Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 5, 2011

రెండు చిన్న కథలు

0 comments Posted by tyagaraju on 5:02 AM



05.02.2011 శనివారము

ఓంసాయి శ్రీ సాయి జయజయసాయి

సత్సంగము - రెండు చిన్న కథలు

మనము అప్ప్డప్పుడు కాస్త కాస్త సత్సంగము గురించి చెప్పుకుంటున్నాము. ఈ రోజు కూడా సత్సంగము మీద చిన్న కథ, భగవంతుడు మనని అనుసరించుట, చిన్న కథ తెలుసుకుందాము. సత్సంగము మనము సజ్జనులతోనూ, భక్తిభావం ఉన్నవారితోనూ చేయాలి. అంటే మీకు యింతకుముదు సత్సంగము యెలా చేయాలో వివరించడం జరిగింది. సత్సంగములో మనము ఒకరికొకరం మన అనుభవాలని, అనుభూతులని, బాబా వారి తత్వాన్ని చర్చింకుటూఉండాలి. అప్పుడే మనమనసులో భక్తిభావం పెంపొందుతుంది.

సాయి భక్తులమైన మనము యేది తిన్నా కూడా, తినేటప్పుడు సాయికి నివేదించి తీసుకోవాలి. ంఅనం తినేటప్పుడుకూడా, సాయినాథారపణమస్తు అనుకుంటూ తినాలి. నేను యేది తింటున్నా, లేక ఆఖరికి మంచినీరు తాగుతున్న సాయినాథార్పణమస్తు అనుకుంటూ తీసుకుంటాను. ప్రతి ముద్దకి అన్నం తినేటప్పుడు, సాయినాథార్పణమస్తు, అంటే సాయియే తింటున్నారు అనే భావం.

బాబా లీలలు కాకుండా ఇటువంటి మిగతా విషయాలు రుచిస్తునాయో లేదో తెలియ చేస్తే వీటిని అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటాను. లేదా లీలలనె యిస్తూ ఉంటాను.

సత్సంగమహాత్మ్యం

ఒకసారి ఒక ముముక్షువు కి నారదుల వారు యెదురయ్యారు. ఆయన నారదులవారిని ముక్తికి మార్గం చూపమని అడిగారు. నారదుల వారు సత్సంగము చేయమన్నారు. (ముముక్షువు - సత్యాన్వేషి) ముముక్షువు " సత్సంగము అంటే యెమిటి" అని అడిగాడు. అప్పుడు నారదులవారు, కింద పాకుతున్న పురుగును చూపించి అదిగొ ఆ పాకే పురుగుని అడుగు అన్నారు. ఆ ముముక్షువు "పురుగా పురుగా, సత్సంగము అంటే యేమిటి "అని అడిగాడు. ఆ మాట వింటూనే ఆ పురుగు చచ్చిపోయింది. ముముక్షువు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదులవారు "అదిగో ఆ యెగిరే పక్షిని అడుగు" అన్నారు. యెగిరే పక్షిని చూసి, "పక్షీ, పక్షీ, సత్సంగము అంటే యేమిటీ" అని అడగ్గానే, ఆ పక్షి ఠపీమని నేలమీద పడి మరణించింది. ఆ ముముక్షువు నిరాశతో "యెమిటిది స్వామీ" అని అడిగాడు. "కంగారు పడకునాయన, కొంచెం సేపట్లో యిక్కడికి దగ్గిరలో ఉన్న ఒక రైతు ఇంటిలో ఆవు ఈనడానికి సిథ్థంగా ఉంది, ఆ పుట్టే దూడని అడుగుదువుగాని పద" అన్నారు నారదులవారు. "వద్దు నారదా, ఆ దూడకూడా మరణిస్తే నాకు గోహత్యా పాతకం చుట్టుకుంటుంది. నేను వెళ్ళిపోతాను" అన్నాడు ముముక్షువు.

"అదెమిటి, సత్సంగము అంటే యేమిటో తెలిసికోకుండానే వెళ్ళిపోతావా? ఒకవేళ ఆ దూడ మరణిస్తే ఆ గోహత్యాపాతకమేదో నేను తీసుకుంటాను సరేనా" అని బయలదేరదీశారు నారదులవారు. రైతు యింటి పశువుల కొట్టంలొ అప్పుడే ఈనిన దూడని "సత్సంగం అంటే నీకు తెలుసా" అని ముముక్షువు అడగగానే ఆ దూడ కాస్తా మరణించింది. ముముక్షువు చాలా బాథ పడ్డాడు. అప్పుడు నారదుల వారు, "ఈ రాజ్యన్నేలే రాజుగారి పట్టమహిషికి కొంచెం సేపటిలొ శిశువు జన్మించబోతున్నాడు. ఆశిశువుని అడుగుదువుగాని పద" అన్నారు. "అమ్మో! రాజ భవనంలోకా? పైగ అంతహ్ పురంలోకా? అడుగడుగునా రాజ భటులు ఉంటారు" యెలా సాథ్యమవుతుంది అనగానే , నారదులవారు, యేమీ ఫరవాలేదు, నన్ను తలుచుకుని ప్రవెశించు అని చెప్పారు. తరువాత జరిగేది తనకి చెప్పమన్నారు.

