Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 12, 2011

ఏమీ నిన్నుపేక్షింతునా?

0 comments Posted by tyagaraju on 7:00 AM




ఏమీ నిన్నుపేక్షింతునా?

12.03.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులారా ఈ రోజు ఒక బాబా లీల అందిస్తున్నందుకు చాలా అనందంగా ఉంది. భగవంతుడు భక్తునికి దాసుడంటారు. అటువంటి లీలను ఈ రోజు మనము తెలుసుకుందాము.
ఈ రోజు మనము శ్రీ సాయి అంకిత భక్తులైన శ్రీ బాపట్ల హనుమంతరావు గారి గురించి తెలుసుకుందాము.

27.12.1944 వేకువ జామున 5 గంటలకు శ్రీ హనుమంతరావు గారికి కలలో, లేత పసుపురంగు లాల్చీ థరించి, అటువంటి రంగుగల వస్త్రమును తలకు ముడి వేసుకుని ఒక సాథురూపమున శ్రీ బాబా వారు సాక్షాత్కరించారు. హనుమంతరావుగారు కలలోనే బాబావారికి సాష్టాంగ నమస్కారము చేశారు. అప్పటికింకా ఆయనకు బాబా గురించి తెలియదు. తనకు దర్శనం ఇచ్చినవారెవరో తెలియక "స్వామీ మీరెవరు? యెందుకు కనిపించారు" అని అడిగారు. "నేను సాయి బాబాను, నీవు ఇదివరకు చాలా గ్రంథాలను రచించావు. మరొక గ్రంథమును రచిద్దామనుకుంటున్నావు. వాటిని అట్లు ఉండనిమ్ము. అని కొన్ని గ్రంథములను చూపిస్తూ "వీనిని వ్రాయుము" అని సాథురూపములో ఉన్న బాబా వారు చెప్పారు. హనుమంతరావు గారు యేమి సమాథానము చెప్పనందు వల్ల "యేమి సందేహించుచున్నావు? నీ ఇష్ట దైవమునే అని చెపుతూ శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి, దత్తాత్రేయ రూపములుగా వారికి దర్శనమిచ్చి, మరలా సాథువుగా కంపించి, "వీనిని రచింపుము" అని అంటూ, తన అభయ హస్తమును హనుమంతరావుగారి శిరశ్శుపై ఉంచి ఆశీర్వదించారు.

1957 లో రాత్రి హనుమంతరావు గారికి కలలో బాబా గారు దర్శనమిచ్చి తన త్రివర్ణ చిత్రమును, "క్యా, తుఝే ఉపేక్షా కర్తాహూ" అనే హిందీ అక్షరములతో వ్రాయబడినదానిని వీరికి బహూకరించారు.




శ్రీ బాపట్ల హనుమంత రావు గా రు సాయి అంకిత భక్తులు. 1962 లో ఒకసారి వీరి యింటికి బంథువులు వచ్చారు. యింటిలో బియ్యం నిండుకున్నాయి. బియ్యం తెచ్చుటకు హనుమంతరావు గారు షాపు కు వెళ్ళారు. అప్పటికే వీరు ఆ షాపు వానికి బాకీ పడి ఉన్నారు. బాకీ యివ్వనిదే అప్పు ఇవ్వడం కుదరదని ఆ వ్యాపారి బియ్యం ఇవ్వలేదు. ఒక్క పది రూపాయలు కూడా యెక్కడా అప్పు పుట్టలేదు. బాథలలోనే మనకు భగవంతుడు గుర్తుకు వస్తాడు అనే మాట యదార్థము. నానా సాహెబ్ చందోర్కర్ తన కుమార్తె మైనతాయి సుఖ ప్రసవమునకు వైద్యము మొదలైన ప్రయత్నాలు చేసి సుఖ ప్రసవమునకు అవకాశము లేని సమయంలో నానాకు సాయి ఊదీ గుర్తుకు రాగానె బాబా ఆదుకున్నారు. ఇక్కడ కూడా హనుమంతరావు గారికి అప్పు దొరకని ఈ కష్టసమయములో శ్రీ సాయిబాబాను ప్రార్థించి తన బాథను విన్నవించుకున్నారు. "నేనుండ భయమేల, యేమి నిన్ను ఉపేక్షింతునా "అని అభయ ప్రదానములు చేసిన ఆపద్బాంథవుడు శ్రీ సాయిబాబా తన భక్తుని యెలా ఆదుకున్నారో చూద్దాము.

