Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 26, 2011

0 comments Posted by tyagaraju on 2:07 AM
ఈ రోజు పోస్ట్ అనగ 26.02.2011 న చేసిన "సాయి మందిర నిర్మాణము" శ్రీ ఆర్. గోపాల్ సింగ్ గారు, సికందరాబాదువారు వ్రాసినది.

బాబా మందిర నిర్మాణము

0 comments Posted by tyagaraju on 1:42 AM





26.02.2011 శనివారము.

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.
బాబా మందిర నిర్మాణము

బాబా మందిరం నిర్మించాలంటే దానికి యెంతో పుణ్యం చేసుకోవాలి. చాలా శ్రమతో కూడుకున్న బృహత్కార్యం. కాని బాబా అనుగ్రహం ఉండాలే కాని అసాథ్యం మాత్రం కాదు. సికందరాబాదులో మందిర నిర్మాణానికి బాబా గారు తమ అనుగ్రహాన్ని యెలా వర్షంలా కురిపించారో ఈ లీల చదివితే ఒడలు పులకరిస్తుంది. ఈ లీల సాయి లీల పత్రికలో 1983, అక్టోబరు సంచికలో ప్రచురితమైంది. ఈప్పుడు బాబా గారి అనుగ్రహాన్ని మనముకూడా తనివితీర చదివి ఆనందిద్దాము.

*****

ఒక సామాన్యమైన మథ్యతరగతి కుటుంబం బాబా మందిరం నిర్మించడమంటే యెవరైన కలలో కూడా ఊహించలేరు. కాని బాబా గారి అనుగ్రహం మా మీద ఉండటం వల్ల యిది కష్టం లేకుండా సాథ్యమయింది. మా కల తక్కువ సమయంలోనే అంటే 5 నెలలలోనే పూర్తి అయింది.

మేము హైదరాబాదులో బిర్లా మందిరంలో 3 అడుగుల యెత్తు ఉన్న కృష్ణుని పాల రాతి విగ్రహాన్ని, ఆరుబయట అందమైన తోటలో చూసినప్పుడు మా మనసులో కి ఈ కోరిక అంటే బాబా మందిరం నిర్మించుదామని వచ్చింది. సికందరాబాదులో ఉన్న నవగ్రహ మందిరం ఆవరణలో బాబా మందిరాన్ని నిర్మించాలన్న కోరిక మామనస్సులో గాఢంగా నాటుకుంది. మాలో ఈ కోరికకి బీజం పడింది.మందిరం నిర్మించడానికి శంఖుస్థాపనకి మంచి ముహూర్తం కోసం చూస్తున్నాము.

నన్ను యెక్కువ ఆశ్చర్య పరిచే సంఘటన జరిగింది. నేను నా స్కూటర్, మోటార్సైకిల్ స్పేర్ పార్ట్ లు అమ్మే కవుంటరులో ఉన్నాను. ఇద్దరు కస్టమర్లు స్కూటర్ స్పేర్ పార్ట్ లు కొనుక్కోవడానికి నా షాపు కి వచ్చి, నా వేలికి ఉన్న బాబా ఉంగరం చూసి, నేను బాబా భక్తుడినా అని అడిగారు. నేను వారితో మామూలుగా అవును అని చెప్పాను. ఇంకా బాబా మందిరం కట్టిద్దామనుకుంటున్నాను అందుకోసం శంఖుస్థాపనకి మంచి ముహూర్తం కోసం చూస్తున్నానని చెప్పాను. వెంటనే వారు, డిశెంబరు 9 తా.1982 మంచి రోజు, ఆ రోజునమేము బాబా విగ్రహాన్ని మల్కాజిగిరిలో ప్రతిష్ఠిస్తున్నాము అని చెప్పారు.

నేను నా భార్య యిది బాబా గారు నిర్ణయించినదే అనుకుని శంఖుస్థాపనకి నిర్ణయించాము. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అప్పటినించి యెటువంటి ఆటంకాలూ లేకుండా నిర్మాణపు పనులు జరిగాయి. ప్రతివారు బాగా సహకారం అందించారు. మందిరం 9" x 3' లో సగ భాగం తోట, మిగిలిన భాగం బాబా విగ్రహాన్ని పీఠం మీద ప్రతిష్ఠించడానికి నిర్మాణం పూర్తి అయింది.

