Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, January 13, 2011

బాబాతో దివ్యానుభూతి

0 comments Posted by tyagaraju on 5:15 PM













14.01.2011 శుక్రవారం


-------------------------------------------------------------------------------------------------


బాబా బొమ్మ శ్రీమతి ప్రియాంకాగారి అమ్మాయి వేసినది

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి



బాబాతో దివ్యానుభూతి


మనం బాబాగారిని ఆర్తితో పిలిస్తే తప్పకుండా పలుకుతారు. చిన్న పిల్లవాడు ఉన్నడనుకోండి. ముందర బొమ్మలు పడేస్తే కాసేపు ఆడుకుంటాడు. తరువాత తల్లికోసం యేడుస్తాదు. మరి యిక ఏబొమ్మలు ఇచ్చినా పిల్లవాడు ఏదుపు మానడు. వాడికి వాళ్ళ అమ్మే కావాలి. భక్తుదయినవాడు అల్లా ఆర్తితో భగవంతుని గూర్చి ఏడవాలి. దేవా నువ్వుతప్ప నాకేమీ వద్దు అని కనక ప్రార్థిస్తే తప్పక మన మొర ఆలకిస్తాదు. అటువంటి అనుభూతిని మనం ఈరోజు తెలుసుకుందాము.


************************************************************************************



ఈరోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలాగారి అమ్మాయి చి.సాయినా యొక్క దివ్యానుభూతి గురించి, శ్రీమతి ప్రియాంకా రౌతెలా గారి మాటలలోనే తెలుసుకుందాము
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ఈరోజు నేను మీకు వళ్ళుగగుర్పొడిచే బాబా అనుభవాన్ని చెపుతాను. సాయంత్రం నేను, మా అమ్మాయి "సాయినా" బాబాగారికి పూజ చేస్తున్నాము. నిజానికి నేను, మా అమ్మాయికి ప్రతీరోజు పూజ చేయడం అలవాటు చేశాను. యెందుకంటేచిన్నప్పటినుంచే పిల్లలకి మనం ఆథ్యాత్మిక భావాలని నేర్పాలి, అప్ప్దుడే వారిలొథై ర్యము నమ్మకము బలపడతాయి. ఇక విషయం చెప్పేముందు మా అమ్మాయి, క్రితం సం.మార్చి లొ వేసిన బాబా ఫొతో ఇక్కడ ఇస్తున్నాను. ఈఫొటో చిత్రించిన బాబా లీలను మీకు తరువాత రోజులలో చెపుతాను. ఈ ఫొటో మా అమ్మాయి తో బాబా అనుభవం చుట్టూ తిరుగుతోంది.మా అమ్మాయికి 7సం..వయస్సు. 3 సం.నుంచి తను బాబా ఆరతి పాటలు మరాఠీ లో పాడుతూఉంటుంది. మా అమ్మాయి సాయిపూజ ఎలాచేస్తుందో నమ్మాలంటే మాఇంటిలో ఉండి చూడాలిసిందే. నిజానికి షిరిడిలో ఆరతి మధ్యలో ఒకామె మా అమ్మాయిని వి.వి.ఐ.పి. లు ఉండేచోట నిలబెడతానని మమ్ములను అడిగి తీసుకునివెళ్ళింది.తరువాత ఆమె, అంత చిన్నపిల్ల అంత స్పష్టంగా, భక్తితో బాబా ఆరతి మరాఠీలొ పాడటం యెప్పుడూ చూడలేదు, అందుచేతనే ఆమెని బాబా సమాథి ప్రక్కనే నిలబెట్టానని చెప్పింది. మా అమ్మయి సాయినాని డా.బాబాగారే రక్షించారు. దానికి సంబంధించిన కథని నా బ్లాగులో చదవగలరు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం (12.01.2011) నేను, మా అమ్మాయి సాయిన సాయంత్రం పూజ చేస్టున్నప్పుడు జరిగిన సంఘటన. ఆరతి పాడుతుండగా మా అమ్మాయి భావోద్వేగానికి లోనవడం గమనించాను. అప్పుడప్పుడు తను అలా భావోద్వేగానికి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను పట్టించుకోలేదు. కాని ఈ రోజు బాగా మార్పు ఉంది, ఆరతి అవగానే తను చాలా బిగ్గరగా యేడవడం మొదలుపెట్టింది. "సాయిన, యేమయింది? అని అడిగాను. సాయిన, అమ్మా, బాబాగారిని చూడాలని ఉంది, ఆయన నిజంగా వచ్చి నాతో యెందుకు మాట్లాడరు? రోజూ కలలోకి వచ్చి, వస్తాను వస్తాను అంటారు బాబాగారు. నువ్వెప్పుడు నేను బాబాగారి కూతురినని చెపుతావు, బాబాగారివల్ల నే నేను బతికానని చెపుతావు, మరయితే నేను బాబాగారిని యెందుకు చూడలేకపోతున్నాను? అని అడిగింది.

ఆ క్షణంలో నిస్సహారాయులిని కనక నేను కుడా ఏడవడం మొదలుపెట్టాను. యేవిథంగానయినా సరే బాబా గారిని చూడాలని ఇంకా బిగ్గరగా యేడవడం మొదలుపెట్టింది. ఈ సంఘటనతో నాకు నోట మాట రాలేదు. బాబాగారు భవుతికంగా యెందుకు రాలేకపోతున్నారో ఇంత అమాయకంగా అడుగుతున్న చిన్నపిల్లకి నేనేమని సమాథానం చెప్పను. బాబాగారు రాకపోవడం మా అమ్మాయిని మానసికంగా బలహీనురాలిని చేస్తోంది.

