Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 22, 2011

0 comments Posted by tyagaraju on 11:43 PM
ఈ బేబీ సరోజనిగారికి, మేమంతా, సత్సంగము అయిపోయాక, వెళ్ళిపోయాము. తరువాత బేబీ సరోజినిగారు సత్సంగము జరిగినచొట శుభ్రము చేద్దామని వెళ్ళగా అక్కడ బాబా గారు తిరుగుతూ అంతా చూస్తున్నట్లుగా కనపడిందట.

బాబాగారు నానుంచి థన్యవాదములు తీసుకునుట

0 comments Posted by tyagaraju on 9:40 PM




23.01.2011 ఆదివారం


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి



బాబాగారు నానుంచి థన్యవాదములు తీసుకునుట


బాబా చరిత్రలో మనకు, యెవరన్న దక్షిణ పంపినప్పుడు మర్చిపోతే, అడిగి తీసుకునేవారని మనకు తెలుసు. అలాగే నానుంచి నేను చెప్పమన్న థన్యవాదములు తీసుకున్న లీల గురించి మీకు వివరిస్తాను.

మనము యెప్ప్పుడూ సాయి నామ జపం చేస్తూ ఉండాలి. మనలని యీప్పుడూ కాపాడేది అదే. సవకల సర్వావస్తలలోనూ ఆ నామ జపం వల్ల బాబా గారు మనలని రక్షించడానికి సిథ్థంగా ఉంటారు. యెందుకంటే ఆపద సమయాలలో కూడా అప్రయత్నంగా మన నోటివెంట బాబా అని మనం అనగానే మనలని ప్రమాదపు అంచులనుండి బయటపడేస్తారు.

ఇటువంటి విషయాలన్నిటిని కూదా సాయి బంధువులమనిన మనము, ప్రతివారం సత్సంగములలో చర్చించుకుంటూ ఉండాలి. యెక్కడయితే సత్సంగము జరుగుతూ ఉంటుందో అక్కడ బాబాగారు వచ్చి కూర్చుంటారు.

మేము సత్సంగ సభ్యులందరమూ ప్రతి శనివారం సా.4 గంటలనుంచి సాయత్రము 6 గంతలవరకు సత్సంగము చేస్తూ ఉంటాము. మరియొకసారి మేము సత్సంగము చేసే విథానము మీకు తెలియపరుస్తాను. ఒకసారి మేము సత్సంగము చేస్తూ కనులు మూసుకుని నామజపం 108 సార్లు చేస్తూ ఉన్నాము. ఆ సమయంలో ఒక భక్తురాలికి శ్రీమతి భేబీ సరోజినిగారికి బాబా గారు వచ్చి కూర్చునట్లుగా కనిపించింది. ఈమేకు బాబా గారు అంతకుముందు కొన్నాళ్ళ క్రితం కలలో కనపడి రొట్టెలు అడిగారు. అప్పటినుంచి ఆమె వారి ఇంటికి దగ్గరలో ఉన్న బాబాగారికి ప్రతిరోజు రాత్రి రొట్టెలు ఇస్తూ ఉంటారు.

మా సత్సంగ సభ్యులమందరమూ కూడా ప్రతిసంవత్సరము షిరిడీ వెడుతు ఉంటాము. రెండు సార్లు నేను వారితో వెళ్ళడం కుదరలేదు. ఈ సంవత్సరము నవంబరు 10 తారికున మేమందరము షిరిడి ప్రయణం పెట్టుకున్నాము. నేను, నా భార్య కూడా షిరిడీ ప్రయాణానికి వారితో పాటుగా రిజర్వ్ చేయించుకున్నాము. కాని అనుకోకుండా కొన్ని పరిస్తుతులు బాబా గారే కల్పించడంవల్ల మా మనవడి బారసాల విజయవాడ వద్దనున్న పల్లెటూరిలో జరిగిన తరువాత మా ఊరు నరసాపురం వెడదామనుకున్నము. కాని, తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి, నరసాపురం వెళ్ళవలసినవారం వెంటనె హైదరాబాదు వెళ్ళడం జరిగింది. అక్కడే నాకు హార్ట్ ప్రోబ్లం బయటపడి నవంబరు 2 న ఆపరేషన్ జరిగింది.

10 తారికున నేను డిస్చార్జ్ అయ్యి మా పెద్ద అక్కగారి ఇంటికి వచ్చాను. సరిగా ఆ రోజు మా సత్సంగము వారందరూ షిరిడీ వెడుతున్నారు. ఆరోజు రైలు స.4.30 కి సికందరాబాదు వస్తుందని తెలుసును కాబట్టి మాసత్సంగము ప్రారంభించిన శ్రీమతి మీనాక్షిగారికి షిరిడీలో బాబాగారికి నా ధన్యవాదములు తెలుపమని ఫోను చేసి చెప్పాను. ఆమె, నా క్షేమసమాచారములు అడిగి అలాగే చెపుతానని చెప్పారు.