ఇద్దరూ రాజభవనం దగ్గిరకి వెళ్ళారు. ముముక్షువు నారదులవారిని తలుచుకుని నిరాటంకంగా అంతహ్ పురంలోకి వెళ్ళాడు. అక్కడ మహారాణీ వారు మగ శిశువుని ప్రసవించింది. ముముక్షువు ఆ బాలుడుని, సత్సంగము అంటే యెమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుని మొహం వింత కాంతితో మెరిసింది. బోసినోటితో చక్కగా నవ్వాడు. తరువాత ముముక్షువు వచ్చి జరిగినదంతా నారదులవారికి చెప్పాడు.

అప్పుడు నారదుల వారు "అదే నాయన సత్సంగ మహత్యం. బాలుడు యెవరనుకున్నావు? ముందర నువ్వు సత్సంగము అంటే యెమిటి అని పురుగుని అడిగావు చూడు, అదే పురుగు సత్సంగము అనే మాట వినగానె పక్షిగా, దూడగ జన్మించి ఆఖరికి ఉత్తమమైన మానవ జన్మ లభించింది దానికి. అదీ కూడా మహరాజ వంశంలో జన్మించింది. సత్సంగం మాట వింటేనె యింతటి దుర్లభమైన మానవ జన్మ లభించిందే, అటువంటిది సత్సంగము చేస్తే యింకెంత పుణ్యమో అలోచించు" అని నారదులవారు సత్సంగ మహత్యాన్ని వివరించారు.

---- @@@ ---

84 లక్షల జీవరాసులలో మానవ జన్మ అత్యుత్తమమైనది. మరి దీనిని సార్థకం చేసుకోవాలంటే మనము యేమి చేయాలొ అలోచించండి.

పాద ముద్రలు

ఒకరోజు ఒకానొక వ్యక్తికి ఒక కల వచ్చింది. అతను సముద్రపు ఒడ్డున భగవంతుడితో కలిసి నడుస్తున్నట్లుగా కల గన్నాడు. ఆకాశంలో తన జీవితంలో జరిగిన దృశ్యాలన్నీ కనుల ముందు సాక్షాత్కరించాయి. ఒక్కొక్క దృశ్యంలో అతనికి రెండు జతల పాద ముద్రలు కనిపించాయి. ఒక జత తనది, మరియొక జత భగవంతుడిది.

ఆఖరి దృశ్యం కనిపించినప్పుడు, అతను తన వెనుక యిసుకలో తన వెనుక పాద ముద్రలని చూచాడు. తన జీవిత గమ్యంలో చాలా సార్లు ఒక జత పాద ముద్రలే ఉండటం గమనించాడు. అది తన జీవితంలో నిరాశతోను, దుఖంతోను ఉన్న సమయాలలొ ఉన్నట్లు గమనించాడు.

ఇది అతనిని చాలా కలవరపరిచింది. భగవంతుడిని అడిగాడు.

" దేవా! ఒకసారి నిశ్చయించుకున్నాక నాకు తోడుగా నాతోనే జీవితమంతా నడుస్తానని చెప్పావు, కాని, నా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఒక జత పాద ముద్రలే ఉన్నాయి. అటువంటి అత్యవసర సమయాల్లో నన్నెందుకు విడిచి వెళ్ళిపోయావొ నాకర్థమవడం లేదు" అన్నాడు. అప్పుడు భగవంతుడన్నాడు " భక్తా ! నువ్వంటే నాకిష్టం, నేను నిన్నెప్పుడూ వదలలేదు, నీకష్ట సమయాల్లో నువ్వు బాథలు పడుతున్నప్పుడు నువ్వు ఒక జత పాద ముద్రలే చూశావు, సమయంలో నేను నిన్ను యెత్తుకుని మోశాను." అని చెప్పాడు.

