వేసిన చీటీలలొ యేదో ఒకటి తీసేముందు, ఆ రెండు చీటీలమీద కొంచెం బాబా ఊదీని చల్లి, బాబా ని సరియైన సమాథానము ఇమ్మని ప్రార్థించండి. నేను చీటీలు తీసేముందు ఈ విథంగా అంటాను.

"" దయా సముద్రుడవైన నా సాయీ, నాకు యేది మంచో యేది చెడొ తెలియదు అందుచేత నువ్వే నాకు మార్గాన్ని చూపించు. కాని నువ్వు యేది నిర్ణయించిన అది నా మంచి కోసమే. దేవ నేను నీ చరణ కమలాల ముందు శరణాగతి చేస్తున్నాను. బాబా నాకు సరియైన మార్గాన్ని చూపించు. సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై, సఛ్ఛె సాయికీ జై, సఛ్ఛె సాయికీ జై.""

ఈ మూడు సూత్రాలని మనసులో పెట్టుకుని బాబా మీద, ఆయన అనంతమైన శక్తిమీద గట్టి నమ్మకం ఉంచుకోండి. బాబా ఆదేశం పొందడానికి ముందుకు సాగండి. ఈ పథ్థతి మీద నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. పాఠకులని కూడా దీనిని ప్రయత్నించమని శిఫారసు చేస్తున్నాను. క్లిష్ట సమయాలలో నించి బయట పడేటందుకు ఇదే మంచి పథ్థతి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, బాబా గారు మీ మంచి కోసం మీ ప్రయోజనం కోసం చీటీ ని తీస్తారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List