వారందరూ షిరిడీ వెళ్ళాగానే, బాబాగారి దర్శనానికి వెళ్ళారు. సామాన్యంగా మనకి యెప్పుడు గుడిలోకి వెళ్ళగానే ఆసన్నిథిలో మిగతా విషయాలు యేమీ గుర్తుకు రావు. అల్లగే మీనాక్షిగారు కూడా బాబా గారికి నేను థన్యవాదములు చెప్పిన విషయం మరిచిపోయారుట. ఆమె కనులు మూసుకుని బాబాగారి సమాథి వద్ద నమస్కారము చేస్తున్నప్పుడు, ఆమె మనొనేత్రం ముందు, మా సత్సంగ సభ్యులువున్న వరుసలో మొదట నేను నుంచునివున్నట్లుగా కనిపించానుట. అప్పుడు ఆమెకు నేను చెప్పమన్న విషయం గుర్తుకువచ్చి బాబాగారికి నా థన్యవాదములు చెప్పినారట.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Friday, January 21, 2011

బాబా దర్శనానుభవము

0 comments Posted by tyagaraju on 10:06 PM














సాయి బంధువులందరికి బాబావారు అశ్శిస్సులు అందచేయు గాక.

నాకు నవంబరు 2 తారీకున బైపాస్ సర్జరీ అయింది. బాబాగారి కృపతో శ్రీమతి ప్రియాంకా రౌ తేలా గారి ద్వారా బాబా లీలలను మీకందరికి తెల్యియచేసే భాగ్యం కలిగింది. ప్రియాంకాగారు ముందు ఆరోగ్యం కూడా చూసుకోమని జాగ్రత్తలు చెప్పారు. కాని ఊరికే కూర్చోలేక కొంత సమయం దీనికి కేటాయిస్తున్నాను. ప్రైరోజు ఒక లీల పోస్ట్ చేద్దమని నాఉద్దేశ్యం. ఒకోసారి ఆలస్యం అవవచ్చు. యెక్కడా తప్పులు దొల్ర్లకుండా సాథ్యమయినంత వరకు జాగ్రత్తలు తీసుకొవడం జరుగుతోంది. ఒకవేళ యెక్కడయిన అక్షరాలు పొరపటుగ
నా దృష్టి పథం నుంచి తపూకుని వుంటే అన్యథా భావించవద్దని నా మనవి. చేసేదెవడు చేయించేదెవడు. అంతా బాబాగారే

************


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

22.01.2011 శనివారం
బాబా గారియొక్క దర్శనము గాని, లీలలు గాని మనకు అనుకోకుండా జరుగుతాయి. ఇవే మనలని బాగారివైపు దృష్టి సారించేలా చేస్తాయి. ఇక మనం బాబాగారిని వదిలిపెట్టము ఆయన మనలని వదిలిపెట్టరు. కావలసిందల్లా అనన్యమైన భక్తి, ఓర్పు, శ్రథ్థ, సహనం.
ఈరోజు మనము సాయిలీల డిసెంబరు 1973, సంచికలో ప్రచురింపబడిన, శ్రీ వి.బి. నంద్వాని, మాహిం, ముంబాయి-16, వారు వ్రాసిన అనుభవం గురించి తెలుసుకుందాము.
*********


బాబా దర్శనానుభవము

1973, మే, 7 వ. తారీకున, 14 సం. మా అబ్బాయితో షిరిడీ చేరుకున్నాను. సెలవు రోజులలో బాగా రద్దీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో , సంస్థ్థాన్ వారికి, మాకు కావలసిన గది తెలుపుతూ రిజర్వు చేయమని ముందుగానే ఉత్తరం వ్రాయడం జరిగింది. అకామడేషన్ ఇన్ చార్జ్ కి ఆ ఉత్తరం ఇంతవరకు అందకపోయినప్పటికీ, ఆయన నాకు నేను అనుకున్న గదే ఇచ్చాడు. ఆ రోజు ఆయన మమ్ములను మథ్యాహ్నం 2 గంటలకు భోజననికి కూడా పిలిచాడు. కాని, కొన్ని కారణాల వల్ల మమ్మల్ని భోజన గృహానికి తీసుకువెళ్ళడానికి 3 గం. దాటుతుండగా వచ్చాడు.అప్పటికి మ అబ్బాయి ఆకలితో వడుకున్నాడు.
నేను మా అబ్బాయిని అంతకుముందే బయటకు వెళ్ళి ఏదయినా తిని రమ్మని చెప్పాను. కాని ఒప్పుకోలేదు. ఇప్పుడు మేమిద్దరము భోజనానికి వెడదాము లేవమని చెప్పినా, కోపంతో నాకేమీ వద్దు అని తిరస్కరించాడు. వాడికి పెందరాళే భోజనం చేయడం అలవాటని నాకు తెలుసు అంచేత నేను వాడినివదిలి సంస్థాన్ ఆఫీసర్ గారితో భోజనానికి వెళ్ళాను.
మా అబ్బాయి 4 గం. లకు లేచి, "నేను సమాథి మందిరానికి వెళ్ళను, బాబాగారికి తలవంచి నమస్కరించను. నేనిక్కడ ఉండను. ఒంటరిగానయినా సరే నేను బొంబాయి తిరిగి వెళ్ళిపోతాను" అని కోపంగా అన్నాడు. ఇదంతా కూడా ఆకలి, కోపం వల్ల వచ్చిందని నాకు తెలుసు. అందుకే మౌనంగా ఊరుకున్నాను.