సాయినా బాబాగారిని రమ్మని బాగా యేడుస్తూ ప్రార్థిస్తోంది. హటాత్తుగ తన చుట్టూ ప్రసాంతమయిన గాలి తనను చుట్టుముట్లినట్టు అయింది. బాబాగారు యెదురుగా ఉండి గట్టిగా తన హృదయానికి హత్తుకున్నత్లుగా అనిపించింది. సాయినా, అమ్మా, బాబాగారు నన్ను కౌగలించుకుంటున్నారు, నాకు తెలుస్తోంది, ఇక్కడ నుంచున్నారు, అని గట్టిగా అరిచింది. జరిగినదంతా తెలియకపోయినా, సాయినా మాత్రం 5,6 నిమిషాలవరకూ బాబాగారి స్పర్శని అనుభవించింది. బాబాగారి అదృస్య హస్తాలలో యెంతో రక్షణని అనుభవించింది. ఇప్పుడామె యేదోఒకరోజు బాబాగారిని ముఖా ముఖీగా కలుసుకుంటామన్న నమ్మకంతో ఉంది. బాబాయందు ఉన్న అచంచలమయిన భక్తికి విస్వాసానికి ఇది గొప్ప అనుభవం. 7 సం.వయస్సున్న చిన్నపిల్లకి యెంతో అద్భుతమయిన అనుభవాన్ని ఇచ్చారు. మమ్ములని సరయిన దారిలో, మంచి మార్గంలో నడిపించి మాకు మార్గదర్శకులుగా ఉండమని బాబాగారికి శిరసు వంచి మొక్కుతున్నాను.

బాబాగారు యెల్లప్పుడు తనభక్తుల కోర్కెలు తీర్చడానికి, కామధేనువు మరియు కల్పవృక్షము వంటివారు. ఈరోజు మా అమ్మాయికి ఇంకా భక్తిభావం పెరిగింది, బాబాకు నేను యెంతో కృతజ్ణురాలిని.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Wednesday, January 12, 2011

వెండి భరిణె

0 comments Posted by tyagaraju on 5:53 PM





















సాయి బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

13.01.2011, గురువారము

ఈరోజు మనం బాబా భక్తులైన తార్ఖడ్ కుటుంబములో శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ ముంబాయి వారు తన అనుభవాన్ని, సాయిలీల పత్రికలో కొన్నిసంవత్సరాల క్రితం వ్రాయగా, దాని అనువాదాన్ని ఆయన మాటలలోనే మీముందు ఉంచుతున్నాను. ఈ అనుభవం చదువుతుంటే ఒడలు పులకరిస్తుంది.

సాయి భక్తులందరూ కూడా ప్రతీరోజు ఊదీని ధరించి బయటకు వెళ్ళే అలవాటు చేసుకొవాలి.

సిల్వర్ బాక్సు (వెండి భరిణె) బై: వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ :: ముంబాయ్

నా మీద బాబా కురిపించిన అనుభూతి గురించి చెప్పేముందు నా గురించి కొంత గత చరిత్ర చెబుతాను. శ్రీ సాయి సచ్చరిత్రలో 9అథ్యాయంలో హేమాడ్ పంత్ గారు మా తాతగారైన బాబా సాహెబ్ తార్ఖడ్ గారి గురించి చెప్పడం జరిగింది.

సీతాదేవి రామచంద్ర తార్ఖడ్, రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ , జ్యోతేంద్ర రామచంద్ర ,వీరు ముగ్గురూ కూడా 1909 నుంచి 1918 వరకు బాబాతో ఉన్న అదృష్టవంతులు. అందుచేత తార్ఖడ్ ఫామిలీ కి తరతరాలకి ఆయన ఆశీస్సులు అందచేస్తూనే ఉన్నారు. బాబాగారు మాకులదేవత. ఆయన మమ్ములని ప్రతి విషయంలోను రక్షిస్తూ ఉన్నారు. మేము మా జీవితమంతా ఆయనయొక్క అనుగ్రహాన్ని పోందుతున్నాము. ఇంకా ముందు ముందు పొందుతామన్న నమ్మకం మాకుంది.

నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని మీ ముందు వుంచుతున్నాను.

ఈ సంఘటన 1973 నవంబర్ దీపావళి రోజులులో జరిగింది. నేను మొట్టమొదటి సారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేను పని చేసే కంపనీ వారు ట్రయినింగ్ నిమిత్తం ఇంగ్లాండ్ పంపిస్తోంది. నేనక్కడ లండన్ కి 100 కి.మీ. దూరంలో ఉన్న చోటమార్చ్ వరకూ ఉండాలి. అందుచేత అవసరమయినవన్నీ కూడా సద్దుకోవడం చాలా ముఖ్యం.

నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. సోమవారం పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గిర ఊదీ లేదని తెలుసుకున్నాను. చిన్నప్పటినుంచీ బయటకు వెళ్ళేటప్పుడు ఊదీ పెట్టుకోవడం మాకు అలవాటు. నాకు కొంత నిరాశ వచ్చింది. అప్పుడు నాకు ట్రావలింగ్ సూట్కేసులో మొట్ట్ఘమొదట ఊదీ పాకెట్ పెట్టి తరువాత బట్టలు సద్దటం నా భార్యకు అలవాటని గుర్తుకొచ్చింది. వెంటనే నేను సూట్కేస్ ఖాళీ చేసి చూడగా ఊదీ పాకట్ కనిపించింది

.కాని అది 5 నెలలు వరకూ వస్తుంది. నేను నా ఉద్యోగ రీత్యా ముంబాయి నుంచి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండాలి. అందుచేత ముంబాయి వెళ్ళగానే ఒక వెండి డబ్బా ఊదీ వేసుకునేందుకు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. లండన్లో ఈ చిన్న ఊదీ పాకట్ పెద్ద సహాయకారి.