ఇది కథే కావచ్చు. కాని దీనినుంచి మనము తెలుసుకోవలసినది యేమిటి అని అలోచిస్తే, భవంతుడిని నమ్ముకుంటే ఆయన మనలని యెప్పటికీ విడిచిపెట్టడు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, అనన్యమైన భక్తిభావంతో సాయినే మనసారా నమ్ముకుని ఆయన నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే, అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయనే చెప్పారు కదా, మీభారమంతా నామీద వేయండి, నేను మోస్తాను అని.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Friday, February 4, 2011

సత్సంగము

0 comments Posted by tyagaraju on 5:26 AM



















సత్సంగము

04.02.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులారా బాబా ఆశీర్వాదములు

ఇన్నాళ్ళూ మనము బాబా లీలలను చదువుకున్నాము. ఇవాళ మనం కొంచెం సేపు సత్సంగము చేసుకుందామా?

సత్సంగములో మనం సాయి తత్వము గురించి తెలుసుకుందాము.

సత్సంగం పట్లా, సత్కథా శ్రవణం పట్లా సద్భావం, సదా వాటిలో నిమగ్నమయే సంస్కారం ఉన్నవారి భాగ్యమే భాగ్యం.

ఒక్కసారి కనులు మూసుకుని మీ కనులముందు బాబా వారిని దర్శించుకోండి. మీరు ఒక్కరే కంప్యూటరు ముందువున్నట్లు కాకుండా, సాయి బంథువులందరూ కూర్చున్నట్లుగా భావించుకోండి.

యెదురుగా ఉన్న బాబా ఫోటొ వంక చూడండి.

అందరూ చెప్పండి. సద్గురు సాయి నాథ్ మహరాజ్ కీ జై

ఒక్కసారి బాబా నామ స్మరణ చేయండి.

ఓం సాయీ నమోనమహ శ్రీ సాయీ నమోనమహ

జయజయ సాయీ నమోనమహ, సద్గురు సాయి నమోనమహ

కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు బాబాగారి రూపాన్ని ఊహించుకుని థ్యానం చేయండి.

ఇప్పుడు మీ చేతుల్లోకి సచ్చరిత్ర తీసుకుని యేదో పేజీ లో ఒక పేరా చదవండి.

సచ్చరిత్రలో ప్రతీ పేజీ కూడా బాబా వారు చెప్పినవి అమృతపు గుళికలు. అందుచెత పారాయణ చేసేటప్పుడు మన మనసంతా అందులో లీనమయిపోవాలి. అథ్యాయం యెప్పుడు పూర్తవుతుందా అనే ఆలోచన రాకూడదు. చరిత్ర చదివాక ఒక్కసారి చదివినది మరల జ్ణప్తికి తెచ్చుకోవాలి. ఆనాటి షిరిడి, అప్పుడు బాబా గారు అక్క్డ డవుండే వారితో యెలా ఉన్నారు ఇటువంటి దృశ్యాలన్నీ మన కనులముందు సాక్షాత్కరింప చేసుకోవాలి.

ఆనాటి షిరిడీ గ్రామం, ఖండొబా దేవాలయము, మసీదు, చావడి, పైన యిచ్చిన చిత్రాలని మరలా ఒకసారి చూడండి.


ఇందులో పొందుపరచిన చిత్రాలలో నంద దీపము , మందిరంలో బాబా గారి విగ్రహము పెట్టకముందు ఫోటొ, విగ్రహము పెట్టిన తరువాత, శ్రీ తాలిం గారు బాబా విగ్రహమును చెక్కుతున్నట్లు ఉన్న ఫోటోలు ఉన్నవి.


శ్రీ సాయిబాబా పట్ల భక్తిగా ఉండేందుకు పదకొండు కారణాలు

1. మొదటిదీ, విశిష్టమైనదీ అయిన కారణం, శ్రీ సాయిసచ్చ్రిత్ర గ్రంథకర్త హేమాద్పంత్ చెప్పినట్లు బాబా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నియమం పెట్టుకొన్నారు. (. 13)

2. అది కూడా వెంటనే ఆలస్యం కాకుండా, మీరు నిజమైన శ్రథ్థతో అడగండి, సహనం పెట్టుకోండి. ఇక మీ కోర్కీలు తీరిపోయినట్లే.

మీరు యెవ్వరైనా, యెక్కడున్నా నా ముందు భక్తి భావంతో అంజలి ఘటించి, విన్నపం చేసుకుంటే నేను మీ వెనుక భావావేశంతో రాత్రింవవళ్ళు నిలబడి వుంటాను. (.15)

3. ఆయన ఎంత సహజంగా ప్రసన్నులౌతరంటే అందుకు కఠిన తపశ్చర్య అవసరం లేదు. కష్టదాయకమైన ఉపవాసాలూ, తపవాసాలూ అక్కరలేదు. కఠోరమైన యింద్రియ నిగ్రహం కూడా అవసరం లేదు. బాబా నే చెప్పినట్లు నీవు నావైపు చూస్తే నేను కూడా అలాగే మీవైపు చూస్తాను.