కొంచెం సేపు అయినతరువాత ఏమయిన తిందామని లేచి బయటకు వెళ్ళాడు. హోటల్లో తినకుండా 4 దోశలు పట్టుకువచ్చి నన్ను కూడా ఒకటి తీసుకోమన్నాడు. వాడి తృప్తి కోసం నేను ఒక దోశ తీసుకుకున్నాను. వాడు రెండు మాత్రమే తినగలిగాడు. ఇంకొకటి ముట్టుకోకుండా మిగిల్చ్చాడు. దానిని ఒక బిచ్చగానికి ఇచ్చాడు.

మేము ఉన్న గది, అకామడేషన్ ఆఫీస్ కి సమాంతరముగా ఉన్న రోడ్డుని ఆనుకుని వున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. రెండు వరుసలు ఉన్న గదుల మథ్య "ఎల్" ఆకారంలో నడవా ఉంది. ప్రవేశించే దారి పొడవుగా ఉంది. పొట్టిగా ఉన్న నడవాలొ స్నానపు గదులు ఉండి ఒకవైపు మూసేసి ఉంది. అందుచేత మేము గది తలుపు తెరుచుకుని కూర్చుంటే నడవాలోంచి ఎవరు వచ్చినా, వెళ్ళినా మాకు కనపడుతుంది.
దోశ తిన్నాక మా అబ్బాయి ప్లేటు కడగడానికి స్నానపు గదులువున్న వైపు వాష్ బేసిన్ వద్దకు వెళ్ళాడు.
ఈ వాష్ బేసిన్ గదులకి బయట ఉంది. హటాత్తుగా మా అబ్బాయి గదిలోకి వచ్చి, స్నానపు గదులు ఉన్న నడవాలో బాబాలా ఉన్న ఒక వ్యక్తి చేతిలో కఱ్ఱ పట్టుకుని ఉన్నాడు, అందుచేత భయపడి వచ్చేశాను అని చెప్పాడు. ఇదంతా కూడా మా అబ్బాయి తలుపు తీసి ఉన్న మా గది గుమ్మంలో నుంచుని చెప్పాడు. నేను గదిలో కూర్చున్న స్థితిలో మా గది ముందునుంచి ఎవరు వెళ్ళినా, వచ్చినా ఖచ్చితంగా కనపడి తీరవలసిందే. నేను వెంటనే లేచి, మా అబ్బాయితో స్నానపు గదులు ఉన్న చోటికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ కనపడలేదు. మా అబ్బాయి కి దర్శనమిచ్చినది బాబాగారే అని నాకనిపించింది. నడవాలోంచి, ఎవరూకూడా నడిచి వెళ్ళడం నా కంటికి కనపడలేదు. ఎవరు అలా గాలిలో మాయమయిపోగలరు? మిగతా గదులలో ఎవరూ కూడా అలా బాబా దుస్తులలో లేరు.

ఇంకా ప్రశ్నించిన మీదట మా అబ్బాయి, ఆ వ్యక్తి ఒక చేతివైపు, క్రింద బాగా చిరిగిన కఫ్నీ థరించి ఉన్నాడని చెప్పాడు. అతను సట్కాతో సమాథి మందిరం వైపు చూపించాడని చెప్పాడు.


తరువాత సాయంత్రం 6 గం. మా అబ్బాయి నాతో కూడా సమాథి మందిరానికి, ద్వారకామాయికి, చావడికి వచ్చి ప్రతీ చోటా బాబాగారికి నేను చేసినట్లే నమస్కారం చేశాడు. మేమున్న వారం రోజులలో చాలా సంతోషంగా గడిపి స్నేహితులను కూడా సంపాదించుకున్నాడు.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

బాబా ఊదీ

0 comments Posted by tyagaraju on 4:45 AM












21.01.2011 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి



భగవంతుడు మననించి కోరేది ఏమిటి ?

నువ్వు భగవంతుడిని ప్రేమిస్తున్నావా?

జవాబు నిశ్చయంగా అవును అనే వస్తుంది. అవును అని నువ్వు ఎలా చెప్పగలవు.