లండన్ లో నాకు ఇచ్చిన ట్రయినింగ్ లో పని పూర్తి చేసుకుని మార్చ్ లో ముంబాయి వచ్చాను. ముంబాయి లో వెండి డబ్బా కొనడానికి నాభార్య, అత్తగారితో కలిసి గిర్గావ్ వచ్చాను. షాప్ లో ఉన్న కుర్రాడు 7,8 బాక్సులు చూపించాదు. కాని బాక్సు లకి అన్నీ మూతలు విడిగా వచ్చే విథంగా ఉన్నాయి. అందుచేత నాకు అల్లా మూత విడిగా రాకుండా, బాక్సుతోనే మూత అతికిఉన్నది కావాలని చెప్పాను. . ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను అని చెప్పారు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం యెందుకు మరో షాప్ లో చూ ద్దా మని ప్రక్క షాప్ లోకి వెళ్ళాము. షాప్ వానికి నాకు కావలసిన బాక్సు చెప్పాను. షాప్ యజమాని పాత బాక్సు అయినా ఫరవాలేదా అని అడిగాడు. పాత బాక్సు అంటే యెమిటి? అని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు. వాటిలో మీఎకు కావలసిన బాక్సు ఉండవచ్చు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది ఇదివినగానే. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండి బాక్సు కొనడమా? అదేమన్నా మంచి పనేనా?నా భార్య, అత్తగారు కూడా ఇలాగే ఆలోచించి మరో షాప్ లో క్రొత్త బాక్సు ఉంటుందేమో చూద్దమనుకున్నారు. కాని షాప్ యజమానిని బాథ పెట్టడం యెందుకని పోనీ తీసుకొచ్చాక వద్దని చెప్పవచ్చులే అనుకొని, సరే తీసుకురండి చూస్తామని చెప్పాము.

ఈలోపున షాప్ యజమాని మాకు యెలాంటి బాక్సు కావాలో అదే తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్సు చూడగానే నాకు తెలివితప్పిపోయింది. యెందుకంటే అది చాలా నల్లగా ఉంది.నా మొహంలో భావాన్ని చూసి, షాప్ యజమాని అన్నాడు, "అయ్యా, ఒకవేళ మీరు కోరుకునే బాక్సు ఇలాంటిదే అయితే వర్రీ కావద్దు. దీనికి మెరుగు పెట్టి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను" అన్నాడు. షాపతను పాపం చాల శ్రమ తీసుకున్నాడనిపించింది నాకు. బాక్సు మూత తెరిచి చూడగానే నాకు నోట మాటరాలేదు. బాక్సు వంక కన్నర్పకుండా చూడ టం మొదలుపెట్టాను. నా భార్య, అత్తగారు నన్నుచూసి యేమయింది అలా ఉండి పోయావు? యెమి జరిగింది? అన్నారు. వారికి బాక్సు చూపించగానే వాళ్ళకు కూడా నోటమాట రాలేదు.

బాక్సు మూత లోపల బాబా బొమ్మ అతికించి ఉంది.

ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. చిన్న బాక్సు లో బాబా బొమ్మ యెవరు ఫి ట్ చేస్తారు? పైగా ఇది 1974 సం. బాబా మీద భక్తి అంతయెక్కువగా లేదు. ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు ఇంతమంది భక్తులు లేరు.

అందుచేత యెవరయిన బాబా భక్తుడు ఇంత శ్రమ తీసుకుని బాక్సులో బాబా బొమ్మ పెట్టాడంటే నాకు నమ్మబుథ్థిగాలేదు. లేకపోతే గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు, వేరే దేవుళ్ళ బొమ్మలు పెట్టుకునుందేవారు.

షాప్ యజమాని బాక్సుకి మెరుగు పెట్టించి ఇచ్చాడు. అది ఇప్పటికి మెరుగు తగ్గకుండా వుంది. ఇంట్లో ఇంకా కొన్ని వెండి సామాన్లు,బొమ్మలు ఉన్నాయి అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి కాని, ఈ బాక్సు మాత్రం ఇంకా వన్నె తగ్గలేదు. ఈ బాక్సు యెప్పుడు నాతోనే ఉంటుంది. బాబా ఊదీ యెప్పుడు తీసుకున్నా బాబా దర్శనం బాక్సులో నాకు కనపడుతూ ఉంటుంది.

నేను గతం గుర్తు చేసుకుంటే, నేనేకనక కొత్త బాక్సుకి ఆర్డర్ చేసుంటే అందులో బాబా ఫోటో వుండేది కాదు. ఇప్పటికి అనుకుంటాను బాబా నాకోసమే ఆ బాక్సు తయారు చేయించారేమోనని. తార్ఖడ్ కుటుంబంలో మూడవతరంవారమయిన మాకు బాబామీద ఇంకా నమ్మకం బలపడింది.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు





పొరపాటు

0 comments Posted by tyagaraju on 12:10 AM
ఓం సాయినాథాయనమహ

సాయి బంథువులారా ఈఓ రోజు పోస్ట్ చేసిన బాబా లీల హెడ్డింగ్ లో సత్సంగ కి బదులు పొరపాటుగా స్తనంగ అని పడింది . పొరపాటుకు క్షతంవ్యుడను.