ఇక్కడ నేను చెప్పేది అతిశయోక్తి కాదు. బాబాగారి అనుగ్రహం మామీద యెంతగా ఉందంటే మేము యే విషయంలోనూ కష్టపడలేదు. పనులు జరుగున్నంత కాలం ప్రతీదీ మా దగ్గిరకే వచ్చేది. దీనికింకా తార్కాణం
మల్కాజిగిరిలోని మందిరంలో బాబా విగ్రహావిష్కరణకి వచ్చిన శిల్పి,నన్ను కలవడానికి మా యింటికి వచ్చి,
బాబా విగ్రహం తయారుచేయడానికి ఆర్డర్ తీసుకుని, సకాలంలో మంచి అందమైన విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు.

ఇంకా భక్తులకి ఆసక్తికరమైన విషయమేమంటే ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పని చేసే మా శ్రేయోభిలాషి ద్వారా బాబా విగ్రహం జైపూర్ నుంచి సికందరాబాదుకి విమానం ద్వారా మా వద్దకే వచ్చింది. బాబా గారు తనంతట తాను నా వద్దకు రావడం నాకు చాలా సంతోషం వేసింది. యెందుకంటే ఇదంతా ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఆయన అనుగ్రహం మామీద ప్రతి విషయంలోను లభించింది. ప్రతి పనీ యే కష్టమూ లేకుండా జరిగి మే 15, 1983 న దంపత సంస్థాపన జరిగింది. చాలా మంది భక్తులు, దంపతులూ ఆరోజు పూజలో పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా చాలా సవ్యంగా జరగడం ఊహకందని విషయం.

ఇదంతా కూడా బాబాగారి అనుగ్రహం తప్ప మరేమీ కాదు. మేమంతా కూడా బాబా మందిరంలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ స్వర్గాన్ని చూస్తున్నాము.

ఇటువంటి పవిత్రమైన కార్యంలో మమ్ములని వాడుకున్నందుకు బాబా వారి చరణాలకు ప్రణమిల్లుతున్నాము.
షిరిడీ సంస్థానం నించి కోర్ట్ రిసీవర్ గారు, మా ఆహ్వానానికి కృతజ్ణతలు తెలుపుతూ పంపిన సందేశానికి కూడా మేము థన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Friday, February 25, 2011

సర్వాంతర్యామి

0 comments Posted by tyagaraju on 5:04 AM




25.02.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి


ఈ రోజు మనము సాయి లీల1975 సంచికలో శ్రీ ఏ.శ్రీనివాసులు సికందరాబాదు వారు వ్రాసిన సాయి లీలను తెలుసుకుందాము.

బాబా గారు యిక్కడ ఉన్నారు, అక్కడవున్నారు, అన్ని చోట్లా ఉన్నారు, అతటా ఉన్నారు, సర్వాంతర్యామి.

1969 సెప్టెంబరులో నేను ట్రైనింగ్ నెమిత్తం హైదరాబాదునుంచి భుసావల్ వెడుతున్నాను. ప్రొద్దున్న 9 గంటలకి మన్మాడ్ లో దిగాను. నేను ట్రైనింగ్ క్లాసులో మరునాడు ఉదయం జాయినవాలసి ఉండటం వల్ల అప్పటికప్పుదు షిరిడి వెడదామని నిర్ణయించుకున్నాను.నా సామానంతా క్లోక్ రూంలో పడేసి షిరిడి వెళ్ళే బస్ యెక్కాను. వాతావరణం బాగా మబ్బుపట్టి పెద్ద వర్షం కురుస్తానని బెదిరిస్తున్నట్లుగా ఉంది. మథ్యాహ్న్న హారతికి చేరుకునేలా చేయమని నాలో నేనే ప్రార్థించుకున్నాను. బస్సు మట్టి రోడ్ గుండా వెడుతోంది. వాతావరణం కళ్ళకి కనువిందు చేస్తోంది. మేము, చెఱకు తోటల గుండా, పళ్ళతోటల గుండా, గ్రామాలూ, బజారుల గుండా, ఆఖరికి 11.30 కి షిరిడీ చేరుకున్నాము. బాబా గారు సమయానికి షిరిడీ చేరుకునేలా సహాయం చేశారు. ఆయన నా ప్రార్థనలని మన్నించారు. తొందరగా స్నానం చేసి మందిరం హాలులోని గుంపులో కి ప్రవేసించాను. ప్రసాదం తీసుకున్న తరువాత సంస్థానం వారు నడిపే ప్రసాదాలయంలో భొజనం చేశాను. మంచి విందుభోజనం చేసిన తరువాత కాట్టేజ్ కి 3 గంటలకి తిరిగి వచ్చాను. బాబాగారు నన్ను దర్శనం పూజా సమయానికి షిరిడి చేర్చినందుకు చాలా సంతోషించాను. బాబాగారి వద్ద సెలవు తీసుకుని సాయంత్రము 4 గంటలకి మన్మాడ్ వెళ్ళే బస్ యెక్కాను. ఆ సమయంలో పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ప్రథాన రహదారి వెంటనె బాగుచేయాలి అన్నంతగా పాడైపోయింది. యెముకలు విరిగిపోయాయేమో అన్నంత దారుణమైన ప్రయాణం తరువాత కోపర్గావ్ కి 3 కిలో మీటర్ల దూరంలోనున్న పట్టణానికి చేరుకున్నాము.