"నేను రోజూ చాలాసేపు భగవంతుడిని (లెక బాబా గారిని) పూజ చేస్తాను, గుడికి వెడతాను, భక్తి గ్రంథాలు చదువుతాను, సాయి సచ్చరిత్ర చదువుతాను, ఇలా చెప్పుకుంటే చాలా వస్తుంది. గుడికి విరాళాలు ఇస్తూ వుంటాను, వెండి కిరీటాలు, సిం హాసనాలూ అన్నీ చేయిస్తాను," చెప్పుకుంటూపోతే చాలా పెద్ద జవాబే. ఇది ఎవ్వరిని అంటే విరాళాలు ఇచ్చేవారిని విమర్శించడం కాదు. కాని, భగంతుడు, లేక బాబా కోరుకునేది ఇదేనా? ఖచ్చితంగా కాదు. అయితే నువ్వు కనక భగవంతుడిని నిజంగా ప్రేమిస్తూంటే ఆయన నీనుంచి కోరుకునేది ఏమిటి?

అనుమానం లేదు, ఆయన కోరుకునేది ప్రేమ, దయ. కాని ఎలా ఆలోచించండి.
సాయి బంధువులమయిన మనము బాబా చెప్పిన బాటలో నడవాలి, ఆయన చెప్పిన సూత్రాలను పాతించాలి. చరిత్ర పారాయణ మామూలుగా చేసి వదిలివేడం కాదు. ఆయ్న లీలలని అర్థం చేసుకోవాలి, వాటిల్ని మనసుకు పట్టించుకోవాలి. అందులొని ఆనందాన్ని అనుభవించాలి. మనలో మార్పు ఒక్కసారిగా రమ్మంటే రాదు. మెల్ల మెల్లగా మనలో మార్పు రావాలి. అది రావాలంటే బాబా చరిత్రలోని విషయాలని ఎల్లప్పుడు గుర్తుచేసుకుంటూ ఉండాలి. నీలొ బాబా ఉన్నారు, మరి నీ యెదటివానిలొ కూడా బాబా ఉన్నారుగా? అటువంటప్పుడు యెదటివారితోకూడా సౌమ్యంగా మాట్లాడే గుణం అలవరచుకోవాలి.

బాబా ఎపుడూ నీనుంచి నీ అమూల్యమైన సమయాన్ని గాని, థనాన్ని గాని, ఆశించడు. నువ్వు పెద్ద భవంతిలో ఉన్నావా, నీ దగ్గిర యెంత థనం ఉంది, ఇవన్ని ఆయనకు అక్కరలేదు. ఆయన కోరుకునేది నీనుంచి భక్తి. ఎదటివారియెడల దయ, ప్రేమ. కాని మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇది ఎలా సాథ్యమని. మనం కనక బాబా సంతానం, లేక సాయి బంధువులము అనుకుంటే ఇది సాథ్యం. మనం గుడికి విరాళాలు ఇవ్వవచ్చు, లక్షలు ఖర్చు పెట్టవచ్చు. కాని కొంత అవసరమయినవారికి కూడా ఇవ్వాలి, బీదవారికి విద్యా దానం చేయవచ్చు. వారికి దుస్తులు కొని ఇవ్వవచ్చు.మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక పూటే తిండితినేవారున్నారు, వారికి కాస్త పట్టెడన్నం పెట్టవచ్చు. ఒక్కరోజైన అనాథ శరనాలయానికి వెళ్ళి అక్కడి అక్కడివారికి మనకు తోచినంత సహాయం చేవచ్చు.
వృథ్థాశ్రమాలు ఉన్నాయి , అక్కడికి వెళ్ళి వారందరితో ఆప్యాయంగా పలకరించి, వారికి కావలసిన మందులు ఇవ్వవచ్చు. మనం వారికి తోచిన సహయం చేవచ్చు. ఇవన్నీకూడా బాబాకి ప్రీతిపాత్రమయినవి కాదా?
అర్హులకి మనం చేసే సాయంలో ఆనందం ఉంది. అదే భగవంతుడికి ప్రీతిపాత్రమయినది.

-------------------------------------------------------------------------------------

బాబా ఊదీ

బాబా ఊదీ అంటే సర్వరోగ నివారిణి అని మనకు తెలుసు. బాబాగారు కూడా తన భక్తులకు ఊదీని ఇచ్చెడివారు.

ఈ రోజు విక్రం గారి ఊదీ మహిమ గురించి వారి మాటలలోనే తెలుసుకుందాము.