Tuesday, January 11, 2011

0 comments Posted by tyagaraju on 8:44 PM
12.01.2011 బుథవారం

ఈ రోజుమనం స్తసంగ ప్రారంభ లీలను గురించి తెలుసుకుందాము

సత్సంగ ప్రారంభ లీల

0 comments Posted by tyagaraju on 7:58 PM



సత్సంగ ప్రారంభ లీల






ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి

మన మనసులో మంచి సంకల్పం ఉండాలే గాని బాబాగారి ద్వారా అవి నెరవరతాయనడంలో యెటువం
టి సందేహము అక్కరలేదు. మన మన్సు మంచిది అవ్వాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మనమాటతీరు మృదువుగా ఉండాలి , మొహములో ప్రసన్నతా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతీ సాయి భక్తుదూ తప్పక ఆచరించతగ్గవి.
ఈ రోజు నేను ద్వారకామాయి సాయి బంధు సేవా సత్సంగ్ స్థాపించిన శ్రీమతి పి.వి. మీనాక్షి గారి బాబా లీలలను గూర్చి చెప్పుకుందాము.
లీలా నం. 1
ఈ లీలను చెప్పేముందు మొదటగా సాయి నాధుని ప్రార్థిస్తున్నాను. మేము ఈ సత్సంగాన్ని 2007 లో బాబాగారి దయతో ప్రారంభించాము. మేము ఆయన చూపే ఎన్నొ లీలలను చూస్తున్నాము. అందులో మొదటగ ఈ సత్సంగం ప్రారంభమయిన లీలను ఆమె మాటలలలోనే తెలుసుకుందాము.
*********************************************************************************
ఒకరోజున నేను, నా స్నెహితురాలు (ఈమె కూడా సత్సంగానికి 108 పాటలను వ్రాసారు) సత్సంగం కొత్తగా ప్రారంభించడం గురించి మట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో సత్సంగానికి ప్రారంభపు సొమ్ము యేదీ లేదు. ఈ సత్సంగం తరఫున ఎన్నో సేవా కర్యక్రమములు చేద్దామనుకొన్నాము. కాని మొదటగా ప్రారంభపు సొమ్ము యేది లేదు. కాని యే భక్తునివద్దనించి సొమ్ము అడగకుండా ప్రారంభిద్దామని అనుకున్నాము. ఇలా మాట్లాడుకుంటూ మేము నడుస్తూఉన్నాము. దారిలో ఒక రంగుల షాప్ వద్దకు పనిఉండి వెళ్ళాము. అక్కడ కుర్చీలో ఒక 500 రూపాయల నోటు ఒకటి పడి ఉంది. నేను ఆ నోటు తీసుకుని పక్కన కుర్చీలో కూర్చున్న అతనిని "ఈ నోటు ఎవరిది అని అడిగాను. ఆ వ్యక్తి ఆనోటు తనది కాదు అని చెప్పాడు. మరలా నేను ఆ షొప్ యజమానిని అడిగాను. అతనుకూడా తనది కాదు అని చెప్పాడు. మేము ఆ షాపు యజమానితో మరలా రేపు వస్తాము, ఎవరయినా 500 రూపాయలు పోగుట్టుకున్నామని అడిగితే మాకు చెప్పండి అని మా వివరాలూ, చిరునామా అన్నీ ఇచ్చి ఆ నోటు తీసుకుని వచ్చేశాము. మరునాడు మేము ఆ షాపు కివెళ్ళి యెవరయినా నోటు పారేసుకున్నామని వచ్చారా అని అడిగాము. ఆ షాప్ యజమాని యెవరూ కూడా నోటు పారేసుకున్నామని రాలేదు అని చెప్పాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది. అసలు ఇది మంచినోటేనా లేక దొంగ నోటా అని. అంధుచేత మేము ఆ సాయంత్రం బ్యాంక్ కి వెళ్ళి ఆ నోటు మంచిదా లేక దొంగనోటా అని అడిగాము. వారు ఆ నోటు మంచిదే అని చెప్పారు. అందుచేత ఆ సొమ్ము బాబాగారే మా సత్సంగం ప్రారంభించడానికి తన మొదటి చందాగా ఇచ్చినట్లు భావించాము. మరునాడు నేను, నా స్నేహితురాలు చివర సున్నా లేకుండా ,500 కి కొంత సొమ్ము వేద్దామనుకున్నాము. అంటే 500/- కాకుండా 501/- ఇలా మాట్లాడుకుంటూ వెడుతుండగా మాకు రోడ్డు మీద 5 రూపాయల నాణెం కనపడింది. ఈవిధంగా బాబాగారు మా సత్సంగానికి తమ మొదటి చందాగా 505/- రూపాయలు ఇచ్చారనటానికి నిదర్శనం. నాకు నాపేరు గాని విద్యార్హతలు గాని చెప్పుకోవడానికి ఇష్ట పడను. దాని వల్ల అహం పెరుగుతుంది. బాబాగారి భక్తురాలిగా ఉండడమే నాకు ఇష్టం. బాబాగారిని నాన్ను యెల్లప్పుడు రక్షించమని వేడుకుంటు ఉంటాను. నేను సాయి సత్సంగంలో సభ్యురాలిగా ఉండి సేవ చేయడమే.
లీల నం.2
మా శ్రీ ద్వారకామాయి సాయి బంథు సేవా సత్సంగ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2008 అక్టోబర్ విజయదశమినాడు అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆరోజు 108 మంది బీదవారికి అన్నదానం జరుపుదామని నిశ్చయించాము. మేము వంటలు చేయడానికి వంటవారినెవరినీ పిలవకుండా మొత్తం పదార్థాలన్నీ మేమే స్వయంగా తయారు చేద్దామనుకున్నాము.
మా చిన్న చెల్లెలు (ఆమె కూడా సత్సంగంలో సభ్యులారు) ఇంకొక ఇద్దరము ప్రథానమయిన వంటవారు. నేను, మిగతా భక్తులం సహాయం చేస్తున్నాము. వంట ప్రారంభించేముందు నేను బాబాగారికి కొబ్బరికాయ కొడదామనుకున్నాను. ఈ యెర్పాటులన్నీ కూడా బాబాగారి గుడి ప్రక్కనే జరుగుతున్నాయి. మా చెల్లెలు తనకు 108 మందికి వంట చేయడంలో అనుభవం లేదని చెప్పింది. వంటలన్నీ ఎలాఉంటాయోనని మేము భయపడ్డాము, ఎందుకంటె బాబాగారికి నైవేద్యం పెట్టకుండా రుచి చూడలేము కదా. నేను కూడా చాలా భయపడ్డాను, ఎందుకంటే వంటలు ప్రారంభిచేముందు బాబాగారికి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాను. అప్పుడు నేను కొబ్బరికాయ తీసుకుని బాబా గారి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్హించాను," బాబా ఇదంతా కూడా నువ్వు తయారుచేసినదే, ప్రథాన సూత్రథారివి నువ్వే, మేము నిన్ను అనుసరించేవారిమి మాత్రమే బాబా."
మొదటగ ఈ సత్సంగం యెక్కడయితే ప్రారంభమయిందో ఆ గుడిలో అన్నదానం జరుగుతోంది. అన్నదానం జరిపేముందు మేము బాబాకి నైవేద్యం పెట్టాము. నైవేద్యం కాగానే మొదటి బాచ్ కి వడ్డించడం మొదలు పెట్టాము. ఆ మొదటి బాచ్ లో భొజనము చేస్తున్న ఒకవ్యక్తి పదార్థాలు చాల రుచిగా ఉన్నాయి అని చెప్పాడు. ఈ పదార్థాలన్నీ యేదయినా పెద్ద హోటల్నుంచి తెచ్చారా అని అడిగాడు. (ఈ మాటలు అన్నవ్యక్తి గేటు పక్కనే బాబా విగ్రహం యెదురుగా కూర్చునివున్నాడు.)
మేమంతా చాలా సంతోషించి "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై " అన్నాము.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Monday, January 10, 2011