500 గజాల మేర రోడ్డు కొట్టుకుపోయి పెద్ద కందకం యేర్పడిఉంది. భారీ వాహనాలు ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళలేనంతగా ఉంది అక్కడి దృశ్యం. పక్కనించి తప్పించుకుని వెళ్ళడానికి కూడా వీల్లేనంతగా అక్కడక్కడ యేర్పడిన కందకాలన్ని నీటితో నిండి ఉన్నాయి.అవతలివైపుకి నడవడానికి కూడా సాథ్యము కానంతగా రోడ్డు జారుడుగా ఉంది. క్రమంగా చీకటి పడుతూ ఆప్రాం తమంతా అడవిని తలపిస్తోంది. ప్రయాణీకులంతా, భయం మరియు తడివాతావరణానికి వణుకుతూ ఉన్నారు. సహాయక చర్యలు జరిగే సూచనలేమీ కనపడటల్లేదు. కొంతమంది ప్రయాణీకులు గట్తిగా బాబా నామాన్ని ఉచ్చరిస్తున్నారు. నేను కూడా సాయినామాన్ని స్మరిస్తున్నాను. నేను మరునాడు ట్రైనింగ్ కి వెళ్ళాలంటే మన్మాడ్ వేళ్ళి భుసావల్ రైలుని అందుకోవాలి. అదే నా ఆదుర్దా. కాని ఇప్పుడీ కష్టాన్నుండి బయటపడేదెలా?

రాత్రి 7 గంటల తరువాత పి.డ్బ్ల్యు.డీ. వారి జీపు వచ్చింది. అది చూడటానికి సర్కస్ వెహికిల్ లా ఉంది. అనుకున్న ప్రదేశానికి చేరాలన్న ఆ వెహికిల్ సర్కస్ ఫీట్లు చేయక తప్పదు. డ్రైవర్ నా దగ్గిరకి వచ్చ్చి నన్ను జీపులోకి రమ్మన్నాడు. అతను ఇంకా కొంతమందిని యెక్కించుకుని జాగ్రత్తగా పట్టణానికి డ్రైవు చేసుకుంటూ వచ్చాడు. మేము ఈ జీపులో కోపర్ గావ్ బస్ స్టాండ్ కి వచ్చాము. డబ్బులిస్తే తీసుకోడానికి డ్రైవరు నిరాకరించి "బాబా మిమ్మల్ని దీవిస్తారు" అని వెళ్ళిపోయాడు. యెవరితను? అతను స్వయంగా బాబాయేనా?

నేను మన్మాడ్కి ఇంకొక బస్ యెక్కాను. అది నన్ను భుసావల్ వెళ్ళే ఎక్స్ ప్రెస్ రైలుకు సమయానికి చేర్చింది. నేను సమయానికి ట్రైనింగ్ కి చేరుకోగలిగాను.

ఇది బాబా లీల కాదా?


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Tuesday, February 22, 2011

బాబా లీల - ఊదీ మహిమ

0 comments Posted by tyagaraju on 5:41 AM









22.02.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి



ఈ రోజు మనము శ్రీ అనిల్ పండిత్, యిండొర్ గారు వ్రాసిన షిరిడీ బాబా ఊదీ లీలని గురించి తెలుసుకుందాము. ఈ లీల సాయిలీల సంచికలో 1974 జూన్ నెలలో ప్రచురితమైనది.