నా పేరు విక్రం. నాకు బాబాగారంటే అనన్యమైన భక్తి. బాబాగారు ఎప్పుడూకూడా నా క్షేమం పూర్వము, ఇప్పుడూ కూడా చూస్తూఉన్నారు. నేను నా కుటుంబానికి దూరంగా అమెరికాలో ఉంటున్నాను. ముఖ్యంగా మా అమ్మగారితో కూడా. అందుచేత బాబాగారే నా తల్లి. భారతదేశంలో మా అమ్మగారు నాన్ను ఎలా చూసేవారో అల్ల బాబాగారే నాకు అన్నీ చూస్తున్నారు. నేను ప్రతివిషయంలోనూ బాబాగారిని సాయిమా అనే పిలుస్తుంటాను. బాబాగారి యొక్క ప్రేమానుభూతిని ఇప్పుడు మీకు చెపుతాను. క్రితం సంవత్సరం మేము కొంతమందిమి కలిసి 8 గంటల రోడ్డుమీద ప్రయాణం పెట్టుకున్నాము. కాని నాకు ఈదేశంలో కారు ప్రయాణమంటే భయం యెందుకంటే ఇక్కడ డ్రైవర్లు చాలా వేగంగా నడుపుతూఉంటారు.
మా ప్రయాణానికి కొన్నిగంటలు ఉందనగా నేను కూర్చుని సాయి సచ్చరిత్ర పుస్తకంలోని మొదటి అథ్యాయంలోని కొన్ని పేజీలు యాదృచ్చికంగా తిరగేసాను. దానిలో బాబాగారు తన భక్తులకి ఇచ్చే ఊదీ, ఊదీ మహిమిలగురించీ సంబంధించిన ప్రస్తావన ఉంది. పుస్తకం మూసేసి, ప్రయాణానికి ముందు నా నుదిటిమీద ఊదీ పెట్టుకుందామని అనుకున్నాను.
ప్రయాణానికి అన్నీ సద్దుకుంటూ, బీరువాలోనించి ఒక చొక్కా తీసుకున్నాను. ఆ చొక్కా మీద నాకు అంత పెద్దగా ఇష్టము లేదు, చాలా అరుదుగా వేసుకుంటూ ఉంటాను. ఈ ప్రయాణంలో ఈచొక్కా వేసుకుందామనుకున్నాను. ఈ చొక్కా ఈ ప్రయాణానికి యెందుకు తీసానో ఇప్పటి వరకు నాకే తెలియదు. చొక్కా జేబూలలో యేమన్నా ఉన్నయేమో చూద్దామని అన్ని చెక్ చేయడం మొదలుపెట్టాను. ఒక జేబులో చెయ్యి పెట్టేసరికి చేతికి యేదొ పొడిలాగ తగిలింది. ఆ పొడి యేమిటొచూద్దామని చేతిని బయటకు తీశాను. అది బూడిద రంగులో ఉన్న పొడి. జేబులో ఇంకా లోతుగా చెయ్యిపెట్టి తీసేసరికి ఆశ్చర్యంగా, అదీఒక చిన్నపాకెట్. దాని మీద "శ్రీ షిరిడి సాయి సంస్థాన్" అని పేరు ఉంది. అది ఒక ఊదీ పాకెట్. ఆ పాకెట్ కొంచెం చిరిగిఉంది, అందుచేట కొంచెం ఊదీ జేబులో అంతా ఒలికిపోయి ఉంది. నేను నమ్మలేకపోయాను,. చరిత్రలో ఊదీ గురించి చదివి ఊదీ కావాలనుకున్న 15 - 20 నిమిషములలోనే ఇది జరిగింది. నేను ఆఖరిసారిగా ఇండియా వచ్చినప్పుడు నా సోదరుడు ఈ చొక్కా నాకు బహూకరించాడు. నేను ఇండియా ఎప్పుడు వచ్చినా కూడా షిరిడీ వెడుతూంటాను. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ చొక్కా వేసుకుని వుంటాను.
అప్పుడు ఈ ఊదీ పాకెట్ జేబులో వేసుకుని మర్చిపోయాను. ఈ ఊదీ లభించడం నా అదృష్టం. బాబాగారు ప్రతీదీ కూడా మనకు యెప్పుడు యేదికావాలో అది లభించేటట్లు యేర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఊదీ కూడాడా ఆయన ఇలాయేర్పాటు చేసినదే. ఇల్క నేను యెటువంటి చింతా పెట్టుకోకుండాఊదీని నుదిటి మీద పెట్టుకుని ప్రయాణానికి సిథ్థమయ్యాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Wednesday, January 19, 2011

బాబా ఊదీ మహిమ

0 comments Posted by tyagaraju on 11:29 PM






20.01.2011 గురువారం



ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ రోజు మనము ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము. ఈ లీల ని సాయి లీల పత్రికనుండి గ్రహించడమయినది.