4. బాబా దేహ త్యాగం చేసి యిన్ని సంవత్సరాలయినా, రోజుకీ వేలాది మంది భక్తులకి ఆయన తమ అస్థిత్వాన్ని తెలుపుతున్నారు. వారి పిలుపుకి ఆయన పరుగున వస్తున్నట్లు అనుభవం కూడా కలుగుతోంది.

నేనొకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా యెముకలు నా సమాథినుంచి మీకు థైర్యాన్నిస్తాయి.

5. బాబా యిప్పుడు దేహథారి కాకున్నా ఆయన్ని సద్గురువుగా భావించి భక్తిని కలిగివుంటే మనం మోసపోతామేమోనన్న చింత వుండదు. రోజుల్లో మన దేశంలో తమను భగవాన్, అవతారం, మహర్షి అని అనిపించుకొనే అనేకమంది గురువులను చూసినప్పుడు నిజమైన గురువు యెవరో తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది.

6. బాబా పట్ల భక్తి కలిగి వుండటానికి డబ్బు అవసరం లేదు. కేవలం పూలు, లేక ఆకులు, నిజమైన ప్రేమతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఆదరంతో యేది అర్పించినా ఆయనకి సరిపోతుంది. రెండు చేతులతో చేసే నమస్కారాన్ని కూడా ఆయన యిష్టపడతారు.

7. బాబాకి మన కష్టాల గురించి యేకరువు పెట్టుకోవటానికి ప్రతీసారీ డబ్బు ఖర్చు పెట్టుకొని షిరిడీకి పోనవసరం లేదు. ఆయన భక్తులు, యెక్కడనుంచైనా (సప్త సముద్రాల కవతలినుంచైనా) సరే పిలిస్తే ఆయన పరుగున వస్తారు.

నాకు బళ్ళు, వాహనాలు, విమానాలు, రైళ్ళు అవసరం లేదు. నన్ను ప్రేమగా యెవరు పిలుస్తారో వారిముందు నేను వెంటనే ప్రకటమౌతాను. (. 40)

8. ద్వాకామాయిలోని అఖండంగా వెలిగే థునిలోని విభూతి సర్వ రోగాలకీ రామబాణం లాంటి ఔషథం.

విభూతిని అద్దుకొంటే ఆది వ్యాథులు పోతాయి. (.33)

వారి పాతకాలు పూర్తిగా నశిస్తాయి. సదా సర్వదా వారికి సుఖసంతృప్తులు లభిస్తాయి.

9. సచ్చరిత్ర గ్రంథం కాదు. కల్పవృక్షమే. సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది. కాని, మోక్షాన్ని వాంచించే భావికులకు అది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. (.53)

10. బాబాకున్న సాయి అనే పేరు చాలా చిన్నది. తియ్యనిది. పలకటం సులభం. కష్టమైన జోడాక్షరాలూ లేవు. నాలుకకి బాథా లేదు. సాయి సాయి అన్న నామ స్మరణ నిరంతరం చేస్తే మీ కష్టాలు గట్టెక్కి కోర్కెలు నెరవేరుతాయి. యెంత మాత్రమూ సందేహం పెట్టుకోకండి. (.10)

11. నన్ను అనన్యంగా శరణు వచ్చి, యెవరు నన్ను నిరంతరం స్మరిస్తుంటారో వారి ఋణం నా తలమీద వుంటుంది. వార్ని ఉథ్థరించి దాన్నించి నేను ముక్తుడినౌతాను. (.44)

గ్రంథ పారాయణ చేసేటప్పుడు, శ్రథ్థ, సహనం వుంటేనే అనుకున్న ఫలప్రాప్తి అవుతుంది.

హడావుడి పడకుండా శ్రథ్థతో కథా అనే అమృతరసథారలను ఆదరపూర్వకంగా సేవెస్తే శ్రోతలకు ప్రేమ యుక్త భక్తి లభించి, వారుకృతార్థులవుతారు.

పిసినారి వాళ్ళు యే పని చేస్తున్నా వారి మనోనేత్రం ముందు పూడ్చిపెట్టిన థనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు అలా మన మనొనేత్రంలో సాయియే కనిపించాలి.

మీరు యెక్కడకు వెడుతున్నా సరే మీ హృదయంలో సాయి ఉన్నాడనే థైర్యంతోను, భక్తిభావంతోను, వెళ్ళండి. సాయి నిరంతరమూ మీవెంటే ఉంటారు.