నేను సుమారు గత 13 సంవత్సరాలనుండి సాయి భక్తుడిగా ఉన్నాను. నేను యెల్లప్పుడూ ఆయనని పూజిస్తూ ఉంటాను. ఆ కాలంలో నేను చాలా చిత్రమైన అనుభవాలు కలిగాయి. వాటిలో కొన్ని సాయిలీల మరాఠి పత్రికలో, గతంలో ప్రచురింపబడ్డాయి.కాని 1972 ఏప్రిల్లో జరిగిన బాబాగరి శక్తి మరియు షిరిడీ లోని బాబా ఊదీ మహాత్మ్యం మాకు మరిచిపోలేని అనుభూతి. ఆ లీలని ఇప్పుడు సాయిభక్తులందరికి వివరిస్తాను.

ఏప్రిల్, 1972 లో హటాత్తుగా, మా పెద్దాబ్బాయి కూతురు భావనకి సుస్తీ చేసింది. ఆమెని మేము సంజీవని అని ముద్దుగా పిలుస్తాము. మా ఫామిలీ డాక్టర్ పరీక్షించి వేసవికాలము వల్ల కొంచెం వడ దెబ్బ లేక వాతావరణం వేడి వల్ల కొంచెం సుస్తీ చేసి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. జ్వరం తగ్గకుండా అలాగే ఉండటంతో ఆహారం యేమీ తినడంలేదు.అమ్మాయి పొత్తికడుపు పెద్దదయి బయ టకు తెలుస్తోందీ. డాక్టర్ గారు మాములుగా వడదెబ్బకనే వైద్యం చేస్తూ సీరియస్ నెస్స్ ని చూడలేదు.అమ్మాయి రోజు రోజుకి క్షీణిస్తోంది. కళ్ళు లోతుకు వెళ్ళాయి, పొట్ట ముట్టుకుంటే బాగా నొప్పి, అల్లా వుంది పరిస్థితి. ఆఖరికి మేము అమ్మాయిని యిండొర్ లోని పెద్ద ఆస్పత్రిలో చూపించదలచాము. మేము ఆదివారము రాత్రి ఆప్స్పత్రిలో చేర్పించాము. ప్రథాన డాక్టర్ గారు ఆరోజు సెలవులో ఉన్నారు.ఆస్పత్రిలో చేర్పించేముందు అమ్మాయికి నుదిటిమీద షిరిడీలోని బాబా ఊదీ చిటికెడు పెట్టాము. మరునాడు ప్రథాన డాక్టర్ గారు పరీక్షించి, ప్రేవులకి సంబంధించిన టైఫాయిడ్ అని నిర్థారించారు. లోపల ప్రేవులలోని గోడకి చిల్లు పడిందని చెప్పారు. ఇటువంటి కేసులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, ఆపరేషన్ చెయ్యవలసిఉంటుంది, కాని, అమ్మాయి ఆపరేషన్ కి తట్టుకోలేదు అని డాక్టర్ గారు చెప్పారు. గ్లూకోజ్ సెలైన్ యెక్కించమని సలహా ఇచ్చారు. మేమంతా కూడా చాలా అందోళనగా ఉన్నాము.మా కుటుంబ సభ్యులమంతా అమ్మాయి గురించి భయపడుతున్నాము. ఆస్పత్రిలో వైద్యం మొదలు అయింది. ఇది జరిగేముందు నేను మరాఠిలో బాబా చరిత్ర చదువుతున్నాను. ఆ సమయానికి నేను 8 అథ్యాయం పూర్తి చేసి 9 లోకి వచ్చాను. నాకు బాబా మీద నమ్మకం ఉంది. నేను ఆయనకి విన్నవించుకున్నాను " ఓ బాబా మామీద ఇటువంటి ఉపద్రవం పడిందేమిటి, దీనినుంచి తప్పిచగలవాడవు నువ్వే"