బాబా ఊదీ మహిమ (1974) బ్య్ : శ్రీ మహేష్ చంద్ర శ్రీవాత్సవ

అక్టోబర్ 1973 నుంచి ఈయన బాబావారి దీవెనలు అందుకుంటూ వుండేవారు.
ఒకరోజు బుథవారం "కోజగిరి పూర్ణిమ" ముందు రోజు రాత్రి షిరిడీకి ప్రయాణం పెట్టుకున్నారు. ఉదయం 10.30 కి, ఆయనకి షిరిడీలో బాబా బొమ్మ వున్న సిల్వర్ ఉంగరం కొనుక్కోవాలనిఒక ఆలోచన వచ్చింది. ఆరోజు మధ్యాహ్నం 1.30 కి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. అతను వజ్రాల వ్యాపారి కూడా. స్నేహితుడితో, తను షిరిడీ వెడుతున్నానని, మరల 2 రోజుల వరకూ కలవడం కుదరదని చెప్పడానికి, అతనితో కలిసి భోజనం చేయడానికి, వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం, భోజనం అవగానే ఆ స్నేహితుడు తనంతతానుగా ప్లాటినం ఉంగరం ఇచ్చాడు. అది చాలా విలువైన, అద్భుతమైన ఉంగరం. అటువంటిక్ విలువైన ఉంగరాన్ని తను చేయించుకోలేడు. ఆ ఉంగరం మీద బాబా బొమ్మ బంగారంతో చెక్కబడివుంది. అది పంచలోహాలతో చేయబడినది.
మరునాడు గురువారం "కోజగిరి పూర్ణిమ" నాడు తను షిరిడీ లో ఉంటాడు. ఈ అద్భుతం ఆయన జీవితంలో గొప్ప మార్పుని తెచ్చింది. మదిలో చెరగని ముద్ర వేసింది. బాబా గారు చూపించే లీలలన్నీ కూడా మరలా మరలా గుర్తు చేసుకునే విథంగా ఉంటాయి.
ఫిబ్రవరి 23, 1974, ఉదయం కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడీ లో అడుగు పెట్టారు. అందరూ కలిసి ఒకేచోట ఉందామనుకున్నారు. కాని, షిరిడీ వెళ్ళగానే శ్రీ వాత్సవ గారు విడిగా వెరేచోట ఉందామనుకుని అల్లాగే వెరేచోట బస చేశారు. ప్రొద్దున్న అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని మహాసమాథి మందిరానికి అభిషేకం చూడ్డానికి వెళ్ళదామని చెప్పడానికి స్నేహితులవద్దకు వెళ్ళారు. అప్పటికి వాళ్ళింకా తయరవలేదు. అందుచేత తనని సమాథిమందిరంలో కలవమని, తను యెదురు చూస్తూ వుంటానని చెప్పారు.
బాబాగారికి పూలదండ కొంటున్నప్పుడు బాబాగారు సూచన ఇస్తున్నట్లుగా ఒక విథమయిన ఆలోచనా తరంగం ఆయన మనసులోకి వచ్చింది. మొదట ద్వారకా మాయి కి వెళ్ళు, తరువాత చావడి, తరువాత సమాథి మందిరం. నేనింకా జీవించే ఊన్నాను. అని ఈవిథంగా ఆయనకి అనిపించింది.
ద్వారకామాయిలో ఆయన చరణాలకు సాగిలపడి నమస్కరించి అక్కడ ఫోటోకి, చావడిలో ఫొటోకి దండలు వేసి, సమాథిమందిరంలొకీ వెళ్ళాడు. అభిషేకం తరువాత మథ్యాహ్న హారతి కూడా చూద్దామని వెళ్ళాడు. మథ్యాహ్న హారతి అవగానే తన బసకి వెళ్ళిపోయాడు. మెల్లిగా సాయంత్రం 4, 4.30 కి లేచి మరలా ద్వారకామాయిలో ఆయన పాదాల వద్ద కూచుని పుస్తకాలు చదువుకుందామని పడుకున్నాడు. కాని యేదో తెలియని శక్తి 3 గంటలకు లేపింది. తయారయి ద్వారకామాయికి వెళ్ళమని చెప్పినట్లయింది. అప్పటికి సమయం 3.30 అయింది. ద్వారకామాయి చేరుకునేటప్పటికి, అక్కడున్న పనివాడు, ఈయనని బాబాగారి ఫోటోలు, పాదుకలు తుడిచి శుభ్రం చేయమని చెప్పాడు. ఆ సమయంలో ఇటువంటిది ఉంటుందని యెప్పుడు అనుకోలేదు. ఈయన ఆనందానికి అవథులు లేవు. ఎంత చక్కటి అవకాసాన్ని బాబాగారు ఇచ్చారు? ఇదంతా ఆయన తనమీద కురిపించిన కటాక్షం. ద్వారకామాయిలో ఈ సేవ చేసి ఆయనకి నమస్కరించి, సాయి చాలీసా, దుర్గా చాలీసా, హనుమాన్ చాలీసా, సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టారు. ఇంతలో అనుకోకుండా చావడి మందిరాన్ని పర్యవేక్షించే ఆయన యెక్కడినించి వచ్చాడో ఈయన వద్ద వున్న "ఆస్ బోర్న్ వ్రాసిన ఇంక్రెడిబుల్ సాయిబాబా" అనే పుస్తకం చూసి, దగ్గిర కూర్చుని బాబాగారిలీలలుమహిమల గురించీ చర్చించడం మొదలు పెట్టారు. ఆ పుస్తకంలో వివరించినవన్ని మాట్లాడారు.
ఈవిథంగా చర్చించుకుంటుండగా తనలో అనుకున్నారు, "బాబాగారు లేరని యెవరన్నారు, ఆయన ప్రతిచోటా వున్నారు. ఈ ప్రపంచమంతా నిండి వున్నారు. ఈ షిరిడీ ఆయన తిరిగిన పవిత్రప్రదేశం. ఈ షిరిడీ తన భక్తులకి యెప్పుడూ కూడా ఆయన లీలలని గురించి జ్ణప్తి చేస్తూ వుంటుంది. ఇలా ఆలోచిస్టుండగా ఆయన దృష్టి బాబా పాదుకలపై పడింది. పాదుకలంతా కూడా ఊదీతో చల్లినట్లుగా ఉంది. అపుడే అక్కడికి వచ్చిన ఇద్దరు భక్తులు కూడా వారిలో వారు మాట్లాడుకోవడం కనిపించింది. వారు మరాఠీలో మట్లాడుకున్నారు. వారు మాట్లాడిన మాటలు ఈ పర్వ్యవేక్షకుడు అనువదించి చెప్పాడు. వారు అన్న మాటలు, "చూడు, బాబా పాదుకల మీద ఊదీ యెంత అందంగా చల్లబడి వుందో". వారు వెళ్ళగానే 10, 15 నిమిషములవరకూ యెవ్వరూ రాలేదు. బహుశా ఇదంతా బాబావారి కృప. ఆ పవిత్రమైన ఊదీ ఈయన కోసం యెర్పరిచారు. యెప్పుడూ భక్తులు వచ్చే సమయంలో కూడా యెవరూ రాలేదంటే అదంతా బాబాగారు యెర్పరచినదే.
ఇక 4.55 కి లేచి, చావడికి వెళ్ళి కాసేపు కూచుందామని పర్యవేక్షకుడితో చెప్పారు.అపుడు అతను ఇంతకుముందు తను యే బాబాగారి పాదాలనయితే శుభ్రం చేశాడొ అక్కడ యేర్పడిన ఊదీ వంక చూపించాడు. చూడగానే ఆ ఊదీ చాలా యెక్కువగా ఉన్నట్లనిపించింది. కాని, చావడిలో పని చేసే పర్యవేక్షకుడు అంతా ప్రోగుచేసి ఇచ్చేటప్పటికి ఒక చిటికెడు ఊదీ వచ్చింది. అది బ్రౌన్ కలర్లో ఉంది వజ్రంలా మెరుస్తోందిట.
ఆయన నమ్మకానికి బాబాగారు ఆవిథంగా అనుగ్రహించారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Sunday, January 16, 2011