భవవంతుడు అన్ని చోట్లా నిండి వున్నాడు. గుడిలోనే ఉన్నాడని అనుకోవద్దు. కాని గుడిలొ ఒక విథమైన పవిత్ర వాతావరణం ఉంటుంది. అనుదుచేత మనస్సు భక్తిభావంతో నిండి మనస్సు భగవంతుడి మీద లగ్నమవడానికి ఆస్కారం ఉంది. ఆస్కారం ఉంది అని యెందుకని అంటున్నానంటే, గుడిలోకి వెళ్ళగానె తెలిసిన వారు కనిపించారనుకొండి, "యేమండీ, బావున్నారా, యేమిటీ, ఈమథ్య కనపడటల్లేదు, పిల్లలంతా బావున్నారా, పిల్లలు యేమి చేస్తున్నారూ? మథ్య అబ్బాయి పెళ్ళి చేశారట కదా నన్ను మర్చిపోయారు, పిలవనే లేదూ" యిలాంటి ప్రాపంచిక విషయాలు మాట్లాడుకొంటే ఇక భక్తిభావం మనకీ ఉండదు, భక్తితో వచ్చిన పక్కవారిని కూడా మన సంభాషణ యిబ్బందిగా ఉంటుంది.

అందుచెత సాయి భక్తులమైన మనము యెక్కడకు వెళ్ళినా, కూడా అనన్యమైన భక్తి శ్రథ్థలతో వెళ్ళాలి. సాయి బిడ్డలమైన మనము సాయి ప్రవచనాలు ఆయన చెప్పిన విలువైన అమృత వాక్కులు మననం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి.

సాయి యేవ్యక్తుల మథ్య కూడా భేదం చూపలేదు.

ఈ రోజు యింతటితో ప్రస్తుతానికి ముగిద్దాము.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, February 3, 2011

షివపూర్ బాబా మందిరము

0 comments Posted by tyagaraju on 5:08 AM



03.02.2001 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు షివపూర్ బాబా గుడి లీలలు రెండవ భాగములో మిగతావి తెలుసుకుందాము. షివపూర్ బాబా గుడిలో జరిగిన, జరుగుగుతున్న లీలలు చదువుతుంటే మనందరికీ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బావుండును అనిపిస్తుంది. ఆ లీలలు అంత అద్భుతంగా ఉన్నాయి.

షివపూర్ బాబా మందిర్. లీల నం. 6

సునీల్ దాస్ అనె భక్తుడికి 16 రోజుల బాబు ఉన్నాడు. హటాత్తుగ బాబు ఆహారం తీసుకోవడం మానేసి, అదేపనిగా యేడవడం మొదలుపెట్టాడు. ఇలా మూడు రోజులపాటు, తిండిలేకుండా అదేపనిగా వణుకుతూ యేడుస్తూ ఉన్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు కూడా యేమీ పనిచేయలేదు. తరువాత వారు బాబుని బాబా గారివద్దకు తీసుకుని వచ్చి విగ్రహం వద్ద పడుకోబెట్టారు. పూజారి గారు బాబా గారి పేరు జపిస్తూ బాబు నుదిటిమీద ఊదీ ని రాశారు. వెంటనే బాబు యేడవడం మానేసి నవ్వడం మొదలు పెట్టాడు. బాబు సీసాలో ఉన్న పాలన్నీ అక్కడున్నవారి సమక్షంలో తాగేసి, మామూలుగా ఆడుకొవడం మొదలుపెట్టాడు.

లీల నం. 7

తారిత్ పాల్ అనే భక్తుడి కూతురికి మొహనికి పక్షవాతం వచ్చింది. ఆయన కూతురుని యెంతో మంది డాక్టర్స్ దగ్గిరకి తీసుకువెళ్ళారు, కాని యెవరూ నయం చేయలేకపోయారు. తరువాత తారిత్ గారు మెను బాబా గుడికి తీసుకుని వచ్చి మొహం మీద యెక్కడయితే పక్షవాతం వచ్చిందో అక్కడ ఊదీని రాయడం మొదలుపెట్టారు. వాడిన మందులన్నీ నిష్పలమైన తరువాత బాబా వారి అనుగ్రహంతో ఆమె పక్షవాతం తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చింది.