బాబా విరాట్ స్వరూపం

0 comments Posted by tyagaraju on 5:03 PM













11.01.2011 మంగళవారం

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

ఈరోజు మనం ఇంకొక బాబా భక్తుని అనుభవాన్ని ఆయన మాటలలోనే తెలుసుకుందాము. బాబాగారు యెవరికి యేరూపంలో కనపడతారో ఎవరికీ తెలియదు. ఆయన భౌతిక రూపంలో కనపడడం చాలా అదృష్టం. అప్పుడు మనలో భక్తిభావం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక బాబాని మనం వదిలిపెట్టం.

బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలే గాని ఆయనని మించిన శక్తి ఏదీకూడా లేదని మనకి అవగతమౌతుంది. బాబాతో మనకి అనుబంధం పెరగాలంటే బాబా లీలలు ఒక్కటే చదవడం, తెలిసికోవదం కాకుండా బాబా భక్తులందరూ తమ తమ అనుభవాలన్నీ మిగతా సాయి భక్తులందరితో పంచుకుంటూ ఉండాలి.

ఇది శ్రీ నడుపల్లి సూర్యనారాయణ గారు, నర్సాపురం వారు చెప్పినది. నా చిన్న తనంలో నేను హైస్కూల్ లో చదువుకునేటప్పుడు ఆయన మాకు మాస్టారు. ఇప్పుడు ఆయన విశ్రాంత ఉపాధ్యాయులు. ఆయన కుడా బాబా భక్తులు,

నేను ఇప్పుడు ఆయన చెప్పిన అనుభవాన్ని ఆయన మాటలలోనే మీముందు ఉంచుతున్నాను.