సాయి అనగానేమి?

0 comments Posted by tyagaraju on 8:56 PM








ఓం సాయిశ్రీసాయి జయజయ సాయి 17.01.2011 సోమవారం

సాయి అనగానేమి?


సంక్రాంతి పండుగ సందర్భగముగా రెండు రోజులుగా సాయి బంధువులకు లీలలను యేమీ ఇవ్వలేకపోయాను.

ఈ రోజు మనము సాయి గురించి కొద్దిగా తెలుసుకుందాము.మనం అప్పుడప్పుడు సాయి గురినిచి విషయ పరిజ్ణానాన్ని కూడా తెలుసుకుంటే సాయి తత్వం మనమనసుకు పట్టి ఉంటుంది.


1) భారతీయ భాషలన్నిటిలో "సాయి" అనగా రక్షించువాడు, భర్త, ఆథ్యాత్మిక గురువు, తండ్రి. ఆయనని ఒక తండ్రిగాకీర్తించు. ఆయన ప్రేమ అనేకవిథాలుగా ప్రకటితమవు తుంది.

2) బాబా సద్గురువా లేక అవతార పురుషుడా?

ఈ ప్రశ్న అడిగేముందు ప్రతి ఒక్కరూ అవతారానికి, సద్గురువు మథ్య భేదాన్ని తెలుసుకోవాలి. సద్గురువు అజ్ణామనే చీకటినితొలగించి మనలో జ్ణాన జ్యొతిని వెలిగించేవాడు. సద్గురువు భగవంతుని . తెలియచెప్పి ఆయనవైపుకుదారిచుపిస్తాడు. అవతారపురుషుడు భగవంతుడే. మానవులని ఉథ్థరించడానికి భువిపైన అవతరించినవాడు. అంటే భగవంతుడు షోడశకళాప్రపూర్ణుడుగా అవతరించవచ్చు లేక వీటిలో
కొన్నిటితో అవతరించవచ్చు. సాయి భువిమీదకి వచ్చిన భగవంతుడు. ఆయనను అవతార పురుషుడు అనడానికి కారణాలు.