మార్చ్ నెలలో నేను షిరిడిళొ ఉన్నాను అప్పుడు సంస్థాన్ ఆఫీస్ నుండి కొన్ని బాబా ఫోటోలు తీసుకువచ్చాను. అందులో ఆశీర్వాదము ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటో చూసినప్పుడల్లా, బాబాగారు చింత వద్దు, ప్రతీదీ మంచే జరుగుతునది అని మాకు అభయము ఇస్తున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటొ ని ఆస్పత్రికి తీసుకువెడామని అనిపించింది నాకు. ఆ ఫోటోని, కొంత ఊదీని ఆస్పత్రికి తీసుకు వచ్చాను. ఫోటోని భావనా తలగడ కింద పెట్టి ఊదీని ఒళ్ళంతా రాశాను. అప్పుడు నాలో భావోద్వేగాలు చాలా గాఢం గా ఉండి యేడవదం తప్ప నిస్సహాయంగా ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులందరిముందు ఇలా అన్నాను "ఓ! బాబా భావనాకి కనుక ఈ రోగం నయం కాకపోతే ఇక ముందు నీ చరిత్ర చదవను" . నా సర్వశ్య శరణాగతి వేడికోలు, ఆనాడు షామా ఒకామెకు సంతానము కలగకపోతే తన నెత్తిమీద కొబ్బరికాయ కొట్టుకుంటాను అని చెప్పినదానికి పోలి ఉంది.

ఈ లోగా నేను చరిత్ర చదువుతూ ఉన్నాను. ప్రతి గురువారము ఆరతి,పూజ చేస్తూ ఉన్నాను.
ఆపరేషన్ లేకుండా రోగం నయం అయ్యేటప్పటికి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అది పేషంట్ సాథించిన విజయమా కాకు అది బాబా గారి శక్తి, ఊదీ మహత్యం. క్రమంగా అమ్మాయి జ్వరం తగ్గింది, ప్రేవులలోని గోదకి ఉన్న చిల్లు కూడా మానింది. 2, 3 వారాల తరువాత అమ్మాయి యింటికి తిరిగి వచ్చింది.

నాకనిపిస్తుంది, బాబా మీద నమ్మకం చూపే లీల అమోఘం. కాని ఆయన అంద్నిచే అనుగ్రహ ఫలితాన్ని మనం కోల్పోతూ ఉంటాము.

(1973 జూలై మరాఠీ

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Sunday, February 20, 2011

సాయి మనవెంటే ఉంటారు -- 2

0 comments Posted by tyagaraju on 3:04 AM



























20.02.2011 ఆదివారము


సాయి మనవెంటే ఉంటారు -- 2

ఓంసాయి శ్రీ సాయి జయజయ సాయి

మనకు ప్రతిక్షణము మన మనస్సులో బాబా రూపమే ఉండాలి. మన నాలిక మీద బాబా నామం ఆడుతూ ఉండాలి. మనం కూర్చున్నా, నుంచున్నా "బాబా" అని స్మరిస్తూ ఉండాలి. ఆఖరికి ఫొన్ లో సమాథానం చెప్పేముందు "హలో" అనకుండా "సాయిరాం" అని పలకాలి. అప్పుడే మనకు బాబా తో సన్నిహిత సాన్నిహిత్యం యేర్పడుతుంది.
దీనివల్ల ఆపత్సమయంలో కూడా బాబా నామస్మరణ మనకు తెలియకుండా అప్రయత్నంగా మన నోటివెంట వస్తుంది. బాబా తక్షణ సహాయం మనకి అందుతుంది.
అటువంటి సంఘటన ఒకటి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఇంతకుముందు శ్రీ వేమూరి వెంకటేస్వర్లుగారి ని బాబా గారు రక్షించిన లీల చదివాము. (సాయి మనవెంటే ఉంటారు) ఆయనకే సంబంథించిన మరియొక లీల యిప్పుడు తెలుసుకుందాము.

శ్రి వేమూరి వెంకటేశ్వర్లు గారు బాబా అనుగ్రహమును పొందిన గొప్ప భక్తులు.
ఆయన ప్రార్థించకుండానే తనకు తెలియకుండానే జరిగిన తన కుటుంబ రక్షణ బాబా యెట్లు చూపించారో ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది.