*************************************************************************************

1995 నుంచి కుడా నేను హార్ట్ ప్రోబ్లెంతోబాధ పడుతున్నాను. 2001 సం.లో దిసంబరులో హార్ట్ ఆపరేషన్ చేయించుకునేముందు బాబా గారిని దర్సనం చేసుకుందామని షిరిడి వెళ్ళడం జరిగింది. మరునాడు ప్రొద్దున హారతికి వెళ్లాను, కాని మధ్యా హ్నం హారతికి ఉండలేకపోయాను. నేను నాభార్యతో కలిసి లాడ్జి కి తిరిగి వస్తూ నడుస్తున్నాను. 20 మీటర్ల దూరంలో నాభార్య నడుస్తూ వస్తోంది. హటాత్తుగా వెనకనుంచి నా ఫాంట్ ని పై నుంచి కిందదాకా ఎవరో తడుముతున్నట్లుగా అనిపించింది. ఎవరో దొంగ నా పర్సు మరి యూ డబ్బులు దొంగిలించుదామని నా జేబులు తడుముతున్నాడని భావించాను. వెంటనే వెనక్కి తిరిగి చూసాను. వెనకాల 15 అడుగుల బాబా గారి విశ్వరూపం కనపడింది. బాబా గారు తన రెండు చేతులతో నన్ను ఆశీర్వదిస్టున్నట్లుగా కనపడింది. నేను వెనక వస్తున్న నా భార్యని బాబాగారి విరాట్ స్వరూపాన్ని చూసావా అని అడిగాను. నా భార్య తను చూడలేదని చెప్పింది. నాకు మాత్రం బాబాగారు తన రెండు చేతులతో నన్నుదీవిస్తున్నట్లుగా కనపడింది. 2006 ఫిబ్రవరి 6 తారీకున నాకు హార్ట్ సర్జరీ అయింది. రెండు రోజులు కోమాలో ఉన్నాను. రెండవరోజున నేను కళ్ళు తెరిచేముందు, ఇద్దరు యమకింకరులు నేను ఉన్న గదిలో ఒకరితరువాత ఒకరుగా నన్ను పైకి కిందకి తమతమ బల్లాలతోఎ గరవేయడం మొదలుపెట్టారు వారు తమబ ల్లాలతో నన్ను పైన తిప్పుతూ హటాత్తుగా నా శరీరం గదిగోడలకు తగిలే ఉద్దేశ్యంతో బల్లాలను తీసివేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నేను "సాయి రామా" అని జపించుకుంటూ ఉన్నాను. సాయి నాధుని అనుగ్రహంతో నేను పైనుంచి మెల్లగా కిందకి పడడం మొదలుపెట్టాను. ఈ విధంగా చాలా సార్లు జరిగింది. ఇద్దరు కింకరులు ఇక నేను చావనని విసిగి వెళ్ళిపోయారు. 2 నిమిషాల తరువాత నేను మెల్లగా ఉపిరి పీల్చుకుని కళ్ళు తెరిచాను. 6 రోజులతరువాత నన్ను ఐ సీ యు లోనుంచి జనరల్ వార్డ్ తీసుకునివచ్చారు. 9 రోజులతరువాత హాస్పటల్నుంచి డిశ్చార్జ్ అయ్యాను. బాబాగారి దయ వలన నా స్నేహితులు ఆపరేషన్ కి కావలసిన ధన సహాయం చేసినాప్రాణాన్ని నిలబెట్టారు. 1994 నుంచి నేను బాబాగారికి బాగా భక్తుడిని అయిపోయాను. మూడు నెలల తరువాత నేను హైదరాబాదులో ని బీరమ్గూడలో ఉన్న బాబా గుడికి వెళ్లాను. బాబా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాను. బాబా 2001డిశంబరు నుంచి నాకు ఎందుకు కనపడటల్లేదు? నేను ఏమి తప్పు చేశాను? హటాత్తుగా బాబాగారి కళ్ళు నీలంగా మారిపోయి తన పాదాల వంక చుదమన్నట్లుగా సంజ్ణ చేస్తున్నట్లుగా అనిపించింది. కొన్ని నిమిమిషాలు ఆయన అలా కళ్ళు తిప్పారు. నాకు తెలియకుండానే నాక ళ్ళవెంట కన్నీరు నా చెంపలమీదుగా కారింది.

దీని అర్ధం ఏమిటంటే నా పాదాలని ఎప్పుడు విడవకు అని చెప్పడం. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే బాబా గారు కళ్ళు తెరిచారు అని మరునాడు దిన పత్రికలలో చదవడం తటస్థించింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Sunday, January 9, 2011

బాబాగారు మీ ఇంటికి కూడా వచ్చి ఉండవచ్చు

0 comments Posted by tyagaraju on 8:34 PM






10.01.2011 సోమవారం








ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సాయి బంధువులారా మీకందరికీ సాయి అనుగ్రహం లబించాలని బాబాని వేడుకుంటున్నాను.

బాబా లీలలు ప్రతిరోజు వ్రాసే భాగ్యాన్ని నాకు, చదివే అదృష్టాన్ని మీకు కలగచేసినందులకు మనం బాబాకు యెల్లప్పుడు కృతజ్ఞలమై ఉండాలి. సాధ్యమైనంతవరకు తెలుగులోకి తర్జుమా చేస్తున్నాను. ఒకవేళ తెలియక పొరపాట్లు యేమయినా ఉంటే దయచేసి తెలియపర్చండి.

మనకు సాథారణంగా ఒక అలవాటు ఉంది. అపరహ్ణంవేళ యెవరు వచ్చినా భిక్ష వెయ్యకూడదు అని. ఒకవేళ అపరాహ్ణంవేళ బాబాగారు భిక్షకుని రూపంలో వచ్చి ఉండవచ్చు

*****************************************************************************

ఈ బాబా లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగ్లో పోస్ట్ చేసినది. దానియొక్క అనువాదం ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను.

మన అందరికీ కూడా బాబా గారి దర్శనం కావాలనే కోరిక ఉంటుంది. మన సద్గురు సాయినాథుని అనుగ్రహం కోసం మనం యెన్నోవిథాలయిన పూజలు వ్రతాలు అన్నీకూడా మనకు తెలిసినంతలో చక్కగా చేస్తాము. కాని బాబాగారు మన ఇంటికి యేదోరూపంలో వచ్చారనే సంగతి మనం గ్రహించలేము. బిక్షకుని రూపం కావచ్చు, సాధువు రూపంలో కావచ్చు, శునకం లేక పక్షి రూపంలో నైనా వచ్చిఉందవచ్చు. కాని మనం మానవమాత్రులంకదా అందుచేత గుర్తించలేము. నేను కొంతమందిని గమనించాను. వారు యేమంటారంటే, బాబాగారు నాకు దర్శనం ఇవ్వలేదు, నాప్రార్థనలకి జావాబు ఇవ్వలేదు, బాబాగారు నామీద కోపగించారా? ఇటువంటి నిందలకు అంతుండదు. కాని మనం ఆత్మ్మ విమర్శ చేసుకోవడం మర్చిపోతాము. నా మనసులోఉన్న ఇదే విషయం మీద ఒక భక్తురాలియొక్క అనుభవాన్ని మీకు చెపుతాను.

ఇది చాలా, హ్రుదయానికి హత్తుకునే నిజంగా జరిగిన సంఘటన.