లీల నం. 8

గ్రామంలొ ఇటువంటి లీలలు చాలా జరిగాయి. పెళ్ళికాని యువతులు బాబా గారికి గుడిలో పూజలు చేయగానే వివాహాలు జరిగాయి. క్రిష్ననగర్ లోని బాలాయి ఘోష్ అనే ఆయన కడు బీద స్థితిలో ఉన్నాడు. కనీస అవసరాలకి కూడా అతని వద్ద డబ్బు ఉండేది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు గాని యేమి ఫలించలేదు. పూర్తిగా నిరాశ చెంది జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు. హటాత్తుగా అతని మనసులో షివపూర్లోని బాబా గుడికి 500/- విరాళమిస్తే అతని చెడు రోజులన్నీ పోతాయన్నట్లుగ ఒక సందేశం వచ్చింది. ఇతని వద్ద పాత సైకిలు తప్ప యేమీ లేదు. అందుచేత సైకిలుని 500- కి అమ్మేసి వచ్చిన డబ్బు బాబా గారికి దక్షిణగా ఇద్దామనుకున్నాడు. అతను సైకిలుని 500- అమ్మేసి ఆవచ్చిన సొమ్ము తీసుకు వెళ్ళి షివపూర్ బాబాగుడికి వెళ్ళి, బాబా గారి పాదాల వద్ద పెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. సరిగ్గా 7 రోజుల తరువాత బాలాయి దూరపు బంథువు ఇతనిని చూడటానికి వచ్చాడు. బాలాయి బంథువుని యెప్పుడూ చూడలేదు. బాలాయిని, తను చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని అడిగాడు. బాలాయి వ్యాపారంలో యే విథమయిన పెట్టుబడి పెట్టనవసరం లేదు అని చెప్పాడు. బాలాయి బంథువుకి బ్యాటరీలు తయారీ, మరియు రిపేర్ వ్యాపారం ఉంది. వ్యాపారం బాగా అభివృథ్థి చెందింది. ఒక సంవత్సరం తరువాత బాలాయి గారు వ్యాపారంలో లాభం యెంతవచ్చిందో చూద్దామనుకున్నాడు. అతని బ్యాంకర్, అతనికి ఒక సంవత్సరంలో 5 లక్షల రూపాయలు లాభం వచ్చిందని చెప్పాడు. ఇదే బాబా గారి చమత్కారము. బాబాగారు కడుబీదవాడిని థనవంతుడిగా చేశారు. బాలాయి, గారు బాబా గారికి 500/- ఇచ్చారు, బాబాగారు అతనకి 1000 రెట్లు తిరిగి ఇచ్చారు.

కనీసం ముగ్గురు నలుగురు, తాము, రాత్రివేళ 2 , 2.30 మథ్య గుడి పైన వేప చెట్టు పైనించి, గుడిపైదాక ఒక గుండ్రటి తెల్లని కాంతి , బంతి ఆకారంలొ వెలుగులు విరజిమ్ముతూ తిరుగుతూ ఉండడం చూశామని అమిత్ విస్వాస్ గారికి చెప్పారు. గుండ్రటి బంతి రెండు మూడు సార్లు తిరిగి మాయమయిపోయిందని చెప్పారు.

లీల నం. 9

ఒకరోజున గుడిలో సాయంత్రం హారతి జరుగుతోంది. గుడి ప్రశిడెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారు గుడి బయటకి చూశారు. ఆయన బాబాగారు, థొతీ, కుర్తా, కఫినీ, థరించి కీర్తనకి అనుగుణంగా నాట్యం చేయడం చూశారు. ఆరతి పాట జరుగుతున్నంత సేపూ బాబాగారు నాట్యం చేసి మాయమయిపోయారు. విషయం అమిత్ విశ్వాస్ గారు చెప్పారు.

ఒకావిడ, అనుకోకుండా తన భర్తకి పక్కింటి అమ్మాయితో అక్రమ సంబంథం ఉందని కనిపెట్టింది. వారి వివాహమయిన 15 సంవత్సరాల తరువాత ఇటువంటిది జరుగుతుందని ఆవిడ ఊహించలేకపోయింది. భర్త ఆవిడతో ఉండటానికి ఇష్టపడక దెబ్బలాడుతూ ఉండేవాడు. ఈమె బాథ పడి యేడ్చింది. ఆమె బాబా గుడికి వెళ్ళి తన భర్త మరలా తనతో ఉండేలాగ చేయమని మొర పెట్టుకుంది. తన భర్త అక్రమ సంబంథాన్ని వదులుకుని వస్తే బాబాగారికి పాయసం నివేదన చేస్తానని బాబా గారికి మాట ఇచ్చింది. నెల తరువాత ఆమె భర్త తిరిగి వచ్చాడు. అతను పక్కింటి అమ్మాయితో పెట్టుకున్న సంబంథాలన్నిటిని వదిలేశాడు.