1957 సెప్టెంబరు 6 వ తేదీన సాయంత్రము ఆరుగంటల సమయమున శ్రీ వెంకటేశ్వర్లు గారు తన ఆఫీసు గదిలో శ్రీ సజ్జ వెంకయ్య గారను ఆయనతో మాట్లాడుతూ కూర్చున్నారు. యింతలో వీరి భార్య ఆదుర్దాగా వచ్చి పిల్లవాడు బావిలో పడ్డాడని చెప్పింది. ఆమాట వినికూడా ఈయన చలించక "బాబా" అంటూ లేచి తనతో మాట్లాడుచున్న వెంకయ్యతో కలిసి యింటి వెనక దొడ్డిలో ఉన్న బావి దగ్గరకు రెండు నిమిషాలలో వెళ్ళారు. వీరిద్దరు బావి వద్దకు వెళ్ళేసరికి బావిలో పడిన తన 15 యేళ్ళ వయసుగల మూడవ కుమారుడు ఒడ్డున నిలబడి ఉన్నాడు. తలకూడ తడిసి పోయిఉంది. ఆ అబ్బాయికి తాను బావిలో పడ్డానని గాని తిరిగి వచ్చితినని గాని తెలియలేదు. శ్రీ వెంకటేశ్వర్లుగారు ఆ బాలుని వీపుమీద తట్టి బావిలో యెల్లా పడ్డావు, మళ్ళా బయటికి యెల్లా వచ్చావు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడికి తాను బావిలో పడినట్లు గుర్తుకువచ్చి "నేను బావిలో పడినప్పుడు అడుగుకు పోలేదు. కొంత లోపలకు వెళ్ళగా ఒక యిటుకరాయి నా కాలుకింద అడ్డురాగా ఆ రాతిమీద నిలుచున్నాను. తరువాత యెవరో నన్ను యిక్కడ దింపారు" అని చెప్పాడు. బావి బొడ్డు బావి. ఆ బావి ఒరలతో ఉన్న బావి. బావికి గిలకలు కూడా లేవు. ఆ పిల్లవాడు బొడ్డు పైకెక్కి నీళ్ళు తోడుచు కాలు జారి ఆ బావిలొ పడ్డాడుట. ఆ బావిలో అప్పుడు 8 అడుగుల లోతున నీరు ఉంది. ఆ నీటిపై ఒడ్డుకు 5 అడుగుల యెత్తు ఉంది.

బావిలో నీళ్ళు 8 అడుగుల లోతున ఉన్నందున బావిలో పడ్డ ఆబాలుడు నీళ్ళల్లో మునగాల్సిందే.యిటుక రాయి నీటి పై యెట్లు తేలింది? ఆ రాతి మీద నిలిచి ఆ బాలుడు ముంగకపోవుట విచిత్రము కాదా? బావిలోనుండి పైకి తనంతట తాను రాలేడు కదా. అలనాడు బాబా మసీదు వెన్నుపట్టెలకు చెక్కబల్లను కట్టి దానిమీద యెవరికి అర్థము కాని రీతిలో యెక్కినట్లు ఈ బాలుని బాబాయే బావినుండి పైకి తెచ్చి నిలిపినారనడంలో యెటువంటి సందేహము లేదు. అక్కడకు వచ్చిన సజ్జా వెంకయ్యగారు వీరితో " పంతులుగారు! బావిలో పడ్డవాడు రెండు నిమిషములలో యెల బయటకు వచ్చాడండి, మీరు అక్కడ బాబా అని అన్నారు,యిక్కడ మీ అబ్బాయి ఒడ్దున వున్నాడు" అని అన్నాడు. యిది అంతయు బాబా లీలయే.

"సాయి సంకల్పిస్తే నీటిలో యిటుకరాయి తేలగలదు. ఆ రాయి 15 సం.బాలుని నీటిలో తేల్చగలదు. ఆ బాలుని పైకి విసరగలదు. ఒడ్డున నెలబెట్టగలదు. ఆఫీసుగదిలో బాబా అని అనుటయే ఆలస్యముగా ఆ తండ్రియే యిన్ని లీలలు చూపారనుటలో యెటువంటి సందేహము లేదు. యిట్టి సాయి లీలలు అనుభవించువారికే తెలుస్తుంది.తన భక్తులనే కాదు, వారికి అయినవారిని కూడా బాబా వెంటనుండి కాపాడుతారని తెలియవలెను" అని వెంకటేశ్వర్లు గారు అన్నారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List