ఆగస్టులొ ఢిల్లీనుంచి మా కజిన్ వచ్చ్చాడు. ఆమరునాడు మేము ఉంటున్నసిటీలోనే తన స్నేహితుడిని కలవాలనుకున్నాడు. తన స్నేహితుడి ఇంటికి నన్నుకూడా తోడుగా రమ్మనమని అడిగాడు. నాకు ఇష్టం లేకపోయిన తన కోరికని కాదనలేకపోయాను. అతనింటికి వెళ్ళగానే నాకు ఆఇంటిలో ఒక విథమయిన నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించింది. ఆ నెగటివ్ ఫోర్స్ వల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 5 నిమిషాల తరువాత అతనితల్లి 70 సం.వయస్సు ఉన్న విథవావిడ వచ్చింది. వారింటికి వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి కాబట్టి మాటలాడటనికి యేమీలేక ఊరికె కూర్చున్నాను. హటాత్తుగా ఆమె మా అమ్మాయి పేరు ఆడిగింది. మా అమ్మాయి పేరు "సాయినా" అని చెప్పాను. మరలా ఆమె ప్రశ్నించక ముందే, నేను సాయి భక్తురాలిని అందుచేత ముందర సాయి అని వచ్చేటట్లు పేరు పెట్టానని చేప్పాను. బాబా వలననే మా అమ్మాయి రక్షింపబడింది అని చెప్పాను. నేను మాట్లాడుతున్నానే గాని యేదో తెలియని

శక్తి నన్ను బయటికి ఆ ఇంటిలోనించి వెళిపొమ్మన్ని చెపుతున్నట్లుగా అనిపించింది. కాని అక్కడే కూర్చుని మా కజిన్ అతని స్నేహితుల సంభషణలను వింటూ కూర్చున్నాను. అతని తల్లి నావయిపే దీక్షగా చూడడం గమనించాను. నేను ఆఇంటిలో నాలుగువయిపులా పరికించి చూడడం మొదలుపెట్టాను. హటాత్తుగా నాదృష్టి ఫ్రిజ్ మీద అంటించిన బాబా స్టికర్ మీద పడింది. నాకు బాగుందనిపించింది. మా కజిన్ స్నేహితుడిని మీరు బాబా భక్తులా అని అడిగాను. నా ప్రశ్న వినగానే అతని తల్లి తాము యెంతటి దురదృష్టవంతులో చెప్పింది. బాబా గారు తమ ఇంటికి వచ్చినా గుర్తించలేకపోయాము. అప్పటినుంచి చాలా కస్టాలు పడుతున్నామని చెప్పింది. ఇదివినగానే యేమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది. జరిగినదంతా చెప్పమని ఆంటీని అడిగాను. 6 నెలలక్రితం ఒక ఫకీర్ మధ్యాహ్నం ఒంటిగంటవేళ వచ్చి యేమయిన ఆహారం పెట్టమని అడిగాడు. గడచిన 2 -3 రోజులనుంచీ యేమీ తిండి తినలేదని చెప్పాడు. ఆమె అతను చెప్పినదేమీ పట్టించుకోకుండా నిర్దయగా వెళ్ళిపొమ్మని చెప్పింది. కాని ఆ ఫకీరు బిక్ష అడుగుతూ అక్కడే నుంచున్నాడు. ఆ ఫకీరు, వెళ్ళిపొయేటప్పుడు, ఇంక యెవరింటికీ కూడా బిక్షకు వెళ్ళకపోవడం గమనించింది. ఆరోజునుంచి వారికి ప్రతీరోజు కష్టాలు మొదలయ్యాయి. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. ఒకరోజున ఒక ముసలి ఫకీరు వచ్చి ఆంటీతో, బాబా గారు మీఇంటికి, మీ బాథలు, కర్మలూ అన్నీ పోగట్టటానికి వచ్చారు అని బాబా గారు వచ్చిన నెల తేదీ, సమయం అన్నీ చెప్పారు. కాని మీరు చాలా దురదృష్టవంతులు, ఆయనని గుర్తించలేదు అని చెప్పాడు. ఆంటీ మరోమాట మాట్లాడకముందే ఆఫకీరు మాయమయ్యాడు. ఆంటీ మ్రాంపడిపోయింది. ఇక వేరేదారి లేక ఆమె బాబాని క్షమించమని ప్రార్థించి, మరలా తిరిగిరమ్మని వేడుకుంది.

ఇదంతా చెప్పి ఆంటీ చిన్నపిల్లలా యేడవడం మొదలుపెట్టింది. నేను ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది. ఆఖరిగా ఆమెకు ఊదీ పాకెట్ ఇచ్చి బీదవారికి అన్నదానం చేయమని చెప్పాను.

ఓర్పు, సహనంతో ఉండండి, బాబాగారు మరలా వస్తారు అని ఓదార్చాను. కాని ఆమె కన్నీటిని ఆపడం నాకు సాథ్యం కాలేదు. వాళ్ళబ్బ్బాయికి నా బాబా బ్లాగ్ గురించి తెలుసు కనక, భిక్షకు యెవరు వచ్చినా లేదు పొమ్మని కసిరి కొట్టగుండ ఈ విషయమంతా బ్లాగ్లో పోస్ట్ చెయ్యమని చెప్పాడు. అతని తల్లి ఇప్పటికీ ఆఫకీర్ మరలా వస్తాడని బయట కుర్చీ వేసుకుని యెదురుచూస్తు ఉందిట.