లీల నం. 10

గుడి సాయి భక్తుల విరాళాలతో నిర్మించబడింది. శ్రీ కె.వి.రమణి అనే గొప్ప భక్తుడు, గుడి నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. ఒకరోజున గుడి సీలింగ్ పని చేసేటప్పుడు పనివారికి 5,000/- రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. పనివారికి డబ్బు ఇవ్వకపోతే వారు పనిలొకిరారు. రోజు రాత్రి గుడిని నిర్మించేవారి వద్ద నయాపైసా లేదు. మరునాడు గుడి నిర్మాణం కొనసాగించడమెలాగా అని బాగా వ్యాకులత పడ్డారు. 5,000/- రూపాయలు యెక్కడనించి తేవాలి? వారు బాబా మీదే భారమంతా వేసి పడుకున్నారు. మరునాడు ఒకాయన తన కుటుంబంతో షివపూర్లొని బాబా గుడికి దర్శనం కోసం వచ్చాడు. ఈయన దుబాయి నుంచి వచ్చాడు, కలకత్తాలో ఉన్న తన స్నేహితుడి ద్వారా షివపూర్లోని బాబా గుడి గురించి విన్నాడు. ఆయన బాబా దర్శనం చేసుకుని పూజలు చేశారు. తరువాత 5,001/- రూపాయలకు చెక్కు మీద సంతకం చేసి బాబా గారికి దక్షిణగా, గుడి యాజమాన్యానికి చెక్కు ఇచ్చారు. బాబా గారు ఉన్నప్పుడు మనం బుఱ్ఱలో అందోళనలు పెట్టుకోవడం యెందుకు. అదే బాబా లీల.

లీల నం. 11

గ్రామంలో ఉన్న ఆవులు, బాబా ఊదీ కలిపిన నీటిని తాగిన తరువాత ఆంథ్రాక్స్ వ్యాథినుండి బయట పడ్డాయి. ఒక్ ఆవుకి 6 సంవత్సరములకి, దాని నుదిటిమీద బాబా ఊదీని రాసి, ఊదీ కలిపిన నీటిని తాగించిన తరువాత దూడ పుట్టింది.

ప్రతి సంవత్సరము జరిపే షివపూర్ బాబా గుడి వార్షికోత్సవాల్లొ, పది వేల మందికి అన్నదాన కార్యక్రమన్ని జరిపించే బాథ్యత సమీర్ భట్టాచార్జీ అనే ఆయన తీసుకుంటాడు. ఒక సంవత్సరం ఈయన జబ్బు పడ్డాడు. ఆలయ కమిటీ వారు సంవత్సరం ఉత్సవాలు భారీగా కాకుండా తక్కువగా చేద్దామనుకున్నారు. ఆఖరి నిమిషంలో గుడి ప్రశి డెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారు, భక్తులందరికి, అన్నదాన కార్యక్రమానికి తమకు తోచిన విరాళాల ను ఇమ్మని విజ్ణప్తి చేశారు. అనుకోకుండా చాలా మంది, బియ్యము, కూరగాయలు, పప్పులు, వాటితో వచ్చారు. వారు తెచ్చినవాటితో పది వేలమందికి అన్నదానం చేయడమే కాకుండా ఇంకా మిగిలిన వాటిని బాబా ప్రసాదంగా తమ తమ ఇళ్ళకి తీసుకువెళ్ళారు. బాబా గారు సర్వాంతర్యామి. బాబా లీలను అర్థం చేసుకోవడం కష్టం.

.

లీల నం. 12

నాదియా జిల్లాలోని టెహత్త పి.ఎస్. బెతాయి జోర్డర్ గ్రామం లో శ్రిమతి తపతి మొందల్ గారికి పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది. వైద్య శాస్త్ర పరంగ వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వారు నిరాశా నిస్పృహలతో మానసికంగా చాలా వేదనతో ఉండి, షివపూర్ బాబా గుడికి వచ్చారు. వారు అమిత్ విశ్వాస్ గారితో చాలా సేపు సంభాషించిన తరువాత, అమిత్ గారు ఆమె నుదిటి మీద బాబా ఊదీ ని పెట్టి, ప్రతీరోజు, ఊదీ ని పెట్టుకోమని చెప్పారు. ఆమె యెంతో భక్తితో ఊదీని పెట్టుకుంది. విచిత్రంగా ఆమెకి, 3 కె.జీ. 800 గ్రా. బరువుతో జనవరి 2010 ఆడ శిశువు జన్మించింది. తల్లీ బిడ్డ సుఖంగా ఉన్నారు.