ఉదయం హనుమంతరావుగారు బియ్యం అరువు అడగ్గా, నిరాకరించిన ఆ వ్యాపారి రూపమున అర బస్తా బియ్యమును నెత్తిన పెట్టుకుని మోసుకుని హనుమంత రావు గారి యింటికి వచ్చి "మంచి బియ్యము ఇప్పుడే వచ్చాయి, తీసుకుని వచ్చాను . దీనికి డబ్బు తరువాత ఇవ్వచ్చు" అని బియ్యపు బస్తా వాకిట్లో పడవేసి వెళ్ళిపోయాడు. హనుమంతరావు గారు బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఒకసారి హనుమంతరావుగారు రచనా వ్యాసంగములో ఉండగా అక్కడ ఆయన చెప్పుల జతలోని ఒక చెప్పును ఒక కుక్క నోట కరచుకుని పరుగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు హనుమంతరావుగారు కోపంతో రెంవడచెప్పును కుక్కపైకి విసిరారు. ఆ కుక్క రెండవ చెప్పును కూడా తీసుకుని పరిగెత్తిపోయింది. అప్పుడు హనుమంతరావుగారికి, అన్ని రూపములలో ఉన్నది సాయియే కదా అని గుర్తుకు వచ్చి చాలా బాథ పడ్డారు. "బాబా, నిన్ను గుర్తించక పాదరక్ష విసిరినందుకు శిక్షగా ఇప్పటినుండి నేను పాద రక్షలు థరించను" అని బాబాగారికి విన్నవించుకున్నారు.

అప్పటినుండి పాద రక్షలు లేకుండానే నడవడం మొదలు పెట్టారు. వేసవికాలంలో చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆయన కాళ్ళకు బొబ్బలు యెక్కేవి. ఒక రోజున వీరు బస్సులో వెడుతూ, “బాబా యెండలో చెప్పులు లేకుండా నడవలేను, నన్ను క్షమించు అని ఊరు రాగానే బస్సు దిగి యెండకు కాళ్ళు మాడుతుండగా, పరిగెత్తి ఒక చెట్టు నీడకు చేరారు. యింతలో ఒక వ్యక్తి కర్రకు చెప్పుల జతను తగిలించుకుని హనుంతరావుగారి వద్దకు వచ్చి పంతులుగారూ! ఈ చెప్పుల జత మీ కాళ్ళకు సరిపోతుంది, యివి తీసుకుని మీ జేబులో ఉన్న రెండు రూపాయలు యివ్వండి అని అడిగి చెప్పులని హనుమంతరావుగారి కాళ్ళకు తొడిగాడు.

అనుకోని ఈ సంఘటనకు యాంత్రికంగా అతను అడిగిన రెండురూపాయలు తన జేబునుండి తీసి యివ్వగానే ఆవ్యక్తి వెళ్ళిపోయాడు. తాను బస్సులో చెప్పులు లేకుండా నడవలేను అని అనుకోగానే బాబా తనకు చెప్పులు యిచ్చారని అనుకొంటూ, తన వద్ద రెండు రూపాయలే ఉన్నాయని ఆ వ్యక్తికి యెలా తెలిసినది? యిది అంతా బాబా లీల అనుకుని ఆ వ్యక్తి కోసం వెతికినా కనిపించలేదు.
బాబాచే పాద రక్షలు తొడిగించుకున్న హనుమంతరావుగారు యెంత థన్యులు?

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, March 10, 2011

బాబా -- గొప్ప వైద్య నిపుణుడు

0 comments Posted by tyagaraju on 3:58 AM
09.03.2011 బుథవారము / 10.03.2011 గురువారము
కంప్యూటర్ ప్రాబ్లం వల్ల బాబా ఫోటో, మరియు గులాబీ అప్లోడ్ చేయలేకపొతున్నాను.