1. సర్వశక్తిమంతుడు, 2) సర్వాంతర్యామి, 3) సర్వజ్ణత, 4) పంచభూతాలయందు ఆథిపత్యము. ఇవిమనకు సచ్చరిత్రలో తెలుసుకున్న విషయాలు.


బాబా గారు జీవించి ఉన్నప్పుడు ఆయన తన భక్తులకు యే విథమయిన వస్తువులను సృష్టించి ఇవ్వలేదు. కాని, ఇప్పుడు బాబాగారు తన భక్తులకు కోరినది అందిస్తు తమ లీలలను ప్రకటిస్తూ ఉన్నారు.

బాబా చరిత్ర వ్రాసిన హెమాడ్పంత్ చదువరులకు చెప్పేదేమనగా బథ్థకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమందభిమానము, మొదలగువానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు , భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక. అమాయకులు, భావికులు, చిన్న, పెద్దా, భక్తులంతా ఒక్క క్షణంపాటు జీవనాన్ని, నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలనీ,చింతలనీ, పక్కన పెట్టి విశిష్టమయిన సాయిబాబా చరిత్రను వినండి లేక చదవండి. సాయి చరిత్ర పరమ పావనమయినది. దీన్ని పఠించేవారి నోరు పవిత్రమౌతుంది. విన్నవారి చెవులు పావనమవుతాయి. అపారకృపామృత థారలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నులైతే సంపూర్ణ శుథ్థ జ్ణానం ప్రకటితమౌతుంది.

1. లయం: కథ వింటుండగా నిద్రమత్తు రావడం.

2. విక్షేపం: కథలో మనసు లీనం కాకపోవదం

3. కషాయం: కథ వింటున్నప్పుడు మూడు గుణాలు క్షోభించి కలిసిపోయి కళ్ళముందు ఈశ్వరుడి సగుణ లేదా నిణర్గు రూపం కనిపించకుందా నల్లటి పచ్చటి రంగులు కనెపించటం.

4. రసాస్వాదం: కథలోని స్త్రీల హావభావాలు, నేత్రకతాక్షాలు,శృంగార వర్ణన లువిన టం మీదే (శ్రథ్థ ఉండటం) ఇవికథాశ్రవణానినికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమౌతుంది. ఉద్యాపనలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకక్కర లేదు. శ్రీరాన్ని శుషింప చేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్రలు, తిరుగుళ్ళు ఈ తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు గుండెలనిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అవిద్య అజాపజా లేకుండా పోతుంది. లోభి ఎ పనిలో ఉన్నా అతని చిత్తానికి తను దాచి పెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనసుల్లో సాయి సాక్షాత్కరించాలి. సాయి, సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయే దుష్టవాసనలన్నిటినీ దగ్థం చేస్తుంది. ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడటం వల్ల , లేదా వినికిడి వల్లా కలిగిన పాపాలు నశించి పోతాయి. సాయి నామాన్ని ఉచ్చరిస్తే కోర్కెలన్నీ నెరవేరుతాయి . గురుకృప యెంత ఆశ్జ్హ్ర్యకరమైందంటే అది రవ్వంత తడి లేనిచోటకూడా యెండి మ్రోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. యె మాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది . పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగల్గుతారు. ఈ కథలను వినడానికి ఒక్క అవథానం తప్ప మరే విథమయిన కష్టమూ పడనక్కరలేదు. ఈ కథలను నితంతరం మనసారా అభ్యాసం చేయాలి. సాయినాథులు కృపతో కేవలం పేరుకు మాత్రం హేమాడ్ పంత్ ను ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథ రచన అనేపనిని తామే చేశారు. భగవంతుడు తన భక్తులను కొన్ని కొన్ని పనులకు నియమిస్తాడు. కొందరు మఠాలను కట్టిస్తారు, కొందరు దేవాలయాలు లేదా స్నాన ఘట్టాలు కట్టిస్తారు. హేమాడ్పంత్ గారు అంటున్నారు, నేనసలు యె యోగ్యతా లేనివాణ్ణి. నాదగ్గిర పూర్తిగా చింకి గుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. (నా దగ్గిర అనేక విషయాల పరిజ్ణానముంది కాని, అందులో ఒక్కదాని గురించైనా పరిపూర్ణ జ్ణానం లేదు) అని భావం


మరోసారి మనం మరల సాయి గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాము.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List