లీల నం.13

విథంగా షివపూర్ బాబా గుడిలో లీలల మీద లీలలు జరుగుతున్నాయి. గ్రామంలో థరణీ థర్ మొండల్ అనే ఆయనకి సెరిబ్రల్ అటాక్ వచ్చి కోమాలో ఉన్నారు. అందరూ ఆశ వదులుకున్నారు. కాని విచిత్రంగా బాబా ఊదీ ని నుదుట పెట్టి, కొంచెం నోటిలో వేయగానే మూడు రోజులలో లేచి తిరగడం మొదలుపెట్టారు. ప్రతిరోజు బాబ్ గుడికి రావడం మొదలుపెట్టారు.

లీల నం.14

శ్రీ సంతు మొండల్ అనె 9 తరగతి విద్యార్థి, మొహము మీద ఇన్ ఫెక్షన్ సోకి, ఆరు నెలలుగా మందులు వాదుతున్నప్పటికి యేమీ ప్రయోజనం కనపడకపోగా, షివపూర్ బాబా గుడికి వచ్చి బాబా ఊదీ పెట్టుకోగానే విచిత్రంగా వారం రోజులలో ఇన్ ఫెక్షన్ తగ్గిపోయింది.

క్రితం సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, బాబా దయవల్ల సంతానవతులైన నలుగురు తల్లులు బాబా గుడికివచ్చి వారి పిల్లల బరువు యెంత ఉందో అంతే బరువుతో స్వీట్స్ అక్కడున్నవారందరికీ పంచిపెట్టారు.

శ్రీమతి కమలా బాలా జోర్దార్ అనే 75 సంవత్సారాల మహిళకి కుష్టు వ్యాథి మూడవ దశలో ఉంది. డాక్టర్ ఆర్జిత్ ముఖర్జీ నాదియా జిల్లా హాస్పిటల్ వైద్యుడు, ఎం.డి.టి. డొసు 12 నెలలపాటు వైద్యం చేసి తిప్పి పంపివేయగా, ఈమె 12 నెలలపాటు గుడిలో బాబా ప్రసాదము ఊదీతో కలిపి తీసుకొనగా, బాబా అనుగ్రంతో ఆమె వ్యాథి తగ్గిపోయింది. ఆమె ఉత్సవంలో సంతోషంతో నాట్యం చేసింది.

లీల నం.15

20 రోజుల క్రితం ఒక బాలుడికి ఫైబర్ ముక్క కంటిలో గుచ్చుకొంది. తల్లితండ్రులు పిల్లవానిని హాస్పిటలికి (కలకత్తాలో ప్రముఖ కంటి ఆసుపత్రి) తీసుకువెళ్ళారు. 15 రోజులు వైద్యం చేసినా యెమి గుణము కనపడలేదు. వారు కన్ను పూర్తిగా చెడిపోయింది, భవిష్యత్తులో అబ్బాయి చూడలేడు, చూపుపోతుంది అని చెప్పారు. తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె షివపూర్ బాబా గుడికివచ్చి బాబా ముందర విలపించింది. ఆమె అమిత్ గారిని పిల్లవాడికోసం బాబాని ప్రార్థించమని చెప్పింది. అమిత్ గారు బాబా ముందు ప్రార్థించి ఆమెకు బాబా ప్రసాదం ఇచ్చారు.

తరువాత వారు పళ్ళు తీసుకువచ్చి బాబా కి కృతజ్ణతలు చెప్పారు, అబ్బాయికి ఛూపు వచ్చిందని ఆనందంతో చెప్పారు. యెంత అద్భుతమైన లీల చేశారు బాబా గారు?

లీల నం.16

కొన్నాళ్ళక్రితం ఒక పెద్దాయన ఉదయం 4 గంటలప్రాంతంలో అమిత్ గారి వద్దకు వచ్చి శిరసు వంచి నమస్కరించారు. అమిత్ గారు ఆశ్చర్య పోయి, నాకెందుకు శిరసువంచి నమస్కారము చేస్తున్నారు, నేను మీకన్న చిన్నవాడిని అన్నారు. అప్పుడు ఆయన తనకి వహ్చిన కల గురించి చెప్పారు.

"అమిత్జీ గారు పొడవైన కఫినీ, ధోతీ థరించి, కుడిచేతిలో సటకా, యెడమ చేతిలో కమండలము థరించి సముద్రము మథ్యలో కూ ర్చున్న బాబా గారి వద్ద నిలబడి ఉన్నారు. ఇద్దరూ సంభాషించుకొంటున్నారు, బాబా గారి చేయి అమిత్ గారి మీద ఉంది. " వచ్చిన కల గురించి అమిత్ గారికి చెప్పారు. అమిత్ గారు బాబాగారిచెత అనుగ్రహింపబడినవారు.

ఇవీ సౌమ్య గారు చెప్పిన షివపూర్ బాబా మందిర లీలలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List