అందుచేత మీఇంటికి యెవరు వచ్చినా సరే కసిరి కొట్టవద్దు. ఇవ్వడం ఇస్టం లేకపోతే మర్యాదగా వెళ్ళిపొమ్మని చెప్పండి. బాబాగారు యేరూపంలోనయినా రావచ్చు. బాబా గారు చెప్పినదిదే.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు





భక్త పరాథీన

0 comments Posted by tyagaraju on 12:04 AM


09.01.2011 ( ఆదివారం)

భక్త పరాథీన



ఎన్నోజన్మల బంథం ఉంటేగాని సాయి భక్తుడివి కాలేవు. సాయి భక్తుడయినవాడు ఎల్లప్పుడు సాయి నామస్మరణ చేస్తూ ఉంటే బాబాగారు మనవెంటే ఉంటారు. మనలని కంటికి రెప్పల కాపాడుటూ ఉంటారనడంలో యెటువంటి సందేహము లేదు.

మరి బాబా తత్వం అర్ధం చేసుకొవడం యెల?

బాబా సచ్చరిత్ర పారాయణ చెయ్యాలి. అందులోని విషయాలని గ్రహించి వాటి ప్రకారం నడచుకోవాలి. మరి ఈవిషయాలన్ని విపులంగా ఆకళింపు చేసుకోవాలంటే సత్సాంగత్యాన్నీ మించింది లేదు. సత్సంగం వల్ల యెన్నో మంచి మంచి విషయాలు తెలుస్తాయి. బాబా లీలౌ ఒకరికొకరు చెప్పుకొని పంచుకుంటూఉంటే మనలో బాబా మీద భక్తి మరింతగా యెక్కువ అవుతుంది. అది అనుభవించినవారికే తెలుస్తుంది.

మరోసారి సత్సంగం గురించి విపులంగా తెలుసుకుందాము.

**************************************************************************************

సాయి బంధువులందరికీ బాబాగారి సుభాశీశ్శులు

బాబా ప్రేమని ఎవరూకూడా వర్ణించలేరు. దానిని యెవరికి వారు అనుభవిస్తే తప్ప తెలిసికోలేరు. తల్లికి బిడ్డకి మధ్యన ఉండే వాత్స్యల్యంలాంటిది. ఈ రోజు మనం బాబాగారు చిన్నపిల్లవాడిలో ప్రవేశించి తన ఫొటో ఎక్కడ వుందో చెప్పిన వైనం గురించి తెలుసుకుందాము.

మాది నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేష్.

మేము అనగా సాయి బంధువులందరమూ ప్రతి శనివారము బాబా సత్సంగము చేస్తూ ఉంటాము. ఒక రోజు అనగా 13.12.2008 నాడు మేమందరమూ కలిసి మాఊరికి 35 కి.మీ. దూరములో ఉన్న జగ్గన్నపేటలో సత్సంగం చేయడానికి నిర్ణయించుకున్నాము. మొదటగా అప్పనపల్లి వెదదామని ప్లాన్ చేసుకున్నాము. అప్పనపల్లి వెంకతేశ్వరస్వామి ఆలయంతో చాల ప్రసిథ్థి చెందిన పుణ్య క్షేత్రం. జగ్గన్నపేటలొ సాయంత్రం 3 గంటలకు సత్సంగం చేయడానికి నిర్ణయించుకున్నాము. సత్సంగంలో బాబాఫొటో పెట్టి చేస్తూ ఉంటాము. ప్రతిసారి కొత్త ఫొటొ కొని మా సత్సంగంలో సభ్యురాలయిన శ్రీమతి మీనాక్షిగారు తెస్తూ ఉంటారు. మేము ఆరోజు ప్రొద్దున్న 8 గంటలకు బస్ శ్టాండ్ నుంచి బయలుదేరదామని అనుకున్నాము. క్రితం రోజు మీనాక్షిగారు బాబా ఫొటొ కొని ఉంచారు. వారి ఇంటిలో మొత్తం 6 గదులు ఉన్నాయి. బయలుదేరే సమయానికి ఫొటొ కోసం చూస్తే యెక్కడ పెట్టారో కనపడలేదు. యెక్కడ పెట్టరో మరిచిపోయారు. ఇంటిలోని ప్రతీ గదీ వెతికారు. బస్ కి సమయం కూడ కావస్తోంది. 8.15 అయింది, 8.30 కి బస్.

ఆఖరికి ఇంటిలో ఉన్న బాబా ఫొటొ ముందు మోకరిల్లి ఆయన సహాయం కోసం అర్థించారు. బాబా, బస్ కి సమయం కావస్తోంది. నీ ఫోటో అక్కడ సత్సంగం లో ఇవ్వాలి. ఫొటో నువ్వే వెతికి నాకు చూపించు బాబా అని కన్నీటితో సహాయాన్ని అడిగింది. ఆమె అలా ప్రార్థించగానే ఆమె సోదరి కొడుకు ఒకటిన్నర సంవత్సరములు ఉంటాయి, వచ్చి ఆమె చేయిపట్టుకుని ఒక గదిలోనికి తీసుకెళ్ళాడు. అక్కడ గదిలో ఉన్న బాబాఫొటో వైపు కుడిచేతితో చూపించాడు. అదిచూసి మీనాక్షిగారికి చాలా ఆశ్చర్యంవేసింది, ఈ లీలను చూసి. చూసారా బాబాగారు కేవలం ఊహతెలియని చిన్నబాలుడిలో ప్రవేసించి యెటువంటి చిత్రం చేసారో. ఆచిన్న బాబుకి బాబా యెవరో తెలియదు, పైగా మీనాక్షిగారు బాబా ఫొటొ గురించి బాథపడుతున్నారని తెలియదు. మరి ఈ లీల

యెవరిద్వారా జరిగింది. భాబాగారు తప్ప యెవరు చేయగలరు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List