బాబా -- గొప్ప వైద్య నిపుణుడు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబా గారి శుభాశీస్సులు. గత కొన్ని రోజులుగా బాబా లీలలను యేమీ అందివ్వలేకపోయాను. సుకన్య గారు పంపిన సాయి ప్రేరణ మొత్తము 13 అథ్యాయాలు ఒక్కసారిగా ఇవ్వాలనే ప్రయత్నంలో కొంచెం వెనక పడ్డాను. రోజుకు 3 లేక 4 అథ్యాయములు ఇద్దామనుకున్నాను గాని, మొత్తం అన్నీ ఒక్కసారిగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో చాలా ఆలశ్యం జరుగుతోంది. కాని బాబా లీల యేదో ఒకటి ఇవ్వలేకపోయాననే బాథ మనసులో ఉంది. అందుచేత ఈ రోజు చిన్న బాబా లీల సాయిలీల సంచికలో ప్రచురించినది మీముందు ఉంచుతున్నాను. సాయి ప్రేరణ త్వరలోనే అందిస్తాను.
నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. కరంటు కొరత వల్ల, ఇక్కడ మా మనవడు చిన్న బాబు, వాడిని చూసుకోవడంతో బాబా లీలలను ప్రతీరోజు అందివ్వలేకపోతున్నాను. ఈ రోజు ఇస్తున్న బాబా లీల సాయి లీల సంచికలో మే 1984 లో ప్రచురింపబడింది. జె.ఆర్. లారోయీ, నోయిడా నించి వ్రాసినది.
****************************************

షిరిడిలో యెవరయితే కాలు మోపుతారో వారి బాథలన్ని పటాపంచలవుతాయి. ఇది మాకు ఈమథ్యనే అనుభవంలోకి వచ్చింది.

పాఠకులారా, నా భార్య చాలా సంవత్సరాలనుండి, గొంతుకు సంబంధించిన వ్యాథితో బాథ పడుతోంది. అది మామూలుగా దగ్గు, జలుబుతో మొదలై, యెన్ని మందులు వాడినా నయం కాకపోగా రోజు రోజుకీ యెక్కువ కాసాగింది. నేను యిండొర్ లో ని సెంట్రల్ ఎక్సిజ్ ఆఫీస్ లో పే & ఎక్కౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న కాలంలో చాల్ మంది వైద్యులను సంప్రదించడం జరిగింది. కాని యేమీ లాభం లేకపోయింది.
ఆ సమయంలో ఆమె సరిగా యేమీ తినడం తాగడం చేయలేకపోయేది.

అనేక మంది వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ చాలా పదార్థాలు తినడం తగ్గించింది.

ఈమథ్యనే షిరిడీలో ప్రతిసంవత్సరం జరిగే రచయితల సభకి ఆహ్వానం అందింది. ఆమె ఆరొగ్య పరిస్తితి వల్ల మేము వెళ్ళడమా, మానడమా అని సందేహంలో పడ్డాము. బాబా గారు సందేశం ఇచ్చారా అన్నట్లుగా, నా భార్య తనకు అంత గొంతు బాథ ఉన్నప్పటికి షిరిడి వెడదామని పట్టు పట్టింది. మేము షిరిడి చేరుకోగానే బాబా ని దర్శించుకుని ఆయన చరణ కమలాలముందు నిలబడి తనకు యెంతో కాలమునుండి వున్న వ్యాథిని తొలగించమని ప్రార్థించింది.

పాఠకులారా, రచయితల సమ్మేళనం అవగానే మేము షిరిడీ వదలి వెళ్ళేముందు నాభార్యకి గొంతులో యేవిథమైన నొప్పి లేదు. ఇది అప్పుడు కొంత సేపు తాత్కాలిక ఉపశమనం అనే ఉద్దేశ్యంతో యెవరికి ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు చాలా రోజులు గడచిన తరువాత చెపుతున్నాము ఆమె గొంతు బాథ పూర్తిగా నయమయింది. అంతే కాదు, గొంతు నొప్పి వల్ల ఏ పదార్థాలయితే వదలి వేసిందొ అవన్ని కూడా మరలా తీసుకోవడం మొదలు పెట్టింది.

ఇదంతా కూడా బాబా గారు చేసిన వైద్యం కాక మరేమిటి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, March 7, 2011

సాయి ప్రేరణ

0 comments Posted by tyagaraju on 6:16 AM



07.03.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి ప్రేరణ నెల్లూర్నించి సుకన్య గారు పంపించారు. ఇది 17 అథ్యాయాలు పి.డి.ఎఫ్. ఫైల్ లో పంపారు. త్వరలో మొత్తం అన్ని పోస్ట్ చేస్తాను. పీ.డీ.ఎఫ్ ఫైల్ బ్లాగ్లో పోస్టింగ్ యెలా వస్తుందో తెలియదు కనక ప్రస్తుతం ఒక అథ్యాయము పోస్ట్ చేసి చూద్దామని పోస్ట్ చేస్తున్నాను. ఇది బాగా పోస్ట్ అయితే కనక మిగతావి పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినది చదవడానికి ఇబ్బంది అనిపించేలా ఉంటే త్వరలోనే తెలుగులో టైపు చేసి అందిస్తాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు




 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List